ఆంధ్ర ప్రదేశ్

AP Rain Update: 30న బంగాళాఖాతంలో అల్పపీడనం, కోస్తాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం, మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించిన అధికారులు

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏప్రిల్ 30 నుంచి మే మొదటివారంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు (Kannababu) వెల్లడించారు.. దీని ఫలితంగా కోస్తాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం (Andhra pardesh rains) ఉందని పేర్కొన్నారు.

AP Coronavirus Bulletin: వైసీపీ ఎంపీ ఫ్యామిలీకి కరోనా పాజిటివ్, రాజ్‌భవన్‌ని వదలని కోవిడ్ 19, పేకాట ఆడిన వ్యక్తి నుంచి 25 మందికి కరోనావైరస్, శ్రీకాకుళం జిల్లాలో కరోనావైరస్ ల్యాబ్

Hazarath Reddy

తన కుటుంబ సభ్యుల్లో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని కర్నూలు ఎంపీ (kurnool MP Dr Sanjeev Kumar) డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ తెలిపారు. కర్నూలు నర్సింగరావుపేటలో ఉన్న తన సోదరుల కుటుంబ సభ్యులకు కరోనా సోకిందని, వీరంతా రాష్ట్ర కోవిడ్‌ హాస్పిటల్‌ (కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి)లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కాగా ఎంపీ తండ్రి, సోదరుడితో పాటు మరో నలుగురికి కరోనా సోకగా వీరంతా, క్షేమంగానే ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

AP COVID-19 Report: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 81 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1,097 కు చేరిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తలు పాటించాలని మంత్రి ఆళ్ల నాని భరోసా

Team Latestly

శ్రీకాకుళం జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4కు పెరిగాయని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. కరోనా కట్టడి కోసం శ్రీకాకుళం జిల్లాలోనే కరోనా ల్యాబ్‌ ఏర్పాటు చేశామని, ర్యాపిడ్ యాక్షన్‌, ట్రూనాట్‌ కిట్స్‌ ద్వారా పరీక్షలు చేస్తున్నామని ఆయన తెలిపారు.....

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వెయ్యి దాటిన కోవిడ్-19 కేసులు, తొలిసారిగా శ్రీకాకుళం జిల్లా నుంచి నమోదైన కరోనావైరస్ పాజిటివ్ కేసులు

Team Latestly

ఇంతకాలంగా ఒక్క కేసు కూడా నమోదు కాని శ్రీకాకుళం జిల్లాకు కూడా ప్రాణాంతక కరోనావైరస్ వ్యాప్తి చెందింది. తాజాగా శ్రీకాకుళం నుంచి 3 పాజిటివ్ కేసులు నమోదవడంతో జిల్లా వాసుల్లో కలకలం మొదలైంది......

Advertisement

Lockdown Relaxations: వైన్స్ షాపులు తెరుచుకోనున్నాయా? దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతించిన కేంద్ర ప్రభుత్వం. ఏవేవి తెరుచుకోనున్నాయి, ఏవి మూసి ఉండనున్నాయి, వేటికి అనుమతి లభించిందో తెలుసుకోండి

Team Latestly

రాష్ట్రాలలో మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో షాప్స్ మరియు ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేయబడిన అన్ని అన్ని రకాల అనవసర వస్తు-సేవల స్టోర్లు, నివాస సముదాయాల్లో, మరియు స్థానికంగా విక్రయించే దుకాణాలు, స్వతంత్రంగా ఉండే షాప్స్ లాక్ డౌన్ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుంది. మునిసిపల్ కార్పొరేషన్లు మరియు మునిసిపాలిటీల పరిధికి వెలుపల ఉండే మార్కెట్ కాంప్లెక్సులు తెరవడానికి అనుమతించబడతాయి......

