తెలంగాణ

Restrictions On New Year Celebrations: హైదరాబాద్‌ లో న్యూఇయ‌ర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు.. ఉల్లంఘిస్తే కఠినమైన శిక్షలు.. జైలుకు కూడా పంపించొచ్చు.. జాగ్రత్త మరి..!!

Rudra

న్యూఇయ‌ర్ వేడుకలకు హైదరాబాద్ ముస్తాబవుతున్నది. ఈ క్రమంలో సిటీలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు.

Hyderabad Horror: హైదరాబాద్‌ లో ఘోరమైన హత్యలు.. బేగంబజార్‌ లో భార్య, కుమారుడి మర్డర్.. ఆపై ఉరేసుకొని సూసైడ్ చేసుకున్న భర్త.. చాకచక్యంగా తప్పించుకున్న పెద్ద కొడుకు (వీడియో)

Rudra

హైదరాబాద్‌ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో యూపీకి చెందిన సిరాజ్‌ అనే వ్యక్తి భార్య, కుమారుడిని దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Google Doodle 2024: ప్రపంచ చెస్ ఛాంపియన్‌ భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ కు గూగుల్ వినూత్న డూడుల్

Rudra

సందర్భానికి తగినట్లు తమ డిస్‌ ప్లేలో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్‌ ని ప్రదర్శించే గూగుల్.. శుక్రవారం వినూత్నంగా గూగుల్ డూడుల్ ప్రదర్శించింది.

Telangana Cold Wave: తెలంగాణపై చలిపులి ప్రతాపం.. శనివారం వరకు రాష్ట్రంలో తీవ్ర చలిగాలులు వీస్తాయన్న ఐఎండీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

Rudra

తెలంగాణను చలిపులి వణికిస్తోంది. తీవ్రమైన శీతల గాలులు జనాల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. డిసెంబర్ 14 వరకు ఇలాంటి వాతావరణమే కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.

Advertisement

Revanth Reddy Meets Nitin Gadkari: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ, కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో సుధీర్ఘ భేటీ, RRR అనుమ‌తులు స‌హా అనేక అంశాల‌పై చ‌ర్చ‌

VNS

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి (159కి.మీ.) అవసరమైన సాంకేతిక‌, ఆర్థిక‌ప‌ర‌మైన అనుమతులు వెంట‌నే ఇవ్వాల‌ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో (Nitin Gadkari) గురువారం రాత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) భేటీ అయ్యారు.

Hyderabad: కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ సమీపంలో వ్యభిచారం, 8 మంది మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వ్యభిచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని కూకట్‌పల్లి ACP శ్రీనివాసరావు హెచ్చరిక

Hazarath Reddy

కేపీహెచ్‌బీలో వ్యభిచారం నిర్వహించే 8 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ సమీపంలో రాత్రి 8 గంటల నుంచి 10 వరకు 10 స్పెషల్ టీంలను ఏర్పాటు చేశాం.. వ్యభిచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూకట్‌పల్లి ACP శ్రీనివాసరావు హెచ్చరించారు.

Jagga Reddy: ఏఐసీసీ నేతలపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్, పార్టీని చంపేయాలని చూస్తున్నారు..అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? అని మండిపాటు

Arun Charagonda

అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? చెప్పాలని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇంచార్జీలు పార్టీని చంపేయాలని చూస్తున్నారు...ఇంతకు ఏఐసీసీ కార్యదర్శులు ఉన్నారా? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా? చెప్పాలన్నారు. దీపాదాస్ మున్షీ ఉందా? ఆమె కూడా వేరే రాష్ట్రం వెళ్ళిపోయిందా?, కొత్త వాళ్ళకు పదవులు ఇచ్చేస్తారా? ఫైనల్ అయ్యేవరకు మాకు చెప్పరా? అని మండిపడ్డారు. ఓ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి విష్ణుపై నిప్పులు చెరిగారు జగ్గారెడ్డి.

Mandakrishna Madiga: కేబినెట్‌లో మాదిగలకు అవకాశం కల్పించాలి, మాదిగలంటే కాంగ్రెస్‌కు చిన్నచూపు తగదన్నమందకృష్ణ మాదిగ,తెలంగాణ తల్లి విగ్రహం మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్న?

