Technology
IMEI Fraud: ఒకే IMEI నంబరుతో 13 వేల ఫోన్లు, ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ న్యూస్ వెలుగులోకి, మొబైల్ ఫోన్ తయారీ సంస్థపై కేసు నమోదు చేసిన మీరట్ పోలీసులు
Hazarath Reddyదొంగిలించబడిన మొబైల్ ఫోన్‌లను (mobile phones) గుర్తించడం చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే దొంగిలించిన ఫోన్ IMEIను మార్చివేసి చాలామంది ఫోన్లను అమ్మేస్తుంటారు. అయితే ఓ IMEI నంబరును 13000 ఫోన్లకు ఎక్కించడం నిజంగా షాకింగ్ కలిగించే అంశమే.. వివరాల్లోకెళితే.. ఉత్తర ప్రదేశ్ పోలీసులు భారతదేశంలో 13,000 కంటే ఎక్కువ హ్యాండ్‌సెట్‌లు ఒకే ప్రత్యేకమైన IMEI (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ) పై నడుస్తున్నట్లు కనుగొన్నారు.
Airtel on Amazon Deal Report: అమెజాన్ పెట్టుబడులు ఒట్టి పుకారు, ఇలాంటి వార్తలు అనవసర పరిణామాలకు దారి తీస్తాయని తెలిపిన భారతీ ఎయిర్‌టెల్‌
Hazarath Reddyదేశీయ టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌లో (Bharti Airtel) దాదాపు 2 బిలియన్‌ డాలర్ల (రూ.15 వేల కోట్ల) విలువైన వాటాను కొనుగోలుచేసేందుకు ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) చర్చలు జరుపుతున్నట్టు వస్తున్న వార్తలపై భారతి ఎయిర్‌టెల్‌ స్పందించింది. ఎయిర్‌టెల్‌ ఈ రూమర్లను (Airtel on Amazon deal report) కొట్టి పారేసింది. ఇటువంటి ఊహాగానాలు అనవసరమైన పరిణామాలకు దారి తీస్తాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యమైన అంశాలపై కంపెనీల స్పష్టమైన వివరణ లేకుండానే ఇలాంటి నివేదికలు వెలువడటం విచారకరమని వ్యాఖ్యానించింది.
Jio Investments: జియోలోకి భారీగా పెట్టుబడులు, నెరవేరుతున్న ముకేష్ అంబానీ లక్ష్యం, 1.85 శాతం వాటాను కొనుగోలు చేసిన ముబదాలా ఇన్వెస్ట్‌మెంట్
Hazarath Reddyజియో ప్లాట్‌ఫామ్‌లలో 1.85 శాతం వాటాను 9,093.60 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు అబుదాబికి చెందిన ముబదాలా ఇన్వెస్ట్‌మెంట్ (Mubadala Investment) కంపెనీ శుక్రవారం ప్రకటించింది. గత రెండు నెలల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో ప్లాట్‌ఫామ్‌లలో ఇది ఆరో పెద్ద పెట్టుబడిగా (Jio Investments) మారింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ (Lockdown) మధ్యలో, జియో ఆరు అంతర్జాతీయ సంస్థల నుండి పెట్టుబడులను కూడా చూసింది.
ZOOM Cloud Meetings: జూమ్ కొత్త వెర్షన్ వాడాలంటే డబ్బులు చెల్లించాలి, ఎఫ్‌‌బీఐ అధికారులతో పనిచేయనున్న జూమ్ సంస్థ, జూమ్‌ సీఈఓ ఎరిక్‌ యాన్‌ వెల్లడి
Hazarath Reddyప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో అందరూ ఇళ్లకు పరిమతమయ్యారు. ఈ నేపథ్యంలోనే వీడియో కాలింగ్ యాప్ లకు బాగా డిమాండ్ పెరిగింది. అత్యాధునిక వీడియో సెషన్స్‌కు పేరొందిన అమెరికాకు చెందిన జూమ్‌ యాప్‌ (ZOOM Cloud Meetings) లాక్‌డౌన్‌ కారణంగా గత రెండు నెలలుగా అధిక లాభాలను అర్జించినట్లు జూమ్‌ (ZOOM) సంస్థ తెలిపింది. అయితే టెక్నాలజీ, భద్రతకు ప్రాధాన్యతమిస్తు కొత్త అప్‌గ్రేడ్‌ వర్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేశామని అయితే ఈ వెర్షన్‌ను ఫ్రీగా అందించడంలేదని, రీచార్జ్‌ చేసుకోవాలని జూమ్‌ సీఈఓ ఎరిక్‌ యాన్‌ తెలిపారు.
