ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh: రోగికి అదుర్స్ సినిమా చూపిస్తూ అరుదైన సర్జరీ చేసిన వైద్యులు, మత్తు ఇవ్వకుండానే మెదడులోని కణితి తొలగింపు, కాకినాడ జీజీహెచ్ డాక్టర్ల అద్భుతం...

Arun Charagonda

కాకినాడలోని సర్వజన ఆసుపత్రి లో అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. రోగి తన చేతులతో ట్యాబ్‌ పట్టుకుని సినిమా చూస్తూ ఉండగానే డాక్టర్లు ఆమె తలలోని కణితిని విజయవంతంగా తొలగించారు.

Ganesh Visarjan 2024: వీడియో ఇదిగో, డ్రోన్‌తో బాల గణపతి విగ్రహం నిమజ్జనం, పోలీసులు అనుమతించకపోవడంతో కొత్తగా ఆలోచించిన కడియపు లంక చిన్నారులు

Hazarath Reddy

తూర్పుగోదావరి జిల్లాలో డ్రోన్‌తో బాల గణపతి విగ్రహ నిమజ్జనం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జిల్లాలోని కడియం మండలం కడియపు లంక గ్రామంలో పలువురు చిన్నారులు బాల గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తొమ్మిది రోజుల పాటు పూజలు చేశారు.

Andhra Pradesh: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కొట్టుకున్న ఇరువర్గాలు, 17 మందికి గాయాలు, అడ్డుకున్న కానిస్టేబుల్‌పై దాడి...వీడియో

Arun Charagonda

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. క్రిస్టియన్ పేటలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరుగగా 17 మందికి గాయాలు అయ్యాయి. అడ్డుకోవటానికి వెళ్ళిన కానిస్టేబుల్ మీద దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Andhra Pradesh: వీడియో ఇదిగో, రోడ్డు లేక కర్రకు మృతదేహాన్ని కట్టి 7 కిలోమీటర్లు మోసుకెళ్లిన గిరిజనులు, విజయనగరం జిల్లాలో ఘటన

Hazarath Reddy

విజయనగరం జిల్లా గంట్యాడ (మ) కొండపర్తికి చెందిన రాజారావు అనే గిరిజనుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని మృతదేహం తరలించడానికి బోటు లేక, రోడ్డు లేక గిరిజనుల అవస్థలు పడుతూ.. ఒక కర్రకు రాజారావు మృతదేహాన్ని కట్టుకొని 7 కిలోమీటర్లు నడుచుకుంటూ తీసుకొని వెళ్లారు.

Advertisement

New Liquor Policy in AP: ఏపీలో నూతన మద్యం విధానం, సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ, వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను వివరించిన అధికారులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం విధానంపై చర్చించేందుకు సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఈ విధానంపై మంత్రులు తమ అభిప్రాయాన్ని సీఎం చంద్రబాబుకు వివరించారు. వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను ఉన్నతాధికారులు తెలిపారు

Andhra Pradesh: వీడియో ఇదిగో, రోడ్డు లేక అంతిమ యాత్ర కోసం నడుము లోతు నీటిలో స్మశానానికి వెళ్తున్న బంధువులు

Hazarath Reddy

అనంతపురం జిల్లాలోని గోరంట్ల మండలంలోని పాలసముద్రం గ్రామం ఎస్సీ కాలనీలో ఎవరైనా చనిపోతే అంతిమయాత్రకు బెంబేలెత్తుతున్నారు. నడుము లోతు చెరువులో కాలువ నీటిలో అంతిమయాత్రగా స్మశానానికి వెళ్లాల్సి వస్తోంది. శవాన్ని స్మశాన వాటికకు తీసుకు వెళ్లడానికి బంధువులు నాన్న తండాలు పడాల్సి వస్తోంది

Andhra Pradesh Shocker: వీడియోలు ఇవిగో, క్రమశిక్షణ పేరుతో విద్యార్థునులపై ప్రిన్సిపాల్ అరాచకం, తట్టుకోలేక మీడియా ముందు కన్నీరు కార్చిన విద్యార్థులు

Hazarath Reddy

అల్లూరి జిల్లా రంపచోడవరంలో దారుణం చోటు చేసుకుంది. రంపచోడవరం గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అరాచకం వెలుగులోకి వచ్చింది. క్రమశిక్షణ పేరుతో విద్యార్థుల పై 100 నుండి 200 గుంజీలు (సిట్ అప్స్) తీయించడంతో నడవలేక కాళ్లవాపులతో విద్యార్థినిలు అవస్థలు పడ్డారు.

