తెలంగాణ

Bandi Sanjay Bail Rejected: బండి సంజయ్ కి బెయిల్ నిరాకరణ, 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ

Krishna

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి కరీంనగర్ కోర్టులో చుక్కెదురైంది. బండి సంజయ్ కి బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించడంతో 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Telangana: కొంప ముంచిన అప్పులు, కుటుంబంలో ముగ్గురు సజీవ దహనం, హత్యా లేక ఆత్మహత్యా తేల్చేందుకు రంగంలోకి దిగిన పోలీసులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన

Hazarath Reddy

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాత పాల్వంచ పరిధిలోని ఒక ఇంట్లో గ్యాస్‌లీక్‌ అయి కుటుంబంలో ముగ్గురు సజీవ దహనం (death in a fire accident) అయ్యారు. మృతులను మొండిగ రామకృష్ణ, భార్య శ్రీలక్ష్మి, కుమార్తె సాహిత్యగా గుర్తించారు.

Y. S. Sharmila: ఏపీలో షర్మిల పార్టీపై సస్పెన్స్, వ్యూహాత్మక సమాధానం ఇచ్చిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి, రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చని తెలిపిన షర్మిల

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెడతారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల (Y. S. Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై (political party Establishment in Andhra Pradesh) మీడియా అడిగిన ప్రశ్నకు షర్మిల చాలా వ్యూహాత్మకంగా సమాధానం ఇచ్చారు.

Hyderabad Fire Accident: శివపార్వతి థియేటర్‌లో ఘోర అగ్ని ప్రమాదం, పూర్తిగా తగలబడిపోయిన థియేటర్‌, దాదాపు రూ. 2 కోట్ల మేర నష్టం, మంటలను అదుపులోకి తీసుకువచ్చిన ఫైర్ సిబ్బంది

Hazarath Reddy

కేపీహెచ్‌బీ కాలనీలో ఉన్న శివపార్వతి థియేటర్‌లో ఈరోజు తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు (Hyderabad Fire Accident) వ్యాపించాయి. దీంతో థియేటర్‌ పూర్తిగా (fire broke out At Shiva Parvathi Theatre) తగలబడిపోయింది. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని అధికారులు భావిస్తున్నారు

Advertisement

Corona in TS: తెలంగాణలో గత 24 గంటల్లో 274 మందికి కరోనా, జీహెచ్ఎంసీలో భారీస్థాయిలో 212 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన ఒక్కరోజులో 21,679 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 274 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీలో భారీస్థాయిలో 212 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 18, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 17 కేసులు వెల్లడయ్యాయి. పలు జిల్లాల్లో కొత్తకేసులేవీ నమోదు కాలేదు.

Bandi Sanjay Arrest: అధికారం, అహంకారంతో కేసీఆర్ కళ్లు నెత్తికెక్కాయి, తీవ్ర విమర్శలు చేసిన బండి సంజయ్, బీజేపీ జాగరణదీక్ష భగ్నం, కరీంనగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు

Hazarath Reddy

ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణదీక్షను (Jagarana Deeksha) పోలీసులు భగ్నం చేశారు.అక్కడ లాఠీఛార్జీలు, తోపులాటలతో ఎంపీ ఆఫీసు యుద్ధక్షేత్రాన్ని తలపించింది.

Revanth Reddy Covid: రేవంత్‌రెడ్డికి కరోనా, జ్వరంతో కూడిన స్వల్ప లక్షణాలు, తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని కోరిన తెలంగాణ కాంగ్రెస్ చీఫ్

Hazarath Reddy

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కొవిడ్ సోకినట్టు నిర్ధారణ అయినట్టు చెప్పారు. జ్వరం, స్వల్ప లక్షణాలు కనిపించడంతో అనుమానంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని, దీంతో కొవిడ్ సోకినట్టు నిర్ధారణ అయిందని తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Nalgonda Accident: పెళ్లైన వారం రోజులకే విషాదం, రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ ఎస్‌ఐ మృతి, ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తండ్రి సహా ఎస్‌ఐ మృతి

