ఆంధ్ర ప్రదేశ్
AP Municipal Poll Results 2021: దూసుకుపోతున్న వైసీపీ, ప్రతిచోటా ఆధిక్యంలో జగన్ సర్కారు, డోన్‌ మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ కైవసం, కనిగిరి మున్సిపాలిటీలో వైసీపీ క్లీన్ స్వీప్, కొవ్వూరు మునిసిపాలిటీ వైసీపీ ఖాతాలోకి..
Hazarath Reddyఏపీ మునిసిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. కౌంటింగ్ ఆరంభం నుంచి వైసీపీ ఆధిక్యత కనపరుస్తూ వస్తోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా ముందుగా లెక్కించిన పోస్టల్‌ బ్యాలెట్‌ల్లో వైఎస్ఆర్‌సీపీదే ఆధిక్యం సాధించింది. ప్రకాశం జిల్లాలోని మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతుంది.
Gollapali Road Accident: నూజివీడులో ఆటోను ఢీకొట్టిన లారీ, ఆరుగురు అక్కడికక్కడే మృతి, తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసిన వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపిన మంత్రి
Hazarath Reddyఏపీలో కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నూజివీడు దగ్గర కూలీలతో వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం (Gollapali Road Accident) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా..మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి.
AP Municipal Election Results 2021: ఆ మూడు స్థానాల పైనే అందరి కన్ను, ఏపీలో మొదలైన పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు, మరి కొద్ది గంటల్లో ఫలితాలు, ఏలూరు మినహా అన్ని స్థానాలకు కౌంటింగ్
Hazarath Reddyఏపీలో పురపాలక ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభమైంది. 10 నుంచి 11 గంటల మధ్య తొలి ఫలితం (AP Municipal Election Results 2021) వెలువడనుంది. సాయంత్రం ఆరు గంటల్లోగా అన్ని చోట్లా ఫలితాలు (municipal corporations, municipalities/nagar panchayats) వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే విశాఖల మాత్రం కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
AP Covid Report: ఏపీలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు, తాజాగా 175 మందికి కరోనా పాజిటివ్, ఇద్దరు మృతితో 7,182కి చేరుకున్న మరణాల సంఖ్య, 8,91,563కి చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య
Hazarath Reddyఏపీలో మరోసారి 100కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 40,448 కరోనా పరీక్షలు నిర్వహించగా 175 మందికి కరోనా పాజిటివ్ (AP Corona Cases) అని నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 40 కొత్త కేసులు వెల్లడి కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 31 కేసులు గుర్తించారు. కృష్ణా జిల్లాలో 24, విశాఖ జిల్లాలో 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.
Tirupati By Election: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీనుంచి తప్పుకున్న జనసేన, బీజేపీ అభ్యర్థికి మద్దతు, ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణంతో అనివార్యమైన ఉప ఎన్నిక, సిట్టింగ్ సీటు నిలబెట్టుకునేందుకు అధికార పార్టీ కుస్తీలు
Hazarath Reddyతిరుపతి పార్లమెంట్ పరిధిలో చిత్తూరు జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు, నెల్లూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ ఏడు స్థానాలు వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. కాబట్టి ఉప ఎన్నికలో గెలుపు నల్లేరుపై నడకేనని అధికార పార్టీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.
AP Municipal Polls 2021 Counting: కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్, హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రెండు చోట్ల కౌంటింగ్ నిలిపివేత, రేపు 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీలకు ఓట్ల లెక్కింపు, విస్తృత ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
Hazarath Reddyఏపీలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీలకు ఈ నెల 10న ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు (మార్చి 14) ఓట్ల లెక్కింపు (AP Municipal Polls 2021 Counting) చేపట్టనున్నారు. 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్, చిలకలూరిపేట మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు నిలిపివేశారు.హైకోర్టు తుది తీర్పు తర్వాతే ఆ రెండు చోట్ల కౌంటింగ్ చేపట్టనున్నారు.
India Coronavirus: దేశంలో మళ్లీ కరోనా కల్లోలం, పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్, స్కూళ్లు మూసివేత, మళ్లీ వణుకుతున్న మహారాష్ట్ర, ఏపీలో వ్యాక్సిన్ తీసుకున్న వృద్ధుడు మృతి, తెలంగాణలో పెరుగుతున్న కేసులు, తాజాగా దేశంలో 24,882 మందికి కరోనా
Hazarath Reddyదేశంలో గత 24 గంటల్లో 24,882 మందికి కరోనా నిర్ధారణ అయింది. కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... 19,957 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,33,728కు (India Coronavirus) చేరింది.గడచిన 24 గంట‌ల సమయంలో 140 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,58,446కు పెరిగింది.
