తెలంగాణ

Karimnagar Shocker: కరీంనగర్ జిల్లా కశ్మీర్‌ గడ్డలో దారుణం..కుటుంబ కలహాలతో ఓ వ్యక్తిపై కత్తితో దాడి...తీవ్ర గాయాలు, ఆస్పత్రిలో చేరిక

Arun Charagonda

కరీంనగర్ కశ్మీర్ గడ్డ లో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. 54వ డివిజన్ కార్పోరేటర్ ఇఫ్రా తహ్రీన్ భర్త ఆతినా అతిఫ్ పై కత్తితో దాడి చేశాడు. అమేర్, అజ్జు, ఆదిల్, ఆలీకి మధ్య జరుగుతున్న కుటుంబ కలహాలను ఆపడానికి వెళ్లగా.. అతిఫ్ పై దాడి చేయగా ఎడమచేయికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

Harishrao: తెలంగాణ హైకోర్టులో హరీశ్‌ రావుకు ఊరట, ఆయన్ని అరెస్ట్ చేయవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు.. కాంగ్రెస్ నేత చక్రధర్‌ గౌడ్‌కు నోటీసులు

Arun Charagonda

తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీశ్‌ రావుకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని క్వాష్ పిటిషన్ దాఖల్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం..ఈ కేసులో హరీశ్‌ రావును అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.

KTR On Kaushik Reddy Arrest: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్‌ను ఖండించిన కేటీఆర్, ఇదేనా ప్రజా పాలన?..ఇందిరమ్మ రాజ్యం? అంటూ కేటీఆర్ ఫైర్

Arun Charagonda

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‌ను ఖండించారు మాజీ మంత్రి కేటీఆర్. ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన కేటీఆర్.. ఎమ్మెల్యే ఫిర్యాదు చేసేందుకు వస్తున్నారని తెలిసి ఏసీపీ పరార్... సీఐ పారిపోతారు అని ఎద్దేవా చేశారు.

Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీస్ కేసు, ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం..కౌశిక్ ఇంటికి పోలీసులు..వీడియో ఇదిగో

Arun Charagonda

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ సీఐపై దుర్భాషలాడాడని..ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించాడంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో కౌశిక్ రెడ్డి ఇంటికి భారీగా చేరుకున్నారు పోలీసులు. ఏ క్షణమైనా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

SI Suicide Case: ఎస్‌ఐ హరీశ్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు, యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..తల్లిదండ్రుల ఫిర్యాదుతో విచారణ

Arun Charagonda

ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. హరీశ్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఏడు నెలల కిందట హరీష్‌కు ఓ యువతి ఫోన్ చేయగా, మాటామాటా కలిసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ చాట్ చేసుకునేవారు.హైదరాబాద్లో చదువుకునే ఆమె వారంలో రెండు రోజులు వాజేడుకు వచ్చి ఉండి వెళ్లేది.. ఈ క్రమంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

CM Revanth Reddy: ఒక్క రోజులో అద్భుతాలు సృష్టించలేం, ఉద్యోగాల కల్పనపై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్, మోదీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్

Arun Charagonda

ఒక్కరోజులో ఎవరూ అద్భుతాలు సృష్టించరని, ప్రజలు ఇచ్చిన అవకాశం మేరకు సంక్షేమం, అభివృద్ధి రెండింటిపైనా దృష్టి సారించి ముందుకు సాగుతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపు 55,143 ఉద్యోగ నియామకాలు పూర్తిచేసిన నేపథ్యంలో ప్రజా ప్రభుత్వం – ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా అశేష జనవాహిని మధ్యన పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రివర్గ సహచరులతో కలిసి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

Pushpa 2: The Rule: పుష్ప 2 ప్రీమియర్ తొక్కిసలాటలో కుప్పకూలిన బాలుడు, హైదరాబాద్‌ సంధ్య ధియేటర్లో ఘటన, పరిస్థితి విషమం

Hazarath Reddy

ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప 2: ది రూల్ ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట మధ్య ఓ యువకుడు స్పృహ కోల్పోయిన విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రేక్షకులు థియేటర్ ప్రాంగణాన్ని ముంచెత్తారు.

Burra Venkatesham VRS Approved By Govt: తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఛైర్మ‌న్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు లైన్ క్లియ‌ర్, బుర్రా వెంక‌టేశం స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ప్ర‌భుత్వం ఆమోదం

VNS

ఐఏఎస్‌ అధికారి బుర్రా వెంకటేశం (Burra Venkatesham) స్వచ్ఛంద పదవీ విరమణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు వీఆర్‌ఎస్‌ను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించిన విషయం విధితమే. ఈ క్రమంలో ఆయన టీజీపీఎస్సీ చైర్మన్‌గా (TGPSC Chairman) గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు.

Advertisement

Naga Chaitanya and Sobhita Dhulipala Wedding: అంగ‌రంగ వైభ‌వంగా నాగ‌చైత‌న్య‌, శోభిత పెళ్లి, నెట్టింట వైర‌ల్ అవుతున్న ఫోటోలు

VNS

టాలీవుడ్‌ నటుడు అక్కినేని నాగచైతన్య(Naga Chaithanya), హీరోయిన్‌ శోభిత ధూళిపాల (Shobjitha) పెళ్లితో ఒక్కటయ్యారు. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్‌లో వివాహ వేడుక వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి సరిగ్గా 8.15 గంటలకు నిర్వహించారు. పెళ్లి వేడుకకు (Naga Chaitanya Sobhita Dhulipala Marriage) ఇరు కుటుంబాలతో పాటు సినీ ప్రముఖులు, సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు.