Lorry Caught Fire: వీడియో ఇదిగో, కడప చెన్నై జాతీయ రహదారిపై మంటల్లో చిక్కుకున్న లారీ, పూర్తిగా అగ్నికి ఆహుతైన వాహనం

Hazarath Reddy

కడప చెన్నై జాతీయ రహదారిపై ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కడప చెన్నై జాతీయ రహదారిపై లారీ ముద్దనూరు నుండి చెన్నైకి ఇసుక తీసుకెళ్తుండగా బకరాపేట సమీపంలో ఒక్కసారిగా మంటలు చలరేగి లారీ దగ్ధమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.

Advertisement

V. Vijaysai Reddy: చంద్రబాబు ఇంటిని కూల్చాల్సిందే, కృష్ణానది కరకట్టపై చట్ట విరుద్ధంగా నిర్మించిన ఇంట్లో సీఎం ఉంటున్నారని తెలిపిన విజయసాయి రెడ్డి

Hazarath Reddy

కృష్ణానది కరకట్టపై చట్ట విరుద్ధంగా నిర్మించిన ఇంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసముంటున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అన్నారు. పర్యావరణ సున్నిత ప్రాంతంలో సీఆర్‌జెడ్ నిబంధనలు విరుద్ధంగా ఇంటి నిర్మాణం అక్రమమని ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు.

Andhra Pradesh: జగన్ ప్రభుత్వం తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు, పాత సంప్రదాయ టెండరింగ్ విధానం అమల్లోకి తెస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు

Hazarath Reddy

గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అమల్లోకి తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం జారీ చేసిన రివర్స్ టెండర్ జీవో నంబరు 67ను రద్దు చేస్తున్నట్లుగా పేర్కొంటూ ఉత్తర్వులు ఇచ్చింది.

New Vande Bharat Trains: తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, విశాఖ టూ దుర్గ్, సికింద్రాబాద్ టూ నాగ్‌పూర్ వెళ్లనున్న న్యూ ట్రైన్స్

Hazarath Reddy

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు రెండు కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం కానుండగా, సోమవారం నాగ్‌పూర్-సికింద్రాబాద్, దుర్గ్-విశాఖపట్నం రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు.

Amalapuram Fire: వీడియోలు ఇవిగో, అమలాపురంలో ఘోర అగ్ని ప్రమాదం, పేలుడు ధాటికి రెండు ముక్కలై కుప్పకూలిన భవనం, ఏడుమందికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అమలాపురం రూరల్‌ మండలం రావుల చెరువు సమీపంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో సోమవారం పేలుడు సంభవించింది. దీంతో రెండంతస్తుల భవనం ధ్వంసమైంది.

Advertisement

Ganesh Visarjan Traffic: 20 నిమిషాల ప్రయాణానికి రెండు గంటలు.. గణనాథుల నిమజ్జనం వేళ ట్యాంక్‌ బండ్‌ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్

Rudra

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీగా వాహనాలు నిలిచాయి. నిమజ్జనానికి వచ్చే గణనాథులు వరుసగట్టడం, సోమవారం ప్రైవేటు కార్యాలయాలు పనిచేస్తుండటం, ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు వెరసి హుస్సేన్ సాగర్ సమీపంలో ఎక్కడికక్కడ రద్దీ నెలకొంది.

Case Booked Against Jani Master: జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ పై రేప్ కేసు నమోదు.. ఎందుకంటే?

Rudra

తన డ్యాన్స్ స్టెప్స్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించి నేషనల్ అవార్డు కూడా అందుకున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషాపై రేప్ కేసు నమోదయింది.

Three Senior IPS Suspended in AP: బాలీవుడ్ న‌టి కేసులో కీల‌క ప‌రిణామం, ఆ ముగ్గురు ఐపీఎస్ ఆఫీస‌ర్ల‌పై వేటు వేసిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం, వైసీపీ నేత‌తో క‌లిసి వేధించార‌ని ఫిర్యాదు

VNS

ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు(PSR Anjaneyulu) , విజయవాడ మాజీ సీపీ కాంతారాణా టాటా (Kanthi rana Tata) , విశాల్‌ గున్ని (Vishal gunni) ని సస్పెండ్‌ చేస్తూ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణపై ఉన్నతాధికారులు వేటు వేశారు.