COVID-19 in AP: కొత్తగా 62 కేసులు, ఏపీలో 955కు చేరిన కోవిడ్ 19 బాధితుల సంఖ్య, కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కరోనా కలవరం

Hazarath Reddy

ఏపీలో కొత్తగా మరో 62 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో (Deadly COVID-19 in AP) ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 955కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ఏపీలో ఇప్పటివరకు కరోనా (Coronavirus) నుంచి కోలుకున్న 145 మంది డిశ్చార్జ్‌ కాగా, 29 మరణించినట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనాతో 781 మంది చికిత్స పొందుతున్నట్టు చెప్పారు.

YSR Zero Interest Loan Scheme: అమల్లోకి వైఎస్ఆర్‌ సున్నా వడ్డీ పథకం, ఏపీ సీఎం వైయస్ జగన్ మరో సంచలన నిర్ణయం, ఆయా సంఘాల ఖాతాల్లో రూ.1,400 కోట్లు ఒకే విడత జమ

Hazarath Reddy

డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ (YS Jagan Govt) తీపి కబురు అందించింది. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ( AP CM YS Jagan Mohan Reddy) అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని (YSR Zero Interest loan scheme) సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు.

AP DGP Gowtham Sawang: పోలీస్ శాఖ సాంకేతిక​ బృందానికి డీజీపీ అభినందనలు, నిఘా కోసం అత్యంత అధునాతన టెక్నాలజీ వాడుతున్నామన్న దామోదర్ గౌతం సవాంగ్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖ సాంకేతిక​ బృందానికి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ( DGP gowtham sawang) అభినందనలు తెలిపారు. కరోనా వైరస్‌ (Coronavirus) నుంచి ప్రజలను కాపాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) సారధ్యంలో పోలీస్‌ శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) వచ్చిన వారి కదలికలను దేశంలోనే తొలిసారిగా జియో ఫెన్సింగ్ టెక్నాలజీతో (Geo-fencing app) అనుసంధానం చేశామన్నారు. ఈ టెక్నాలజీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 22,478 మందిపై ఇరవై ఎనిమిది రోజుల పాటు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామని చెప్పారు.

Advertisement

Andhra Pradesh Coronavirus: దడపుట్టిస్తున్న కర్నూలు, గుంటూరు, రెండు జిల్లాల్లోనే 48.7 శాతం కేసులు, తాజాగా 80 కొత్త కేసులు నమోదు, ఏపీలొ 893కి చేరిన మొత్తం కేసుల సంఖ్య

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి (Covid-19 pandemic in AP) విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ( andhra pradesh) గత 24 గంటల్లో 80 కరోనా కేసులు నమోదవగా, ముగ్గురు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య (AP COVID-19) 893కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో కర్నూలు, గుంటూరు జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా ఈ రెండు జిల్లాల్లో 48.7 శాతం కేసులు నమోదయ్యాయి.

Supreme Court Judgment: షెడ్యూల్డ్ ప్రాంతాల్లో రిజర్వేషన్లు 50 శాతం మించరాదు, తెలుగు రాష్ట్రాలను హెచ్చరించిన సుప్రీంకోర్టు, అప్పటి నియామకాల్లో జోక్యం చేసుకోబోమంటూ వెల్లడి

Hazarath Reddy

షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో (scheduled areas) రిజర్వేషన్లు 50 శాతం మించరాదని దేశ అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని (Telugu states) షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాలకు నూరు శాతం గిరిజనులకు రిజర్వేషన్లు వర్తింపజేయడం చెల్లదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది.రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండరాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ఇది విరుద్ధమంది. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విన్నపం మేరకు ఇప్పటివరకు జరిగిన నియామకాలకు రక్షణ ఇస్తున్నామని, ఏపీ, తెలంగాణలో ఇదేరీతిలో పునరావృతమైతే ఇప్పటివరకు జరిగిన వాటికి కూడా రక్షణ ఉండదని హెచ్చరించింది.

