తెలంగాణ

Telangana Cabinet Meeting: కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, కాలేజీల్లో ఫీజుల నియంత్రణ, కొత్త చట్టం తీసుకువచ్చేందుకు కసరత్తు

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సోమవారం జరిగిన తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖంగా రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ, ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసే దిశగా కొత్త చట్టం తీసుకురావాలని టీ కేబినెట్ (Telangana Cabinet Meeting) నిర్ణయించింది.

COVID in TS: తెలంగాణలో కొత్తగా 2,447 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 1,112 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 80,138 శాంపిల్స్ పరీక్షించగా... 2,447 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 1,112 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 235, రంగారెడ్డి జిల్లాలో 183 కేసులు వెల్లడయ్యాయి.

Pocharam Srinivas Reddy Corona: పోచారం శ్రీనివాసరెడ్డికి మరోసారి కరోనా, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మరోసారి కరోనా సోకింది. ఆయనకు స్వల్ప లక్షణాలే ఉన్నప్పటికీ ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సూచించారు. దాంతో హైదరాబాదు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.

COVID in TS: తెలంగాణలో కొత్తగా 2,047 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,174 కొత్త కేసులు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 55,883 మందికి కరోనా పరీక్షలు చేయగా... 2,047 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,174 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 178, రంగారెడ్డి జిల్లాలో 140 కేసులు వెల్లడయ్యాయి.

Advertisement

Sankranthi Holidays Extended: తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు, కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయం, ఈ నెల 30 వరకు హాలీడేస్‌

Naresh. VNS

8 వ తేదీ నుంచి ప్రకటించిన సంక్రాంతి సెలవులు (Sankranthi Holidays) నేటితో ముగియనున్నాయి. అయితే రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సెలవులు పొడిగించాలని విద్యాశాఖ (Edcuation ministry)కు వైద్యారోగ్య శాఖ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ(Health ministry) సిఫార్సు మేరకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Kanuma Festival : కనుమ పండుగను ఎందుకు చేసుకుంటారు? ఎలా చేసుకోవాలి? కనుమనాడు చేయకూడనివి, చేయాల్సినవి ఏమిటి?

Naresh. VNS

సంక్రాంతి(Sankranthi) అంటేనే సందడి. చిన్నా, పెద్దా అంతా కలిసి చేసుకునే పండుగ. మూడు రోజుల పాటూ నిర్వహించే ఈ పండుగలో మూడో రోజు కనుమను సెలబ్రేట్ చేసుకుంటారు. మొదటి రెండ రోజులు మనం చేసుకుంటే మూడో రోజు మన చుట్టూ ఉన్న ప్రకృతి(Nature), మనకు సహాయం చేసిన పశువులు, పక్షులకు కృతజ్ఞతలు చెప్పడానికి చేసుకుంటారు.

Tamilisai Sankranti Celebrations: రాజ్‌భవన్‌లో ఘనంగా సంక్రాంతి వేడుకలు, స్వయంగా పొంగల్ వండిన గవర్నర్ తమిళిసై, కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు

Naresh. VNS

తెలంగాణలోని రాజ్‌భ‌వ‌న్‌ (Rajbhavan)లో సంక్రాంతి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. సంక్రాంతి (sankranti ) వేడుక‌ల్లో భాగంగా గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై (tamilisai) సౌంద‌ర్ రాజ‌న్ స్వ‌యంగా పొంగ‌ల్ (Pongal) వండి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. రాజ్‌భ‌వ‌న్‌లోని మెయిన్ హౌస్ ముందు గ‌వ‌ర్న‌ర్ పొంగ‌ల్ వంట‌కాలు వండి, ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

Covid cases in Telangana: తెలంగాణలో తగ్గని కరోనా తీవ్రత, ఒక్కరోజే 2,398 పాజటివ్ కేసులు నమోదు, హైదరాబాద్‌ పరిధిలోనే అత్యధికంగా కరోనా కేసులు

Naresh. VNS

తెలంగాణ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి (Corona cases) విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు (positive cases) పెరిగిపోతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 2,398 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. మ‌రో 1,81 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. రిక‌వ‌రీ రేటు (recovery rate) 96.35 శాతంగా ఉంది.

Advertisement

Makar Sankranti 2022: వరుణ్ తేజ్‌పై మెగాస్టార్ చిరంజీవి సీరియస్, అందరూ చూస్తుండగానే ఏం చేశాడో తెలిస్తే షాక్...

Krishna

చిరంజీవి, ఆయన సోదరుడు నాగబాబు కుటుంబం, అలాగే అల్లు అరవింద్ కలిసి వేడుకలు జరుపుకున్నారు. కాగా తమ భోగి పండగ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను చిరంజీవి, వరుణ్ తేజ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ అవి కాస్తా వైరల్‌గా మారాయి.

Makar Sankranti 2022: భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలుసా, మకర సంక్రాంతి నాడు పాటించే ఆచారాలు ఏంటి, కనుమ రోజు ఏం చేయాలి, ఈ ఆచారాల వెనుక ఉండే రహస్యాలేంటి ?

Krishna

తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఈ పండుగ భోగి మంటలతో, భోగి పళ్లతో మొదలవుతుంది. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరి లోగిల్లో రంగు రంగుల ముగ్గులు, వాటి మధ్య గొబ్బెమ్మలు.. బోగి మంటలతో పండుగ శోభను సంతరించుకుంటాయి.

Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు, రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే దంచి కొడుతున్న వానలు, ఉష్ణోగ్రత తగ్గి పెరుగుతున్న చలి

Hazarath Reddy

ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, కర్ణాటక నుంచి విదర్భ, చత్తీస్‌గఢ్ మీదుగా ఒడిశా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు (Weather Forecast) అధికారులు పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సముద్రమట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది.

