తెలంగాణ

Bonalu Celebrations: లాల్‌ దర్వాజా మహంకాళి బోనాలు, పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర సీపీ అంజనీకుమార్‌ ఆదేశాలు జారీ, ఏయే ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారో..పూర్తి వివరాలు ఓ సారి చూద్దామా..

Hazarath Reddy

ఆషాఢ బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీలోని లాల్‌ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల ఉత్సవాలకు (Hyderabad Bonaly Festival) అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామ‌ని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. బోనాల‌కు త‌ర‌లివ‌చ్చే భ‌క్తుల‌కు అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ప్ర‌భుత్వం, దేవాదాయ శాఖ ఆద్వ‌ర్యంలో అన్ని సదుపాయాలను సిద్ధం చేశామ‌న్నారు.

E Peddi Reddy Joins TRS: నన్ను చంపినా సరే అబద్దాలు చెప్పి మోసం చేయను, కేసీఆర్‌ చెప్పాడంటే జరిగి తీరాల్సిందే, దళిత బంధు పథకాన్ని ఎవరూ అడ్డుకోలేరని తెలిపిన సీఎం కేసీఆర్, టీఆర్ఎస్‌లో చేరిన మాజీమంత్రి పెద్దిరెడ్డి

Hazarath Reddy

దళితుల సమగ్రాభివృద్ధికోసం బృహత్‌ సంకల్పంతో రూపొందించిన దళిత బంధు పథకాన్ని ఎవరూ అడ్డుకోలేరని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. తరతరాలుగా సమాజంలో నిర్లక్ష్యానికి గురైన దళితుల జీవితాలను పూర్తిగా మార్చివేసేందుకే ఎంతటి ఖర్చుకైనా వెనుకాడకుండా ఈ పథకానికి రూపకల్పన చేశామని తెలిపారు.

Etala Rajender Health Update: అపోలో ఆస్పత్రిలో ఈటల రాజేందర్, ఆక్సిజన్‌, బీపీ స్థాయిలు పడిపోయినట్లు తెలిపిన వైద్యులు, ప్రజాదీవెన పాదయాత్రకు బ్రేక్‌

Hazarath Reddy

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో వైద్యులు ఈటలకు చికిత్స (Etela Rajender Health Update) అందిస్తున్నారు. ఈటల రాజేందర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వివేక్‌ పరామర్శించారు.

COVID in TS: తెలంగాణలో డెల్టా వేరియంట్ కేసులు గుర్తింపు; రాష్ట్రంలో కొత్తగా 614 కోవిడ్ కేసులు నమోదు, వైరస్ వ్యాప్తి అదుపులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా తెరుచుకున్న సినిమా హాళ్లు

Team Latestly

తెలంగాణలో కేసులు తగ్గుముఖంపడుతున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి సినిమా థియేటర్లు తిరిగి తెరుచుకున్నాయి. ఈరోజు పలు చిత్రాలు కూడా రిలీజ్ అయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 100 శాతం సీట్ల సామర్థ్యంతో థియేటర్లు నడుస్తున్నాయి...

Advertisement

Andhra Pradesh: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు, 10 గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్న అధికారులు; శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను పెంచిన తిరుమల తిరుపతి దేవస్థానం

Team Latestly

2007 తర్వాత శ్రీశైలం గేట్లు జూలైలో గేట్లు ఎత్తడం ఇదే మొదటిసారి. ఇక శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఈ ఆహ్లదకర దృశ్యాన్ని సందర్శించేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు....

COVID19 in TS: గాంధీ ఆసుపత్రిలో ఆగష్టు 3 నుంచి నాన్-కోవిడ్ వైద్య సేవలు పునఃప్రారంభం; తెలంగాణలో కొత్తగా 657 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 9,314కు పెరిగిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి దాదాపు నాలుగు నెలల విరామం తరువాత ఆగస్టు 3 నుండి ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ మరియు అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవలకు సంబంధించి నాన్-కోవిడ్ సేవలను ప్రారంభించనుంది....