Indian Railways: రైల్వేశాఖ మరో తీపి కబురు, విజయవాడ నుంచి కొత్తగా 12 స్పెషల్ ట్రైన్స్, ఇప్పటికే 110 రైళ్లు విజయవాడ మీదుగా ప్రయాణం, ఏప్రిల్‌ 1 నుంచి కొత్తగా 12 రైళ్లు ప్రారంభమవుతాయని తెలిపిన రైల్వే శాఖ
Hazarath Reddyఏపీ నుంచి రైలు ప్రయాణం చేసే వారికి శుభవార్త, కరోనా కారణంగా రద్దయిన పలు రైళ్లు మళ్లీ పట్టాలెక్కుతున్నాయి. తాజాగా ఏపీ లో విజయవాడ నుంచి మరో 12 రైళ్లను (12 new Special passenger trains) పునరుద్ధరించనున్నారు. ఇప్పటికే విజయవాడ (vijayawada) మీదుగా రోజూ 110 రైళ్లు తిరుగుతున్నాయి.
AP's COVID19 Report: ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా కేసు నమోదై నేటికి ఏడాది, రాష్ట్రంలో మళ్లీ కోరలు చాస్తున్న కోవిడ్, ఇటీవల కాలంలో తొలిసారిగా 200 దాటిన పాజిటివ్ కేసులు
Team Latestlyఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా కేసు నమోదై నేటికి సరిగ్గా ఏడాదవుతోంది. గతేడాది 2020, మార్చి 12న ఇటలీ నుంచి నెల్లూరు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా ఉందని తేలడంతో రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదయింది. ఆ తర్వాత వారానికే మరొకటి, అలా వైరస్ ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందింది.....
COVID19 in AP: తాడేపల్లిగూడెం మునిసిపల్ కార్యాలయంలో కోవిడ్ కలకలం, సుమారు 10 మంది అఫీసర్లకు సోకిన వైరస్, ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 174 కరోనా కేసులు నమోదు
Team Latestlyచిత్తూరు జిల్లాలోనే గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా 60 కోవిడ్19 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 26, విశాఖ నుంచి 23 మరియు గుంటూరు జిల్లా నుంచి 12 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మునిసిపల్ కార్యాలయంలో 10 మంది ఉద్యోగులకు కోవిడ్ సోకడం కలకలం రేపుతోంది....
Kollu Ravindra Arrest: టీడీపి నేత కొల్లు రవీంద్ర అరెస్ట్, బెయిల్‌పై విడుదల; అరెస్టును తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, బీసీల పట్ల జగన్ ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆగ్రహం
Team Latestlyమున్సిపల్ ఎన్నికల సందర్భంగా బుధవారం మచిలిపట్నంలో పోలీసు సిబ్బంది విధులకు అంతరాయం కలిగించారనే అభియోగంపై మాజీ మంత్రి, టిడిపి నాయకుడు కొల్లు రవీంద్రను మచిలిపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు....
AP Municipal Elections 2021: ప్రశాంతంగా ముగిసిన ఏపీ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌, మొత్తం 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలకు ఎన్నికలు, మధ్యాహ్నం 3 గంటల వరకు 53.57 శాతం పోలింగ్‌ నమోదు
Hazarath Reddyఏపీ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తం 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీల్లో ( AP Municipal Elections 2021) సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 53.57 పోలింగ్‌ శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈనెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.
AP Municipal Polls 2021: బిర్యాని ప్యాకెట్లలో ముక్కు పుడకలు, పడమట లంకలో ఓటు వేసిన పవన్ కళ్యాణ్, విశాఖపట్నంలో ఓటేసిన విజయసాయి రెడ్డి, ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయని తెలిపిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ
Hazarath Reddyఉదయం 11 గంటల వరకు కృష్ణా జిల్లా- 32.64 శాతం, చిత్తూరు జిల్లా-30.12 శాతం, ప్రకాశం జిల్లా-36.12 శాతం, వైఎస్సార్‌ జిల్లా -32.82 శాతం, నెల్లూరు జిల్లా-32.67 శాతం, విశాఖ జిల్లా-28.50 శాతం, కర్నూలు జిల్లా -34.12 శాతం, గుంటూరు-33.62 శాతం, శ్రీకాకుళం-24.58 శాతం, తూర్పుగోదావరి-36.31శాతం, అనంతపురం-31.36 శాతం, విజయనగరం-31.97 శాతం, పశ్చిమ గోదావరి-34.14 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.
