తెలంగాణ

Maoists Killed Two Men: ములుగు జిల్లా వాజేడులో మావోయిస్టుల దుశ్చర్య.. ఇన్‌ ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య.. మృతుల్లో పంచాయతీ కార్యదర్శి కూడా

Rudra

ములుగు జిల్లా వాజేడులో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసు ఇన్‌ ఫార్మర్లనే నెపంతో ఇద్దరిని కత్తులతో పొడిచి హత్య చేశారు.

Accident at Kondagattu: కొండగట్టులో రెండు లారీలు ఢీ.. ముగ్గురికి గాయాలు.. డ్రైవర్లు నిద్రమత్తులో ఉండటమే కారణం (వీడియో)

Rudra

కరీంనగర్-జగిత్యాల రహదారి కొండగట్టు వద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు లారీల ముందు భాగం నుజ్జు నుజ్జు కాగా అందులో రాజస్థాన్ నుండి టైల్స్ లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్ దేవిలాల్ లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు.

Hanuman Idol Set on Fire: భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలో ఘోర అపచారం.. మంటల్లో హనుమాన్ విగ్రహం.. విగ్రహం దగ్ధమవ్వడం ఊరికి అరిష్టమంటున్న గ్రామస్తులు (వీడియో)

Rudra

తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలపై దాడులు నిత్యకృత్యంగా మారడం కలకలం రేపుతున్నది. ముఖ్యంగా తెలంగాణలో ఈ తరహా ఘటనలు ఎక్కువయ్యాయి. తాజాగా భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలోని అమరేశ్వర ఆలయంలో ఘోరమైన అపచారం జరిగింది.

America Tragedy: గన్ మిస్‌ ఫైర్‌.. అమెరికాలో హైదరాబాద్ యువ‌కుడి మృతి.. బ‌ర్త్‌ డే రోజే విషాదం.. మృతుడు ఉప్ప‌ల్ వాసి ఆర్య‌న్ రెడ్డిగా గుర్తింపు

Rudra

పుట్టినరోజే ఆ యువకుడి జీవితంలో చివరి రోజుగా మారింది. అమెరికాలో తెలుగు యువ‌కుడు ప్రమాదవశాత్తూ మృతి చెందిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, వేరే మహిళతో ఆ పనిలో ఉంటూ భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన నల్గొండ విద్యా అధికారి, పోలీసులకు ఫిర్యాదు

Hazarath Reddy

నల్లగొండ జిల్లా విద్యాధికారి(DEO) భిక్షపతి భార్య ఉండగానే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చంది. అతను మరో మహిళతో ఉండగా భార్య తన కుటుంబ సభ్యులతో వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. భిక్షపతిని నిలదీయగా ఆమెను ఇంటి నుంచి బయటకు పోమ్మంటూ బెదిరించాడు.

Posani Krishna Murali: వీడియో ఇదిగో, తెలంగాణ తెచ్చాడని కేసీఆర్‌కు ఓటేసా, తర్వాత విమర్శించినా ఏనాడు నా మీద కేసులు పెట్టలేదని తెలిపిన పోసాని

Hazarath Reddy

పోసాని కృష్ణ మురళి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లుగా ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇక మీదట నుంచి తాను రాజకీయాల గురించి మాట్లాడనని, ఏ పార్టీని పొగడను ఏ పార్టీ గురించి మాట్లాడను, మరే పార్టీని విమర్శించను అంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు.

Telangana: చార్జింగ్ పెడుతుండగా పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్..జగిత్యాలలో ఘటన, స్కూటర్ తో పాటు డబ్బు బూడిద పాలు

Arun Charagonda

చార్జింగ్ పెడుతుండగా ఎలక్ట్రిక్ స్కూటర్ పేలింది. జగిత్యాల జిల్లా బాలపెల్లి గ్రామంలో ఈ ఘటన జరుగగా 40 రోజుల క్రితం ఓ ప్రముఖ టూవీలర్ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నారు తిరుపతి రెడ్డి. ప్రమాద సమయంలో స్కూటర్ డిక్కిలో రూ.1.90 లక్షలు ఉన్నాయని...స్కూటర్, డబ్బు కాలి బుడిద కావడంతో లబోదిబోమంటున్నాడు బాధితుడు తిరుపతి రెడ్డి.