Jio New Offer: జియో తాజా ఆఫర్, రూ. 249 లేదా అంతకంటే ఎక్కువ రీచార్జ్ చేసుకునే వారికి నాలుగు డిస్కౌంట్ కూపన్లు, జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు అందుబాటులో ఆఫర్
Hazarath Reddyప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) తన వినియోగదారులకు కొత్త ఆఫర్ ను ( Jio New offfer) ప్రకటించింది. రూ. 249 లేదా అంతకంటే ఎక్కువ రీచార్జ్ చేసుకునే వారికి ఒకే విలువ గల నాలుగు డిస్కౌంట్ కూపన్లను ఇస్తున్నట్టు తెలిపింది. రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ ట్రెండ్స్ ఫుట్ వేర్, ఎజియోలలో ఈ కూపన్ల ద్వారా డిస్కౌంట్ పొందవచ్చని తెలిపింది.
Cyclone Nisarga: ముంబైకి మరో పెను ముప్పు, కరోనా వేళ విరుచుకుపడనున్న నిసర్గ తుఫాన్, మొత్తం నాలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్, మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేసిన ఐఎండీ
Hazarath Reddyభారత ఆర్ధిక రాజధాని ముంబైపై (Mumbai) అల్పపీడనం తీవ్ర ప్రభావం (Cyclone Nisarga) చూపనుందని భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతూ తుపాన్‌గా మారనుందని తెలిపింది. ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్‌ మీదుగా అల్పపీడనం జూన్‌ 3న తీరం తాటుతుందని పేర్కొంది. కాగా, తుపాన్‌ మహారాష్ట్రను దాటే క్రమంలో ముంబై నగరంపై ఈ తుఫాను తీవ్ర ప్రభావం చూపనుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మోహపాత్రా పేర్కొన్నారు. సోమవారం ఉదయం అల్పపీడనం ఉధృతంగా మారినట్లు తెలిపారు.
Earth's Magnetic Field Weakening: మొబైల్‌ ఫోన్లు,శాటిలైట్‌లు ఆగిపోవచ్చు, అయస్కాంత క్షేత్రాల బలహీనతే ప్రధాన కారణం, హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు
Hazarath Reddyత్వరలో భూమి చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రం బలహీనపడుతుందని (Earth's Magnetic Field Weakening) శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తద్వారా మొబైల్‌ ఫోన్‌లు (mobile phones), శాటిలైట్‌లు ( spacecraft) ఆగిపోవచ్చని శాస్త్రవేత్తలు (Scientists) అంచనా వేస్తున్నారు. భూమి చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రం సూర్యుడి నుంచి వచ్చే భయంకరమైన అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడటమే కాకుండా మన మొబైల్‌ సిగ్నల్‌, శాటిలైట్‌ సిగ్నల్స్‌ అందించడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తోందనే విషయం విదితమే.
Amazon India Jobs: నిరుద్యోగులకు శుభవార్త, అమెజాన్‌లో 50 వేల ఉద్యోగాలు, స్వతంత్ర కాంట్రాక్టర్లు,పార్ట్‌టైమ్ ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసిన అమెజాన్ ఇండియా
Hazarath Reddyకోవిడ్‌-19 సంక్షోభం, లాక్‌డౌన్‌ COVID-19 Lockdown) ఆంక్షల్లో చిక్కుకుని దిగ్గజాలనుంచి స్టార్టప్‌ కంపెనీల దాకా అందరూ ఉద్యోగులను తొలగించుకుంటూ పోతున్న విషయం విదితమే. అలాగే వేతనా కోత కూడా విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెజాన్ నిరుద్యోగులకు శుభవార్తను చెప్పింది. తమకు 50 వేల సిబ్బంది అవసరం (Amazon India Jobs) పడుతుందని అమెజాన్ ఇండియా (Amazon India) శుక్రవారం ప్రకటించింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా 50వేల మందిని నియమించుకోనున్నామని తెలిపింది.
