తెలంగాణ

CM KCR at Dhrana: పీయూష్ గోయ‌ల్ కాదు.. పీయూష్ గోల్ మాల్, మోదీని త‌రిమికొడుతామని సీఎం కేసీఆర్ హెచ్చరిక, ఇంటిగ్రేటెడ్ అగ్రిక‌ల్చ‌ర్ పాల‌సీ రూపొందించాలని కేంద్రానికి డిమాండ్

Hazarath Reddy

కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్ర‌జులు, రైతులు సిద్ధంగా ఉన్నార‌ని, తాడోపేడో తేల్చుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. కేంద్రానికి 24 గంట‌ల డెడ్‌లైన్ విధించారు కేసీఆర్. 24 గంట‌ల్లోపు ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

TRS Dharna in Delhi: ధాన్యం సేక‌ర‌ణ‌పై ఢిల్లీలో టీఆర్ఎస్ దీక్ష, రైతుల ప‌క్షాన కేసీఆర్ చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇస్తామని తెలిపిన రాకేశ్ తికాయ‌త్, దీక్ష వేదిక‌గా టీఆర్ఎస్ త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌

Hazarath Reddy

ధాన్యం సేక‌ర‌ణ‌పై ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా టీఆర్ఎస్ దీక్ష (TRS Dharna in Delhi) చేప‌ట్టింది. రైతుల ప‌క్షాన ప్ర‌జాప్ర‌తినిధుల నిర‌స‌న దీక్ష పేరుతో ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన దీక్ష‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ( CM KCR), రాకేశ్ తికాయ‌త్ హాజ‌ర‌య్యారు

Sri Rama Navami Celebrations: భద్రాద్రిలో కన్నులపండువగా శ్రీరామనవమి వేడుకలు, రెండేళ్ల తర్వాత ప్రత్యక్షంగా భక్తులకు నేరుగా తిలకించే అవకాశం, వేలాదిగా చేరుకుంటున్న భక్తులు

Naresh. VNS

భద్రాచలంలో (Badrachalam) రాములోరి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు (Sri ramanavami) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిపేందుకు ఆలయ అధికారులు, అర్చకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మిథిలా స్టేడియంలో (Mithila stadium) జరగనున్న కల్యాణోత్సవానికి భక్తులు పోటెత్తారు.

Fire Accident In Hyderabad: మైలార్ దేవ్ పల్లి పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం, ఉక్కిరిబిక్కిరి అవుతున్న స్థానికులు, రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది..

Krishna

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ప్లాస్టిక్ కంపెనీలో అకస్మాత్తుగా భారీ మంటలు చెలరేగాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. చుట్టుపక్కలంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. ప్లాస్టిక్ కంపెనీ ఇళ్ల మధ్య ఉండటంతో దట్టమైన పొగకు స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

Advertisement

TSRTC Increased Ticket Fares: మరోసారి పెరిగిన బస్సు ఛార్జీలు, డీజిల్ సెస్ పేరుతో ధరలు పెంచిన టీఎస్‌ఆర్టీసీ, ఆర్డినరీ బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.2 వసూలు, సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.5 పెరిగిన ధరలు

Naresh. VNS

తెలంగాణలో మరోసారి ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ (Ordinary) సర్వీసులకు రూ.2 పెంచారు. ఎక్స్ ప్రెస్ , డీలక్స్ (Deluxe), మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసులకు రూ.5 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. బస్సు సర్వీసుల్లో కనీస టికెట్ ధర రూ.10గా నిర్ణయించారు. పెరిగిన ధరలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి.

Telangana: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో, బస్సును ఓవర్ టేక్ చేయబోయి మహిళ తల మీద నుంచి వెళ్లిన లారీ

Hazarath Reddy

తెలంగాణ రాజధాని హైద‌రాబాద్‌లోని రామంత‌పూర్‌లో శుక్ర‌వారం ఉద‌యం ఘోర రోడ్డుప్ర‌మాదం సంభ‌వించింది. యాక్టివాపై వెళ్తున్న ఇద్ద‌రు దంప‌తుల‌ను వేగంగా వ‌చ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో భార్య అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా, భ‌ర్త‌కు తీవ్ర గాయాలయ్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

TRS Protest: కేంద్రం వడ్లు కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసనలు, బీజేపీ సర్కార్ వడ్లు కొనుగోలు చేసేంత వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తేల్చి చెప్పిన కేసీఆర్ సర్కారు

Hazarath Reddy

తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు (TRS organises innovative protest) కొనసాగుతున్నాయి. కాగా, రైతుల ఆందోళనలకు మద్దతుగా ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు కలెక్టర్‌ కార్యాలయం వద్ద చేపట్టిన దీక్షలో మోకాళ్లపై కూర్చొని వినూత్న రీతిలో తమ నిరసనను తెలియజేశారు.