Makar Sankranti 2022: సంక్రాంతి మూడు రోజుల విశిష్టత, జరుపుకునే విధానం గురించి తెలుసుకుందాం,

Krishna

సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేవి పల్లె వాతావరణం, పాడి పంటలు, భోగిమంటలు, కోడిపందాలు, ముగ్గుల పోటీలు. ఈ పండుగకి ఎగసిపడే భోగిమంటలు రంగురంగుల ముగ్గులు పచ్చని పైరుగల పొలాలు అన్నీ ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి.

Advertisement

COVID in TS: తెలంగాణలో గడచిన 24 గంటల్లో 2,707 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,328 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 84,280 శాంపిల్స్ పరీక్షించగా... 2,707 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,328 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 248, రంగారెడ్డి జిల్లాలో 202 కేసులు వెల్లడయ్యాయి.

Shankar Rao Convicted:రెండు కేసుల్లో దోషిగా తేలడంతో కోర్టులోనే సృహతప్పిన మాజీమంత్రి శంకర్‌రావు, శిక్ష రద్దు చేసి జరిమానాతో సరిపెట్టిన కోర్టు

Naresh. VNS

మాజీమంత్రి శంకర్‌రావు(Ex-minister Shankar Rao )ను రెండు కేసుల్లో దోషి(convicted)గా తేల్చింది ప్రజా ప్రతినిధుల కోర్టు. భూ వివాదానికి(Land case) సంబంధించి బెదిరించారన్న ఆరోపణలతో షాద్‌నగర్‌(Shadnagar)లో 2015లో ఓ కేసు నమోదైంది.

Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షాలు, మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం, అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ

Hazarath Reddy

హైదరాబాద్ గురువారం బూడిద మేఘాల దట్టమైన దుప్పటిని చుట్టుకొని నిద్రలేచింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే భారీ వర్షం (Hyderabad Rains) కురుస్తోంది. ఎల్బీనగర్, చైతన్యపురి, కొత్తపేట్‌, సరూర్ నగర్. కర్మన్ ఘాట్, రాజేంద్రనగర్, హైదర్‌గూడ, నాగోల్‌, మీర్‌పేట్‌, అత్తాపూర్, నార్సింగి మణికొండ, పుప్పాలగూడ ప్రాంతాల్లో జల్లులతో కూడిన వర్షం కురుస్తోంది.

COVID Clusters on IIT Campuses: హైదరాబాద్ ఐఐటీ కాలేజీలో కరోనా కల్లోలం, గత 24 గంటల్లో 123 మందికి కరోనా, ప్రస్తుతం క్యాంపస్‌లో 2 వేలమంది విద్యార్థులు, 250 మంది ఫ్యాకల్టీలు

Hazarath Reddy

తెలంగాణలో కాలేజీల్లో కరోనా కల్లోలం రేపుతోంది, ముఖ్యంగా గత 24 గంటల వ్యవధిలో ఐఐటీ కాలేజీల్లో (COVID Clusters on IIT Campuses) కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని హైదరాబాద్‌ ఐఐటీలో బుధవారం నాటికి 123 మందికి కరోనా సోకింది.

Advertisement

COVID in TS: తెలంగాణలో కొత్తగా 2,319 మందికి కరోనా, ఇద్దరు మృతి, తాజాగా 474 మంది రికవరీ

Hazarath Reddy

బుధవారం తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2,319 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు.ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య (Corona cases in Telangana) 7,00,094 కాగా, మరణాల సంఖ్య 4,047 ఉంది. ఇక రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 6,77,708 ఉండగా, తాజాగా 474 మంది రికవరీ అయ్యారు.

KCR Letter to PM Modi: ప్రధాని మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ ఘాటు లేఖ, ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్, రైతుల నడ్డి విరుస్తున్నారని మండిపాటు

Naresh. VNS

ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు తెలంగాణ సీఎం కేసీఆర్(Kcr Letter to Modi). ఎరువుల ధరల పెంపుపై కేంద్రం తీరును ఆయన తప్పుబట్టారు (KCR opposes hike in fertilizer rates). పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని ఆయన కోరారు. పెరిగిన ఎరువుల ధ‌ర‌లు(fertilizer prices) త‌గ్గించాల‌ని, కోట్ల మంది రైతుల త‌ర‌పున విజ్ఞప్తి చేస్తున్నాన‌ని కేసీఆర్ త‌న లేఖ‌లో పేర్కొన్నారు.

Fire Breaks Out at GHMC: జీహెచ్ఎంసీ జోనల్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం, పలు ఫైల్స్‌ దగ్ధం, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

భాగ్యనగరం సికింద్రాబాద్‌లోని జీహెచ్ఎంసీ జోనల్‌ కార్యాలయంలో బుధవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ కార్యాలయంలోని మూడవ అంతస్తులో టాక్స్ సెక్షన్లో మంటలు చెలరేగాయి. కార్యాలయమంతా దట్టమైన పొగ కమ్ముకుంది.

Minister Thalassani: సినిమా సమస్యలపై ఏపీ ప్రభుత్వంతో మాట్లాడతా, తెలంగాణ మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు, సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్‌గా ఉండాలని తెలిపిన మంత్రి

Hazarath Reddy

ఏపీలోని సినిమా థియేట‌ర్ల స‌మ‌స్య‌ల‌పై (I will talk to AP ministers on the issue of theaters) ఆ రాష్ట్ర మంత్రుల‌తో తాను మాట్లాడ‌తాన‌ని తెలంగాణ‌ మంత్రి తలసాని శ్రీ‌నివాస్ యాద‌వ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Advertisement