Pushpa 2: The Rule: వీడియో ఇదిగో, హైదరాబాద్‌లో సంధ్య థియేటర్‌ వద్ద లాఠీ ఛార్జ్, అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసి ఎగబడిన అభిమానులు

Hazarath Reddy

Hyderabad: వీడియో ఇదిగో, బిర్యానీలో ప్రత్యక్షమైన బొద్దింక, ఒక్కసారిగా షాక్ అయిన కస్టమర్, సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆందోళనకు దిగిన కస్టమర్లు

Hazarath Reddy

హైదరాబాద్ - కొత్తపేట కృతుంగ రెస్టారెంట్ బిర్యానీలో ప్రత్యక్షమైన బొద్దింక. ఇదేంటని అడిగితే హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆందోళనకు దిగిన కస్టమర్లు.. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Harish Rao:పంజాగుట్టలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయండి, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు

Hazarath Reddy

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని అందులో పేర్కొన్నారు.

Advertisement

Hyderabad: హైదరాబాద్‌లో మరో రాష్ డ్రైవింగ్ కేసు..మల్లేపల్లిలో హోండా సిటీ కారు బీభత్సం, వాహనాలను గుద్దుకుంటూ వెళ్లిన వైనం..పలువురికి గాయాలు...వీడియో ఇదిగో

Arun Charagonda

లంగర్ హౌస్ ఘటన మరవక ముందే హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో రాష్ డ్రైవింగ్ కేసు నమోదు అయింది. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లి వద్ద గుర్తుతెలియని వ్యక్తి హోండా సిటీ కారులో రాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు పక్కన ఉన్న వాహనాలను గుద్దుకుంటూ వెళ్లిపోయాడు.

Google Safety Engineering Centre: తెలంగాణలో గూగుల్ భారీ పెట్టుబడులు, హైదరాబాద్‌లో సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు..సీఎం రేవంత్ రెడ్డితో గూగుల్ కంపెనీ ప్రతినిధుల చర్చలు సఫలం

Arun Charagonda

తెలంగాణలో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది గూగుల్‌ కంపెనీ. హైదరాబాద్‌లో సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి చర్చలు జరిపారు గూగుల్ ప్రతినిధులు. ఆగస్టు 2024లో గూగుల్‌ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లిన సమయంలో చర్చలు జరిపారు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు. గూగుల్‌ మేనేజ్‌మెంట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేలా ఒప్పించారు రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy: ఆర్య వైశ్యులు తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లు, హైదరాబాద్‌లో మాజీ సీఎం రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి

Arun Charagonda

రాష్ట్ర ఆర్థిక ఎదుగుదల ఆర్యవైశ్యుల చేతిలో ఉందని..వీరంతా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు కావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య 3 వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు రేవంత్. ఆర్య వైశ్యుల వ్యాపారాలకు ఎలాంటి అనుమతులైనా ప్రభుత్వం సకాలంలో ఇస్తుందని...రాజకీయాల్లో ఆర్య వైశ్యులకు సముచిత స్థానం ఇస్తాం అని తేల్చిచెప్పారు.

Paidi Rakesh Reddy: మంత్రి కోమటిరెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన కామెంట్స్, మతిస్థిమితం లేకుండా తాగే పిచ్చి ఎంకడు, దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్

Arun Charagonda

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీద బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్యాహ్నం తాగి మతిస్థిమితం లేకుండా మాట్లాడే పిస్స ఎంకడు..మధ్యాహ్నం తాగే కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చిండు అని ఆరోపించారు.

Advertisement

Telangana: దారుణం, కాజీపేటలో వృద్ధుడైన వ్యాపారిని కత్తితో పొడిచి హత్యాయత్నం చేసిన యువకుడు, రాత్రిపూట షాపు మూసి ఇంటికి వెళుతుండగా దాడి

Hazarath Reddy

కాజీపేట డీజిల్ కాలనీలో సిమెంట్ బ్రిక్స్ వర్క్ షాప్ నిర్వహిస్తున్న వృద్దుడు రాత్రి షాపు మూసి ఇంటికి నడిచి వెళ్తుండగా దాడి చేసిన వసీం అక్రం అనే యువకుడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కాజీపేట పోలీసులు.

Earthquake in Medaram: వీడియో ఇదిగో, భూంకంపం దెబ్బకు వణికిపోయిన మేడారం సమ్మ‌క్క‌-సార‌క్క గ‌ద్దెలు, గ‌ద్దెల చుట్టూ ఉన్న గ్రిల్స్ ఊగిన‌ట్లు సీసీకెమెరాల ద్వారా స్ప‌ష్ట‌ం

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ములుగు కేంద్రంగా వచ్చిన ఈ భూకంపం ప్రభావంతో దాదాపు 225 కి.మీ. వ్యాసార్థంతో భూమి 5 సెకండ్ల దాకా కంపించింది. ఈ భూకంపం ప్రభావంతో సమ్మ‌క్క‌-సార‌క్క గ‌ద్దెలు వ‌ణికిపోయాయి.

Earthquake in Telugu States: మళ్లీ భూప్రకంపనలు వచ్చే అవకాశం, భూకంప తీవ్రత 6 వరకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపిన ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ములుగు కేంద్రంగా వచ్చిన ఈ భూకంపం ప్రభావంతో దాదాపు 225 కి.మీ. వ్యాసార్థంతో భూమి 5 సెకండ్ల దాకా కంపించింది.

Patnam Narendra Reddy: పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ, క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు

Arun Charagonda

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది హైకోర్టు. కొడంగల్ కోర్టు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది హైకోర్టు.

Advertisement
Advertisement