తెలంగాణ

Telangana: తెలంగాణలో తీవ్ర విషాదం, అమెరికాలో ఈతకు వెళ్లిన ఇద్దరు హనుమకొండ విద్యార్థులు మృతి, మరో ఇద్దరు గల్లంతు..

Hazarath Reddy

అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఈతకు వెళ్లి మృతి (Two students from Telangana) చెందారు. మిస్సోరిలోని ఓజార్క్‌ సరస్సులో (river in Missouri) ఈతకు వెళ్లిన నలుగురు తెలుగు విద్యార్థులు.. ప్రమాదవశాత్తు ఈత కొడుతూ అందులో గల్లంతయ్యారు.

Telangana Scores Double UNESCO Awards: తెలంగాణ చారిత్రక ఖ్యాతి విశ్వవ్యాపితం.. గోల్కొండ కోటలోని మెట్లబావి, దోమకొండ కోటకు యునెస్కో అవార్డులు.. భారత్‌కు మొత్తం నాలుగు అవార్డులు..

Rudra

తెలంగాణ చారిత్రక ఖ్యాతి మరోమారు విశ్వవ్యాపితం అయింది. రాష్ట్రంలోని రెండు చారిత్రక కట్టడాలకు యునెస్కో ఆసియా-పసిఫిక్ అవార్డులు లభించాయి. కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణంలో ఉన్న గోల్కొండ మెట్ల బావి, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ కోట ఈ అవార్డులకు ఎంపికయ్యాయి.

Telangana Top In Mutton Consumption: ముక్క లేనిదే ముద్ద దిగదు... మటన్ అత్యధికంగా తినే రాష్ట్రాల్లో తెలంగాణ టాప్.. ఏడాది సగటున 21.17 కిలోల వినియోగం.. గత నాలుగేళ్లలో మాంసం కోసం రూ. 58,500 కోట్లు వెచ్చించిన జనం

Rudra

తెలంగాణలో మటన్ వినియోగం విపరీతంగా పెరిగింది. దేశంలో అత్యధికంగా మాంసాహారం వినియోగిస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. గత నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రంలో 9.75 లక్షల టన్నుల గొర్రెలు, మేకల మాంసం ఉత్పత్తి, విక్రయాలు జరిగినట్టు భారత జాతీయ మాంసం పరిశోధన సంస్థ అధ్యయనంలో తేలింది.

New Traffic Rules In Hyd: రాంగ్ రూట్ లో వచ్చే వాహనాలకు రూ. 1,700 ఫైన్.. ట్రిపుల్ రైడింగ్ కు రూ. 1,200 జరిమానా.. హైదరాబాద్ లో నేటి నుంచి ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం!

Rudra

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపనున్నారు. అవును. ఇప్పటికే పలు కఠిన నిబంధనలను అమలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు... ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించబోతున్నారు. ఆ వివరాలు ఏంటంటే?

Advertisement

Boy Died Choking on Chocolate: తండ్రి ఇచ్చిన చాక్లెట్ తిని బాలుడు మృతి, గొంతులో ఇరుక్కోవడంతో ఊపరాడక కుప్పకూలిన ఎనిమిదేళ్ల బాలుడు, వరంగల్‌ లో విషాదం

Naresh. VNS

సందీప్‌ (8) స్కూల్‌కు వెళ్లిన తర్వాత చాక్లెట్‌ను నోట్లో వేసుకున్నాడు. అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక సందీప్‌ కిందపడిపోయాడు. గుర్తించిన పాఠశాల సిబ్బంది బాలుడిని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి (MGH Hospital) తరలించారు. తండ్రి కంగర్‌సింగ్‌కు సమాచారం అందించారు.

SI, Constable Physical Tests: ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టుల తేదీలు విడుదల, డిసెంబర్ 8 నుంచి టెస్టులు నిర్వహించనున్నట్లు ప్రకటన, ఏయే ప్రాంతాల్లో టెస్టులు ఉంటాయో తెలుసా?

Naresh. VNS

పోలీస్‌ నియామక ప్రక్రియలో (Police recrutment) అత్యంత కీలకమైన ఫిజికల్‌ టెస్టులకు (Physical Measurement Tests) రంగం సిద్ధమైంది. డిసెంబర్‌8వ తేదీ నుంచి ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఫిజికల్‌ మేజర్మెంట్‌ (PMT), ఫిజికల్‌ మెజర్మెంట్‌ టెస్ట్‌ (PET) నిర్వహించనున్నట్లు పోలీస్‌ నియామక మండలి ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తామని వెల్లడించింది.

