తెలంగాణ

Allu Arjun: డ్రగ్స్‌ రహిత సమాజం నిర్మిద్దాం అంటూ వీడియో విడుదల చేసిన అల్లు అర్జున్‌, తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని పిలుపు

Hazarath Reddy

డ్రగ్స్‌ రహిత సమాజం నిర్మిద్దాం అంటూ ఎక్స్ వేదికగా అల్లుఅర్జున్ వీడియో షేర్ చేశారు. ఇందులో డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని అల్లు అర్జున్‌ పిలుపునిచ్చారు. ఆయన ఎక్స్ వేదికగా ఈ స్పెషల్‌ వీడియో షేర్‌ చేశారు.

Khammam: హాస్టల్‌లో సీనియర్ వర్సెస్ జూనియర్‌ల మధ్య ఘర్షణ..మద్యం తాగి వచ్చాడని జూనియర్‌ను అనుమతించని సీనియర్లు..గొడవ పెరిగి కర్రలతో దాడి..వీడియో ఇదిగో

Arun Charagonda

గురుకుల హాస్టల్ లో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. ఖమ్మం నగరంలోని ఎస్సీ సంక్షేమ హాస్టల్ లో సీనియర్, జూనియర్ల మధ్య ఘర్షణ జరిగింది. నిన్న రాత్రి మద్యం తాగి వచ్చాడని జూనియర్ వేణును హాస్టల్ లోకి అనుమతించలేదు సీనియర్లు. దీంతో వేణు, సీనియర్ల మధ్య వాగ్వాదం జరుగగా వేణుపై కర్రలతో దాడి చేశారు సీనియర్లు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Telangana: ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం, ఫుడ్ సేఫ్టిపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు.. కమిటీ సభ్యులు తిన్నాకే పిల్లలకు ఆహారం పెట్టాలని ఆదేశం

Arun Charagonda

తెలంగాణ గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హాస్టల్, గురుకులాలు, అంగన్ వాడీ కేంద్రాలు, హాస్పటల్స్ లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ప్రిన్సిపాల్ / వార్డెన్, మరో ఇద్దరు సిబ్బందితో కమిటీ ఏర్పాటు చేసింది.

MLC Jeevan Reddy: గురుకుల సిబ్బందిపై ఎమ్మెల్సీ జీవన్‌ ఫైర్..అల్లీపూర్ గురుకులాన్ని తనిఖీ చేసిన జీవన్‌ రెడ్డి..నాసిరకం భోజనం పెడతారా అని సిబ్బందిపై మండిపాటు

Arun Charagonda

గురుకుల సిబ్బందికి చివాట్లు పెట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గురుకులాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు జీవన్ రెడ్డి. ప్రభుత్వం నుండి బిల్లులు తీసుకుంటున్నారు. పిల్లలకు సరిపడా భోజనం పెట్టడానికి ఏంటి కష్టం అని ప్రశ్నించారు.అన్నం ఉడకలేదు... నీళ్ల పప్పు, నీళ్ల చారు పిల్లలకు ఎందుకు వడ్డిస్తున్నారు? అని మండిపడ్డారు. మెనూ ప్రకారం వారంలో రెండు రోజులు నాన్ వెజ్ పెట్టాల్సి ఉండగా, నెలలో ఒకే రోజు నాన్ వెజ్ పెడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

CM Revanth Reddy: సమగ్ర సర్వేలో వివరాలు నమోదు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. వీలైనంత త్వరగా కుల సర్వే పూర్తి చేయాలని సూచించిన తెలంగాణ సీఎం

Arun Charagonda

యావత్ దేశానికి మార్గాన్ని నిర్దేశిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాలు నమోదు చేయించుకున్నారు.

Hyderabad: వామ్మో..చికెన్ కబాబ్‌లో ఎలుక మలం, లక్డికపూల్ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో బయటపడ్డ షాకింగ్ విషయాలు

Hazarath Reddy

లక్డికాపూల్‌లో ఆహార భద్రత దాడుల్లో ఎలుకల మలం, సజీవ బొద్దింకలు కనుగొనబడ్డాయి. ప్రసిద్ధ బడేమియా కబాబ్‌ కూడా నియమాలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించబడింది. పేలవమైన పరిశుభ్రత, భద్రతా ప్రమాణాల గురించి దిగ్భ్రాంతికరమైన వెల్లడిలో, ఆహార భద్రతా టాస్క్ ఫోర్స్ లక్డికాపూల్‌లోని మూడు ప్రముఖ తినుబండారాలపై దాడులు నిర్వహించింది

CM Revanth Reddy: వసతి గృహాల ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం..బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం, తప్పుడు ప్రచారం చేస్తే శిక్షిస్తామని హెచ్చరిక

Arun Charagonda

వ‌స‌తిగృహాల్లో త‌ర‌చూ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోవ‌డంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. పాఠ‌శాల‌లు, గురుకులాల‌ను త‌ర‌చూ త‌నిఖీ చేయాలి కలెక్టర్‌లను ఆదేశించారు. ఆదేశం. విద్యార్థుల‌కు ప‌రిశుభ్ర వాతావ‌ర‌ణంలో పౌష్టికాహారం అంద‌జేయాలన్నారు.

