ఆంధ్ర ప్రదేశ్
President Kovind AP Tour: రాష్ట్రపతిని కలిసేందుకు మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టు అనుమతి, కోవింద్‌కు స్వాగతం పలికేందుకు రేణి గుంటకు చేరుకున్న పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి, మధ్యాహ్నం 12 గంటలకు తుది తీర్పు
Hazarath Reddyరాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటనలో పాల్గొనేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. కాగా మంత్రి పెద్దిరెడ్డిని ఫిబ్రవరి 21వ తేదీ వరకు నిర్భందించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ (Nimmagadda Ramesh kumar) శనివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎస్‌ఈసీ ఆదేశాలను సవాలు చేస్తూ.. మంత్రి పెద్దిరెడ్డి (Peddireddy ramachandra reddy) ఆదివారం హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.
Guntur Tragedy: నిత్యం అవమానాలు, తట్టుకోలేక కన్న కొడుకును చంపేసిన తల్లి, నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన వైనం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు, గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీసుస్టేషన్‌ పరిధిలో ఘటన
Hazarath Reddyకొడుకు దురాగతాలను తట్టుకోలేని కన్న తల్లి కొడుకును చంపేసింది. పేగు తెంచుకు పుట్టినవాడు నిత్యం అవమానాలకు గురి చేస్తూ..మద్యం, గంజాయి తాగి వేధింపులకు పాల్పడుతుంటే సహించలేని కన్న పేగు బిడ్డను (Guntur Tragedy) కడతేర్చింది.
RINL Privatisation: ఇరవై వేలమంది పొట్ట కొట్టవద్దు, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపండి, ప్రధాని మోదీకి ఏపీ సీఎం వైయస్ జగన్ లేఖ, ప్రైవేట్ పరం చేస్తే ఏపీ ప్రభుత్వమే తీసుకుంటుందని ఐటీ మంత్రి గౌతం రెడ్డి వెల్లడి
Hazarath Reddyకేంద్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై (RINL Privatisation) ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం లేఖ రాశారు.'విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలి.
Ganta Resigns to MLA Post: ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా రాజీనామా
Hazarath Reddyవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌ రాజీనామా (Ganta Resign for MLA Post) చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఎమ్మె‍ల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన (TDP MLA Ganta Srinivasa Rao) ప్రకటించారు.
AP Local Body Polls 2021: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయండి, ఏపీ డీజీపీకి ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు, తమకు ఇంకా ఆదేశాలు రాలేదని తెలిపిన గౌతం సవాంగ్, ఈసీ ఆదేశాలపై స్పందించిన మంత్రి
Hazarath Reddyఏపీలో పంచాయితీ ఎన్నికలు వేడెక్కాయి. ఫిబ్రవరి న తొలి దిడత పోలింగ్ (AP Local Body Polls 2021) జరగనుండటంతో అధికార ప్రతిపక్ష పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ‌కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని (minister peddireddy ramachandra reddy) తన నివాసం నుంచి బయటకు రాకుండా కట్టడి చేయాలని సూచిస్తూ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు శనివారం లేఖ రాశారు.
APSRTC Offer: ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ బంపరాఫర్, 48 గంటల ముందు టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్, మార్చి 31వ తేది వరకు అమలులో..
Hazarath Reddyప్రయాణీకుల కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) బంపరాఫర్ (APSRTC Offer) ప్రవేశపెట్టింది. ఆర్టీసీలో డాల్పిన్, అమరావతి, ఇంద్ర, సూపర్‌లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్‌ బస్సులో ప్రయాణించడానికి 48 గంటల ముందుఎవరైనా టిక్కెట్లను రిజర్వు చేసుకుంటే (Ticket Booking) ఛార్జీలో 10 శాతం రాయితీ కల్పించనున్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీ సంస్థ రీజినల్‌ మేనేజర్‌ జితేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు
Vizag Steel Plant Privatisation: విశాఖలో ఊపందుకున్న ఉద్యమం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని తేల్చి చెప్పిన ఉద్యోగ, కార్మిక సంఘాలు, మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలు
Hazarath Reddyవిశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీలో రాజకీయ పార్టీలు అన్నీ ఏకమవుతున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు (Vizag Steel Plant Privatisation) కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఉద్యోగ, కార్మిక సంఘాలు, పలు రాజకీయ పార్టీల నేతలు రొడ్డెక్కారు. అందరూ కలిసి విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించి.. తమ ఆందోళనను నిర్వహిస్తూ చాటిచెబుతున్నారు.
