ఆంధ్ర ప్రదేశ్

CBI Summons Minister Sabitha: ఏపీ సీఎం జగన్ కేసులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీబీఐ సమన్లు, జనవరి 17న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు

Vikas Manda

అనంతపురం జిల్లాలో పెన్నా సిమెంట్స్‌కు భూముల కేటాయింపు మరియు తాండూర్‌ తదితర ప్రాంతాల్లో గనుల కేటాయింపు వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయని చార్జిషీట్‌లో సీబీఐ పేర్కొంది....

AP Capital-Foot March: అమరావతిలో ఉద్రిక్తత, మహిళలపై లాఠీచార్జ్, పలువురికి గాయాలు, గుంపులుగా రావడంతోనే వారిని నిలువరించామన్న పోలీసులు, ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవన్న ఎస్పీ, వేడెక్కిన టీడీపీ, వైసీపీ సోషల్ మీడియా వార్

Hazarath Reddy

అమరావతిలో(Amaravathi) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజధానిని (AP Capital) అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ.. 29 గ్రామాల రైతులు, ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో రాజధాని గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఉద్దండరాయునిపాలెం(Uddandrayuni Palem) నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం (Kanakadurga temple) వరకు మహిళలు నిర్వహించ తలపెట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు.

Fact-Finding Committee: అమరావతికి నిజ నిర్ధారణ కమిటీ, మహిళలపై పోలీసుల దాడిని సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమీషన్, నిజ నిర్ధారణ కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం తదుపరి చర్యలు, ట్విట్లర్లో వెల్లడించిన జాతీయ మహిళా కమీషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ

Hazarath Reddy

ఏపీ రాజధానిగా అమరావతినే (Amaravati) కొనసాగించాలంటూ తుళ్లూరు, మందడం గ్రామాల్లో నిరసన ప్రదర్శన చేస్తున్న మహిళా రైతులపై పోలీసులు దాడి చేసిన ఘటనను జాతీయ మహిళా కమీషన్ (National Women Commission) సుమోటోగా స్వీకరించింది. శనివారం నిజ నిర్ధారణ కమిటీని(Fact-Finding Committee ) అమరావతికి పంపుతామని జాతీయ మహిళా కమీషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ (Rekha Sharma)ట్విట్టర్ లో తెలిపారు.

AP Capital Issue: రాజమండ్రిని నాలుగవ రాజధానిగా చేయమన్న మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, గ్రేటర్ రాయలసీమను ఇవ్వకుంటే ఉద్యమం చేస్తామన్న కేంద్ర మాజీ మంత్రి కోట్ల, రాజధాని కోసం జోలె పట్టిన చంద్రబాబు, నేతలు ఏమన్నారంటే..

Hazarath Reddy

ఏపీలో మూడు రాజధానులు అంశం (AP 3 Capital issue) వేడెక్కిస్తోంది. రాజధాని ప్రాంతాల్లో ప్రజలు రోడ్లెక్కి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు రాజధానులు వద్దు..నాలుగు రాజధానులు కావాలని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు (Minister Sriranganatha Raju) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిని (Rajamandri) 4వ రాజధాని చేయాలని. సాంస్కృతిక రాజధానిగా దాన్ని చేయాలని, వచ్చే కేబినెట్, అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ (CM Jagan) దృష్టికి తీసుకెళుతామని ఆయన అన్నారు.

Advertisement

Jagananna Vidya & Vasathi Deevena: ఏపీలో మరో రెండు కొత్త పథకాలు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, విద్యార్థులకు ప్రతి ఏటా రూ. 30 వేలు, నేరుగా తల్లుల ఖాతాలో జమ, జూన్ 1 నుంచే అన్ని ప్రభుత్వ స్కూల్స్‌లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం

Hazarath Reddy

ఏపీలో పరిపాలనలో దూసుకుపోతున్న సీఎం జగన్ (CM Jagan) మరో రెండు కొత్త (Two New Schemes)శ్రీకారం చుట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హమీని నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెబుతున్నారు. ఇందులో భాగంగా ‘జగనన్న విద్యా దీవెన’,(Jagananna Vidya Deevena) ‘జగనన్న వసతి దీవెన’ (Jagananna Vasathi Deevena) అనే రెండు కొత్త పథకాలను తీసుకొస్తున్నారు.

