తెలంగాణ

Telangana Shocker: పెళ్లికి ఒప్పుకోలేదని లవర్  గొంతు కోసి చంపేసిన ప్రేమోన్మాది, పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గోదావరిఖని పోలీసులు

Hazarath Reddy

ప్రేమించిన యువ‌తి పెళ్లికి నిరాక‌రించింద‌నే కోపంతో ఓ ప్రియుడు (Telangana Shocker) త‌న ప్రియురాలిని క‌త్తితో గొంతు కోసి హ‌త్య చేశాడు. ఈ దారుణ ఘ‌ట‌న పెద్దపల్లి జిల్లా రామ‌గిరి మండల ప‌రిధిలోని కే కే నగర్‌లో మంగ‌ళ‌వారం సాయంత్రం చోటు చేసుకుంది.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 173 కరోనా కేసులు, గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి, జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 61 కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో కొత్తగా 173 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 61 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 37,844 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.

Local Body MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల సందడి, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల, తెలంగాణలో 12, ఆంధ్రప్రదేశ్‌లో 11 స్థానాలకు ఎన్నికలు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ (Localbody MLC Elections Schedule Released) విడుదలైంది. తెలంగాణలో 12, ఆంధ్రప్రదేశ్‌లో 11 స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది.

Corona in TS: తెలంగాణలో కొత్త‌గా 161 క‌రోనా కేసులు న‌మోదు, గత 24 గంటల్లో ఒకరు మృతి, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 50 కొత్త కేసులు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 37,844 కరోనా పరీక్షలు నిర్వహించగా, 161 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 50 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 12 కేసులు గుర్తించారు.

Advertisement

CM KCR vs Bandi Sanjay: సీఎం కేసీఆర్ రాజీనామా సవాల్, గొర్ల పైసలు కేంద్రమే ఇచ్చిందని నిరూపిస్తే ఒకే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేస్తానని బండి సంజయ్‌కి సవాల్ విసిరిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

వరి వేయాలన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌పై కేసీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు (CM KCR vs Bandi Sanjay) చేశారు. బండి సంజయ్‌ విషయం పరిజ్ఞానం లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడని (Telangana CM KCR Warns BJP Leader) విమర్శించారు.

Hyderabad Shocker: కన్నతండ్రే కామాంధుడై.. పుల్లుగా మద్యం తాగి పదేళ్ల కూతురుపై అత్యాచారయత్నం, భయంతో బయటకు పరుగులు పెట్టిన బాలిక, ఇబ్రహీంపట్నంలో నిందితుడు అరెస్ట్ 

Hazarath Reddy

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే (Hyderabad Shocker) పశువులా కూతురి మీద పడ్డాడు. తాగిన మైకంలో ఆమెపై అత్యాచారయత్నానికి (Father attempts to rape daughter) ఒడికట్టాడు. ఈ దారుణం తట్టుకోలేక బాలిక ఇంటినుంచి బయటకు వచ్చి కేకలు వేసింది.

New Liquor Shops in TS: మద్యం బాబులకు పండగే, కొత్తగా 404 మ‌ద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం, డిసెంబ‌ర్ నుంచి నూత‌న మ‌ద్యం విధానం అమల్లోకి

Hazarath Reddy

తెలంగాణ‌లో డిసెంబ‌ర్ నుంచి నూత‌న మ‌ద్యం విధానం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో మందుబాబులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలో కొత్త‌గా 404 మ‌ద్యం దుకాణాలు (New Liquor Shops in TS) పెంచారు. దీంతో మ‌ద్యం దుకాణాల సంఖ్య 2,216 నుంచి 2,620కి పెంచారు.

CM KCR Press Meet: ఫాంహౌజ్ దున్నడానికి నీవు డ్రైవర్‌వా, ఓ తోకగానివి, నా ఫామ్‌హౌజ్‌లో అడుగుపెడితే ఆరు ముక్కలైతవ్‌, బండి సంజయ్‌పై విరుచుకుపడిన తెలంగాణ సీఎం కేసీఆర్‌

Hazarath Reddy

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై సీఎం కేసీఆర్‌ (Telangana CM KCR) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీని వదిలే ప్రశ్నే లేదని.. వెంటాడుతూనే ఉంటానని కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. బండి సంజ‌య్ నువ్వో తోక‌గాడివి..నా ఫాంహౌజ్ దున్నుతా అంటున్నావ్‌.. ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ వా? అంటూ మండిపడ్డారు.

