తెలంగాణ

Telangana SSC Exam Timetable 2021: తెలంగాణలో మే 17 నుంచి 26 వరకు 10వ తరగతి పరీక్షలు, ఆరు పేపర్లకు మాత్రమే పరీక్షలు, వెల్లడించిన టీఎస్‌ ఎస్‌ఎస్‌సీ బోర్డు

Hazarath Reddy

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యా శాఖ మంగళవారం విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పూర్తి విద్యా సంవత్సరం సాధ్యపడనందున కేవలం ఆరు పేపర్లకు మాత్రమే పరీక్షలు నిర్వహించనున్న టీఎస్‌ ఎస్‌ఎస్‌సీ బోర్డు వెల్లడించింది.

YS sharmila New Party: వైయస్ పేరు లేకుండా షర్మిల లేదు, తెలంగాణ కన్నా తమిళనాడు లేదా కర్నాటకలో పెడితే ఎక్కువ ఓట్లు వస్తాయి, షర్మిలా రెడ్డి కొత్త పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు

Hazarath Reddy

దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ ముద్దుల తనయ వైయస్ షర్మిల కొత్త పార్టీపై (ys sharmila party) నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాటి రచ్చబండ కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ.. షర్మిల పార్టీ (YS sharmila New Party) పెట్టడం తన అన్న ఏపీ సీఎం వైయస్ జగన్ డైరెక్షన్‌లో జరిగిందా.. లేదా అనేది త్వరలో తేలుతుందన్నారు.

YS Sharmila New Party Row: తెలంగాణలో వైసీపీ ఏర్పాటు సీఎం జగన్‌కు ఇష్టం లేదు, పార్టీ ఏర్పాటు నిర్ణయం అనేది షర్మిల వ్యక్తిగతం, అన్నా చెల్లెళ్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవు, మీడియాతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

Hazarath Reddy

కోట్లాది మంది ప్రజల అభిమానంతో పుట్టుకొచ్చిన పార్టీ వైఎస్సార్‌సీపీ. పదేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చారు. తెలంగాణ రాజకీయాలపై వైఎస్‌ జగన్‌ స్పష్టమైన వైఖరితో ఉన్నారు.

'Ravali Sharmila Kavali Sharmila': రావాలి షర్మిల కావాలి షర్మిల, లోటస్ పాండ్‌లో ఫ్లెక్సీల జోరు, తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యం, అన్ని విషయాలు చెబుతానంటున్న వైయస్ షర్మిలా రెడ్డి

Hazarath Reddy

తెలంగాణ లోటప్ పాండ్ లో రావాలి షర్మిల కావాలి షర్మిల నినాదాలతో మోగుతోంది. తెలంగాణలో వైయస్ అభిమానుల రాకతో లోటస్ పాండ్ లో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు రావాలి షర్మిల కావాలి షర్మిల (Ravali Sharmila Kavali Sharmila) ప్లెక్సీలతో దర్శనమిచ్చారు. కాగా కొత్త పార్టీని (YS Sharmila Political Entry Suspence) ప్రారంభించబోతున్న వైయస్ షర్మిల తమ అభిమానుల ముందుకు వచ్చారు.

Advertisement

Y. S. Sharmila Meeting: అన్నని కాదని కొత్త పార్టీ పెడుతోందా? లోటస్ పాండ్‌లో వైయస్ షర్మిలారెడ్డి ఆత్మీయ సమావేశం, దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి పెళ్లి రోజు నేడు, జగనన్న వదిలిన బాణం ఏం చేయబోతోంది?

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి, దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల (Y. S. Sharmila) తెలంగాణలో కొత్త పార్టీ పెడతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

Telangana COVID Status: తెలంగాణలో కొత్తగా మరో 149 కోవిడ్ కేసులు నమోదు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు కొనసాగుతున్న టీకాల పంపిణీ, ఇప్పటివరకు వ్యాక్సిన్ చేయించుకున్నది కేవలం 38 శాతం మాత్రమే

Team Latestly

టీకా కోసం తమ పేరు నమోదు చేసుకున్న వారిలో చాలా తక్కువ మంది టీకాలు వేయించుకున్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్లలలో ఇప్పటివరకు కేవలం 38 శాతం మంది మాత్రమే టీకా కోసం ముందుకొచ్చారు. టీకా ప్రారంభమైన మొదటి రోజు నుంచి ఫిబ్రవరి 8 వరకు అధికారిక గణాంకాల ప్రకారం....

