Technology

Samsung Galaxy S23: త్వరపడండి, శాంసంగ్ గెలాక్సీ ఎస్23పై రూ. 20 వేలు తగ్గింపు, ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో మరిన్ని ఆఫర్లు గురించి తెలుసుకోండి

Vikas M

Samsung Galaxy S23 రాబోయే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో భారతదేశంలో గణనీయమైన ధర తగ్గింపును పొందుతుందని నిర్ధారించబడింది. శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై సోమవారం (ఏప్రిల్ 29) ప్రారంభ ధర నుండి రూ. 20,000 ధర తగ్గింపు ఉండనుంది.

Redmi Note 13 Pro+ 5G: రెడ్‌మీ నుంచి నోట్ 13ప్రో+ వరల్డ్ చాంపియన్స్ ఎడిషన్ విడుదల, ధర, ఫీచర్లు, ఆఫర్ల వివరాలు తెలుసుకోండి

Vikas M

చైనా మొబైల్ దిగ్గజం రెడ్‌మీ (Redmi) తన రెడ్‌మీ మిడ్ రేంజ్ ఫోన్ 13ప్రో+ వరల్డ్ చాంపియన్స్ ఎడిషన్ (Redimi Note 13Pro+) ను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. షియోమీ ఇండియా 10వ వార్షికోత్సవం సందర్భంగా అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఏఎఫ్ఏ) సహకారంతో రెడ్‌మీ నోట్ 13ప్రో + 5జీ వరల్డ్ చాంపియన్స్ ఎడిషన్ ఫోన్ ఆవిష్కరించింది.

Credit Card Rule Change: క్రెడిట్‌ కార్డ్‌ వినియోగదారులకు అలర్ట్, మే 1 నుంచి ఈ కార్డుల లావాదేవీల్లో భారీ మార్పులు, అదనపు ఛార్జీలు వసూలు

Vikas M

క్రెడిట్‌ కార్డ్‌ వినియోగదారులకు అలర్ట్. మే 1 నుంచి పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్‌ కార్డ్‌ లావాదేవీల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇటీవల ఎస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లు మే 1 నుంచి తమ క్రెడిట్‌ కార్డ్‌ నుంచి యుటిలిటీ బిల్లులు అంటే ఎలక్ట్రసిటీ బిల్‌, వాటర్‌ బిల్‌, గ్యాస్‌ బిల్‌ చెల్లిస్తే ఒక శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

Google Layoffs: గూగుల్‌లో ఆగని లేఆప్స్, పైథాన్ ఫౌండేషన్ టీమ్‌ మొత్తం ఉద్యోగులను తొలగించినట్లుగా వార్తలు

Vikas M

ఇజ్రాయెల్ ప్రభుత్వంతో కంపెనీకి ఉన్న సైనిక సంబంధాలపై నిరసన వ్యక్తం చేసిన గూగుల్ ఇటీవల ఉద్యోగులను తొలగించింది. మొదట, నిరసనల కారణంగా గూగుల్ 28 మంది కార్మికులను తొలగించింది. తరువాతి రోజుల్లో మరో 20 మందిని తొలగించింది.

Advertisement

Reliance Jio New Plan: జియో నుంచి 90 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్, రోజుకు 2జీబీతో పాటు అదనంగా మరో 20 జీబీ డేటా, ధర ఎంతంటే..

Vikas M

దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. 90 రోజుల వ్యాలిడిటీతో రూ.749 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో సాధారణ ఆఫర్లతో పోల్చితే యూజర్లకు అధిక డేటా లభిస్తోంది. ఆఫర్‌లో రోజుకు 2జీబీతో పాటు అదనంగా మరో 20 జీబీ డేటాను జియో అందిస్తోంది.

Ola Layoffs: ఓలా సీఈఓ హేమంత్ బక్షి రాజీనామా, ఉద్యోగాల కోతలు మొదలుపెట్టిన రైడ్-హెయిలింగ్ దిగ్గజం, 10 శాతం కోతలు

Hazarath Reddy

రైడ్-హెయిలింగ్ కంపెనీ ఓలా ఉద్యోగుల తొలగింపులను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ 29, సోమవారం ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, ఓలా క్యాబ్స్ దాని మొత్తం సిబ్బందిలో 10% మందిని తొలగించే క్రమంలో భాగంగా పునర్నిర్మాణ కసరత్తును చేపట్టనుంది

Eye Problem Solving with Gene Therapy: జన్యు చికిత్సతో కంటి సమస్యకు పరిష్కారం.. ఎల్‌వీ ప్రసాద్‌ కంటి అధ్యయన సంస్థ ఘనత

Rudra

వారసత్వంగా వచ్చే రెటీనా వ్యాధులను గుర్తించేందుకు రెటీనాల్‌ పిగ్మెంట్‌ ఈపీథీలియం(ఆర్‌పీఈ) ఉత్పరివర్తనాలు సహకరిస్తాయని ఎల్‌వీ ప్రసాద్‌ కంటి అధ్యయన సంస్థ పరిశోధనలో తేలింది.