AP English Medium: ఇంగ్లీష్ మీడియం కావాలా..వద్దా?, తల్లిదండ్రుల్లారా మీరే తేల్చుకోండి, పేరంట్స్ అభిప్రాయం తెలుసుకోవాలని విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసిన జగన్ సర్కారు

Hazarath Reddy

గత కొన్ని రోజుల క్రితం ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం (English Medium in Govt Schools) అమలు చేస్తూ జగన్ సర్కారు ఇచ్చిన జీవోలను హైకోర్టు (AP High Court) రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనకు సంబంధించి హైకోర్టు ఆదేశాల అమలుపై ఏపీ సర్కార్ (AP Government)దృష్టిసారించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఏ మీడియంలో చదవాలని భావిస్తున్నారో తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

AP Corona Pandemic: పలమనేరులో ఉప్పు వ్యాపారికి కరోనా, ఏపీలొ 813కు చేరిన కరోనా కేసులు, ఏపీ వాలంటీర్లకు రూ.50 లక్షల బీమా సదుపాయం

Hazarath Reddy

వాలంటీర్ల పనితీరుకు గానూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి రూ.50 లక్షల భీమా సదుపాయం కల్పించేందుకు సిద్ధమైంది. ఈమేరకు వైద్య ఆరోగ్య శాఖ పంచాయతీ రాజ్ శాఖకు మంగళవారం సర్క్యులర్‌ జారీ చేసింది. గ్రామ, వార్డు వలంటీర్లకూ 'ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ' ప్యాకేజీ వర్తింపజేయాలని నిర్ణయించినట్టు పేర్కొంది.

Advertisement

AP Coronavirus: 24 గంటల్లో 35 కొత్త కేసులు, ఏపీలో 757కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు, 22కు చేరిన మృతుల సంఖ్య, ఏపీలో రోజురోజుకూ పెరుగుతున్న పరీక్షా సామర్థ్యం

Hazarath Reddy

ఏపీలో కరోనా వైరస్‌ (AP Coronavirus) రోజు రోజుకూ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 35 పాజిటివ్‌ కేసులు (COVID19 positive cases) నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 757కు చేరింది. కరోనా (Coronavirus) మహమ్మారితో ఇవాళ మరో ఇద్దరు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 22కు చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో కోలుకుని 96 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనాపై తాజా కేసులకు సంబంధించిన బులిటెన్‌ను ప్రభుత్వం (AP Govenment) విడుదల చేసింది.

AP Lockdown Violation: ఏపీలో లాక్‌డౌన్ ఉల్లంఘన, ఎమ్మెల్యే రోజాకు పూలతో స్వాగతం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాల డిమాండ్

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా కరోనావైరస్ రోజు రొజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ లాక్ డౌన్ (Nationwide Lockdown) విధించిన విషయం విదితమే. అలాగే దాన్ని మే 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు కూడా లాక్ డౌన్ (Coronavirus lockdown) పటిష్టంగా అమలు చేస్తోంది. అయితే ఎంత పటిష్టంగా అమలు చేసినా అక్కడక్కడా లాక్ డౌన్ ఉల్లంఘనలు (AP Lockdown Violation) జరుగుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా (YSRCP MLA Roja) లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించారు. లాక్ డౌన్ పై ఆమె వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

AP Police Tweet: సత్తెనపల్లి యువకుడి మరణంపై ఏపీ పోలీస్ ట్వీట్, సత్తెనపల్లి టౌన్ ఎస్ఐ డి.రమేష్ సస్పెండ్, కేసు నమోదు చేసిన విచారణకు ఆదేశించిన డీజీపీ

Hazarath Reddy

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో (sattenapalli) పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఓ యువకుడు ఘటన సోమవారం ఆందోళనకు దారి తీసింది. దీనిపై మంగళవారం ట్విటర్‌ ద్వారా ఏపీ పోలీసులు వివరణ ఇచ్చారు. గుంటూరు రూరల్ జిల్లాలో జరిగిన దురదృష్టకర సంఘటనలో షేక్ మహ్మద్ గౌస్ మరణించారు. ఈ సంఘటనలో పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. చెక్ పోస్ట్ వద్ద మృతుడిని ఆపిన సత్తెనపల్లి టౌన్ ఎస్ఐ డి.రమేష్ సస్పెండ్ చేశామన్నారు.