Advertisement

Bandi Sanjay vs CM KCR: కేసీఆర్‌ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే, 40 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం కొంటామని కేంద్రం లేఖ ఇచ్చిందని తెలిపిన బండి సంజయ్

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రెస్ మీట్లో కేంద్రంపై, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీద విరుచుకుపడని సంగతి విదితమే. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కౌంటర్‌ ఎటాక్‌కు (Bandi Sanjay vs CM KCR) దిగారు.

Padma Awards 2021: తెలుగు రాష్ట్రాల నుంచి 4 గురికి పద్మ అవార్డులు, రాష్టపతి భవన్‌లో ఘనంగా పద‍్మ అవార్డుల ప్రదానోత్సవం, అవార్డులు అందుకున్న వారి పూర్తి జాబితా ఓ సారి చూద్దామా..

Hazarath Reddy

పద‍్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్టపతి భవన్‌లో ఘనంగా జరుగింది. 2020 సంవత్సరంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ (President Ram Nath Kovind) పద్మ అవార్డులు (Padma Awards 2021) ప్రదానం చేశారు. అవార్డుల ప్రదానోత్సవంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

Krishna Water Dispute: శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను తక్షణమే అప్పగించండి, రెండు తెలుగు రాష్ట్రాలకు లేఖలు రాసిన కృష్ణా బోర్డు చైర్మన్‌ మహేంద్రప్రతాప్‌సింగ్‌, వీటితో పాటు నీటిని వాడుకునే 15 ప్రాజెక్టులను తమకు అప్పగించాలని లేఖలో వెల్లడి

Hazarath Reddy

ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లతోపాటు వాటి నుంచి నేరుగా నీటిని వాడుకునే 15 ప్రాజెక్టులను (అవుట్‌లెట్లు) తక్షణమే అప్పగించాలని తెలుగు రాష్ట్రాలను (andhra pradesh telangana principal secretaries) కృష్ణా బోర్డు చైర్మన్‌ మహేంద్రప్రతాప్‌సింగ్‌ ఆదేశించారు.

CM KCR Press Meet Highlights: మేము 103 మంది ఉన్నాం, దమ్ముంటే టచ్ చేసి చూడు, బండి సంజయ్‌కి సవాల్ విసిరిన సీఎం కేసీఆర్, కేంద్రం చేతకానితనాన్ని రాష్ట్రాలపై రుద్దుతారా అంటూ మండిపాటు, సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు ఇవే

Hazarath Reddy

హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు. ఆదివారం ఆయన ప్రగతిభవన్‌లో మీడియాతో (CM KCR Press Meet Highlights) మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంపై, రాష్ట్రంలోని బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ( BJP State president Bandi Sanjay Kumar) నోటి కొచ్చినట్టు మితిమీరి అడ్డం పొడవు మాట్లాడుతున్నాడు.

Advertisement

Telangana Paddy: యాసంగిలో వరి సాగు వద్దు, ఎట్టిపరిస్థితుల్లో కొనుగోలు చేయమని తేల్చిచెప్పిన తెలంగాణ సర్కారు

Naresh. VNS

తెలంగాణ ప్రభుత్వం రైతులకు కీలక సూచనలు చేసింది. ఈ యాసంగిలో రైతుల వరిసాగు చెయవద్దని స్ఫష్టం చేసింది. ఒకవేళ వరిసాగు చేస్తే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయదని ప్రకటించారు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి.

Private Bus Driver Escape: టైర్ మార్చుకొని వస్తానని ప్రయాణికుల లగేజీతో బస్సు డ్రైవర్ జంప్, రాత్రంతా రోడ్డుపైనే పడిగాపులు కాసిన ప్రయాణికులు, నల్లగొండలో ఘటన

Naresh. VNS

భోజనం కోసం దిగిన ప్రయాణికులకు కుచ్చుటోపీ పెట్టి బస్సుతో సహా ఉడాయించారు ఓ ప్రైవేట్ ట్రావ్స్ బస్సు డ్రైవర్, క్లీనర్. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద ఈ ఘటన జరిగింది. దీంతో ట్రావెల్స్‌ బస్సులోనే లగేజీ పెట్టి కిందకు దిగిన 64 మంది ప్రయాణికులు లబోదిబోమంటున్నారు.

Sadar Festival Celebrations: సదర్‌ పండగ వేడుకలకు ముస్తాబైన హైదరాబాద్, యాదవ కులస్తులు మాత్రమే ఘనంగా జరుపుకునే ఉత్సవాల గురించి ఓ సారి తెలుసుకుందామా, దున్నపోతులతో యువకుల కుస్తీ సదర్‌లో ప్రత్యేక ఆకర్షణ

Hazarath Reddy

సదర్‌ పండగ హైదరాబాద్‌ మహానగరంలో జరిగే ప్రధాన ఉత్సవాల్లో (Sadar Festival Celebrations 2021) చాలా ముఖ్యమైనది. ఈ పండగను (Dunnapothula panduga) నగరంలోని యాదవ కులస్తులు మాత్రమే జరుపుకుంటారు. దీపావళి ఉత్సవాల్లో భాగంగా, దీపావళి ముగిసిన రెండో రోజున సదర్‌ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దీనిని

Corona in TS: తెలంగాణలో కొత్తగా 106 మందికి కోవిడ్, జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 49 కేసులు, రాష్ట్రంలో ఇప్పటివరకు 6,72,052 పాజిటివ్ కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 22,650 కరోనా పరీక్షలు నిర్వహించగా, 106 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. వీటిలో అత్యధిక భాగం జీహెచ్ఎంసీ పరిధిలోనివే. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 49 కేసులు నమోదయ్యాయి.

Advertisement

Sadar Festival: సదర్ ఉత్సవాలకు సర్వం సిద్ధం, హైదరాబాద్‌లో సందడి చేయనున్న కోట్ల రూపాయల దున్నపోతులు.

Naresh. VNS

సదర్ పండుగకు సిటీ రెడీ అయింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సదర్‌ వేడుక కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీపావళి సందర్భంగా జరిపే వేడుకలకు హైదరాబాద్ ప్రసిద్దిగాంచింది.

Road Accident in TS: దీపావళి సంబరాల్లో కాటేసిన మృత్యువు, ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు అక్కడికక్కడే మృతి, కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన

Hazarath Reddy

దీపావళి సంబరాలు ఓ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. దీపావళి సెబ్రేషన్ (Diwali shopping) కోసం టపాసులు కొనేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో (Road Accident in TS) కుటుంబంలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

Y. S. Sharmila: మానవత్వం చాటుకున్న వైఎస్ షర్మిల, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తన కాన్వాయ్‌లోని అంబులెన్స్‌‌లో ఆస్పత్రికి తరలింపు, 108 అంబులెన్స్‌కు కాలే చేసినా రాలేదని ఆవేదన

Hazarath Reddy

క్యాంప్‌కు సమీపంలో బైక్ రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్‌లు పరస్పరం ఢీకొన్నాయి. ఆమె స్వయంగా 108 అంబులెన్స్‌కు కాల్ చేశారు. అయితే అరగంట దాటినా అంబులెన్స్ రాకపోవడంతో.. హుటాహుటిన తన కాన్వాయ్‌లోని అంబులెన్స్‌‌ను ఘటనాస్థలికి పంపి.. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Telangana: నగ్న వీడియోలు, ఫోటోలతో కాబోయే భార్యపై వేధింపులు, కిరాతక భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు, అధిక కట్నం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో యువతి ఆత్మహత్య

Hazarath Reddy

తెలంగాణలో అధిక కట్నం ఇస్తే పెళ్లి చేసుకుంటానని.. లేకుంటే నగ్న వీడియోలు బయటపెడతానని బెదిరింపులకు పాల్పడటంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే.ఈ దారుణ ఘటనకు కారకుడైన నిందితుడిని రంగారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ (Ranga reddy Police arrested fianc) చేశారు

Advertisement
Advertisement