Revanth Reddy House Arrest: రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలు హౌస్ అరెస్ట్, పెట్రోల్‌ ధరలు, విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసనగా ఆందోళనలకు పిలుపునిచ్చిన తెలంగాణ కాంగ్రెస్

Hazarath Reddy

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కాగా, రాష్ట్రంలో ఈ నెల నుంచి విద్యుత్‌ ఛార్జీలు సైతం పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్‌ ధరలు, విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆందోళనలకు ప్లాన్‌ చేశారు.

Advertisement

Ram Navami 2022: రెండు సంవత్సరాల తరువాత శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబైన భద్రాచలం, ఈనెల 10న సీతారాముల కల్యాణం, 11న మహాపట్టాభిషేకం కార్యక్రమాలు

Hazarath Reddy

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన తెలంగాణలోని భద్రాచలం పుణ్యక్షేత్రంలో జరిగే రాములోరి కల్యాణానికి ఏర్పాట్లు (Bhadradri all set for grand Rama Navami) జోరుగా కొనసాగుతున్నాయి. ఈసందర్భంగా ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఈనెల 10న సీతారాముల కల్యాణం, 11న మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు.

Hyderabad Drug Case: డ్రగ్స్‌ పెడ్లర్స్‌ అందరినీ అరెస్ట్‌ చేశాం, కొందరు కస్టమర్లను పట్టుకోవాల్సి ఉందని తెలిపిన నార్కోటిక్స్‌ టీమ్‌ డీసీపీ చక్రవర్తి

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో నమోదైన తొలి డ్రగ్స్‌ మరణానికి సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రేమ్‌ ఉపాధ్యాయకు హష్‌ ఆయిల్‌ సరఫరా చేసిన వీరవల్లి లక్ష్మీపతిని హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌–న్యూ) అధికారులు బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు.

Hyderabad: మత్తుమందు ఇచ్చి అవయవాలు ఎత్తుకెళ్లారు! గోవాలో మిస్సైన టెంపో డ్రైవర్ తలపై మిస్టరీ కుట్లు, నిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీనివాస్, కళ్లు తెరిస్తే కానీ మీస్టరీ వీడే అవకాశం లేదు

Naresh. VNS

బోరబండలో నివాసముంటున్న శ్రీనివాస్..టెంపో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మార్చి 19న 10 మందిని గోవా తీసుకువెళ్లిన శ్రీనివాస్ 20న సాయంత్రం అదృశ్యమయ్యాడు. దీంతో కూడా వచ్చిన ప్రయాణికులు బోరబండలోని శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకుని గోవా వెళ్లిన కుటుంబ సభ్యులు అక్కడ శ్రీనివాస్ కోసం గాలించినా ఆచూకీ దొరకకపోవడంతో గోవాలోని అంజునా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

KTR Satire on Modi: ప్రధాని మోదీపై సెటైర్ విసిరిన తెలంగాణ మంత్రి కేటీఆర్, దేశంలో జీడీపీ దూసుకెళ్లడం లేదని ఎవరన్నారంటూ ట్వీట్

Hazarath Reddy

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా మరోసారి ప్రధాని మోదీపై వ్యంగ్యం ప్రదర్శించారు. గత రెండు వారాల్లో.. దేశవ్యాప్తంగా దాదాపు 10రూ. పెరిగిన పెట్రో ధరలను ప్రస్తావిస్తూ కేటీఆర్‌ మంగళవారం ఉదయం ఓ ట్వీట్‌ చేశారు.

Advertisement

Telangana: డ్రగ్స్‌కు బానిసైన కొడుకు, కరెంటు స్తంభానికి కట్టేసి కళ్లలో కారం కొట్టిన తల్లి, మంట మంట అంటూ అల్లాడిన బాధితుడు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

తెలంగాణలో సూర్యాపేట జిల్లా కోదాడలో గంజాయికి బానిసైన కుమారుడికి తల్లి దేహశుద్ధి చేసిన ఘటన వీడియో వెలుగులోకి వచ్చింది. కోదాడలో 15 ఏళ్ల కుర్రాడు గంజాయి లేనిదే బతకలేని స్థితికి వచ్చాడు. కొడుకు మాదక ద్రవ్యాలకు బానిస కావడాన్ని ఆ తల్లి తట్టుకోలేకపోయింది.

TS EDCET-2022: టీఎస్ ఎడ్‌సెట్ -2022 నోటిఫికేష‌న్ విడుద‌ల, రెండేండ్ల బీఎడ్ కోర్సుకు ఏప్రిల్ 7 నుంచి జూన్ 15వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు

Hazarath Reddy

తెలంగాణలో టీఎస్ ఎడ్‌సెట్ -2022 నోటిఫికేష‌న్ విడుద‌లైంది. 2022-23 విద్యా సంవ‌త్స‌రానికి గానూ రెండేండ్ల బీఎడ్ కోర్సుకు (TS EDCET-2022) సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను ఉన్న‌త విద్యా మండ‌లి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ లింబాద్రి, ఎడ్‌సెట్ క‌న్వీన‌ర్ రామ‌కృష్ణ‌, ఎడ్‌సెట్ కో క‌న్వీన‌ర్ శంక‌ర్ విడుద‌ల చేశారు.