AP Local Body Polls: అక్కడ ఏకగ్రీవాలను ఆపండి, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను ప్రకటించవద్దని తెలిపిన ఎస్ఈసీ నిమ్మగడ్డ, మండిపడుతున్న అధికార పక్షం నేతలు, తొలి విడతలో 523 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం, ఈసీ ఈ–వాచ్‌ యాప్‌పై 9వ తేదీ వరకు ఏపీ హైకోర్టు స్టే
Hazarath Reddyఏపీలో తొలి విడత పంచాయితీ ఎన్నికలకు పోలింగ్ ఈ నెల 9న ప్రారంభం కానున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో చాలా చోట్ల ఏకగ్రీవాలు అయ్యాయి. అయితే గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో తొలివిడత ఎన్నికలు జరిగే చోట్ల ఏకగ్రీవమైన పంచాయతీలను తాను అనుమతి ఇచ్చేవరకు అధికారికంగా ప్రకటించవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కలెక్టర్లను ఆదేశించారు.
COVID19 Status in AP: ఆరోగ్య సమస్యలు లేని ఫ్రంట్ లైన్ వర్కర్లు వ్యాక్సిన్ వేయించుకోవాలని అధికారుల పిలుపు, ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 97 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
Team Latestlyఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఆరోగ్య సమస్యలు లేని హెల్త్ కేర్ వర్కర్లు మరియు ఫ్రంట్ లైన్ వర్కర్లు టీకాలు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు. రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 33,876 మంది శాంపుల్స్ ను పరీక్షించగా....
AP's Health Bulletin: ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ప్రారంభమైన రెండో విడత కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్, గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 95 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
Team Latestlyమొదటి దశలో మొత్తం 3,88,307 టీకా కోసం రిజిస్టర్ చేసుకోగా 1,89,890 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు టీకాలు వేసుకున్నారు. తొలి విడతలో 48.90 శాతం వ్యాక్సినేషన్ నమోదయిందని అధికారులు వెల్లడించారు....
AP SSC Exams Time Table 2021: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల, జూన్ 7 నుంచి పరీక్షలు, జులై 21 నుంచి కొత్త విద్యాసంవత్సరం
Hazarath Reddyఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ బుధవారం మాట్లాడుతూ.. జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షలు ఉంటాయని తెలిపారు. సైన్స్ లో రెండు పేపర్లు ఉంటాయన్నారు. జులై 21 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతుందన్నారు
AP Panchayat Elections 2021: టీడీపీ నేత పట్టాభిపై దాడి, అక్కడ అసలేం జరిగింది? కొడాలి నాని హస్తం ఉందంటున్న టీడీపీ నేతలు, తీవ్రంగా ఖండించిన కొడాలి నాని, ఎంతమందిని చంపుతారంటూ చంద్రబాబు ఫైర్, ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
Hazarath Reddyటీడీపీ నేత‌ పట్టాభి రామ్‌పై విజయవాడలో దాదాపు 10 మంది దుండ‌గులు దాడికి పాల్ప‌డ్డారు. టీడీపీ అధికార ప్రతినిధి ప‌ట్టాభి తన ఇంటి నుంచి కార్యాలయానికి బయల్దేరగానే రాడ్ల‌తో ఆయన కారును దుండగులు ధ్వంసం చేశారు. దీంతో కారులో ఉన్న‌ పట్టాభికి కూడా గాయాలయ్యాయి.