TS POLYCET Results 2021: పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, ఆగస్టు 5 నుంచి తొలి విడత ప్రవేశాలు, విద్యా సంవత్సరం సెప్టెంబరు 1న మొదలు, ఫలితాలను ఎలా డౌన్లో‌డ్ చేసుకోవాలో కథనంలో తెలుసుకోండి

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు (TS POLYCET Results 2021) నేడు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి బుధవారం మధ్యాహ్నం విడుదల (Telangana TS POLYCET Result 2021 Declared) చేసింది.

Komatireddy Rajgopal Reddy Arrest: కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అరెస్ట్, అధికారం శాశ్వతం కాదని తామేంటో చూపిస్తామని టీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చిన మునుగోడు ఎమ్మెల్యే

Hazarath Reddy

తెలంగాణలో మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి (Komatireddy Rajgopal Reddy) నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీఎం కేసీఆర్‌ ప్రకటించిన ‘దళిత బంధు’ పథకాన్ని మునుగోడు నియోజకవర్గ దళితులకు కూడా వర్తింప చేయాలని కోరుతూ.. రాజగోపాల్‌ రెడ్డి, కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి బుధవారం మంత్రి జగదీష్‌ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.

Advertisement

Warangal Shocker: ప్రేమ పెళ్లి అంటూ సహజీవనం, గర్భం దాల్చగానే దాన్ని తీసేసి పరార్, వరంగల్ జిల్లాలో మోసపోయానంటూ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి

Hazarath Reddy

ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు..పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ మాటలు నమ్మిన యువతి అతనికి సర్వస్వాన్ని అర్పించింది. కొన్ని నెలల పాటు సహజీవనం చేసింది. ఈ నేపథ్యంలో గర్భం దాల్చింది. పెళ్లి చేసుకోమని అడగగా అబార్షన్‌ చేయించి ముఖం చాటేశాబు ఓ ప్రబుద్ధుడు. మోసపోయానని తెలుసుకున్న బాధిత యువతి వరంగల్ జిల్లా వాజేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Sheep Distribution in Telangana: తెలంగాణలో నేటి నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో లాంఛనంగా ప్రారంభించనున్న పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

Hazarath Reddy

నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత గొర్రెల పంపిణీకి (Sheep Distribution in Telangana) తెలంగాణ పశు సంవర్ధకశాఖ శ్రీకారం చుట్టనున్నది. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ (Minister Talasani) లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

COVID in TS: తెలంగాణలో 1.41 కోట్లు దాటిన కోవిడ్ టీకా డోసుల పంపిణీ; రాష్ట్రంలో కొత్తగా 645 పాజిటివ్ కేసులు నమోదు.. 9,237కు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

రాష్ట్రంలో మొత్తంగా 1.41 కోట్ల మందికి టీకాల పంపిణీ జరిగింది. అయితే 1.41 కోట్ల మందిలో రాష్ట్రవ్యాప్తంగా 30.57 లక్షల మందికి రెండు డోసుల టీకా లభించగా, 1.11 కోట్ల మంది వ్యక్తులు కోవిడ్ వ్యాక్సిన్ యొక్క మొదటి మోతాదును పొందారు...

TS PolyCET 2021 Counselling Date: తెలంగాణ పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు రేపు విడుదల, టీఎస్ పాలిసెట్ -2021 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఎస్బీటీఈటీ, ఆగ‌స్టు 5 నుంచి తొలివిడత కౌన్సెలింగ్‌ ప్రారంభం

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు (Telangana Polytechnic Results) రేపు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి ప్రకటించింది.

Advertisement

Telangana Dalit Bandhu Scheme: హుజూరాబాద్‌లో ఇల్లు లేని దళిత కుటుంబం ఉండకూడదు, దశల వారీగా దళితబంధు పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం, Dalit Bandhu అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్

Hazarath Reddy

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన దళితబంధు (Telangana Dalit Bandhu ) అవగాహన సదస్సు ప్రగతి భవన్ లో జరిగింది. దళితబంధు’పథకం అవగాహన సదస్సులో పాల్గొనేందుకు హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి 412 మంది దళిత ప్రతినిధులు, 15 మంది రిసోర్స్‌పర్సన్‌లు కలిపి మొత్తం 427 మంది 16 ప్రత్యేక ఏసీ బస్సుల్లో వచ్చారు.