WhatsApp Status video: వాట్స్‌యాప్ స్టేట‌స్ వీడియో ఇప్పుడు 30 సెకండ్లు, పాత స్టేటస్ టైమింగ్‌ని రీస్టోర్ చేస్తున్నట్లు ప్రకటించిన వాట్స్‌యాప్
Hazarath Reddyక‌రోనా (coronavirus )స‌మ‌యంలో వాట్స్‌యాప్ (WhatsApp) ద్వారా అనేక త‌ప్పుడు వార్త‌లు షేర్ అవుతున్న నేప‌థ్యంలో ప్రముఖ సోషల్‌మీడియా మేస్సేజింగ్‌‌ యాప్‌ సంస్థ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. యూజర్లు తమ స్టేటస్‌లో పెట్టుకొనే వీడియోలు 15 సెకండ్లకు మించి నిడివి లేకుండా సెట్టింగ్స్ చేసింది. తాజాగా మ‌ళ్ళీ స్టేట‌స్ వీడియో (WhatsApp Status video) నిడివిని 30 సెకండ్లుగా ఫిక్స్ చేసింది. దీంతో యూజ‌ర్స్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. వాట్స్‌యాప్ మొదలైనప్పడు స్టేటస్‌ వీడియోల నిడివి 90 సెకండ్లు ఉండేది. యూజర్లు పెరుగుతున్న కొద్ది నిడివిని తగ్గిస్తూ వస్తున్నది. భారత్‌లో వాట్స్‌యాప్ యూజర్లు 40కోట్ల మంది ఉన్నారు.
Satya Nadella: వర్క్ ఫ్రం హోం చాలా డేంజర్, మానసిక ఆరోగ్యంపై పెను ప్రభావం చూపించే అవకాశం, కీలక వ్యాఖ్యలు చేసిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదేళ్ల
Hazarath Reddyదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో అందరూ ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. అన్ని కంపెనీలు ఉద్యోగులను మూడు నెలల నుంచి ఇంటి నుంచే పని (work from home) చేయమని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదేళ్ల (Microsoft CEO Satya Nadella) కీలక వ్యాఖ్యలు చేశారు. శాశ్వతంగా ఉద్యోగుల చేత వర్క్ ఫ్రం హోం చేయించడం(ఇంటి నుంచే ఆఫీసు పని చేయడం) వారి మానసిక ఆరోగ్యంపై పెను ప్రభావం చూపించే అవకాశం (damaging for workers) ఉందని, వారి సామాజిక బంధాలు దెబ్బతినొచ్చని అభ్రిప్రాయపడ్డారు.
Reliance Jio New Plan: రోజుకు 3 జీబీ హైస్పీడ్ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ, రూ.999 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను లాంచ్ చేసిన రిలయన్స్ జియో
Hazarath Reddyరిలయన్స్‌ జియో తన వినియోగదారులకు మరొక గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కరోనా వైరస్‌, లాక్‌డౌన్ కారణంగా అందరూ ఇంటి దగ్గర నుంచే పని చేస్తున్న కారణంగా డేటాను ఎక్కువగా ఉపయోగించే వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్‌ను (Reliance Jio New Plan) తీసుకువచ్చింది. రూ.999 తో రీఛార్జ్ (Rs. 999 Prepaid Plan) చేసుకోవడం ద్వారా రోజుకు 3 జీబీ హైస్పీడ్ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వాలిడిటీ 84 రోజులుగా ఉంది. 84 రోజుల ( 84 Days) వ్యవధిలో యూజర్లు మొత్తం 252 జీబీని వాడుకోవచ్చు.
Reliance Jio-Vista Deal: విదేశీ పెట్టుబడుల్లో జియో హ్యాట్రిక్ డీల్, విస్టా ఈక్వెటీ కంపెనీకి 2.3 శాతం వాటాను అమ్మేసిన ముఖేష్ అంబానీ, డీల్ విలువ సుమారు రూ. 11,367 కోట్లు
Hazarath Reddyరిలయన్స్ జియో (Reliance Jio) విదేశీ పెట్టుబడులతో దూసుకుపోతోంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్, ప్రైవేటు ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ ఒప్పందాలతో జోరుమీదున్న జియో తాజాగా అమెరికాకు చెందిన విస్టా ఈక్విటీ పార్టనర్స్‌ (Vista Equity Partners) కంపెనీతో మరో మెగా ఒప్పందానికి (Reliance Jio-Vista Deal) సన్నద్ధమైంది. కంపెనీకి ఇది విదేశీ పెట్టుబడుల్లో హ్యాట్రిక్ డీల్ అని చెప్పవచ్చు. రియ‌ల‌న్స్ ఇండ‌స్ట్రీస్‌కు చెందిన రిల‌య‌న్స్ జియోలో 2.3 శాతం వాటా షేర్లను అమెరికాకు చెందిన విస్టా ఈక్వెటీ కంపెనీ కొన్న‌ది. దీని ద్వారా విస్టా కంపెనీ జియోలో సుమారు 11,367 కోట్ల పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ది.
