తెలంగాణ

Telangana: ఇలాంటి దొంగను జన్మలో చూసుండరు ..నీళ్ల బిందెలను ఎత్తుకెళ్లిన దొంగ...సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

దొంగలంటే బంగారం, డబ్బు దోచుకుంటారు కానీ తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ దొంగ చేసిన పని అందరికి నవ్వు తెప్పించక మానదు. ఎందుకంటే ఇద్దరు చిల్లర దొంగలు నీళ్ల బిందెలను ఎత్తుకెళ్లిన ఘటన సీసీ కెమెరాకు చిక్కింది. అర్థరాత్రి ఓ ఇంట్లో దూరి నీళ్ల బిందెలు ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో చూసి నెటిజన్లు నవ్వుకుంటుండగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Telangana Assembly Sessions: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. కౌశిక్ రెడ్డిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆగ్రహం..తీరు మార్చుకోకపోతే సస్పెండ్ చేస్తానని వార్నింగ్

Arun Charagonda

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో ఆటో డ్రైవర్ల సమస్యపై చర్చించాలని పట్టుబట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. ఓవర్సీస్ స్కాలర్‌షిప్ అందించేందుకు పాలకులు కమీషన్లు దండుకుంటున్నారని వివేకానంద చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLC Kavitha: మూసీ సుందరీకరణపై ప్రభుత్వం చెప్పినవన్నీ అబద్దాలే, డీపీఆర్ రెడీ కాకముందే అప్పు కావాలని ప్రపంచబ్యాంకును కోరిన ప్రభుత్వం...ఎమ్మెల్సీ కవిత ఫైర్

Arun Charagonda

మూసీ భాగోతం ఆధారాలతో బైట పెట్టారు ఎమ్మెల్సీ కవిత. మూసీ సుందరీకరణ కోసం DPR రెడీ కాకముందే రూ.4,100 కోట్లు అప్పు కావాలని వరల్డ్ బ్యాంకును అడిగారని తెలిపారేఉ. మూసీ సుందరీకరణ కోసం వరల్డ్ బ్యాంకును అప్పు అడిగిన తేదీ - 19/09/2024 కాగా మూసీ DPR కోసం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన తేదీ - 4/10/2024 అన్నారు. ప్రభుత్వం మూసీ ప్రాజెక్టుపై చెబుతున్నవన్నీ అబద్దాలేనన్నారు.

Telangana Assembly: ఆటోడ్రైవర్లకు సంఘీభావంగా ఆటోల్లో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవద్దు..అండగా ఉంటామని భరోసా

Arun Charagonda

ఆటోడ్రైవర్లకు సంఘీభావంగా ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇప్పటివరకు 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల జాబితాను ఇచ్చాము..అయినా రాష్ట్ర ప్రభుత్వానికి దున్న పోతు మీద వాన పడ్డేట్టే ఉంది.

Advertisement

CM Revanth Reddy: 63 లక్షల మంది మహిళలకు చీరల పంపిణీ, సెర్ఫ్ ద్వారా ఉచితంగా పంపిణీ చేపట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం

Arun Charagonda

రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (#SERP) ద్వారా ఉచితంగా పంపిణీ చేయనున్న చీరల నమూనాలను అసెంబ్లీలోని తన చాంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు.

Telangana: రోడ్డుపై డబ్బుల కట్టలు విసిరేసిన యువకుడు, కేసు నమోదు చేసిన ఘట్‌కేసర్ పోలీసులు...వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్ - ఘట్‌కేసర్ పరిధిలోని ఆర్ఆర్ఆర్ వద్ద ఓ యువకుడు రూ.20 వేలు రోడ్డు పక్కన విసిరేసి, వీడియో చూసినవారు ఎవరైనా వచ్చి తీసుకోవచ్చని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. వీడియో వైరల్‌గా మారి

Hyderabad: బాచుపల్లిలో 6 అడుగుల పాము, ఓ ఇంట్లోకి ప్రవేశించగా స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చిన స్థానికులు..ఎలా పట్టుకున్నాడో చూడండి

Arun Charagonda

హైదరాబాద్‌లోని బాచుపల్లిలో ఓ భారీ పాము కలకలం రేపింది. బాచుపల్లిలోని కేఆర్సీఆర్ కాలనీలో 6 అడుగుల ఓరియంటల్ ర్యాట్ స్నేక్ ఓ ఇంట్లోకి చొరబడింది. దీంతో భయాందోళన చెందిన కాలనీవాసులు స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ ఆ భారీ సర్పాన్ని బంధించి సురక్షిత ప్రదేశానికి తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Hazarath Reddy

కీసరలోని మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల(సనత్‌నగర్, కూకట్‌పల్లి) పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులను, ఖమ్మంలోని బీసీ గురుకులంలో ఓ విద్యార్థినిని ఎలుకలు కరిచాయి

Advertisement

Hyderabad: నార్సింగిలో సోలార్ రూఫ్ టాప్ సైక్లింగ్ ట్రాక్‌ను తొలగించిన అధికారులు, బీఆర్ఎస్ ఆనవాళ్లను చెరిపేసే కక్ష సాధింపు చర్య అని మండిపడిన బీఆర్ఎస్

Hazarath Reddy

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండియాలో మొట్టమొదటి సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ ను నార్సింగ్ లో ఏర్పాటు చేసిన సంగతి విదితమే. తాజాగా ఈ సైకిల్ ట్రాక్ ను తొలగిస్తున్నారు అధికారులు.సైకిల్ ట్రాక్ ను జేసీబీ సాయంతో తొలగిస్తున్న వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

HYDRA Demolitions: హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లం, కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైడ్రా ఏర్పడకముందు ఉన్న నిర్మాణాల జోలికి తాము వెళ్లబోమని, కానీ హైడ్రా ఏర్పడిన తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను మాత్రం కూల్చివేస్తామని కమిషనర్ (హైడ్రా) రంగనాథ్ తెలిపారు. అంటే జులై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామన్నారు.