WhatsApp Threatens To Leave India: అలా చేయాల‌ని బ‌లవంతం చేస్తే భార‌త్ వ‌దిలి వెళ్లిపోతాం! సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన వాట్సాప్, మెటా సంస్థ‌లు

VNS

తమ ప్లాట్‌ఫాంలో మెసేజ్‌లకు ఉన్న ఎన్‌క్రిప్షన్‌ విధానాన్ని తొలగించాలని ఆదేశాలిస్తే తాము భారత్‌లో సేవలను నిలిపివేస్తామని స్పష్టం చేసింది. ఎన్‌క్రిప్షన్‌ తొలగించడమనేది వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛకు, వినియోగదారుల గోప్యత హక్కుకు భంగం కలిగిస్తుందని వాట్సాప్‌,మెటా ఆరోపించాయి.

Advertisement

Flipkart Big Saving Days: మే 2 అర్థరాత్రి నుంచి ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌, పే లేటర్‌ ఆప్షన్‌ ద్వారా లక్ష రూపాయల వరకు కొనుగోలు చేసుకునే అవకాశం

Vikas M

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ తేదీలను ప్రకటించింది. మే 2 అర్థరాత్రి నుంచి 9 వరకు ఈ సేల్‌ అందుబాటులో ఉండనుంది.సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, గృహోపకరణాలపై డిస్కౌంట్లు లభించనున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్‌షిప్‌ యూజర్లు ఒకరోజు ముందుగానే అంటే మే 2 నుంచే ఈ సేల్‌లో పాల్గొనవచ్చని ప్రకటించింది.

WhatsApp: ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ తొలగించమని బలవంతం చేస్తే భారత్ నుంచి వెళ్లిపోతాం, ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన వాట్సాప్

Vikas M

ఎన్‌క్రిప్షన్‌ను విచ్ఛిన్నం చేయమని మాకు చెబితే, వాట్సాప్ దేశం నుంచి వెళ్తుంది" అని వాట్సాప్ తరఫు న్యాయవాది తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాలతో కూడిన ధర్మాసనానికి చెప్పారు.

PAN-Aadhaar Linking: ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయని వారికి బిగ్ అలర్ట్,రెండింతల టీడీఎస్‌ కోతలుంటాయని తెలిపిన ఐటీ శాఖ

Vikas M

ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయని వారికి బిగ్ అలర్ట్. మే నెలాఖరుకల్లా ఆధార్‌తో పాన్‌ అనుసంధానం పూర్తయితేనే టీడీఎస్‌ షార్ట్‌ డిడక్షన్‌ కోసం పన్ను చెల్లింపుదారులపై ఏ చర్యలూ ఉండబోవని ఆదాయ పన్ను శాఖ తెలియజేసింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది.

Whirlpool Layoffs 2024: ఆగని లేఆప్స్, 1,000 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న హోమ్ మేకర్ వర్ల్‌పూల్, ఆర్థిక మాంద్య భయాలే కారణం

Vikas M

వర్ల్‌పూల్ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా 1,000 మంది ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. దేశీయ విక్రయాలు క్షీణించడం, యునైటెడ్ స్టేట్స్‌లో తగ్గుతున్న డిమాండ్ కారణంగా వర్ల్‌పూల్ తొలగింపులు అమలు చేయబడ్డాయి.

Advertisement

JioCinema New Subscription Plans: ఓటీటీ దిగ్గజాలకు జియో షాక్, 29 రూపాయలకే నెలంతా ఉచిత వీడియో కంటెంట్, 4కే వీడియో క్వాలిటీతో యాడ్‌ ఫ్రీ కంటెంట్ ఎంజాయ్

Vikas M

జియో ఓటీటీ ప్రియుల‌కు సూప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. యూజర్లకు అందుబాటు ధ‌ర‌లో రెండు కొత్త ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ప్లాన్స్‌ను తీసుకువ‌చ్చింది. కొత్త‌గా తీసుకొచ్చిన వాటిలో రూ. 29, రూ. 89 ప్లాన్స్ ఉన్నాయి. కేవ‌లం రూ. 29కే నెల మొత్తం 4కే వీడియో క్వాలిటీతో యాడ్‌ ఫ్రీ కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు. అయితే, ఈ ఆఫ‌ర్ ఒక్క డివైస్‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది.

Elon Musk's X Ventures Into TV App: యూట్యూబ్‌కు పోటీగా టీవీ యాప్, సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన ఎలాన్‌ మస్క్‌, ఎలా ఉంటుందంటే..