New Judges for AP & TS High Court: ఏపీకి, తెలంగాణకు కొత్త జడ్జీలు, నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం, వీరిలో ఏపీకి ముగ్గురు, తెలంగాణకు ఒకరు

Hazarath Reddy

రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం నలుగురు పేర్లను సిఫార్సు చేసింది. దీని ప్రకారం ఏపీ రాష్ట్ర హైకోర్టుకు (Andhra Pradesh High Court) కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు (New Judges in AP & TS) రానున్నారు. అలాగే తెలంగాణ హైకోర్టుకు (Telangana High Court) ఒక జడ్జీ రానున్నారు.

Advertisement

States Share: రాష్ట్రాల పన్నుల వాటాను విడుదల చేసిన కేంద్రం. ఆంధ్రప్రదేశ్‌కు రూ. 1,892 కోట్లు మరియు తెలంగాణకు రూ. 982 కోట్లు మంజూరు

Team Latestly

దేశంలో COVID-19 మహమ్మారి కారణంగా ఉత్పన్నమవుతున్న విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్రాలకు సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో ఎలాంటి కోతలు లేకుండా అందజేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది....

AP COVID-19 Bulletin: కర్నూలు, గుంటూరులో పెరుగుతున్న కేసులు, ఏపీలో తాజాగా 75 కొత్త కేసులు, 20కి చేరిన మరణాల సంఖ్య, రాష్ట్రంలో 722కి చేరిన కోవిడ్-19 కేసులు సంఖ్య

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (Andhra Pradesh) గడిచిన 24 గంటల్లో కొత్తగా 75 కరోనా(Covid-19) పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా (Coronavirus Cases) బాధితుల సంఖ్య 722కు చేరుకుంది. వీరిలో 92 మంది డిశ్చార్జ్‌ కాగా, 20 మంది మరణించారు. ఇక ప్రస్తుతం 610 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కోవిడ్‌-19 కేసులకు సంబంధించిన బులెటిన్‌ను (AP COVID-19 Bulletin) విడుదల చేసింది. కర్నూలు జిల్లా 174 కేసులతో టాప్‌లో ఉండగా.. 149 కేసులతో గుంటూరు తర్వాతి స్థానంలో ఉంది.

Chandrababu Naidu Birthday: టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు, కరోనా నేపథ్యంలో సాదాసీదాగా మాజీ ముఖ్యమంత్రి బర్త్‌డే వేడుకలు, విషెస్ చెప్పిన ఏపీ సీఎం జగన్, పలువురు రాజకీయ ప్రముఖులు

Hazarath Reddy

టీడీపీ (TDP) అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) 70వ పుట్టినరోజు జరుపుకున్నారు. పుట్టిన రోజు వేడుకల్ని హైదరాబాద్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకున్నారు. అత్యంత సాదాసీదాగా ఈ వేడుకలు జరిగాయి. పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబుకు సోషల్ మీడియాలో (HBD CBN) శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబుకు ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పారు. చంద్రబాబు ఇలాగే ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరారు. కాగా ట్విట్టర్ లో #HBDPeoplesLeaderCBN అంటూ హ్యాష్ ట్యాగ్ ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు.

PM Phone Call to AP CM: ఏపీ సీఎంకు ప్రధాని ఫోన్, కరోనా నివారణ చర్యలపై చర్చ, ఏపీలో నేటి నుంచి లాక్‌డౌన్ సడలింపు, మార్గదర్శకాలు ఏంటో ఓసారి తెలుసుకోండి

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఆదివారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు (AP CM YS Jagan) ఫోన్‌ చేశారు. కోవిడ్‌ –19 నివారణకు (covid 19 Preventive Measures) తీసుకుంటున్న చర్యలపై ఇద్దరూ చర్చించుకున్నారు. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న వ్యూహాలను సీఎం ప్రధానికి వివరించారు. రాష్ట్రంలో వైరస్‌ నివారణకు, వ్యాప్తిని అడ్డుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. టెస్టింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకున్న అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement
Advertisement