Naresh. VNS

నల్లగొండలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన వారం రోజులకే వికారాబాద్ వన్ టౌన్ ఎస్‌ఐ రోడ్డు (Sub-inspector) ప్రమాదంలో మృతి చెందారు. ఈఘటనలో ఎస్‌ఐ(Sub-inspector)తో పాటు ఆయన తండ్రి కూడా మృతి చెందడంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Advertisement

Liquor Sales in Telangana: మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్‌, న్యూఇయర్‌ నాడు తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలెన్ని అంటే! ఏపీలోనూ రికార్డుస్థాయిలో లిక్కర్ సేల్

Naresh. VNS

సంవత్సరం చివరి రోజు (Year End)తెలుగు రాష్ట్రాల్లో రికార్డుస్థాయిలో లిక్కర్‌ అమ్మకాలు(Highest Liquor sale) జరిగాయి. ముఖ్యంగా తెలంగాణలో రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్‌శాఖ(Excise) తెలిపింది. డిసెంబర్‌(December) నెలలోనే తెలంగాణలో అత్యధిక విక్రయాలు(Telangana Liquor sale highest) నమోదయ్యాయి.

Telangana: తెలిసిన వాళ్లే దారుణంగా రేప్ చేస్తున్నారు, తెలంగాణలో 23 శాతానికి పైగా పెరిగిన అత్యాచార కేసులు, రాష్ట్రంలో మొత్తం నేరాలు 4.65 శాతం పెరిగాయని తెలిపిన పోలీస్ అధికారులు

Hazarath Reddy

ఈ కేసులను స్టడీ చేయగా ఎక్కువ భాగం అత్యాచార బాధితులకు నేరస్థులు తెలిసిన వారేనని పోలీసులు తెలిపారు. కాగా 2020లో 1,934 అత్యాచార కేసులు నమోదయ్యాయి. కేవలం 26 కేసుల్లో మాత్రమే గుర్తుతెలియని నిందితులు అత్యాచారాలకు పాల్పడ్డారని తేలింది

Telangana High Court: తెలంగాణలో ఒమిక్రాన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు, కేంద్ర గైడ్‌లెన్స్‌ను తప్పకుండా పాటించాలని కేసీఆర్ ప్రభుత్వానికి సూచన, న్యూఇయర్ వేడుకలపై జోక్యం చేసుకోలేమని తెలిపిన కోర్టు

Hazarath Reddy

హైకోర్టు ఒమిక్రాన్‌పై కీలక ఆదేశాలు ( immediately implement the guidelines) జారీ చేసింది. ఈ నెల 21, 27న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గైడ్ లెన్స్‌ను తప్పకుండా పాటించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.

Vijaya Dairy: తెలంగాణలో పాల వినియోగదారులకు షాక్, విజయ డైయిరీ పాల ధరలు పెంపు, లీటరు టోన్డ్ మిల్క్ పై రూ. 2, హోల్ మిల్క్ పై రూ. 4 పెంపు

Hazarath Reddy

తెలంగాణలో విజయ డైయిరీ పాల ధరలు పెరిగాయి. లీటరు టోన్డ్ మిల్క్ పై రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ప్రకటించింది. దీంతో పాటుగా హోల్ మిల్క్ ధర ధర కూడా రూ.4 పెంచింది. ఈ పెంచిన ధరలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.

Advertisement

Hyderabad: మాయమాటలతో పొదల్లోకి తీసుకువెళ్లి బాలికపై దారుణంగా అత్యాచారం, నిందితుడిని అరెస్ట్ చేసిన రాజేంద్రనగర్ పోలీసులు, నల్గొండ జిల్లాలో భూమి తన పేర రాయలేదని భార్య మరో దారుణం

Hazarath Reddy

భాగ్య నగరంలోని రాజేంద్రనగర్‌లో దారుణం​ జరిగింది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ మానవ మృగం అత్యాచారానికి పాల్పడింది. ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న అమ్మాయికి ఓ యువకుడు మాయమాటలు చెప్పి మోటార్‌ సైకిల్‌పై హిమాయత్‌సాగర్‌ వైపు తీసుకెళ్లాడు.