Malla Reddy Comments on IT Raids: బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే ఐటీ రైడ్స్ ఉండవు, ఎంతైనా సంపాదించుకోవచ్చు, మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర కామెంట్స్

Naresh. VNS

బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం వస్తే ఐటీ రైడ్స్ ఉండవని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎంతైనా సంపాదించుకోవచ్చని వ్యాఖ్యానించారు. కాకపోతే, సంపాదించిన దానికి కొంత పన్ను చెల్లించేలా కేసీఆర్ కొత్త నిబంధనలు తీసుకువస్తారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt) వచ్చాక దేశంలో ఆదాయపన్నును హేతుబద్ధీకరిస్తామని అన్నారు.

Hyderabad: ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో పనులు ప్రారంభించాలని మంత్రి కేటీఆర్‌ను కోరిన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ..

kanha

ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో పనులు ప్రారంభించాలని హైదరాబాద్ ఎంపీ, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తిహాద్-ఉల్-ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం తెలంగాణ పట్టణాభివృద్ధి శాఖ కెటిఆర్ ని కోరారు.

Advertisement

Hyderabad Metro: డిసెంబ‌ర్ 9న సీఎం కెసిఆర్ శంషాబాద్, మైండ్ స్పేస్ వరకూ సెకండ్ ఫేజ్ మెట్రో రైలుకు శంకుస్థాప‌న

kanha

మెట్రో రెండో ఫేజ్ ప‌నుల‌కు సంబంధించి సిఎం కెసిఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారని రాష్ట్ర ఐటి, ప‌రిశ్ర‌మల శాఖ కెటిఆర్ పేర్కొన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వ‌ర‌కు మెట్రోను విస్త‌రించాల‌ని నిర్ణ‌యించారని తెలిపారు.

AP Pilgrims Rescued: పెను ప్రమాదం నుంచి బయటపడిన నిడదవోలు వాసులు.. నిడదవోలు నుంచి వారణాసికి 120 మంది.. గంగానదిలో బోటులో వెళ్లిన 40 మంది.. నదిలో కొంతదూరం వెళ్లాక బోటుకు చిల్లు.. బోల్తాపడిన బోటు.. అందరినీ రక్షించిన స్థానికులు

Rudra

కాశీలోని గంగానదిలో జరిగిన బోటు ప్రమాదం నుంచి ఏపీలోని నిడదవోలు వాసులు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు.

Chhattisgarh Encounter: చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోల మృతి.. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు.. మావోల సమావేశం జరుగుతుండగా ఘటన

Rudra

చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు నక్సల్స్ మృతి చెందారు. ఎన్‌కౌంటర్‌లో మరో ముగ్గురు మావోయిస్టులు గాయపడినట్టు సమాచారం.

Jeevitha Rajashekhar Cheated by Cyber Criminals: సైబర్‌ నేరగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయిన జీవితా రాజశేఖర్, సగం ధరకే జియో ప్రోడక్టులు ఇస్తానంటూ కహానీలు చెప్పిన క్రిమినల్, నమ్మి లక్షన్నర ట్రాన్స్‌ఫర్ చేసిన జీవిత

Naresh. VNS

సగం ధరకే జియో బహుమతులు అందిస్తానని తెలిసిన వారి పేర్లను చెప్పి నమ్మించడంతో మేనేజర్‌ ఒప్పుకున్నాడు. సైబర్‌ నేరగాడు ఇచ్చిన జాబితాలో నుంచి పలు వస్తువులను ఎంచుకున్నాడు. అయితే వీటికి సంబంధించిన టోకెన్‌ అమౌంట్‌ పంపించాలని సైబర్‌ నేరగాడు అడిగాడు. అతన్ని పూర్తిగా నమ్మిన మేనేజర్‌ వెంటనే లక్షన్నర రూపాయలు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు

Advertisement

Sabarimala Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్.. మరో 38 ప్రత్యేక రైళ్లను సిద్ధం చేస్తున్న దక్షిణమధ్య రైల్వే.. డిసెంబరు, జనవరి నెలల్లో అందుబాటులోకి

Rudra

శబరిమల భక్తుల సౌకర్యార్థం డిసెంబరు, జనవరి నెలలో 38 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, నర్సాపూర్ నుంచి ఇవి అందుబాటులో ఉండనున్నాయి.

Group-IV Jobs in Telanagana: తెలంగాణలో పెద్దమొత్తంలో గ్రూప్-4 జాబ్స్‌ భర్తీకి అనుమతి, మొత్తం 9,168 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం, మూడు కేటగిరీల్లో కొలువులు, ఏయే విభాగాల్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయో లిస్ట్ ఇదుగోండి!

Naresh. VNS

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) ద్వారా రూ.9,168 గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ (CM KCR) ఇచ్చిన హామీ మేరకు పోస్టులను భర్తీ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా ఆశావహులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రూప్‌-4 ఉద్యోగాల్లో ముఖ్యంగా మూడు కేటగిరీలకు సంబంధించిన పోస్టులున్నాయి.

Shashidhar Reddy Joins BJP: బీజేపీ తీర్ధం పుచ్చుకున్న మర్రి శశిధర్‌రెడ్డి, తెలంగాణలో కాంగ్రెస్‌ పని అయిపోయింది, టీఆర్‌ఎస్‌ను గద్దె దించేందుకు పోరాటం చేస్తానని వెల్లడి

Hazarath Reddy

తెలంగాణ సీనియర్‌ నేత‌ మర్రి శశిధర్‌రెడ్డి అధికారికంగా బీజేపీలో చేరిపోయారు. ఢిల్లీలో శుక్రవారం బీజేపీ కీలక నేతల నడము ఆయన కాషాయం కండువా కప్పుకున్నారు. కేంద్ర మంత్రులు సర్బానంద్‌ సోనావాలా, కిషన్‌రెడ్డితో పాటు మరికొందరు కీలక నేతలు ఈ చేరిక కార్యక్రమంలో పాల్గొన్నారు.

MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌కు ఊరట, సిట్‌ నోటీసులపై ప్టే విధించిన తెలంగాణ హైకోర్టు, విచారణ వచ్చే నెల 5వ తేదీకి వాయిదా

Hazarath Reddy

తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో (MLAs Poaching Case) బీజేపీ కీలక నేత, కర్ణాటకకు చెందిన సీనియర్‌ పొలిటీషియన్‌ బీఎల్‌ సంతోష్‌కు ఊరట లభించింది. సిట్‌ నోటీసులపై ( SIT notice) తెలంగాణ హైకోర్టు శుక్రవారం స్టే విధించింది.

Advertisement

Snake Bite on Puppies: షాకింగ్ వీడియో, మూడు కుక్క పిల్లలను కాటేసి చంపేసిన నాగు పాము, పిల్లలను రక్షించుకునేందుకు తల్లి కుక్క పోరాటం

Hazarath Reddy

వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌ మండలం మంతట్టి గ్రామంలో విషాద కర ఘటన చోటు చేసుకుంది. మూడు కుక్క పిల్లలను నాగుపాము కాటేసి చంపేసింది. తన పిల్లలను రక్షించుకునేందుకు తల్లి కుక్క పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది

Same Sex Marriage: సేమ్ సెక్స్ మ్యారేజ్‌‌కు ప్రత్యేక వివాహ చట్టం కోరుతూ పిటిషన్, సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణ అప్పుడే చేపడతామని వెల్లడి

Hazarath Reddy

స్వలింప సంపర్క వివాహాలకు ప్రత్యేక వివాహం చట్టం వర్తింపజేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు గేలు సుప్రియో, అభ‌య్‌ లు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో 5గురికి నోటీసులు, విచారణకు హాజరు కాకుంటే అరెస్ట్‌ చేస్తామని హెచ్చరికలు జారీ చేసిన సిట్

Hazarath Reddy

తెలంగాణతో పాటుగా దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో (MLAs Poaching Case) సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసిన సిట్ (SIT) మరో అయిదుగురికి తాజాగా నోటీసులు జారీ చేసింది.

Projects in Telugu States: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త, రూ.573.13 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం, రోడ్ల విస్తరణ, ప్రధాన పర్యాటక ప్రాంతాలను కలిపేలా రోడ్ల నిర్మాణం

Hazarath Reddy

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Central Minister Nitin Gadkari) బుధవారం నాడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు రూ. 573.13 కోట్ల విలువైన ప్రాజెక్టులకు (Rs 573 crore for Telangana and Andhra Pradesh) ఆమోదం తెలిపారు,

Advertisement
Advertisement