AP Municipal Elections 2021: ఓటు వేసేందుకు గుర్తింపు కార్డు అడుగుతున్నారా, 18 ప్ర‌త్యామ్నాయ ఫోటో గుర్తింపు కార్డుల‌లో ఏద‌యినా చూపించవచ్చని తెలిపిన ఎన్నికల కమిషన్
Hazarath Reddyఆంధ్రప్రదేవ్ మున్నిపల్ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మొదలయింది. అయితే ఓటర్లు ఓటు వేసేందుకు ఏం గుర్తింపు కార్డులు తీసుకువెళ్లాలనే దానిపై చాలామందికి అనుమానాలు ఉన్నాయి. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఓటర్ జాబితాలో పేరున్న వారంతా.. ఓటర్ ఐడీ అందుబాటులో లేకున్నా ఓటు వేయవచ్చని స్పష్టం చేసింది.
Covid Vaccinaton: వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ముగ్గురు మృతి, ముంబై, పశ్చిమబెంగాల్‌, ఏపీలోని చిత్తూరులో ఒక్కొక్కరు చొప్పున మృతి, బెంగుళూరులో 103 ఏళ్ల మహిళకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు, కరోనా లేదని నకిలీ రిపోర్ట్‌ సృష్టించిన కుటుంబంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు
Hazarath Reddyఏపీలో చిత్తూరు జిల్లాలోని పాలసముద్రంకు చెందిన పట్రాజు జగదమ్మ(52) మధుమేహంతో బాధపడుతోంది. మూడో విడతలో శనివారం ఆమె స్థానిక పీహెచ్‌సీలో టీకా తీసుకుంది. ఈ క్రమంలో ఆమెకు జ్వరం రావడంతో మంగళవారం సాయంత్రం పీహెచ్‌సీలో చూపించారు. పరిస్థితి విషమించడంతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.
AP Municipal Polls 2021: ఏపీలో పుర, నగర పాలక పంచాయతీల్లో ప్రారంభమైన ఎన్నికల పోలింగ్‌, ఏలూరు కార్పొరేషన్‌, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Hazarath Reddyఏపీలోని పుర, నగర పాలక పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్‌ (Municipal Elections Polling) ప్రారంభమైంది. ఏలూరు కార్పొరేషన్‌, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్‌ జరుగుతుంది.
AP Covid Updates: భారీ ఊరట..ఏపీలో గత 24 గంటల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు, తాజాగా 118 మందికి పాజిటివ్, 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 38 మందికి కోవిడ్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 45,079 కరోనా పరీక్షలు నిర్వహించగా 118 మందికి పాజిటివ్ (AP Covid Updates) అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 38 మందికి కరోనా సోకినట్టు వెల్లడైంది. కృష్ణా జిల్లాలో 21, విశాఖ జిల్లాలో 15 పాజిటివ్ కేసులు (Coronavirus Report in AP) నమోదయ్యాయి.
AP Assembly Budget Session 2021: మార్చి 19 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు ఆమోదం పొందే అవకాశం, ఈ నెలాఖరు వరకు బడ్జెట్ సమావేశాలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 19 నుంచి అసెంబ్లీ సమావేశాలను (AP Assembly Sessions 2021) నిర్వహిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశాల్లోనే (Andhra Pradesh Assembly sessions 2021) బడ్జెట్‌ను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లోనే బడ్జెట్‌ను ప్రవేశపెడతామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ నెలాఖరు వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Visakha Steel Plant Privatization: కేంద్రం నిర్ణయం మార్చుకోవాలి, మరోసారి ప్రధానికి లేఖ రాసిన ఏపీ సీఎం వైయస్ జగన్, ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ కోరిన వైసీపీ అధినేత
Hazarath Reddyవిశాఖ స్టీల్‌ప్లాంట్‌ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి లేఖ రాశారు. స్టీల్‌ప్లాంటును ప్రైవేటీకరించవద్దని, కేంద్రం నిర్ణయం మార్చుకోవాలని ఈ లేఖలో (AP CM YS Jagan Mohan Reddy Writes To PM Modi) విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ కోరిన సీఎం జగన్‌, తనతో పాటు అఖిలపక్షాన్ని కూడా తీసుకువస్తానని పేర్కొన్నారు. ‘‘కేంద్ర ప్రకటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
Visakha Steel Plant Privatization: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదు, పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, అవసరమైనప్పుడు మద్దతు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి సూచన
Hazarath Reddyవిశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని (Visakha Steel Privatization) స్పష్టం చేసింది. పార్లమెంట్ లో ఎంపీ సత్యనారాయణ (MP Satyanarayana) అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇస్తూ... స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో రాష్ట్రానికి సంబంధలేదని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో రాష్ట్రానికి ఎలాంటి వాటాలు లేవన్నారు.