తెలంగాణ
Telangana: సిగరేట్ తాగొద్దన్నందుకు పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య, ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు...కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు
Arun Charagondaసిగరెట్ తాగొద్దన్నందుకు పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో చోటు చేసుకుంది. పదో తరగతి విద్యార్థి(16)ని సిగరెట్ తాగొద్దని తండ్రి మందలించడంతో 6 నెలల క్రితం గడ్డిమందు తాగాడు. చికిత్స అందించడంతో కోలుకోగా, విద్యార్థి ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని ఫ్రెండ్స్, కుటుంబంతో మాట్లాడకుండా ఉండేవాడు.. కాగా నిన్న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Student Suicide: హైదరాబాద్ మియాపూర్ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ విద్యార్థి బలవన్మరణం.. మృతుడి స్వస్థలం ఏపీలోని విజయవాడ
Rudraహైదరాబాద్ లోని మియాపూర్ లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Cyber Nude Call: ఇంజినీరింగ్ విద్యార్థికి యువతి నగ్న వీడియో కాల్.. ఘట్ కేసర్ లో మరో స్కాం.. ఏంటది??
Rudraహైదరాబాద్ లోని ఘట్ కేసర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థికి ఓ అనామక యువతి నగ్న వీడియో కాల్ చేసి.. డబ్బులు వసూలు చేసింది.
Hospital Horror: కంటిలో నలక పడిందని వస్తే, సర్జరీ అన్నారు.. మత్తు ఇంజక్షన్ ఇచ్చి చిన్నారిని పొట్టనబెట్టుకున్నారు.. హైదరాబాద్ లో ప్రైవేటు కంటి దవాఖాన ముందు బంధువుల ఆందోళన (వీడియో)
Rudraహైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో దారుణం జరిగింది. బిడ్డ కంటిలో నలక సమస్యతో హాస్పిటల్ ను ఆశ్రయించిన ఆ తల్లిదండ్రులకు చివరకు కడుపుకోతే మిగిలింది.
Free Bus Service In Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు ఫ్రీ బస్, కార్తీక మాసం సందర్భంగా ప్రారంభించిన అధికారులు
VNSశ్రీశైల మహాక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం శుక్రవారం సాయంత్రం నుంచి ఉచిత బస్సు సౌకర్యం (Free bus) ప్రారంభించింది. వారాంతపు సెలవులతోపాటు పర్వ దినాల్లో అధిక సంఖ్యలో శ్రీశైల క్షేత్రానికి (Free Bus in Srisailam) భక్తులు తరలి వస్తున్నారు.
Sarpanch Dies by Suicide: కొండారెడ్డి పల్లె గ్రామ మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడిన హరీష్ రావు, మీ అన్నదమ్ముళ్లపై చట్టరీత్యా హత్యా నేరం పెట్టాలని డిమాండ్
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలోని కొండారెడ్డి పల్లె గ్రామ మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడడం కలచివేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత గ్రామంలో ఉన్న దారుణ పరిస్థితికి సాయిరెడ్డి ఆత్మహత్య నిదర్శనం అని ఆయన అన్నారు
Harishrao: రోడ్డెక్కిన ప్రజాపాలన దరఖాస్తులు...సైబర్ మోసగాళ్ల చేతికి ఈ వివరాలు చిక్కితే ప్రజల పరిస్థితి ఏంటి?..హరీశ్ రావు ప్రశ్న
Arun Charagondaనాడు నడిరోడ్డు ఎక్కిన ప్రజాపాలన దరఖాస్తులు..నేడు మళ్ళీ నడి రోడ్డుపై ఇంటింటి కుటుంబ సర్వే పత్రాలు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. ప్రజల వివరాల సేకరణ పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదీ మరో నిదర్శనం..రోడ్ల పై తెలంగాణ ప్రజల బతుకు వివరాలను బట్టబయలు చేయడమేనా మీ సర్వే లక్ష్యం? ఏంటన్నారు.
Telangana: వీడియో ఇదిగో, పురాతన శివాలయంలో శివలింగాన్ని ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు, దుండగులను అరెస్ట్ చేయాలని హిందూ సంఘాలు ధర్నా
Hazarath Reddyరంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఉన్న పురాతన శివాలయంలో రాత్రి శివలింగాన్ని తొలగించి గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. శివుని పక్కనే ఉన్న వినాయకుడు విగ్రహాన్ని పక్కనే ఉన్న చెట్ల పొదల్లో పడేశారు. హిందూ సంఘాలు చేరుకొని శివలింగాన్ని ఎత్తుకెళ్లిన దుండగులను గుర్తించి అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేశారు.