Visakha Boat Fire Accident: చేపల వేటకు వెళ్లిన బోటు మంటలకు దగ్దం, బోటులోని 5 గురు సురక్షితం, రూ.40 లక్షల ఆస్తి నష్టం..వీడియో ఇదిగో

Arun Charagonda

విశాఖలో పెను ప్రమాదం తప్పింది. సముద్రంలో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోటు మంటలకు దగ్ధం అయింది.ఇంజిన్ లో మంటలు ఏర్పడి పూర్తిగా బోటుకు వ్యాపించడంతో దగ్దమైందిబోటు.ఆ సమయంలో మరో ఫిషింగ్ బోటు దగ్గరలో ఉండటంతో 5 మంది క్షేమంగా బయటపడ్డారు. బోటులో వేటకు వెళ్లిన 5 మంది క్షేమంగా ఉన్నారు. సుమారు 40 లక్షలు వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు మత్స్యకారులు.

Advertisement

Jagan On Chandrababu: ప్రజారోగ్యంపై టీడీపీ ప్రభుత్వ విధానం ఇదేనా?, ఎంబీబీఎస్ సీట్లు వద్దంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయడంపై జగన్ ఫైర్, ప్రజాగ్రహం తప్పదని హెచ్చరిక

Arun Charagonda

రాష్ట్రానికి ఎంబీబీఎస్‌ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి, అవసరం లేదంటూ చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం చాలా దారుణం అని మండిపడ్డారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తన చేతులతో తానే భంగం కలిగించడం అత్యంత హేయం, దుర్మార్గం. పక్క రాష్ట్రాలు కొత్త మెడికల్‌ కాలేజీలు, ఎంబీబీఎస్‌ సీట్లకోసం ప్రదక్షిణాలు చేస్తున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పిపంపడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనం చంద్రబాబు అని ప్రశ్నించారు.

Fake Websites On Srisailam Temple Name: శ్రీశైలం ఆలయం పేరుతో ఫేక్ వెబ్‌సైట్లు, 27 ఫేక్ సైట్లను గుర్తించిన ఆలయ అధికారులు, అప్రమత్తంగా ఉండాలని సూచన

Arun Charagonda

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయం పేరుతో ఫేక్ వెబ్‌సైట్‌లను గుర్తించారు ఆలయ అధికారులు. ఇప్పటివరకు 27 ఫేక్ వెబ్‌సైట్‌లను గుర్తించామని తెలిపిన ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. రాజస్థాన్, జైపూర్ నుంచి నకిలీ సైట్లను ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.

Andhra Pradesh Shocker: ప్రేమ వ్యవహారం, థియేటర్‌లో విద్యార్థిపై కత్తితో దాడి, తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేరిక...వీడియో

Arun Charagonda

తిరుపతి - పీజీఆర్ థియేటర్‌లో లోకేష్‌ అనే యువకుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు కార్తీక్ అనే యువకుడు. కావ్య అనే యువతితో సినిమాకు వచ్చారు లోకేష్‌. అయితే దాడి తర్వాత కార్తీక్‌తో వెళ్లిపోయింది యువతి కావ్య. ఇక బాధితుడు లోకేష్‌కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా పోలీసులు విచారణ చేస్తున్నారు.

Andhra Pradesh Shocker: అధికారుల వేధింపులు, సెల్ఫీ వీడియో తీసుకొని.. ఆత్మహత్యాయత్నం, హిందుపూర్‌లో 104 ఆపరేటర్ ఆత్మహత్యయత్నం..వీడియో

Arun Charagonda

హిందూపురం 104 ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ రామకృష్ణ వేధింపులు తాళలేక సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు సోమందేపల్లి డేటా ఎంట్రీ ఆపరేటర్ రామిరెడ్డి. వీడియోని కుటుంబ సభ్యులకు పంపగా.. విషయాన్ని 104 డాక్టర్ దృష్టికి తీసుకెళ్లింది కుటుంబం.

Advertisement
Advertisement