Arun Charagonda

మాదిగలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన మందకృష్ణ..కాంగ్రెస్ అగ్రనాయకత్వంలో మాదిగలకు పలుకుబడి లేదు అన్నారు.

Advertisement

MLA Raja Singh on Mohan Babu: జర్నలిస్టు దాడి ఘటనపై మోహన్ బాబు క్షమాపణ చెప్పాలి, ఇష్యూని ఇలాగే వదిలేస్తే మరింత పెద్దది అవుతుందని తెలిపిన ఎమ్మెల్యే రాజాసింగ్

Hazarath Reddy

జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి ఘటనపై బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) స్పందించారు.మోహన్ బాబు ఫ్యామీలి గొడవల్లో వారి కొడుకు మీడియాను పిలవడం వల్లే హౌజ్‌లోకి ఎంటర్ అయ్యారని తెలిపారు. మోహన్ బాబు మీ కుటుంబ సమస్య మీ ఇంటివరకే ఉంటే బాగుంటుంది.. అని తెలిపారు.

Telangana: దారుణం, స్కూల్ నుంచి గంట ముందు ఇంటికి వెళ్లిందని విద్యార్థిని చేయి విరిగేలా కొట్టిన టీచర్, దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో ఘటన

Hazarath Reddy

స్కూల్ నుంచి ఇంటికి గంట ముందు వెళ్లినందుకు విద్యార్థిని చేయి విరిగేలా కొట్టింది ఓ టీచర్. నిజామాబాద్ జిల్లా దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో ఈ దారుణం చోటు చేసుకుంది.

Harishrao: సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సత్తా చూపుదాం, అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌ పార్టీని నిలదీస్తాం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో హస్తం పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలన్న మాజీ మంత్రి హరీశ్‌ రావు

Arun Charagonda

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తా అన్నాడని గుర్తు చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. సిద్దిపేటలో సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మే శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌ రావు...కేసీఆర్‌ను అధికారం నుంచి దించడానికి ఒక గంట ఎక్స్ట్రా పని చేయాలని మిమ్మల్ని అడిగాడు రేవంత్ రెడ్డి...అధికారంలోకి వచ్చిన నెలలో సెక్రటేరియట్లో కూర్చొని చాయ్ తాగుతూ సమస్య పరిష్కరించుకుంటామన్నావు కదా రేవంత్ రెడ్డి, ఇంకా నెల కాలేదా? చెప్పాలన్నారు.

AP Jitender Reddy: తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి, మాజీ క్రికెటర్ చాముండేశ్వరి నాథ్‌పై గెలుపు

Arun Charagonda

తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి నియమితులయ్యారు. జితేందర్ రెడ్డి , మాజీ క్రికెటర్ వి.చాముండేశ్వరీ నాథ్‌కి మధ్య ఎన్నిక జరగగా.. జితేందర్ రెడ్డికి 43 ఓట్లు రాగా, చాముండికి 9 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో జితేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు.

Advertisement

Hyderabad: లాల్‌దర్వాజ నల్లపోచమ్మ దేవాలయంలో అద్భుతం, పసుపులో కుడికాలి పాదం..క్యూ కడుతున్న భక్తులు..వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్‌ లాల్‌దర్వాజ మేకలబండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో అద్భుతం జరిగింది. పసుపులో కుడికాలి పాదం గుర్తు దర్శనమివ్వడంతో సాక్షాత్తూ అమ్మవారు వచ్చారనే నమ్మకంతో భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Telangana Shocker: ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు కుటుంబం బలి, ట్రేడింగ్‌లో కొడుక్కి నష్టాలు రావడంతో గడ్డి మందు తాగిన కుటుంబం..నలుగురు మృతి

Arun Charagonda

ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు కుటుంబం బలి అయింది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేటకు చెందిన శివప్రసాద్(26) అప్పు చేసి ఆన్‌లైన్ ట్రేడింగ్ చేశాడు. అందులో నష్టాలు రావడం, అప్పులు ఇచ్చిన వారి నుండి ఒత్తిడి ఎక్కువవడంతో తండ్రి మొండయ్య(60), తల్లి శ్రీదేవి(54), అక్క చైతన్య(30)తో కలిసి గడ్డి మందు తాగాడు.వరంగల్ ఏంజీఏం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మరణించారు.