Rahul Gandhi: అదాని ఇష్యూలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్న అరెస్ట్ చేయాల్సిందే, ఎవరిని వదిలిపెట్టొదన్న ఎంపీ రాహుల్ గాంధీ..అదాని వెనుక ఉంది మోడీనే అని కామెంట్

Arun Charagonda

అమెరికాలోనూ అదానీ అక్రమాలకు పాల్పడ్డారు అని మండిపడ్డారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. అదాని వెనుక ఎవరు ఉన్న అరెస్ట్ చేయాల్సిందే అన్నారు . ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఆదాని దగ్గర డబ్బులు తీసుకున్న రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా అరెస్ట్ చేయాల్సిందేనన్నారు రాహుల్ గాంధీ.

Advertisement

KTR On Adani Issue: అదానితో కాంగ్రెస్ - బీజేపీ అనుబంధం.. దేశానికి అవమానం, తెలంగాణలో అదాని పెట్టుబడుల వెనుక కాంగ్రెస్ వాట ఎంతో బయట పెట్టాలని కేటీఆర్ డిమాండ్

Arun Charagonda

అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నేరాభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్‌ని టార్గెట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అదాని కంపెనీ - తెలంగాణ ప్రభుత్వం మధ్య ఉన్న చీకటి ఒప్పందాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

Man Performs CPR on Monkey: వీడియో ఇదిగో, చనిపోయిందనుకున్న కోతికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన యువకుడు, మహబూబాబాద్ జిల్లాలో ఘటన

Hazarath Reddy

ఒక వానరం విద్యుత్ షాక్‌ గురై అక్కడే పడిపోయింది. అయితే ఆ కోతి చనిపోయింది అనుకుని అంతా వదిలేశారు.నాగరాజు అనే యువకుడు దానికి సిపిఆర్ చేశాడు. కొంత సేపటి తర్వాత చనిపోయిందనుకున్న వానరం ఒక్కసారిగా లేచి చెంగుచెంగున ఎగిరింది.

Hyderabad Accident: ఇంత దారుణమా, ప్రాణం పోతోంది రక్షించమని వేడుకున్నా సాయం చేయని జనం, ఫోటోలు తీసుకుంటూ కాలక్షేపం

Hazarath Reddy

రక్తం మడుగులో ఉన్న ఎలందర్ నొప్పితో అల్లాడుతూ తనను కాపాడమని వేడుకున్నాడు అక్కడ ఉన్న జనం ఫోటోలు, వీడియోలు తీస్తూ 108 వెహికల్ వచ్చే వరకు గడిపారు. 108 వచ్చి ఆసుపత్రికి తరలించే లోపు ఎలందర్ మృతి చెందాడు.మృతునికి ఇద్దరు చిన్నపిల్లలు, భార్య ఉన్నారు.

Telangana: హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాల్సిందే, అయ్యప్ప మాల తొలగించాలని డిమాండ్ చేసిన రంగారెడ్డి జిల్లా లాయర్లు, మాలలో దర్గా దర్శనం తప్పేనని కామెంట్

Arun Charagonda

సినీ హీరో రామ్ చరణ్ పవిత్రమైన అయ్యప్ప మాలలో కడపలోని అమీన్పూర్ దర్గాను సందర్శించడానికి యావత్ హిందూ సమాజము,యావత్ అయ్యప్ప భక్తులు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు రంగారెడ్డి జిల్లా లాయర్లు. వెంటనే రామ్‌చరణ్ అయ్యప్ప మాల తొలగించి ఆ స్వామి వారిని క్షమాపణ కోరి యావత్ అయ్యప్ప భక్తులకు యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

Mahabubabad: శభాష్ పోలీస్..ఉరి వేసుకున్న మహిళకు సీపీఆర్...మహిళ ప్రాణం కాపాడిన కానిస్టేబుల్....వీడియో ఇదిగో

Arun Charagonda

ఉరి వేసుకున్న మహిళకు సీపీఆర్ చేసి ప్రాణం కాపాడారు ఓ కానిస్టేబుల్. మహబూబాబాద్‌కి చెందిన ఓ మహిళ కుటుంబ కలహాలతో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్ రాంబాబు CPR చేసి మహిళ ప్రాణాలను కాపాడారు.