Telangana Assembly Session 2024: వీడియో ఇదిగో, ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అంటూ నినదించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ వంతపాడిన మంత్రి పొన్నం ప్రభాకర్

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినదించారు. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ బీఆర్ఎస్ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ వంత పాడారు.

Telangana: పబ్జి గేమ్ ద్వారా పరిచయమైన యువకుడు మాటలు నమ్మి ఆన్‌లైన్‌లో రూ. 3 లక్షలు బెట్టింగ్, మోసపోయానని తెలుసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న యువకుడు

Hazarath Reddy

ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు యువకుడు బలయ్యాడు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండవుతాపురం గ్రామానికి చెందిన మరుపట్ల హనూక్(25) అనే యువకుడికి పబ్జి గేమ్ ద్వారా ఓ యువకుడు పరిచయమయ్యాడు.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, ఓవర్ టేక్ చేయబోయి లారీ, బస్సు మధ్యలో పడ్డ బైకర్, తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలు

Hazarath Reddy

తెలంగాణలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భూపాలపల్లి పట్టణంలో గణేష్ చౌక్ వద్ద ఓ బైకర్ అతి వేగంగా వెళ్లి లారీ, బస్సు మధ్యలో ఇరుక్కుపోయాడు. మజూద్ అనే యువకుడు బైక్ అతి వేగంగా నడుపుతూ లారీ బస్సు మధ్యలోకి దూసుకువెళ్లాడు, అయితే అదుపుతప్పి పడిపోయాడు.

Pushpa-2 Stampede Row: సంధ్య థియేటర్ లైసెన్స్ రద్దుకు రంగం సిద్దం, థియేటర్ కు షోకాజ్ నోటీసులిచ్చిన చిక్కడపల్లి పోలీసులు

Hazarath Reddy

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట వ్యవహారంలో మలుపులు తిరుగుతోంది. తాజాగా సంధ్య థియేటర్‌కు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. థియేటర్‌ లైసెన్స్‌ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని, దీనిపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించారు.

Sandhya Theater Stampede Row: వీడియో ఇదిగో, శ్రీతేజ్‌కు ఆక్సిజన్‌ అందక బ్రెయిన్‌ డ్యామేజ్‌ అయింది, 13 రోజులుగా చికిత్స కొనసాగుతుందని తెలిపిన సీపీ సీవీ ఆనంద్

Hazarath Reddy

పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్‌కు కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. మంగళవారం కిమ్స్‌ ఆసుపత్రికి వచ్చిన హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌.. వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి క్రిస్టినాతో కలిసి గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించారు

Pushpa-2 Stampede Row: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట వ్యవహారంలో కీలక పరిణామం, థియేటర్‌కు షోకాజ్ నోటీసులు పంపిన సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌

Hazarath Reddy

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట వ్యవహారంలో మలుపులు తిరుగుతోంది. తాజాగా సంధ్య థియేటర్‌కు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. థియేటర్‌ లైసెన్స్‌ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని, దీనిపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించారు.

Advertisement

Formula E Race Case: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసు, దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామని ప్రకటించిన బీఆర్ఎస్

Hazarath Reddy

ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసులో మాజీ మంత్రి, BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై కేసు నమోదుకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అనుమతి ఇవ్వడంతో ఆ దిశగా రంగం సిద్ధమవుతోంది. గవర్నర్‌ అనుమతిని ఏసీబీకి పంపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

హరీష్‌ రావు వ్యాఖ్యలపై మంత్రి భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను బీఆర్ఎస్ తప్పువదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. అప్పులపై చర్చ జరగాలనే శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. ‘‘అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా?’’ భట్టి సవాల్ విసరగా.. అందుకు మాజీ మంత్రి హరీష్ రావు సై అన్నారు.

Telangana Assembly Session 2024: ఏడాది పాలనలో కాంగ్రెస్ చేసిన అప్పు రూ. 1,27,208 కోట్లు, ఇలాగే కొనసాగితే వచ్చే 5 ఏళ్లలో రూ. 6,36,040 కోట్లుఅవుతుంది, అసెంబ్లీలో మండిపడిన హరీష్ రావు

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఏడాది పాల‌న‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసిన అప్పుల‌పై శాస‌న‌స‌భ‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ఏడాది కాలంలో రూ. 52 వేల కోట్లు మాత్ర‌మే అప్పు తీసుకున్నామ‌ని ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు.

Telangana Assembly Session 2024: వీడియో ఇదిగో, నల్ల రంగు అంగీలు, చేతులకు బేడీలు వేసుకుని అసెంబ్లీకి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, లగచర్ల రైతులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్

Hazarath Reddy

నల్ల రంగు అంగీలు, చేతులకు బేడీలు వేసుకుని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు. ఇదేమి రాజ్యం.. ఖాకీ రాజ్యం.. దోపిడి రాజ్యం, లాఠీ రాజ్యం.. లూఠీ రాజ్యం, రైతులకు సంకెళ్లా సిగ్గు సిగ్గు అంటూ అసెంబ్లీ లాబీల్లో నినాదాలు చేశారు.

Advertisement
Advertisement