Weather Forecast: తెలంగాణకు ఎల్లో అల‌ర్ట్, రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని తెలిపిన హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ

Hazarath Reddy

తెలంగాణలో గత వారం రోజుల నుంచి ఎండలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. తాజాగా ఎండ‌ల‌తో ఉక్కిరి బిక్కిరి అవుతోన్న తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి, ఉక్క‌పోత నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగించే వార్త‌ను హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ వినిపించింది.

Hyderabad vs Bengaluru: హైదరాబాద్ vs బెంగుళూరు, డీకే శివకుమార్ మంత్రి కేటీఆర్ మధ్య ఐటీ గురించి ఆసక్తికర ఛాలెంజ్ చర్చ

Hazarath Reddy

మంత్రి కేటీఆర్‌, క‌ర్నాట‌క కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్ మ‌ధ్య ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆస‌క్తికర చ‌ర్చ జ‌రిగింది. బెంగుళూరులో మౌళిక స‌దుపాయాలు స‌రిగా లేవ‌ని కొన్ని రోజుల క్రితం ఖాతాబుక్ సీఈవో త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement

Hyderabad Rave Party: ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ కేసులో విస్తు గొలిపే విషయాలు, 148 మందిలో అందరూ వీఐపీల బిడ్డలే, ఎఫ్‌ఐఆర్‌లో నలుగురు నిందితుల పేర్లు, రాడిసన్‌ బ్లూ హోటల్‌‌లో అసలేం జరిగింది

Hazarath Reddy

భాగ్య నగరంలో పబ్‌ సంస్కృతి మితిమీరిపోతోంది. తాజాగా రాడిసన్‌ బ్లూ హోటల్‌ ఉదంతం (Hyderabad Drugs Bust) వెలుగులోకి రావడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లోని బంజా రాహిల్స్‌ రోడ్‌ నం.6లో ఉన్న ర్యాడిసన్‌ బ్లూప్లాజా హోటల్‌కు చెందిన ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో ఆదివారం తెల్లవారుజామున నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు.

Covid in TS: తెలంగాణలో కొత్తగా 12 మందికి కరోనా, అత్యధికంగా హైదరాబాదులో 8 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 10,348 కరోనా పరీక్షలు నిర్వహించగా, 12 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 8 కొత్త కేసులు నమోదు కాగా, జోగులాంబ గద్వాల జిల్లాలో 1, ఆదిలాబాద్ జిల్లాలో 1, నాగర్ కర్నూలు జిల్లాలో 1, కామారెడ్డి జిల్లాలో 1 కేసు గుర్తించారు.

Naga Babu Reacts on Niharika: నా బిడ్డ బంగారం, ఆమె ఏ తప్పు చేయలేదనే పోలీసులు వదిలేశారు, నిహారికపై వస్తున్న వదంతులపై నాగబాబు క్లారిటీ, వీడియో రిలీజ్ చేసిన మెగా బ్రదర్

Naresh. VNS

నా కూతురు నిహారిక ఆ స‌మ‌యానికి అక్క‌డుండ‌ట‌మే. ప‌బ్ టైమింగ్స్ ప‌రిమితికి మించి న‌డ‌ప‌డం వ‌ల్ల ప‌బ్ మీద పోలీసులు చ‌ర్య‌లు తీసుకున్నారు. నిహారిక‌కు సంబంధించినంత వ‌ర‌కు ఆమె క్లియ‌ర్. నిహారిక విష‌యంలో ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని పోలీసులు చెప్పారు. అనుమానాల‌కు తావివ్వ‌కూడద‌ని స్పందిస్తున్నా. నిహారిక‌పై అన‌వ‌స‌ర ప్ర‌చారాలు చేయ‌కండని విజ్ఞ‌ప్తి చేశారు నాగ‌బాబు.

Hyderabad: మాజీ ఎంపీ రేణుకా చౌదరికి చెందిన పబ్‌లో రేవ్ పార్టీ, పట్టుబడ్డ బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్, ప్రముఖ నటుడి కుమార్తె, పలువురు సెలబ్రెటీలు, భారీగా కొకైన్, గంజాయి, డ్రగ్స్ స్వాధీనం

Naresh. VNS

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లో నిర్వహిస్తున్న భారీ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. హోటల్‌లోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో (Fooding and mink pub) రేవ్‌ పార్టీ (Rev party) నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆదివారం వేకువజామున 2.30 గంటల సమయంలో నార్త్‌జోన్‌, సెంట్రల్‌ జోన్‌, వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మెరుపుదాడి చేశారు.

Advertisement
Advertisement