Power to Local Bodies: జిల్లా మరియు మండల పరిషత్తులకు అదనపు నిధులు, అదనపు విధులు కల్పించాలని పంచాయతీ రాజ్ సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయం, గ్రామీణాభివృద్ధే లక్ష్యం అని వెల్లడి

Team Latestly

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక స్వపరిపాలన సంస్థలను బలోపేతం చేసి, గ్రామీణాభివృద్ధిలో వాటి పాత్రను క్రియాశీలం చేస్తామని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం ఇస్తున్న మాదిరిగానే జిల్లా పరిషత్, మండల పరిషత్ లకు కూడా నిధులు కేటాయిస్తామని, నిర్ధిష్టమైన విధులు అప్పగిస్తామని వెల్లడించారు.....

Khammam Suicide Case: ఆర్థిక సమస్యలతో మాజీ సర్పంచ్ కుటుంబం ఆత్మహత్యాయత్నం, చికిత్స పొందుతూ భార్య,భర్తలు మృతి, విషమంగా పిల్లల పరిస్థితి, మరో చోట ఇంటికి వస్తున్నానంటూ ఆత్మహత్య చేసుకున్న యువకుడు

Hazarath Reddy

ఖమ్మంలో రెండు రోజుల క్రితం కుటుంబంతో కలిసి ఆత్మహత్యా యత్నానికి (Khammam Suicide Case) పాల్పడిన భార్య,భర్తలు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బోడియాతండా గ్రామంలో మాజీ సర్పంచ్ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంగతి విధితమే.

Advertisement

COVID in TS: తెలంగాణలో 2 లక్షలకు పైగా హెల్త్ కేర్- ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ పూర్తి, రాష్ట్రంలో కొత్తగా 101 కోవిడ్ కేసులు నమోదు, ప్రస్తుతం 1842గా ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. అయితే రికవరీలు ఎక్కువగా ఉండటం మరియు వ్యాక్సినేషన్ కూడా అందుబాటులోకి వచ్చేయడంతో ప్రజలు ఇప్పుడు కరోనాను ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2 లక్షలకు పైగా టీకాల వినియోగం జరిగింది.....

Telangana CM Change Row: ఎవరూ మాట్లాడొద్దు..మరో పదేళ్లు నేనే సీఎం, తెలంగాణలో టీఆర్ఎస్‌కు పోటీ ఎవరూ లేరు, టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో సీఎం కేసీఆర్, 12 నుంచి టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం

Hazarath Reddy

గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ సీఎం మార్పు (Telangana CM Change Row) ఉండబోతోందంటూ జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టత ఇచ్చారు. సీఎంగా తానే కొనసాగుతానని, మరో 10 ఏళ్ల వరకు తనను టచ్ చేయలేరని కేసీఆర్ (CM KCR gave clarity) తేల్చి చెప్పారు.

CM KCR Meeting Update: రూ.3 వేల కోట్లతో తొమ్మిది ఎత్తిపోతల పథకాలు, ఫిబ్రవరి 10న శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్, రేపు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం భేటీ, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులతో ముగిసిన తెలంగాణ సీఎం భేటీ

Hazarath Reddy

తెలంగాణభవన్‌లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనున్నది. రాష్ట్ర కమిటీ సభ్యులతోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, నగర మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్‌ అధ్యక్షులను ఈ సమావేశానికి ఆహ్వానించారు.

Vaccination Drive in TS: తెలంగాణలో ఇప్పటివరకు 1,88,097 మంది హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సినేషన్ పూర్తి, నేటితో ముగియనున్న తొలి విడత టీకాల పంపిణీ, రాష్ట్రంలో ప్రస్తుతం 1964 ఆక్టివ్ కేసులు

Team Latestly

రాష్ట్రంలో 1,76,728 మంది ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది ఉన్నారు, వీరిలో 64 శాతం మంది టీకా వేయించుకున్నారు. ఇక ఈరోజుతో హెల్త్ కేర్ సిబ్బందికి కోవిడ్ టీకాలు వేయడం ముగుస్తుంది, రేపట్నించి ఫిబ్రవరి 15 వరకు రెండో విడత వ్యాక్సినేషన్ లో భాగంగా పోలీసులు, రెవెన్యూ, పురపాలక మరియు పంచాయితీ సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు....

Advertisement

TSRTC Update: ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించిన తెలంగాణ సర్కార్, కమిటీ మార్గదర్శకాలను ఆమోదిస్తూ దస్త్రంపై సంతకం చేసిన సీఎం కేసీఆర్

Team Latestly

నూతన మార్గదర్శకాల ప్రకారం, ఉన్నత అధికారులు, ప్రధానంగా డిపో నిర్వాహకులు మరియు ప్రత్యేక అధికారాలు కలిగినన రీజినల్ మేనజర్లు కార్మికులను విచక్షణారహితంగా విధులను తొలగించడానికి వీలుపడదు. అలాగే, కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి మరియు వారి సేవలను గుర్తించడానికి ఆర్టీసీ డైరెక్టర్ నేతృత్వంలోని ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయబడుతుంది....