AP Panchayat Elections 2021: అచ్చెన్నాయుడికి 14 రోజుల రిమాండ్, నేను హోం మంత్రి అయిన తరువాత మీ సంగతి చూస్తా, పోలీసులపై బెదిరింపులకు పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యే, శ్రీనివాస్‌రెడ్డి మృతికి కారకులైన వారిని వదిలిపెట్టేది లేదని తెలిపిన నిమ్మగడ్డ
Hazarath Reddyవైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు, నిమ్మాడ సర్పంచ్ అభ్యర్ధి అప్పన్న, అతని కుటుంబ సభ్యులపై దాడి, బెదిరింపులకు పాల్పడిన కేసులో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు (AP TDP chief Atchannaidu) 14 రోజుల రిమాండ్‌కు ఆదేశిస్తూ స్థానిక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
AP Inter Exams Time Table 2021: ఏపీలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, మే 5 నుంచి 22 వరకు ఫస్టియర్‌ పరీక్షలు, మే 6 నుంచి 23 వరకు సెకండియర్ పరీక్షలు
Hazarath Reddyకరోనావైరస్ వ్యాప్తి కారణంగా ఏపీలో ఇంటర్ తరగతులు ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ (AP Inter Exams Time Table 2021) ప్రకటించారు. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలు 2021 (AP Inter Exams ) మే ఐదో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి రామకృష్ణ సోమవారం తాత్కాలిక షెడ్యూల్‌ను విడుదల చేశారు.
Covid Updates in India: భారీగా తగ్గిన కోవిడ్ కేసులు, గంటల వ్యవధిలో ఊపిరితిత్తులను ధ్వంసం చేస్తున్న కరోనా, దేశంలో 8,635 మందికి కరోనా నిర్ధారణ, ఏపీలో అత్యంత తక్కువగా 64 మందికి పాజిటివ్
Hazarath Reddyకరోనావైరస్‌ సోకిన తర్వాత ఊపిరితిత్తుల్లోని కణాల్లో ఎటువంటి మార్పులు సంభవిస్తాయో తెలియజేసే ఒక సమగ్రమైన మ్యాప్‌ను బోస్టన్ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఊపిరితిత్తులను చేరిన గంటల వ్యవధిలోనే కరోనా విజృంభించి కణాలను ధ్వంసం చేయడం మొదలుపెడుతుందని గుర్తించినట్టు వారు తెలిపారు.
AP Panchayat Elections 2021: ఏకగ్రీవాలకు వ్యతిరేకం కాదు, నాకు వివాదాలు ఇష్టం లేదు, శ్రీకాకుళం, విజయనగరం కలెక్టరేట్‌లలో అధికారులతో సమీక్షలో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్
Hazarath Reddyఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ సోమవారం శ్రీకాకుళం, విజయనగరం కలెక్టరేట్‌లలో అధికారులతో సమీక్ష (Srikakulam and Vizianagaram authorities) నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలోను, విజయనగరంలోను నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
AP Panchayat Elections 2021: అచ్చెన్నాయుడు అరెస్ట్ వెనుక ఏం జరిగింది? నిమ్మాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా అచ్చెన్నాయుడి భార్య, వైసీపీ అభ్యర్థిగా కింజారపు అప్పన్న, నేడు విజయసాయిరెడ్డి నిమ్మాడ పర్యటన
Hazarath Reddyఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును నిమ్మాడలో మంగళవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా నిమ్మాడలో ఎటువంటి సంఘటనలు తెలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా ఆయన్ని అదుపులోకి (TDP Chief Accennaidu Arrested) తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అచ్చెన్నాయుడును కోటబొమ్మాళి పోలీసు స్టేషన్‌కి తరలించారు.
Kasibugga SI Sirisha: గుర్తు తెలియని మృతదేహాన్ని 2 కిలోమీటర్లు మోసిన మహిళా ఎస్సై, అంత్యక్రియలు కూడా జరిపించిన శ్రీకాకుళం కాశీబుగ్గ మహిళా ఎస్సై శిరీష, ప్రశంసలు కురిపించిన తెలుగు రాష్ట్రాల పోలీస్ శాఖలు
Hazarath Reddyమానవత్వం చాటుకున్న మహిళా ఎస్సైపై (Woman SI sirisha) తెలుగు రాష్ట్రాల పోలీస్ శాఖలతో పాటు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాలోని పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడివికొత్తూరు గ్రామం పొలాల్లో ఓ గుర్తుతెలియని మృతదేహం పడి ఉన్నట్లు సమాచారం అందింది.
MP Vijayasai Reddy on Budget 2021: పోలవరం ఊసే లేదు, ఫిషింగ్ హార్బర్ చెప్పుకునేంతగా లేదు, ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై వరాలు కురిపించారు, బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
Hazarath Reddyఈ రోజు పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy on Budget 2021) అన్నారు. బడ్జెట్‌ పూర్తిగా‌ నిరాశపరిచిందని, ఏపీకి సరైన కేటాయింపులు జరగలేదన్నారు.