తెలంగాణ
Telangana Bandh Update: కేసీఆర్‌ని జైలుకు పంపిస్తాం, వదిలే ప్రసక్తే లేదు, జైలు నుంచి విడుదలైన బండి సంజయ్‌, జనవరి 10న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన బీజేపీ
Hazarath Reddyతెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌తో (Bandi Sanjay Arrest) వాతావరణం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలో అక్రమ కేసులను నిరసిస్తూ, 317 జీవోను పునఃసమీక్షించాలని డిమాండ్‌ చేస్తూ భారతీయ జనతాపార్టీ జనవరి 10న రాష్ట్ర బంద్‌కు (Telangana Bandh ) పిలుపునిచ్చింది.
COVID in TS: కరోనా థర్డ్ వేవ్ అలర్ట్, తెలంగాణలో ఒక్కరోజే 1,520 మందికి కరోనా, ప్రస్తుతం రాష్ట్రంలో 6,168 యాక్టివ్ కేసులు
Hazarath Reddyతెలంగాణలో వరుసగా రెండో రోజు కూడా కరోనా కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 42,531 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా వీరిలో 1,520 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,85,543కి చేరుకుంది.
MP Bandi Sanjay Bail Row: బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు, వ్యక్తిగత పూచికత్తు కింద రూ. 40 వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశం, తదుపరి విచారణ ఈనెల 7కు వాయిదా
Hazarath Reddyబీజీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. బండి సంజయ్‌ జుడిషియల్ రిమాండ్‌పై స్టే విధించిన హైకోర్టు.. ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తూ బుధవారం మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వ్యక్తిగత పూచికత్తు కింద రూ. 40 వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.
Corona in TS: తెలంగాణలో కరోనా విశ్వరూపం, ఒక్కరోజులోనే 1,052 కేసులు నమోదు, అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 659 కొత్త కేసులు
Hazarath Reddyతెలంగాణలో విశ్వరూపం చూపిస్తోంది. ఒక్కరోజులోనే వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 42,991 కరోనా శాంపిల్స్ పరీక్షించగా... 1,052 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 659 కొత్త కేసులను గుర్తించారు.
Telangana Shocker: కొడుకు ఆత్మహత్య, కోడలిని దారుణంగా కత్తితో గొంతు కోసి చంపేసిన మామ, తెలంగాణ మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కోడలిని మామ అత్యంత కిరాతకంగా కత్తితో గొంతు కోసి (Woman hacked to death by father in law) చంపేశాడు. కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన (Telangana Shocker) చోటుచేసుకుంది.
JP Nadda Press Meet: ఇది మనకు ధర్మ యుద్ధం, కేసీఆర్‌ది అప్రజాస్వామిక పాలన, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే పనిగా పెట్టుకున్నారు, పార్టీ ఆఫీసులో కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా
Hazarath Reddyసంజయ్ బండిని మానవహారంగా నిర్వహించి పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలో కేసీఆర్ అప్రజాస్వామిక పాలనకు (Telangana govt is the most undemocratic government) ఇది ప్రత్యక్ష ఉదాహరణ. కేసీఆర్ తన భావాలను, మానసిక సమతుల్యతను కోల్పోయారని విమర్శించారు.
Bandi Sanjay Arrest Row: ర్యాలీ లేకుండా నిరసనతో ముగించిన జేపీ నడ్డా, గాంధీ విగ్రహానికి నివాళులు, సత్యాగ్రహం పూర్తయిందని తెలిపిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
Hazarath Reddyబీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సికింద్రాబాద్‌లో గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. నడ్డాతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ ఇతర బీజేపీ నేతలు గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.
MP Bandi Sanjay: ఎంపీ బండి సంజయ్‌‌కు హైకోర్టులో చుక్కెదురు, లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను తిరస్కరించిన సింగిల్‌ బెంచ్‌, ఎమ్మెల్యే, ఎంపీల కేసుల విచారణకు తనకు రోస్టర్ లేదని తెలిపిన అత్యున్నత న్యాయస్థానం
Hazarath Reddyఎంపీ బండి సంజయ్‌ హైకోర్టులో దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ (Telangana High Court Single Bench) తిరస్కరించింది. కరీంనగర్‌లో తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్‌లో (Lunch Motion Petition) కోరారు.
Suryapet: సూర్యాపేట ర్యాగింగ్ కేసులో ఆరుగురు విద్యార్థులపై సస్పెన్షన్‌ వేటు, వసతిగృహం నుంచి విద్యార్థులను శాశ్వతంగా పంపించేస్తూ ఉత్తర్వులు, ఐదుగురు వైద్య విద్యార్థులపై కేసు నమోదు
Hazarath Reddyసూర్యాపేటలోని Medical Collegeకు చెందిన హాస్టల్ లో ఒక student Raging కు గురైన ఉదంతం కలకలం రేపిన సంగతి విదితమే. విచారణలో సూర్యాపేట మెడికల్‌ కాలేజీ ర్యాగింగ్‌ ఘటన నిజమేనని తేలింది. ర్యాగింగ్‌పై ఏర్పాటు చేసిన కమిటీ హాస్టల్‌లో ర్యాగింగ్‌ (Suryapet Student Ragging Case) జరిగినట్లు నివేదికలో తేల్చింది. ర్యాగింగ్ చేసిన ఆరుగురు విద్యార్థులపై ఏడాదిపాటు సస్పెన్షన్‌ వేటు వేస్తున్నట్లు డీఎంఈ తెలిపారు.