SSC Exams Update: ఎస్‌ఎస్‌సి విద్యార్థులకు మరో ఊరట, పరీక్షల్లో ప్రశ్నాపత్రాలను 6కు తగ్గించిన విద్యాశాఖ, పరీక్ష సమయంతో పాటు ప్రశ్నల ఎంపికలో కూడా పెంచుతూ నిర్ణయం, వివరాలు ఇలా ఉన్నాయి

Team Latestly

తరగతులు జరిగిన ఆధారంగా అన్ని సబ్జెక్టులకు అవసరమైన కోర్ కాన్సెప్ట్స్ కింద ఇచ్చిన సిలబస్ నుంచి ప్రశ్నలను రూపొందించాలని అధికారులను కోరారు. జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఫిజికల్ సైన్సెస్ పార్ట్-ఎ మరియు బయోలాజికల్ సైన్స్ పార్ట్-బి కోసం విడిగా జవాబు పుస్తకాలను జారీ చేయాలని కూడా కోరారు...

TS Health Bulletin: మరో రెండు రోజుల పాటు ప్రైవేట్ హెల్త్ కేర్ సిబ్బందికి వ్యాక్సినేషన్, ఫిబ్రవరి 6 నుంచి రెండో విడత టీకాల పంపిణీ, రాష్ట్రంలో ప్రస్తుతం 1985గా ఉన్న కోవిడ్ ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

ఫిబ్రవరి 6 నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ పంపిణీ చేయనున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. రెండో విడతలో పోలీసులు, రెవెన్యూ, పురపాలక మరియు పంచాయితీ సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. ఫిబ్రవరి 15 వరకు రెండో విడత వ్యాక్సినేషన్ జరగనుంది....

Vikarabad Mystery Disease: వికారాబాద్‌ను తాకిన మిస్టరీ వ్యాధి, భారీ సంఖ్యలో కోళ్లు, కాకులు మృత్యువాత, శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపిన అధికారులు

Hazarath Reddy

తెలంగాణలో వికారాబాద్ జిల్లాలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. అంతు చిక్కని జబ్బుతో (Vikarabad Mystery Disease) వందలాది కోళ్లు చనిపోతున్నాయి. ఈ మిస్టరీ వ్యాధి గ్రామస్తులను ఆందోళనకు గురి చేస్తోంది. కోళ్లతోపాటు కాకులు కూడా చనిపోవటంతో బర్డ్‌ ఫ్లూ భయంతో ప్రజలు వణికిపోతున్నారు.

Advertisement

TS COVID Status: తెలంగాణలో రెండో విడత వ్యాక్సినేషన్ పంపిణీకి ఏర్పాట్లు, తొలి విడత విజయవంతమైందన్న ఆరోగ్య శాఖ, రాష్ట్రంలో కొత్తగా మరో 185 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

Team Latestly

ఇప్పటివరకు హెల్త్ కేర్ సిబ్బందికి టీకాల పంపిణీ చేశారు. టీకాలు వేసుకోని వారికి అవగాహన కల్పిస్తూ టీకాలు వేయించి తొలిదశ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 6 నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ పంపిణీ చేయనున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు....

MLA Challa Dharma Reddy: మళ్లీ వివాదంలో చిక్కుకున్న పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, ఆ కులం ఆఫీసర్లకు అక్షరం ముక్కరాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు, క్షమాపణలు చెబుతూ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని వెల్లడి

Hazarath Reddy

ఇప్పటికే వివాదంలో నలిగిపోతున్న పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. రాముడి పేరిట బీజేపీ నేతలు దొంగ బుక్కులు తయారుచేసి చందాలు వసూలు చేస్తున్నారని చేసిన వ్యాఖ్యల దుమారం చల్లారక ముందే మరోసారి ఆయన (MLA Challa Dharma Reddy) వెనుకబడిన కులాలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి

TS's Health Bulletin: తెలంగాణలో స్థిరంగా కరోనా వ్యాప్తి, కొత్తగా మరో 152 కేసులు నమోదు, రాష్ట్రంలో 2,022గా ఉన్న కోవిడ్ ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

Uttam Kumar Reddy on Budget 2021: బడ్జెట్‌లో తెలంగాణకు ఒరిగిందేమి లేదు, ఎన్నికలున్న రాష్ట్రాల బడ్జెట్‌లా ఉంది, ఎంపీ ల్యాడ్స్ వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

Hazarath Reddy

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని టీపీసీసీ తాత్కాలిక చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy on Budget 2021) అన్నారు. ఈ బడ్జెట్‌తో తెలంగాణకు ఒరిగేదేమీ లేదన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇచ్చిన 10 వేల కోట్లు 29 రాష్ట్రాలకు ఏ మాత్రం సరిపోవన్నారు.

Advertisement
Advertisement