Telangana: అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తుడికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు..మహబూబాబాద్ బస్ డిపో సిబ్బందిపై అయ్యప్ప భక్తుల ఆగ్రహం...వీడియో ఇదిగో

Arun Charagonda

అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తుడికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డిపో సెక్యూరిటీ సిబ్బందిపై అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల ధరించిన వారికి పరీక్షలు ఏంటని ప్రశ్నించినవారిపై డిపో మేనేజర్ దురుసుగా ప్రవర్తించారని ...ఈ రోజు డిపో ముట్టడికి పిలుపునిచ్చారు.

Advertisement

Telangana: సాంబారు,చట్నీలో బొద్దింక..మహబూబ్ నగర్‌ ఎస్సీ బాలికల హాస్టల్‌లో కలకలం...విషయం బయటకు చెప్పొద్దని విద్యార్థులకు బెదిరింపులు

Arun Charagonda

మహబూబ్ నగర్ - పాలమూరులోని కలెక్టర్ బంగ్లా సమీపంలోని ఎస్సీ బాలికల హాస్టల్లో సాంబారు, చట్నీలో బొద్దింక రావడం కలంకలం రేపింది. ఈ విషయమై వంట సిబ్బందిని అడిగితే ఇంట్లో బొద్దింక వస్తే తీసేసి తినమా అంటూ విద్యార్థులను బెదిరించారు వంట సిబ్బంది. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సాంబారులో బొద్దింక వచ్చిందంటే ప్లేట్లోంచి పడేసి తినాలని సిబ్బంది చెబుతుండడం వారి నిర్లక్ష్యానికి నిదర్శమని మండి పడ్డారు.

Harish Rao On Rythu Bharosa: రైతు భరోసా భోగస్..కనీస మద్దతు ధర ఏది?, రైతులను మోసం చేసినందుకు విజయోత్సవాలా?...సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్‌ రావు ఫైర్

Arun Charagonda

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్​నగర్​లో నేటి నుంచి మూడు రోజుల పాటు రైతుపండగ నిర్వహణకు సర్కారు ఏర్పాట్లు చేసింది.కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం తొలి ఏడాదిలోనే రూ.54,280 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

BRS Gurukula Bata: రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ స‌మ‌ర‌శంఖం, గురుకుల బాట‌కు పిలుపునిచ్చిన కేటీఆర్

VNS

నవంబర్ 30 నుంచి డిసెంబర్ 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. గురుకుల బాట (Gurukula Bata) కార్యక్రమంలో భాగంగా గురుకులాలు, కేజీబీవీలు(KGBVB), మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నేతలు పరిశీలించనున్నారని తెలిపారు.

Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, సరోగసి కోసం ఇంటికి పిలిచి లైంగిక వేధింపులు, అపార్ట్‌మెంట్ తొమ్మిదవ అంతస్తుపై నుండి దూకి చనిపోయిన మహిళ

Hazarath Reddy

హైదరాబాద్ మై హోమ్ భుజ అపార్ట్‌మెంట్ తొమ్మిదవ అంతస్తు పై నుండి దూకి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అశ్విత సింగ్ (25) అనే మహిళ మృతిచెందింది. సరోగసి ద్వారా పిల్లలను కనివ్వడం కోసం అశ్విత సింగను రాజేష్ బాబు అనే వ్యక్తి తెచ్చుకున్నారు.

Advertisement

Telangana: మానవత్వమా నువ్వెక్కడా?, కన్నతల్లిని స్మశానంలో వదిలేసిన కొడుకులు..కాలు విరిగి ఎనమిది రోజులుగా స్మశానంలోనే వృద్ధురాలు...వీడియో వైరల్

Arun Charagonda

మానవత్వం మంటగలిసింది. జగిత్యాలలో కన్నతల్లిని స్మశానంలో వదిలేశారు కసాయి కొడుకులు. గత ఎనిమిది రోజులుగా స్మశాన వాటికలోనే వృద్ధురాలు రాజవ్వ ఉంది. పెన్షన్ డబ్బుల కోసం తల్లిని చితకబాదాడు కుమారుడు. కాలు విరగడంతో అచేతన స్థితిలో రాజవ్వ ఉండగా నలుగురు కొడుకులు ఉన్నా ఏం ప్రయోజనం లేదని వాపోయింది. అధికారులకు సమాచారం ఇవ్వగా ఆసుపత్రికి తరలించారు.