Omicron in Telangana: గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా కల్లోలం, తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన కేసీఆర్ సర్కారు, పెరుగుతున్న కేసులతో నుమాయిష్‌ మూసివేత
Hazarath Reddyతెలంగాణలోని అన్ని విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవులు (Schools, colleges to remain shut in Telangana) ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో 9 రోజులు సెలవులను ప్రకటించారు. 16వ తేదీ తర్వాత కరోనావైరస్ (Coronavirus) పరిస్థితులను బట్టి సెలవులపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.
COVID in Telangana: తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన కేసులు, గత 24 గంటల్లో 482 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 294 కొత్త కేసులు
Hazarath Reddyతెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్యలో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. కొన్నిరోజుల కిందటి వరకు 100కి అటూఇటూగా నమోదైన కొత్త కేసులు, ఇప్పుడు 400 దాటాయి. గడచిన 24 గంటల్లో 38,362 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 482 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 294 కొత్త కేసులు వెలుగు చూశాయి.
Bhadradri Kothagudem: పాల్వంచ కుటుంబం సజీవదహనం కేసులో కొత్త ట్విస్ట్, ఎమ్మెల్యే కుమారుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు, పరారీలో నిందితుడు, సూసైడ్ లెటర్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు
Hazarath Reddyభద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో రామకృష్ణ కుటుంబం సజీవ దహనం కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేందర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పాల్వంచ ఏఎస్పీ వెల్లడించారు.
Telangana Lockdown Update: కేసులు పెరిగితేనే తెలంగాణలో లాక్‌డౌన్, క్లారీటి ఇచ్చిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, జనవరి చివరి వారంలో లాక్ డౌన్ ఉండే అవకాశం ఉందని తెలిపిన డీపీహెచ్
Hazarath Reddyతెలంగాణలో కరోనావైరస్ కేసులు, ఒమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Bandi Sanjay Bail Rejected: బండి సంజయ్ కి బెయిల్ నిరాకరణ, 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ
Krishnaబిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి కరీంనగర్ కోర్టులో చుక్కెదురైంది. బండి సంజయ్ కి బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించడంతో 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Telangana: కొంప ముంచిన అప్పులు, కుటుంబంలో ముగ్గురు సజీవ దహనం, హత్యా లేక ఆత్మహత్యా తేల్చేందుకు రంగంలోకి దిగిన పోలీసులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన
Hazarath Reddyభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాత పాల్వంచ పరిధిలోని ఒక ఇంట్లో గ్యాస్‌లీక్‌ అయి కుటుంబంలో ముగ్గురు సజీవ దహనం (death in a fire accident) అయ్యారు. మృతులను మొండిగ రామకృష్ణ, భార్య శ్రీలక్ష్మి, కుమార్తె సాహిత్యగా గుర్తించారు.
Y. S. Sharmila: ఏపీలో షర్మిల పార్టీపై సస్పెన్స్, వ్యూహాత్మక సమాధానం ఇచ్చిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి, రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చని తెలిపిన షర్మిల
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెడతారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల (Y. S. Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై (political party Establishment in Andhra Pradesh) మీడియా అడిగిన ప్రశ్నకు షర్మిల చాలా వ్యూహాత్మకంగా సమాధానం ఇచ్చారు.
Hyderabad Fire Accident: శివపార్వతి థియేటర్‌లో ఘోర అగ్ని ప్రమాదం, పూర్తిగా తగలబడిపోయిన థియేటర్‌, దాదాపు రూ. 2 కోట్ల మేర నష్టం, మంటలను అదుపులోకి తీసుకువచ్చిన ఫైర్ సిబ్బంది
Hazarath Reddyకేపీహెచ్‌బీ కాలనీలో ఉన్న శివపార్వతి థియేటర్‌లో ఈరోజు తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు (Hyderabad Fire Accident) వ్యాపించాయి. దీంతో థియేటర్‌ పూర్తిగా (fire broke out At Shiva Parvathi Theatre) తగలబడిపోయింది. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని అధికారులు భావిస్తున్నారు
Corona in TS: తెలంగాణలో గత 24 గంటల్లో 274 మందికి కరోనా, జీహెచ్ఎంసీలో భారీస్థాయిలో 212 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో గడచిన ఒక్కరోజులో 21,679 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 274 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీలో భారీస్థాయిలో 212 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 18, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 17 కేసులు వెల్లడయ్యాయి. పలు జిల్లాల్లో కొత్తకేసులేవీ నమోదు కాలేదు.
Bandi Sanjay Arrest: అధికారం, అహంకారంతో కేసీఆర్ కళ్లు నెత్తికెక్కాయి, తీవ్ర విమర్శలు చేసిన బండి సంజయ్, బీజేపీ జాగరణదీక్ష భగ్నం, కరీంనగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు
Hazarath Reddyఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణదీక్షను (Jagarana Deeksha) పోలీసులు భగ్నం చేశారు.అక్కడ లాఠీఛార్జీలు, తోపులాటలతో ఎంపీ ఆఫీసు యుద్ధక్షేత్రాన్ని తలపించింది.
Revanth Reddy Covid: రేవంత్‌రెడ్డికి కరోనా, జ్వరంతో కూడిన స్వల్ప లక్షణాలు, తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని కోరిన తెలంగాణ కాంగ్రెస్ చీఫ్
Hazarath Reddyతెలంగాణ కాంగ్రెస్ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కొవిడ్ సోకినట్టు నిర్ధారణ అయినట్టు చెప్పారు. జ్వరం, స్వల్ప లక్షణాలు కనిపించడంతో అనుమానంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని, దీంతో కొవిడ్ సోకినట్టు నిర్ధారణ అయిందని తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని కోరారు.