AP CM YS Jagan: సీఎం హోదాలో తొలిసారిగా నాంపల్లి కోర్టుకు ఏపీ సీఎం జగన్, భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన తెలంగాణా పోలీసులు, గత ఏడాది మార్చి 1న చివరి సారిగా సీబీఐ కోర్టుకు హాజరయిన ఏపీ సీఎం

Hazarath Reddy

అక్రమాస్తుల కేసుల విషయంలో ఏపీ (Andhra pradesh)సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP Cm YS Jagan)నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన నేరుగా నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు (CBI court) వచ్చారు.

Sankranti Special Trains: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే, కొన్ని రూట్లలో రైళ్ల సంఖ్య పెంపు, పండగ సీజన్‌కు ప్లాట్‌ఫాం ధరలనూ రెట్టింపు చేసిన రైల్వే శాఖ

Vikas Manda

పనిలోపనిగా సికింద్రాబాద్ మరియు కాచిగూడ స్టేషన్లలో ప్లాట్‌ఫాం టిక్కెట్ల ధరను రూ. 10 నుంచి రూ.20కి పెంచారు. జనవరి 9 నుంచి 20 వరకు పెరిగిన ధరలు అమలులో ఉంటాయని రైల్వే అధికారులు వెల్లడించారు.....

Amma Vodi Scheme: విద్యార్థులకు శుభవార్త, 'అమ్మ ఒడి' పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్, పిల్లల చదువు కోసం ప్రతి పేద విద్యార్థి తల్లికి ఏడాదికి రూ. 15 వేలు ఆర్థిక చేయూత, సంపూర్ణ అక్ష్యరాస్యత సాధనే లక్ష్యం అని వెల్లడించిన సీఎం

Vikas Manda

వచ్చే ఏడాది నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఆ తర్వాత నుంచి ఒక్కో సంవత్సరం పెంచుకుంటూ పోతామని స్పష్టం చేశారు. ఆంగ్లమాధ్యమంలో సమస్యలు ఎదుర్కొనే విద్యార్థుల కోసం....

Advertisement

AP 'Local' Polls: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్ట్ అనుమతి, జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికల కోసం జనవరి 17 లోపు వెలువడనున్న నోటిఫికేషన్, పూర్తి షెడ్యూల్, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి

Vikas Manda

న్యాయస్థానం స్థానిక సంస్థల ఎన్నికలకు ఆమోదం తెలపడంతో ఏపీలో మళ్ళీ ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్రంలోని 660 జెడ్‌పిటిసి, 660 మండల పరిషత్ మరియు 10,229 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 12,951 గ్రామ పంచాయతీ ఎన్నికలు....

Bharat Bandh 2020: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న భారత్ బంద్, బ్యాంకింగ్ సేవలకు అంతరాయం, పలుచోట్ల వాహనాలు, రైళ్లు నిలిపివేత, కొన్ని ప్రాంతాల్లో బంద్ ప్రభావం తీవ్రం, మరికొన్ని చోట్ల పాక్షికం, పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మకం

Vikas Manda

ముంబై, చెన్నై, భువనేశ్వర్, పుదుచ్చేరి తదితర ప్రాంతాలలో కూడా బంద్ ప్రభావం కనిపించింది. చాలా చోట్ల నిరసనకారులు ఆర్టీసీ బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. జాతీయ రహదారుల దిగ్భందనం, రస్తారోకో, రైల్ రోకో వంటి కార్యక్రమాలతో రవాణా సేవలకు అంతరాయం కలిగించారు.....

AP Capital: అమరావతిని రాజధానిగా గుర్తించవద్దని రాష్ట్రపతికి లేఖ, వైయస్సార్సీపీ నేతపై రాళ్ల దాడి, ప్రతిగా సవాల్ విసిరిన పిన్నెల్లి, నారా లోకేష్ అరెస్ట్, హైవేను దిగ్బంధించిన అమరావతి రైతులు

Hazarath Reddy

ఏపీలో ఇప్పుడు రాజధానిపై యుద్ధం(AP Capital War) నడుస్తోంది. 3 రాజధానుల ఉండవచ్చంటూ అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) చేసిన ప్రకటనను టీడీపీ(TDP) పార్టీ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలోనే అమరావతిలో(Amaravathi) ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజధానిని (AP Capital Change)ఇక్కడ నుంచి తరలిస్తే ఊరుకునేది లేదంటూ అమరావతికి భూములిచ్చిన రైతులు అక్కడ నిరసన (farmers protest) కొనసాగిస్తున్నారు.