Corona in Telangana: తెలంగాణలో 60 శాతం మందికి కరోనా యాంటీబాడీస్ అభివృద్ధి; రాష్ట్రంలో కొత్తగా 638 కోవిడ్ కేసులు నమోదు, ప్రస్తుతం 9,325గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

కరోనావైరస్ యొక్క ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌ రకానికి వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేస్తుందని అంతేకాకుండా తెలంగాణలో సుమారు 60 శాతం జనాభాకి సహజమైన రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందినట్లు తాజా అధ్యయనం...

Telangana Dalit Bandhu: హుజూరాబాద్‌లో సాధించే విజయం మీదనే తెలంగాణ దళితబంధు విజయం ఆధారపడి ఉంది, దళితబంధు పథకం కార్యక్రమం కాదు.. ఉద్యమం, హుజూరాబాద్‌ ప్రతినిధులతో ప్రగతి భవన్‌లో సమావేశమైన సీఎం కేసీఆర్‌

Hazarath Reddy

తెలంగాణ దళితబంధు కేవలం కార్యక్రమం కాదని.. ఉద్యమమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. సోమవారం సీఎం కేసీఆర్‌ (CM KCR) అధ్యక్షతన తెలంగాణ దళితబంధు కార్యక్రమంపై హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన దళితబంధువులతో ప్రగతి భవన్‌లో (CM KCR Hold Review Meeting ) సమావేశమయ్యారు. మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Hyderabad Shocker: సోషల్ మీడియాలో పరిచయం, అర్థరాత్రి ఇంటిలోకి దూరి బాలికపై అత్యాచారం, హైదరాబాద్‌లో దారుణ ఘటన, నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

భాగ్యనగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని విషయం తెలుసుకుని అర్థరాత్రి ఇంటిలోకి దూరిన ఓ యువకుడు (Telangana Shocker) 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి (Minor girl 'raped' by teenage boy) పాల్పడ్డాడు.

Advertisement

Corona in TS: తెలంగాణలో కొత్తగా 494 మందికి కరోనా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 76 కేసులు నమోదు, నలుగురు మృతితో 3,784కి పెరిగిన కరోనా మరణాల సంఖ్య, రాఫ్ట్రంలో ప్రస్తుతం 9,405 యాక్టివ్ కేసులు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 91,457 కరోనా పరీక్షలు నిర్వహించగా, 494 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాదు పరిధిలో 76, కరీంనగర్ జిల్లాలో 49, వరంగల్ అర్బన్ జిల్లాలో 43, ఖమ్మం జిల్లాలో 40 కొత్త కేసులు నమోదయ్యాయి. నిర్మల్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

Ramappa Temple: కాకతీయ శిల్పా కళావైభవం.. రామప్ప దేవాలయానికి అరుదైన గౌరవం! ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన యునెస్కో, హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్

Vikas Manda

రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో ప్రకటించిన సందర్భంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ఖ్యాతి లభించినందుకు దేశప్రజలందరికి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు....

Telangana Shocker: వెంటాడిన అనారోగ్యం..కొడుకును కృష్ణా నదిలో తోసేసి ఆ తర్వాత భార్యతో కలిసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న జెన్‌కో ఉద్యోగి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నల్గొండ పోలీసులు

Hazarath Reddy

తెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జెన్‌కో ఉద్యోగి, ఆయన భార్య, కుమారుడు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్య సమస్యలు, మానసిక సంఘర్షణతోనే జెన్‌కో ఉద్యోగి కుటుంబంతో సహా ఆత్మహత్య (Three Members of Family Die by Suicide) చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

Dalit Bandhu Scheme: దళితబంధు పథకం కింద ఇచ్చే మొత్తం పూర్తిగా ఉచితం, ఇందుకోసం రూ. లక్ష కోట్లయినా ఖర్చుపెడతాం, ఈటెల చిన్నోడు..ఏం చేయలేడు, హుజూరాబాద్ నేతలతో సీఎం కేసీఆర్, తనుగుల ఎంపీటీసీ భర్త రామస్వామికి స్వయంగా ఫోన్‌ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ పార్టీ (TRS) అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. కేసీఆర్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నదళిత బంధు పథకాన్ని (Dalit Bandhu Scheme) హుజూరాబాద్ నియోజకవర్గంలో మరింత బలంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

Advertisement
Advertisement