Vikas M

గూగుల్ యూట్యూబ్ కి షాకిస్తూ ఎలాన్ మస్క్ ఎక్స్ కొత్త యాప్ తీసుకువస్తోంది. వీడియో స్ట్రీమింగ్‌ దిగ్గజం యూట్యూబ్‌ (YouTube)కు దీటుగా యూజర్లు హైక్వాలిటీ వీడియోలు అప్‌లోడ్‌ చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా టీవీ యాప్‌ (X TV app)ను అందుబాటులోకి తేనున్నట్లు ‘ఎక్స్‌’ సీఈవో లిండా యాకరినో ప్రకటించారు.

Tesla Layoffs: భారీ లేఆప్స్, 6,020 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న టెస్లా, దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయాలే కారణం

Vikas M

కాలిఫోర్నియాలోని సుమారు 6,020 మంది ఉద్యోగులను తొలగించాలని టెస్లా సంస్థ యోచిస్తోంది. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్‌ నివేదించింది. వాహ‌న విక్రయాలు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టం (declining sales), ఎలక్ట్రిక్‌ వాహనాలకు మార్కెట్‌లో పెరిగిన పోటీ కారణంగా కంపెనీపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

AI-Powered Poetry Camera: వ్యక్తి ఫీచర్స్ ను వర్ణిస్తూ ఫోటోతో పాటు కవిత్వం రాసే కెమెరా.. ఎలాగంటే?

Rudra

అందమైన అమ్మాయిని, సుందరమైన ప్రదేశాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని చూసినప్పుడు మది నుంచి కవిత్వం ఉప్పొంగి వచ్చేస్తుంది. ఇక, నుంచి ఈ పని కూడా కృత్రిమ మేధ(ఏఐ) చేయబోతున్నది.

Advertisement

WhatsApp New Feature: ఇంటర్నెట్ లేకున్నా వాట్సాప్‌లో ఫొటోలు, వీడియోలు పంపుకోవచ్చు, సరికొత్త ఫీచర్‌ను తీసుకురానున్న వాట్సాప్

Vikas M

ప్ర‌ముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇంట‌ర్నెట్ లేకున్నా ఫొటోలు, వీడియోలు, ఫైల్స్‌ను వినియోగ‌దారులు షేర్ చేసుకునే స‌దుపాయాన్ని తీసుకురానుంది. ఈ ఫీచ‌ర్ క‌నుక అందుబాటులోకి వ‌స్తే నెట్‌వ‌ర్క్‌తో సంబంధం లేకుండా డాక్యుమెంట్ల‌ను పంపించుకునే వెసులుబాటు క‌లుగుతుంది.

BharatPe Launches ‘BharatPe One’: దేశంలోనే తొలిసారిగా ఆల్ ఇన్ వన్ పేమెంట్ డివైస్, భారత్ పే వన్ తీసుకువచ్చిన ఫిన్ టెక్ కంపెనీ భారత్ పే

Vikas M

POS (పాయింట్ ఆఫ్ సేల్), QR, స్పీకర్‌లను ఒకే పరికరంలో పొందుపరిచే భారతదేశపు మొట్టమొదటి ఆల్ ఇన్ వన్ చెల్లింపు ఉత్పత్తిని ఫిన్‌టెక్ కంపెనీ BharatPe మంగళవారం ప్రారంభించింది.BharatPe One అని పిలువబడే ఈ ఉత్పత్తి వ్యాపారుల కోసం లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి రూపొందించబడింది.

Zomato Platform Fee Hiked: కస్టమర్లకు షాకిచ్చిన జొమాటో, ఒక్కో ఆర్డర్‌పై ప్లాట్‌ఫారమ్ రుసుము రూ.5కి పెంపు

Vikas M

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో తాజాగా కస్టమర్లకు మరోసారి షాకిచ్చింది. త‌న‌ ప్లాట్‌ఫారమ్ ఫీజును మ‌రోసారి 25 శాతానికి పెంచింది. దీంతో ఒక్కో ఆర్డర్‌పై ప్లాట్‌ఫారమ్ రుసుము రూ.5కి చేరింది. కాగా, గ‌తేడాది ఆగస్టులో రూ. 2 ప్లాట్‌ఫారమ్ రుసుమును ప్రవేశపెట్టిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కు త‌న బిజినెస్‌ను లాభదాయకంగా న‌డ‌ప‌డానికి దానిని రూ. 3కి పెంచింది.

Good Glamm Group Layoffs: ఆగని లేఆప్స్, 150 మంది ఉద్యోగులను తొలగించిన కాస్మొటిక్ తయారీ కంపెనీ గుడ్ గ్లామ్ గ్రూప్

Vikas M

కాస్మొటిక్ ఉత్పత్తులను తయారు చేసి విక్రయించే గుడ్ గ్లామ్ గ్రూప్ దాదాపు 150 మంది లేదా 15 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది చివర్లో ఐపీవోకి వెళ్తున్న నేపథ్యంలో ఈ యూనికార్న్‌ కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు తన మానవ వనరులను పునర్నిర్మించడంతో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement