తెలంగాణ

TS Inter 1st Year Exams: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు ఆపలేమని స్పష్టం చేసిన హైకోర్టు, ఈ నెల 25 నుంచి యథావిధిగా ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఎగ్జామ్స్, గురుకులాలు ఓపెన్ చేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Hazarath Reddy

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు ఆపలేమని హైకోర్టు శుక్రవారం తేల్చి చెప్పింది. ఈ నెల 25 నుంచి పరీక్షలు (TS Inter 1st Year Exams) ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పరీక్షలను ఆపడం సమంజసం కాదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

#PoliceFlagDay: అమరుడైన హోం గార్డు లింగయ్య త‌ల్లికి పాదాభివంద‌నం చేసిన రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్ మ‌హేశ్ భ‌గ‌వ‌త్, వీడియోని ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసిన క‌మిష‌న‌రేట్

Hazarath Reddy

రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ ఓ హోం గార్డు త‌ల్లికి పాదాభివంద‌నం చేసిన దృశ్యాల‌కు సంబంధించ‌ని వీడియోను ఆ క‌మిష‌న‌రేట్ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. పోలీసు అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా వారి కుటుంబాల‌ను మ‌హేశ్ భ‌గ‌వ‌త్ స‌త్క‌రించారు.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 183 పాజిటివ్ కేసులు, జీహెచ్ఎంసీ పరిధిలో 59 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 41,363 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 183 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 59 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 18, రంగారెడ్డి జిల్లాలో 15, వరంగల్ అర్బన్ జిల్లాలో 13, ఖమ్మం జిల్లాలో 12 కేసులు గుర్తించారు. నారాయణపేట, ములుగు, మహబూబ్ నగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

Corona in TS: తెలంగాణలో మరో 191 కరోనా పాజిటివ్ కేసులు, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 49 కేసులు

Hazarath Reddy

గత 24 గంటల్లో తెలంగాణలో 191 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 49 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 19, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 162 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.

Advertisement

Police Commemoration Day 2021: అమర వీరులకు తెలంగాణ ప్రభుత్వం నివాళి, పోలీసుల ప్రాణ త్యాగాలు మరువలేనివని తెలిపిన డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని తెలిపిన హోం మంత్రి అలీ

Hazarath Reddy

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని గోషామహల్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని(Police Commemoration Day 2021) ఘనంగా నిర్వహించారు. హోం మంత్రి మహమ్మద్ అలీ (Telangana Home minister), డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీకుమార్ ,మాజీ పోలీస్ ఉన్నతాధికారులు అమరవీరుల దినోత్సవానికి హాజరయ్యారు.

Telangana Shocker: వృద్ధుడా..కామాంధుడా, వస్తువులు ఆశచూపి 4 రోజుల పాటు బాలికపై అత్యాచారం, కాలని వాసులు 100కు ఫోన్‌ చేయడంతో ఘటన వెలుగులోకి

Hazarath Reddy

తెలంగాణ వరంగల్ జిల్లాలో దారుణ ఘటన (Telangana Shocker) చేసుకుంది. ఇంటి పక్కన ఉండే ఓ మైనర్‌ బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ సంఘటన హనుమకొండ జిల్లా కేంద్రంలోని పరిమళ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది

YS Sharmila Praja prasthanam: చేవెళ్ల నుంచి షర్మిల ప్రజా ప్రస్థానం, 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు, 16 సెగ్మెంట్లను చుట్టేలా పాదయాత్ర, తరలి రానున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ శ్రేణులు

Hazarath Reddy

తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీని ప్రారంభించిన షర్మిలా రెడ్డి 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర (Praja prasthanam foot march) చేపట్టి తిరిగి చేవెళ్లలోనే ముగించనున్నారు

Corona in TS: తెలంగాణలో కొత్తగా 202 క‌రోనా కేసులు నమోదు, ప్రస్తుతం రాష్ట్రంలో 3,940 యాక్టివ్ కేసులు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 52 కొత్త కేసులు

Hazarath Reddy

Advertisement

Hyderabad Shocker: మైనర్‌వి అప్పుడే ప్రేమ ఎందుకన్న అమ్మ, నీకెందుకంటూ తల్లి గొంతుకు ఉరివేసి చంపేసిన కసాయి కూతురు, రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణ ఘటన

Hazarath Reddy

ప్రేమ పేరుతో కళ్లు మూసుకుపోయి కన్నతల్లినే కడతేర్చిందో కసాయి కూతురు. తను ప్రేమించినవాడితో తిరగొద్దు అని తల్లి అనడంతో లవర్ తో కలిసి అతి దారుణంగా హత్య (Daughter killed mother with her Boyfriend) చేసింది.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 208 మందికి కరోనా, గ్రేటర్ హైదరాబాదులో 62 తాజా కేసులు, రాష్ట్రంలో ప్రస్తుతం 3,929 యాక్టివ్ కేసులు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 45,418 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 208 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 62 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 14, మంచిర్యాల జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు గుర్తించారు.

Huzurabad Bypoll 2021: దళితబంధు వెంటనే ఆపండి, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ, హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత కొనసాగించాలని తెలిపిన ఈసీ

Hazarath Reddy

హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక (Huzurabad Bypoll 2021) ముగిసేవరకు దళిత బంధు అమలు ఆపేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ నియోజకవర్గానికి ఈ నెల 30న ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Motkupalli Joins TRS Party: మోత్కుపల్లితో నా స్నేహం రాజ‌కీయాల‌కు అతీతం, ప్రాణం పోయినా ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని వదలమన్న సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు

Hazarath Reddy

న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో (Motkupalli Joins TRS Party) చేరారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్.. మోత్కుప‌ల్లి న‌ర్సింహులు (Ex Minister Motkupalli Narasimhulu) టీఆర్ఎస్ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.

Advertisement

Coronavirus in TS: తెలంగాణలో కొత్తగా 122 మందికి కోవిడ్, జీహెచ్ఎంసీ పరిధిలో 55 కరోనా కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 26,676 కరోనా పరీక్షలు నిర్వహించగా, 122 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 55 కరోనా కేసులు నమోదు కాగా, జిల్లాల్లో ఎక్కడా రెండంకెల్లో కొత్త కేసులు నమోదు కాలేదు.

TRSLP Meeting Highlights: మరోసారి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎంపిక లాంఛనమే, ఆయన పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన టీఆర్ఎస్ మంత్రులు, ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని స్పష్టం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో అధ్యక్ష ఎన్నిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ (TRSLP Meeting Highlights) జరిగింది. హుజురాబాద్‌ ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్‌ చర్చించారు. పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 111 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 29 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 30,050 కరోనా పరీక్షలు నిర్వహించగా, 111 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 29 కొత్త కేసులు నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి.

Heavy Rains: రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక, భారీ వర్షాలకు వణుకుతున్న 4 రాష్ట్రాలు, కేరళలో 8 మంది మృతి, హైదరాబాద్‌పై విరుచుకుపడిన వరదలు

Hazarath Reddy

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలను ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. వచ్చే రెండ్రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Indian Meteorological Department) తెలిపింది.

Advertisement

Maoist Leader RK Death: ఆర్కే మృతిపై మావోయిస్టుల కీలక ప్రకటన, కిడ్నీలు విఫలమై ఈ నెల 14న రామకృష్ణ మరణిచారని ప్రకటనలో వెల్లడి, పార్టీ శ్రేణుల సమక్షంలో ఆర్కే అంత్యక్రియలు పూర్తి చేసినట్లు తెలిపిన మావోయిస్టులు

Hazarath Reddy

మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ సాకేత్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్కే మృతిని (Maoist Leader RK Death) మావోయిస్టులు ధ్రువీకరించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 14న ఆర్కే మృతి చెందినట్లు (Senior Maoist leader RK dies of illness) మావోయిస్టులు ప్రకటించారు.

Maoist Leader RK Dies: ఆర్కే మృతిని ధ్రువీకరించిన మావోయిస్టులు, ఈ నెల 14న ఆర్కే మృతి చెందినట్లు ప్రకటన విడుదల, కిడ్నీలు విఫలమై మరణిచారని ప్రకటనలో వెల్లడి

Hazarath Reddy

మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ సాకేత్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్కే మృతిని మావోయిస్టులు ధ్రువీకరించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 14న ఆర్కే మృతి చెందినట్లు మావోయిస్టులు ప్రకటించారు. కిడ్నీలు విఫలమై ఆయన మరణిచారని తెలిపారు.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 168 కేసులు, ప్రస్తుతం రాష్ట్రంలో 4,171 యాక్టివ్ కేసులు

Hazarath Reddy

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 168 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 207 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కేవలం ఒక్క కరోనా మరణం మాత్రమే సంభవించింది.

Road Accident in Gadwal: పండగ సంబరాల వేళ.. బోల్తాపడిన ఆర్టీసీ బస్సు, 20 మందికి గాయాలు, జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో విషాద ఘటన, ఏపీలో ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ బస్సుకు నిప్పింటిచిన యువకుడు

Hazarath Reddy

తెలంగాణలోని జోగులాంబ గ‌ద్వాల జిల్లా ఇటిక్యాల మండ‌లం ధ‌ర్మ‌వ‌రం స‌మీపంలో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డుప్ర‌మాదం (Road Accident in Gadwal) జ‌రిగింది. హైద‌రాబాద్ నుంచి క‌ర్నూల్ వెళ్తున్న ఆర్టీసీ బ‌స్సు.. జాతీయ ర‌హ‌దారి 44పై బోల్తా ప‌డింది.

Advertisement
Advertisement