Google Doodle Games: జనాదరణ పొందిన Google డూడుల్ గేమ్‌లు 10, ఈ రోజు గూగుల్ డూడుల్ గేమ్ ప్యాక్-మ్యాన్, ఈ గేమ్ గురించి ఓ సారి తెలుసుకుందాం
Hazarath Reddyగతంలో జనాదరణ పొందిన Google డూడుల్‌లతో ఆడుతూ ఉండండి. ప్యాక్-మ్యాన్ (2010) గేమ్‌ను ఈ రోజు డూడుల్‌ కింద గూగుల్ అందించింది. కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 17 వరకు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్ డూడుల్ (Google Doodle) ద్వారా ఇలాంటి ప్రత్యేక గేమ్ లను (Google Doodle Games) యూజర్లకు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
Google Doodle Games: జనాదరణ పొందిన Google డూడుల్ గేమ్‌లు 8, నేటి గూగుల్ డూడుల్ గేమ్ హాలోవీన్ 2016, ఈ గేమ్ గురించి ఓ సారి తెలుసుకుందాం
Hazarath Reddyగతంలో జనాదరణ పొందిన Google డూడుల్‌లతో ఆడుతూ కాలక్షేపం చేయండి. హాలోవీన్ (2016) గేమ్‌ను ఈ రోజు డూడుల్‌ కింద గూగుల్ అందించింది. ఈ రోజు గూగుల్ డూడుల్ గేమ్ హాలోవీన్ (Halloween 2016), 2016లో వచ్చిన గేమ్ గురించి ఓ సారి తెలుసుకోండి. ఇప్పటిదాకా 8 గేమ్ లు వచ్చాయి. అవి వరసగా కోడింగ్, క్రికెట్, ఫిషింగర్, రాక్‌మోర్, గార్డెన్ గ్నోమ్స్, స్కోవిల్ లొటరియా, తాజాగా హాలోవీన్ . ఈ రోజు వచ్చిన హాలోవీన్ (Halloween) గేమ్ చరిత్ర గురించి ఓ సారి తెలుసుకుందాం.
Google Doodles: జనాదరణ పొందిన Google డూడుల్ గేమ్‌లు 7, ఈ రోజు గూగుల్ డూడుల్ గేమ్ లొతరియా, ఈ గేమ్ గురించి ఓ సారి తెలుసుకుందాం
Hazarath Reddyగూగుల్ డూడుల్‌తో నేటి ఆట లోటెరియా, ఇది మెక్సికన్ కార్డ్ గేమ్ (Mexican card game), ఇది 2019 లో ప్రవేశపెట్టబడింది. వినియోగదారులు క్లాసిక్ లోటెరియా ఆటను స్నేహితులతో ప్రైవేట్ మ్యాచ్‌లో ఆడవచ్చు లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులతో యాదృచ్ఛికంగా మ్యాచ్ చేయవచ్చు.గూగుల్ డూడుల్ (Google Doodles Lotería) లోటెరియా ఆటను అతిథి కళాకారులు, మెక్సికోకు చెందిన చాబాస్కి, మెక్సికోలో జన్మించిన సిసిలియా, హెర్మోసిల్లో జన్మించిన లూయిస్ పింటో, లాస్ ఏంజిల్స్‌కు చెందిన లోరిస్ లోరా మరియు మెక్సికో నగరానికి చెందిన వాల్స్ చిత్రీకరించారు.
Jio-Silver Lake Deal: జియో మరో భారీ డీల్, రిలయన్స్ జియో ఫ్లాట్‌ఫాంపై సిల్వర్ లేక్ రూ. 5,656 కోట్ల పెట్టుబడులు, డిజిటల్ ఇండియా సాధనలో కీలక పరిణామం అన్న ముఖేష్ అంబానీ
Hazarath Reddyరిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) కు చెందిన రిలయన్స్ జియో మరో భారీ డీల్ సాదించింది. ప్ర‌ఖ్యాత టెక్ కంపెనీ సిల్వ‌ర్ లేక్‌ (Silver Lake) రిల‌య‌న్స్ జియోలో భారీ పెట్టుబ‌డులు పెట్టింది. ఆ సంస్థ సుమారు రూ. 5,656 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీక‌రించింది. రిల‌య‌న్స్‌లో 1.15 శాతం షేర్ల‌ను సిల్వ‌ర్ లేక్ కొనుగోలు చేయ‌నున్న‌ది. ఇటీవ‌లే ఫేస్‌బుక్ కూడా సుమారు 5.7 బిలియ‌న్ల డాల‌ర్లు పెట్టి జియోలో 9.99 వాటాను కొనుగోలు చేసిన విష‌యం తెలిసిందే.