Jagananna Amma Vodi: సీఏం గుడ్ న్యూస్, అమ్మ ఒడి డబ్బులు అర్హులందరికీ వచ్చేస్తాయి, హాజరుతో పనిలేదు, 9వ తేదీ నేరుగా తల్లుల అకౌంట్లోకి అమౌంట్, వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం

Hazarath Reddy

పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం అమ్మఒడి పథకం (Jagananna Amma Vodi) లబ్ధిదారులకు గుడ్ న్యూస్ వినిపించారు. ఈ పథకానికి 75శాతం హాజరు ఉండాలనే నిబంధనను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. తొలి ఏడాది మాత్రమే మినహాయింపు ఇచ్చారు. రెండో ఏడాది నుంచి 75శాతం హాజరు నిబంధన కచ్చితంగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను సీఎం ఆదేశించారు.

Advertisement

AP Fishermen Released By PAK: 14 నెలల తరువాత స్వదేశానికి, పాక్ చెర నుండి బయటకు వచ్చిన ఆంధ్రా జాలర్లు, ఏపీ సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన మత్స్యకారులు, సరిగ్గా తిండి కూడా పెట్టలేదంటూ ఆవేదన

Hazarath Reddy

గత 14 నెలలుగా పాకిస్తాన్‌ జైలులో మగ్గుతున్న 20 మంది ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) మత్స్యకారులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. వీరంతా గుజరాత్‌ (Gujarat)తీర ప్రాంతంలో చేపల వేట సాగిస్తూ పొరపాటున పాకిస్తాన్‌ (Pakistan) ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించడంతో అక్కడ సైన్యానికి బందీగా చిక్కారు.

psycho Attack On Home Guard: ఉన్మాది వీరంగం, హోమ్ గార్డుని కదులుతున్న రైలులో నుంచి తోసివేసిన ఉన్మాది, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన హోమ్ గార్డు శివ, తూర్పు గోదావరిలో సంఘటన

Hazarath Reddy

ఆంధ్ర ప్రదేశ్‌లోని(Andhra pradesh) తూర్పు గోదావరి జిల్లాలో(East Godavari) విషాదకర సంఘటన చోటు చేసుకుంది. తుని(Tuni) సమీపంలో వేగంగా వెళ్తున్న రైలు నుంచి హోంగార్డును(Home guard) ఓ ఉన్మాది తోసివేయడంతో దుర్మరణం పాలయ్యాడు. తుని జీఆర్పీ ఎస్‌ఐ అబ్దుల్‌ మారూఫ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అలెప్పీ నుంచి ధన్‌బాద్‌ వెళ్తున్న బొకారో ఎక్స్‌ప్రెస్‌లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన అబీబ్‌ ప్రయాణిస్తున్నాడు.

Maha Padayatra In Amaravathi: అమరావతిలో 20వ రోజుకు చేరుకున్న నిరసన దీక్షలు, 10 వేల మంది రైతులతో మహా పాదయాత్ర, జాతీయ జెండాలతో రోడ్డు మీదకు వచ్చిన రైతులు, సీఎం జగన్ 3 రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తున్న అమరావతి రైతులు

Hazarath Reddy

మూడు రాజధానుల ప్రకటనకు( 3 Capital Issue) నిరసనగా అమరావతి గ్రామాల్లో రైతుల ఆందోళనలు(Farmers Protest) కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతిని(Amaravathi)కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ అమరావతి రైతులు చేపట్టిన నిరసన దీక్షలు సోమవారానికి 20వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు నుంచి 10 వేల మంది రైతులు, యువకులు, మహిళలతో మందడం వరకు మహా పాదయాత్రను(Maha Padayatra) నిర్వహించారు. తమ పాదయాత్రను ఎవ్వరూ అడ్డుకోలేరని రైతులు స్పష్టం చేశారు.

Vaikunta Dwara Darshanam: వైకుంఠ దర్శనం రెండు రోజులే, ఈ నెల 20 నుంచి ఉచిత లడ్డూ, వెల్లడించిన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన కలియుగ వైకుంఠం

Hazarath Reddy

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం(Vaikunta Dwara Darshanam) పది రోజుల పాటు కల్పించాలని కోరుతూ వేసిన పిటిషన్ పై హైకోర్టులో (High Court) నిన్న విచారణ జరిగింది. ఈ విషయమై స్పష్టత ఇవ్వాలని, టీటీడీ (TTD Board) బోర్డు సమావేశమై ఓ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ పాలక మండలి సమావేశమైంది.

Advertisement

Tourist Bus Caught Fire: మంటల్లో కాలి బూడిదైన టూరిస్టు బస్సు, శ్రీకాకుళంలో తప్పిన పెను ప్రమాదం, 18 మందికి గాయాలు, గాయపడిన వారిని శ్రీకాకుళం ఆస్పత్రికి తరలింపు, వెనుక నుంచి మరొక బస్సు బలంగా ఢీకొట్టడంతో ఘటన, ( వీడియో)

Hazarath Reddy

శ్రీకాకుళం జిల్లా (Srikakulam) పైడిభీమవరం దగ్గర ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న టూరిస్టు బస్సును వెనుక నుంచి వచ్చిన మరో బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉత్తరాఖండ్‌కు చెందిన టూరిస్ట్‌ బస్సు మంటల్లో కాలి (Tourist Bus Catches Fire)బూడిదయింది. పూరిలో జగన్నాధస్వామి దర్శనం చేసుకుని విశాఖపట్నం వెళ్తుండగా.. ఒక పర్రిశమకు చెందిన బస్సు అదుపు తప్పి టూరిస్ట్‌ బస్‌ను ఢీకొనడంతో మంటలు వ్యాపించాయి.

AP Capital-Political Row: దమ్ముంటే 21మందితో రాజీనామా చేసి రెఫరెండంకి రా, చంద్రబాబుకు సవాల్ విసిరిన కొడాలి నాని, బీసీజీ రిపోర్టును భోగిమంటల్లో తగలబెట్టమన్న చంద్రబాబు, మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించిన జనసేన ఎమ్మెల్యే

Hazarath Reddy

ఏపీలో (AP Politics) రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా రాజధాని మార్పు (AP Capital Change) విషయంపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బీసీజీ రిపోర్ట్ ఏపీ సీఎం జగన్ కి (AP CM YS Jagan) అందిన నేపథ్యంలో రాజధానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

AP Disha Police Station: ఏపీలో ప్రత్యేక దిశ పోలీస్ స్టేషన్, జిల్లాకు ఒక దిశ ప్రత్యేక కోర్టు, ఈనెల 7 నుంచి దిశ యాప్‌ అందుబాటులోకి, నిందితులకు 21 రోజుల్లోనే కఠిన శిక్ష పడేలా చట్టం, రాష్ట్రపతి ఆమోదం కోసం వెయిటింగ్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra pradesh GOVT) ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దిశ చట్టం (Disha Act) ఏపీలో (AP)త్వరలో అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం దిశ పోలీస్‌స్టేషన్‌ను(Disha Police Station) ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. దిశ చట్టం అమలులో భాగంగా కాకినాడ నగరంలో(Kakinada) దిశ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ తెలిపారు.

Anantapur School Bus Accident: కర్ణాటకలో ఘోర ప్రమాదం, జోగ్ జలపాతం వద్ద లోయలో పడిన అనంతపురం జిల్లా స్కూల్ బస్సు, విద్యార్థి మృతి, 46 మందికి గాయాలు, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన జగన్, తక్షణమే సహాయక చర్యలు అందించాలని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

అనంతపురం జిల్లా కదిరి (Kadiri) నుంచి విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు కర్ణాటకలో ప్రమాదానికి (Kadiri School Bus Accident) గురైంది. వీరు ప్రయాణిస్తున్న బస్సు కర్ణాటకలోని దార్వాడ్ జిల్లా జోగ్‌ జలపాతం(Jog Falls) వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందగా, ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. అలాగే ఇద్దరు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి.

Advertisement
Advertisement