Goreti Venkanna: గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, వల్లంకి తాళం సాహిత్యానికి అవార్డు, హర్షం వ్యక్తంచేసిన సీఎం కేసీఆర్, అందరికీ ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్సీ గోరటి వెంకన్న

Hazarath Reddy

కేంద్ర సాహిత్య అకాడమీ 2021 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ అవార్డులను గురువారం ప్రకటించింది. కవి, రచయిత ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు (Telangana MLC Goreti Venkanna) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. 2021 సంవత్సరానికి గాను గోరటి వెంకన్నను తెలుగులో సాహిత్యంలో ఎంపికచేశారు.

Traffic Restrictions in Hyderabad: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో అడుగడుగునా తనిఖీలు, నూతన సంవత్సరం సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి..

Hazarath Reddy

నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్ల పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions in Hyderabad) ప్రకటించారు. గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం ఉదయం 2 గంటల వరకు ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్డు పరిసరాల్లో వాహనాల రాకపోకలను అనుమతించబోమని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ (Hyderabad Commissioner of Police Anjani Kumar) తెలిపారు.

Omicron in TS: జనవరి 2 వరకు తెలంగాణలో ఆంక్షలు, ర్యాలీలు, సభలను నిషేధిస్తున్నామని తెలిపిన డీజీపీ మహేందర్ రెడ్డి, అందరూ మాస్కు ధరించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు (Omicron in TS) అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణలో ఆంక్షలు (Restrictions in Telangana) విధించారు. జనవరి 2వ తేదీ వరకు ర్యాలీలు, సభలను నిషేధిస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి (DGP mahender-reddy) ఉత్వర్వులు జారీ చేశారు.

Advertisement

Omicron in Telangana: కరోనా థర్డ్‌వేవ్‌ దూసుకొస్తోంది, తెలంగాణలో వచ్చే 2,3 వారాలు చాలా కీలకమని తెలిపిన రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు పాటించాలని సూచన

Hazarath Reddy

తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్‌ శరవేగంగా వ్యాప్తిస్తోంది. ఎటువంటి ప్రయాణ చరిత్ర, ఎలాంటి కాంటాక్ట్‌ లేకపోయినా ఒమిక్రాన్‌ వేరియంట్ (Omicron in Telangana) చాపకింద నీరులా వ్యాప్తిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసులపై రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

Corona in TS: తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, గత 24 గంటల్లో 235 మందికి కోవిడ్, ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 121 కొత్త కేసులు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 38,023 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 235 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 121 కొత్త కేసులు వెల్లడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 31, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 23 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 204 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

December 31 Restrictions: తెలంగాణలో న్యూఇయర్ వేడుకలకు మార్గదర్శకాలివే! నిబంధనలు విడుదల చేసిన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు, 2డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికే అనుమతి

Naresh. VNS

తెలంగాణలో న్యూఇయర్ వేడుకలకు(New Year celebrations in Telangana) అనుమతిచ్చిన ప్రభుత్వం...పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలకండి. కానీ రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో న్యూ ఇయర్‌ వేడుకల(Hyderabad New year) సందర్భంగా సీపీ సీవీ ఆనంద్‌ (CV Anand)మార్గదర్శకాలు జారీ చేశారు.

CM KCR Review Meeting: ప్రభుత్వ పథకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష, నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో సమావేశం

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో సమీక్ష (CM KCR Review Meeting) నిర్వహించారు. ఈ సమావేశంలో పోడు భూముల అంశంతో పాటు దళిత బంధు పథకం అమలు, మెడికల్ కాలేజీ నిర్మాణంపై సీఎం చర్చించారు.

Advertisement
Advertisement