Google Doodle: జనాదరణ పొందిన Google డూడుల్ గేమ్‌లు 6, ఈ రోజు గూగుల్ డూడుల్ గేమ్ స్కోవిల్, 2016లో వచ్చిన గేమ్ గురించి ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyగతంలో జనాదరణ పొందిన Google డూడుల్‌లతో ఆడుతూ ఉండండి. స్కోవిల్ (2016) గేమ్‌ను ఈ రోజు డూడుల్‌ కింద గూగుల్ అందించింది. కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకు కొనసాగుతోంది. ఇది ఇంకా పొడిగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గూగుల్ డూడుల్ (Google Doodle) ద్వారా ఇలాంటి ప్రత్యేక గేమ్ లను (Google Doodle Games) అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో వచ్చిన గేమ్ లన్నింటినీ మళ్లీ గూగుల్ డూడుల్ ద్వారా పరిచయం చేస్తోంది. ఇప్పటిదాకా 6 గేమ్ లు వచ్చాయి. అవి వరసగా కోడింగ్, క్రికెట్, ఫిషింగర్, రాక్‌మోర్, గార్డెన్ గ్నోమ్స్, తాజాగా స్కోవిల్. ఈ రోజు వచ్చిన స్కోవిల్ (Wilbur Scoville) గేమ్ చరిత్ర గురించి ఓ సారి తెలుసుకుందాం.
Google Doodle Games: జనాదరణ పొందిన Google డూడుల్ గేమ్‌లు 4, ఈ రోజు గూగుల్ డూడుల్‌లో రాక్‌మోర్ గేమ్, ఈ ఆటతో ఇంట్లోనే ఉంటూ సంతోషంగా గడిపేయండి
Hazarath Reddyగతంలో జనాదరణ పొందిన Google డూడుల్‌లతో ఆడుతూ ఉండండి. రాక్‌మోర్ (2016) గేమ్‌ను ఈ రోజు డూడుల్‌ కింద గూగుల్ అందించింది. కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకు కొనసాగుతోంది. ఇది ఇంకా పొడిగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గూగుల్ డూడుల్ (Google Doodle) ద్వారా ఇలాంటి ప్రత్యేక గేమ్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో వచ్చిన గేమ్ లన్నింటినీ మళ్లీ గూగుల్ డూడుల్ ద్వారా పరిచయం చేస్తోంది. ఈ రోజు వచ్చిన రాక్‌మోర్ (Clara Rockmore) గేమ్ చరిత్ర గురించి ఓ సారి తెలుసుకుందాం.
Aarogya Setu App: ఆరోగ్య సేతు యాప్ ఉంటేనే ఆఫీసుకు రండి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం, అందులో రిస్క్ చూపెడితే ఆఫీసుకు రావొద్దని హెచ్చరికలు
Hazarath Reddyకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ముందుగా 'ఆరోగ్య సేతు' యాప్‌లో (Aarogya Setu App) వారి ఆరోగ్య స్థితిని సమీక్షించాలని, ఆ తర్వాతే కార్యాలయానికి బయలుదేరాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం (Govt Tells Central Govt Employees) ఆదేశించింది. భారతదేశంలో పెరుగుతున్న COVID-19 కేసుల మధ్య, ప్రభుత్వం తమ మొబైల్ ఫోన్లలో 'ఆరోగ్యా సేతు' యాప్‌ను వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాలని తన అధికారులు, సిబ్బంది (అవుట్‌సోర్స్ సిబ్బందితో సహా) అందరినీ కోరింది.
Google Doodle Games: జనాదరణ పొందిన Google డూడుల్ గేమ్‌లు 3, ఈ రోజు గూగుల్ డూడుల్‌లో ఫిషింగర్ గేమ్, ఈ ఆటతో ఇంట్లోనే ఉంటూ సంతోషంగా గడిపేయండి
Hazarath Reddyగతంలో జనాదరణ పొందిన Google డూడుల్‌లతో ఆడుతూ ఉండండి. ఫిషింగర్ (2017) గేమ్‌ను ఈ రోజు డూడుల్‌ కింద గూగుల్ అందించింది. కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకు కొనసాగుతోంది. ఇది ఇంకా పొడిగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గూగుల్ డూడుల్ (Google Doodle) ద్వారా ఇలాంటి ప్రత్యేక గేమ్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో వచ్చిన గేమ్ లన్నింటినీ మళ్లీ గూగుల్ డూడుల్ ద్వారా పరిచయం చేస్తోంది. ఈ రోజు వచ్చిన ఫిషింగర్ (Oskar Fischinger) గేమ్ చరిత్ర గురించి తెలుసుకోండి