Hydra: చెరువులు, నాళాల పునరుద్ధరణపై మేధావులతో హైడ్రా కమిషనర్ సమావేశం, మూడు గంటల పాటు చర్చ, హైడ్రా కూల్చివేతలు ఆగవని స్పష్టం
Arun Charagondaచెరువులు, నాళాల పునరుద్ధరణపై మేధావులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశమయ్యారు. గ్రేటర్ పరిధిలో ఉన్న చెరువులు, నాళాలకు FTL బౌండరీల నిర్ణయం తీసుకున్నారు. రిటైర్డ్ ENC లు, మైనర్ ఇరిగేషన్ సీఈలు , వీసీలు, ప్రొఫెసర్లు, పర్యావరణవేత్తలు, పీసీబీకి చెందిన సీనియర్ అధికారులతో రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా మీటింగ్ జరుగగా మేధావుల సలహలు, సూచనలు తీసుకున్నారు.
KTR: అదానీకి అండగా బడే భాయ్ - చోటే భాయ్...కాంగ్రెస్ పార్టీది గల్లీలో ఒక నీతి…ఢిల్లీలో ఒక నీతా? , రేవంత్ రెడ్డికి దమ్ముంటే లగచర్లకు రావాలని కేటీఆర్ సవాల్
Arun Charagondaఅదానీ బండారం మళ్లీ అంతర్జాతీయంగా బయటపడిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీడియాతో మాట్లాడిన కేటీఆర్ .. ఆఫ్రికా సహా దేశంలో ఆయన వ్యవహారంపై ప్రకంపనలు మొదలయ్యాయి అన్నారు. అదానీ పై కేసు పెట్టాలని, జేపీసీ వేయాలని ఎన్నిసార్లు కోరినప్పటిికీ ప్రధాని మోడీ పట్టించుకోలేదు.. అదానీ కంపెనీలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు రెండుసార్లు బయటపడిందన్నారు.
Siddipet: సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన డీసీఎం...ఆరుగురికి తీవ్ర గాయాలు...బాధితులను ఆస్పత్రికి తరలింపు
Arun Charagondaసిద్దిపేట - పొన్నాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న ఆటోను అతివేగంగా వెనకనుంచి ఢీకొట్టింది డీసీఎం. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు, ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Hyderabad: ఫ్రీ లాంచ్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థ టోకరా..రూ. 150 కోట్లు వసూలు, బాధితులు 600 మందికి పైనే!
Arun Charagondaఫ్రీ లాంచ్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థ టోకరా వేసింది. ఆర్జే గ్రూప్ పేరుతో వినియోగదారులతో డబ్బులు కట్టించుకున్నారు భాస్కర్, సుధారాణి. దాదాపు 600 మంది నుంచి రూ.150 కోట్ల వసూలు చేశారు. డబ్బులు కట్టి నాలుగేళ్లు అయినా ఇంతవరకూ ఫ్లాట్స్ ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని బాధితుల ఆరోపించారు.
Lagacharla Incident: లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పేరు, రూ.10 కోట్లు కేసీఆర్ ఇచ్చారని ప్రభుత్వ తరపు లాయర్ ప్రస్తావన, మాజీ ఎమ్మెల్యే రెచ్చగొట్టే ప్రసంగం చేశారని ఆధారాలు సమర్పణ
Arun Charagondaలగచర్ల ఘటనలో తొలిసారి కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చింది. కోర్టులో కేసీఆర్ పేరు ప్రస్తావించారు ప్రభుత్వ తరపు న్యాయవాది నాగేశ్వరరావు. మాజీ సీఎం కేసీఆర్ రూ.10 కోట్లు ఇచ్చారని తెలిపారు. అలాగే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాల పెన్ డ్రైవ్ ని హైకోర్టుకు అందజేశారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే ఇదంతా చేశారని కోర్టుకు వెల్లడించారు ప్రభుత్వ తరపు న్యాయవాది.
Telangana: ఉరి వేసుకొని 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య, రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం, కేసు నమోదు చేసి పోలీసుల దర్యాప్తు
Arun Charagondaరాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో విషాదం నెలకొంది. 10వ తరగతి విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుద్దాల ప్రభుత్వ పాఠశాలలో 10వ. తరగతి చదువుతున్నారు వెంకటేష్. కొడుకు మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తుండగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Cockroaches In Chutney: బయట టిఫిన్ చేస్తున్నారా?, ఇది చూస్తే ఇకపై జన్మలో బయట టిఫిన్ చేయరు?..ఒక్క చట్నీలోనే ఎన్ని బొద్దింకలో తెలుసా?