Warangal: అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు..ఒకరు మృతి, మాదన్నపేట చెరువు మత్తడి వద్ద అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు...వీడియో

Arun Charagonda

వరంగల్ - నర్సంపేట పట్టణంలో నర్సింహులు పేటకు చెందిన ముగ్గురు యువకులు నర్సంపేటలో ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా మాదన్నపేట చెరువు మత్తడి వద్ద వారి కారు అదుపుతప్పి చెరువులో పడిపోయింది. దీంతో వెంటనే ఇద్దరిని కాపాడగా.. మరో యువకుడు మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

CM Revanth Reddy: UPSC విజేతలను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకం ద్వారా రూ.లక్ష ఆర్ధిక సాయం అందించిన ప్రభుత్వం

Arun Charagonda

తెలంగాణ నుంచి #UPSC సివిల్ సర్వీసెస్‌ మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం కింద ప్రజా ప్రభుత్వం లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన వారిలో 20 మంది అభ్యర్థులు ఎంపిక కావడం పట్ల ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపారు

Advertisement

KTR Open Letter To Rahul Gandhi: మూట‌ల‌పై ఉన్న శ్ర‌ద్థ‌, మీరిచ్చిన మాట‌ల‌పై లేదా? రాహుల్ గాంధీకి కేటీఆర్ బ‌హిరంగ లేఖ‌

VNS

చేతి గుర్తుకు ఓటేస్తే చేతగానీ ముఖ్యమంత్రిని తెలంగాణపై రుద్దారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) విమర్శించారు. కాంగ్రెస్‌ సర్కార్‌ వల్ల అన్నదాతల నుంచి ఆడబిడ్డల దాకా ప్రతివర్గం అరిగోస పడుతోందని అన్నారు. ప్రగతి పథంలో పరుగులు పెట్టిన రాష్ట్రం అధోగతి పాలవుతుంటే తెలంగాణ వైపు కన్నెత్తి చూడని మీ తీరును చూసి నాలుగు కోట్ల ప్రజలు నిత్యం రగిలిపోతున్నారని మండిపడ్డారు.

Manchu Manoj Bindover: మంచు ఫ్యామిలీ వివాదంలో కీల‌క ప‌రిణామం, రాచ‌కొండ క‌మిష‌న‌ర్ ముందు మంచు మ‌నోజ్ బైండోవ‌ర్

VNS

మంచు మనోజ్ ను పోలీసులు బైండోవర్ చేశారు. ఏడాది పాటు ఈ బైండోవర్ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు అధికారులు స్పష్టం చేశారు.

Droupadi Murmu Telangana Tour: తెలంగాణ‌లో రాష్ట్రప‌తి ప‌ర్య‌ట‌న ఖరారు, మ‌హిళావ‌ర్సిటీతో పాటూ ప‌లు ప్రాంతాల్లో టూర్

VNS

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఈ నెల 21వ తేదీన వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు. వర్సిటీ (Telangana Women University) శతాబ్ది వేడుకలను ప్రారంభించనున్నారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ఈ నెల 17న రాష్ట్రానికి రానున్న సంగతి తెలిసిందే. ఐదు రోజులపాటు ఆమె తెలంగాణలో గడపనున్నారు

Cold Wave in Telugu States: హైద‌రాబాద్ గ‌జ‌గ‌జ‌, రాబోయే రోజుల్లో మ‌రింత చలి తీవ్ర‌త పెరిగే అవ‌కాశం, ఏపీలోనూ పడిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు

VNS

బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.7 డిగ్రీలు తగ్గి 29.3 డిగ్రీలుగాను, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.3 డిగ్రీలు తగ్గి 17.7 డిగ్రీలు, గాలిలో తేమ 43శాతంగా నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) అధికారులు వెల్లడించారు.

Advertisement
Advertisement