Software Engineer Suicide: హైదరాబాద్ మాదాపూర్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య, మైండ్ స్పేస్ 13వ అంతస్తు పైనుంచి దూకేసిన నవీన్ రెడ్డి..పోలీసుల విచారణ

Arun Charagonda

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాదాపూర్‌లో నవీన్ రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మైండ్ స్పేస్ 13వ అంతస్తు పైనుంచి దూకేశాడు. ఈ క్రమంలో అతడు అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

President Draupadi Murmu: హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్‌ హెల్ప్‌లైన్‌ కోసం టోల్ ఫ్రీ నెంబర్...!

Arun Charagonda

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు రాష్ట్రపతి చేరుకోనున్నారు. 6.20 నుంచి 7.10 వరకు రాజ్‌భవన్‌లో విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం రాత్రి 7.20కి ఎన్టీఆర్‌ స్టేడియంలో భక్తి టీవీ కోటి దీపోత్సవంలో పాల్గొననున్నారు ముర్ము.

CM Revanth Reddy: మాగనూరు స్కూల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశం..ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులపై ఫైర్

Arun Charagonda

నారాయణపేట జిల్లాలోని మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థినీ విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులెవరైనా సరే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ ను సీఎం ఆదేశించారు.

Advertisement

Hyderabad: గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన నాలుగంతస్తుల భవనం కూల్చివేత వీడియో ఇదిగో, హైడ్రాలిక్ యంత్రం సాయంతో కూల్చివేస్తున్న అధికారులు

Hazarath Reddy

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన నాలుగంతస్థుల భవనం కూల్చివేత పనులను అధికారులు చేపట్టరు. ఇక్కడి సిద్ధిఖి నగర్‌లో కొద్దిపాటి స్థలంలో నిర్మించిన నాలుగంతస్థుల కొత్త భవనం నిన్న పక్కకు ఒరిగిన సంగతి విదితమే. పక్కన మరో భవనం నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో దీనిపై ఆ ప్రభావం పడిందని అంటున్నారు.

Telangana Weather Update: రాబోయే వారం రోజులు జాగ్ర‌త్త‌, తెలంగాణ‌లో 15 డిగ్రీల‌కు ప‌డిపోనున్న ఉష్ణోగ్ర‌త‌లు, ఆ వ్యాధి ప్ర‌బలే అవకాశం

VNS

తెలంగాణలో రానున్న వారం రోజులు 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు (Lowest Temperatures) నమోదుకానున్నాయని వాతావరణశాఖ హెచ్చరించడంతో ఆరోగ్యశాఖ పలు సూచనలు చేసింది. శీతల సమయాల్లోనే ఇన్‌ఫ్లూయెంజా (Influenza) పంజా విసిరే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలుగా పేర్కొంది.

Harish Rao Serious On Government: గురుకులాలా లేక నరక కూపాలా? రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ పాల‌న‌పై మాజీ మంత్రి హ‌రీష్ రావు తీవ్ర ఆగ్ర‌హం

VNS

ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ పట్ల మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాలా లేక నరక కూపాలా అని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విష వలయాలా అని ప్రశ్నించారు. వాంకిడి గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్‌తో అనారోగ్యం పాలై ఓ విద్యార్థిని 20 రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై కొట్టుమిట్టాడుతున్నదని హరీశ్‌రావు తెలిపారు.

Praja Vijayotsava Sabha: కేసీఆర్‌..ఒక్కసారి అసెంబ్లీకి రా, అన్నీ లెక్కలు తేలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు, బీఆర్‌ఆఎస్ నేతలకు మైండ్‌ దొబ్బిందని విమర్శ

Hazarath Reddy

వేములవాడలో కాంగ్రెస్‌ ప్రజా విజయోత్సవ సభ జరిగింది. ఈ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఓడించినా మార్పు రాలేదని అని అన్నారు.బీఆర్‌ఆఎస్ నేతలకు మైండ్‌ దొబ్బింది అని మండిపడ్డారు.

Advertisement
Advertisement