Arun Charagondaబయట టిఫిన్ చేస్తున్నా? అయితే ఇది మీ కోసమే. హైదరాబాద్ - కేపీహెచ్బీలోని నెక్సస్ మాల్ వద్ద ఉన్న మధురం టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తున్న వారు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఒకేసారి చాలా మందికి చట్నీలో బొద్దింకలు వచ్చాయి. బొద్దింకలతో ఉన్న ఆహారాన్ని సగం తిన్నాక అవి బయటపడటంతో టిఫిన్ సెంటర్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
KCR: దటీజ్ కేసీఆర్, కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్కు బ్రేక్...గులాబీ బాస్ వ్యూహంతో వెనక్కి తగ్గిన సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్తో టచ్లోకి పార్టీ మారిన ఎమ్మెల్యేలు!
Arun Charagondaఓ వైపు ఓటమి మరోవైపు నేతల పార్టీ జంప్ దీనికి తోడు ఎమ్మెల్యేల ఫిరాయింపులు వెరసీ గులాబీ బాస్ కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతలు పూర్తిగా డిఫెన్స్లో పడ్డారు. దీంతో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడం బీఆర్ఎస్ నేతలకు కీలకంగా మారింది. ఇక ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్న ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితి కేసీఆర్ది. ఈ నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ ఉంటుందా? ఉండదా అనే సందేహం కూడా అందరిలో నెలకొంది. కానీ ఈ పరిస్థితుల్లో కేసీఆర్ వేసిన త్రిముఖ వ్యూహం ఫలించింది. సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్కు బ్రేక్ పడింది.
Hyderabad Police: సోషల్ మీడియా పోస్టులపై హైదరాబాద్ పోలీసుల ఫోకస్, సైబర్ పెట్రోలింగ్ ద్వారా నిఘా..అసభ్య పోస్టులు పెడితే ఇకపై కఠిన చర్యలే
Arun Charagondaసోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు. అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్టులు పెట్టే వారిపై చర్యలకు సిద్ధమయ్యారు. సైబర్ పెట్రోలింగ్ ద్వారా సోషల్ మీడియాలో పోస్టులపై నిఘా పెట్టామని, ఇలాంటి పోస్టులు పెట్టి కేసులు ఎదుర్కొంటున్న వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, సాధారణ ఉద్యోగులు మరియు చిరు వ్యాపారులు ఉన్నారు.
Complaint Against Ram Charan: అయ్యప్ప మాల ధరించి కడప దర్గాకు వెళ్లిన రామ్ చరణ్.. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఎయిర్ పోర్టు పీఎస్ లో అయ్యప్ప స్వాముల ఫిర్యాదు
Rudraటాలీవుడ్ స్టార్ నటుడు రామ్ చరణ్ పై అయ్యప్ప స్వాములు ఫిర్యాదు చేశారు. అయ్యప్ప దీక్షలో ఉండి చరణ్ కడప దర్గాను దర్శించడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
Theft in Yellamma Temple: మేడ్చల్ జిల్లా పోచారం ఐటి కారిడార్ సమీపంలోని ఎల్లమ్మ ఆలయంలో చోరీ.. గుడిలో అమ్మవారినీ ఎత్తుకెళ్ళిన దుండగులు (వీడియో)
Rudraమేడ్చల్ జిల్లా పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫకిరిటెక్యా తండాలోని ఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగింది. గర్భగుడిలో ఉన్న అమ్మవారి విగ్రహంతోపాటు అమ్మవారికి అలంకరించిన ఐదు గ్రాముల బంగారు పుస్తెలు, 5 తులాల వెండి కళ్లను దుండగులు దొంగిలించారు.
Telangana BC Commission: పిచ్చకుంట్ల అనే పదం వాడితే క్రిమినల్ కేసు..బీసీ కమిషన్ సంచలన నిర్ణయం, త్వరలో ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వస్తాయని నిరంజన్ వెల్లడి
Arun Charagondaఇకపై పిచ్చకుంట్ల అనే పదం వాడితే క్రిమినల్ కేసు నమోదుకానుంది. రాజకీయ నాయకులు గానీ, ఇతర కులాలు ఎవరైనా పిచ్చకుంట్ల అనే పదం వాడితే వారిపై క్రిమినల్ కేసులు పెడతాం అన్నారు బీసీ కమిషన్ ఛైర్మన్ గోపిశెట్టి నిరంజన్.