Telangana: అవమానం భరించలేక మంజీరా నదిలో దూకిన తల్లీకొడుకులు మృతి, ఆటో దొంగతనం విషయంలో పంచాయితీకి పిలవడంతో తీవ్ర మనస్థాపం

Hazarath Reddy

దొంగతనం విషయంలో పంచాయితీకి పిలవడంతో తల్లీకుమారుడు మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలంలో చోటు చేసుకుంది.

Hyderabad: వీడియో ఇదిగో, కూకట్‌పల్లిలో సోదరిని వేధించినందుకు యువకుడిని హత్య చేసిన అన్న, చపాతీ కర్రతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. టీ తాగేందుకు వచ్చిన తమ సోదరి పై కామెంట్ చేశాడన్న కారణంతో ఓ వ్యక్తిని చపాతీ కర్రతో కొట్టి చంపిన సంఘటన కూకట్‌పల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Student Dies by Suicide: తీవ్ర విషాదం, వనపర్తి గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్న 7వ తరగతి విద్యార్థి, దుప్పటితో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని సూసైడ్

Hazarath Reddy

తెలంగాణలో వనపర్తి (Vanaparthy) జిల్లా మదనాపురం మండలం ఎస్సీ గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య (Student suicide) చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. మండలంలోని పొన్నూరు గ్రామానికి చెందిన ప్రవీణ్‌ గురుకుల పాఠశాలలో లో 7వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు జోవనోపాధి కోసం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు.

Advertisement

Dilawarpur Protest: రైతుల ఆందోళనతో దిగొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని ప్రభుత్వ ఆదేశం, లిఖితపూర్వక హామీ ఇవ్వాలని గ్రామస్తుల డిమాండ్

Arun Charagonda

రైతు తిరుగుబాటుతో దిగొచ్చింది కాంగ్రెస్ సర్కార్. దిలావర్ పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఘటన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు కలెక్టర్ అభిలాష అభినవ్. వెంటనే పనులు నిలిపివేయాలని ఆదేశించారు కలెక్టర్ . అయితే కలెక్టర్‌ ఆదేశాలు ఇచ్చినా రైతులు ఆందోళన విరమించడం లేదు. ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని డిమాండ్ చేశారు.

CCTV Footage: వీహెచ్‌ కారును ఢీకొట్టిన కారు...అర్థరాత్రి ఘటన, వైరల్‌గా మారిన సీసీటీవీ ఫుటేజ్

Arun Charagonda

కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు కారును ఢీకొట్టింది కారు. తన ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారును ఢీకొట్టి ధ్వంసం చేసింది మరొక కారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్‌గా మారగా పోలీసులకు ఫిర్యాదు చేశారు వి.హనుమంతరావు.

MLC Kavitha: బీఆర్ఎస్ నేతల అరెస్ట్‌ను ఖండించిన ఎమ్మెల్సీ కవిత, అక్రమ అరెస్ట్‌లతో ప్రజా తిరుగుబాటు అణివేయడం మూర్ఖత్వం అని మండిపాటు

Arun Charagonda

బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్ట్‌ను ఖండించారు ఎమ్మెల్సీ కవిత. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కవిత...చేసిన తప్పులకు ప్రజలు తిరగబడతారనే భయంతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు పుడుతోంది. మాగునూరు జెడ్పీ హైస్కూల్ లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తారని, ప్రజలతో కలిసి ఉద్యమిస్తారనే భయంతో తెల్లవారుజామునే అక్రమ అరెస్టులకు తెరలేపింది కాంగ్రెస్ సర్కార్ అని మండిపడ్డారు.

Warangal: ఉచిత బస్సు ప్రయాణం కోసం చీర కట్టి దివ్యాంగుల నిరసన, వరంగల్‌లో చీరలు కట్టి దివ్యాంగుల ప్రయాణం...వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

చీరలు కట్టుకొని ఆర్టీసీ బస్సు ఎక్కి నిరసన తెలిపారు దివ్యాంగులు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల తమకు కేటాయించిన సీట్లల్లో కూడా మహిళలే కూర్చుంటున్నారని.. తమకు ఉచిత ప్రయాణం కల్పించి, 3 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ చీరలు కట్టుకొని దివ్యాంగులు నిరసన తెలిపారు.

Advertisement
Advertisement