Technology
McKinsey Begins Layoffs: ఉద్యోగులను పీకేస్తున్న మరో దిగ్గజం, 2,000 మంది ఉద్యోగులను తొలగించనున్న ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సీ, ఆర్థిక మాంద్య భయాలే కారణం
Hazarath Reddyప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సీ అండ్‌ కంపెనీ 2,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్లాన్‌ సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.తమ క్లయింట్లతో నేరుగా సంబంధం ఉండని సహాయక సిబ్బందిని తొలగించే యోచనలో మెకిన్సీ (McKinsey & Co) ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఉన్నతోద్యోగులు తెలిపారు.
SBI Alert: యోనో యాప్ వాడే వారికి అలర్ట్, పాన్ అప్‌డేట్ అంటూ ఈ లింకులు, మెసేజ్‌లు వస్తే ఓపెన్ చేయకండి, కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసిన ఎస్‌బీఐ
Hazarath Reddyస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వారి SBI Yono ఖాతాలో వారి PAN నంబర్‌ను అప్‌డేట్ చేయని ఖాతాదారుల ఖాతా బ్లాక్ చేయబడుతుందని లేదా మూసివేయబడుతుందనే వాదనలను తిరస్కరించింది. కాగా కస్టమర్‌లు తమ పాన్ కార్డ్ వివరాలను అప్‌డేట్ చేయడానికి లింక్‌తో పాటు ఓ మెసేజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Ericsson Layoffs: ఆగని ఉద్యోగాల కోత, 1400 మంది ఉద్యోగులను పీకేస్తున్న టెలికం దిగ్గజం ఎరిక్సన్‌, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం
Hazarath Reddyదూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాల మధ్య టెక్ కంపెనీలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా టెలికాం గేర్‌ మేకర్‌, మొబైల్‌ సంస్థ ఎరిక్సన్‌ ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు (Ericsson Layoffs) రెడీ అయింది.
Passport Fraud: పాస్‌పోర్ట్ ఫ్రాడ్ అలర్ట్, ఈ ఫేక్ వెబ్‌సైట్ల జోలికి పోవద్దని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ, అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే లాగిన్ కావాలని సూచన
Hazarath Reddyపాస్‌పోర్ట్ సంబంధిత సేవల కోసం చూస్తున్న వ్యక్తులు ఆన్‌లైన్‌లో ప్రజలను లక్ష్యంగా చేసుకుని నకిలీ వెబ్‌సైట్‌లు లేదా మొబైల్ అప్లికేషన్‌ల (Fake Websites, Mobile Apps) బారిన పడవద్దని ప్రభుత్వం సోమవారం హెచ్చరించింది.
Twitter Layoffs: ట్విట్టర్లో మళ్లీ కోతలు, సేల్స్, మార్కెటింగ్ విభాగం నుండి ఉద్యోగులను పీకేసిన కంపెనీ, ఇప్పటికే ముంబై, న్యూఢిల్లీ కార్యాలయాలను మూసేసిన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్
Hazarath Reddyటెక్ బిలియనీర్ ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ మరో రౌండ్ తొలగింపులను (Twitter Layoffs) ప్రకటించింది, ఈసారి దాని ప్రకటన విక్రయాల విభాగాన్ని తాకింది. కంపెనీ తన సేల్స్ టీమ్‌లోని సిబ్బందిని తగ్గించిన కొద్ది నెలల తర్వాత ఈ కోతలు (Elon Musk fires more employees) మొదలు పెట్టింది.
Wipro Offers Freshers Lower Pay: ప్రెషర్స్‌కి విప్రో భారీ షాక్, సగం జీతానికే పనిచేయాలని మెయిల్, అందుకు ఓకే అంటే జాబ్‌లో చేరాలని తెలిపిన ఐటీ దిగ్గజం
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, క్లయింట్ల నుంచి డీల్స్‌ జాప్యం అవుతున్న నేపథ్యంలో ప్రెషర్స్ కు ఐటీ సంస్థ విప్రో భారీ షాక్ ఇచ్చింది. కొత్తగా నియమించుకున్న ఉద్యోగులను మొదట్లో ఆఫర్‌ చేసిన జీతంలో సగానికి (Wipro Offers Freshers Lower Pay) పనిచేయాలని కోరింది. సగం జీతంతో ప్రాజెక్ట్‌లను అంగీకరించాలని వారికి మెయిల్ పంపింది.
TCS Layoffs: ఉద్యోగం ఊడిన వారికి గుడ్ న్యూస్, జాబ్‌ కోల్పోయిన ఉద్యోగుల్ని నియమించుకుంటామని తెలిపిన టీసీఎస్‌ చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ ఆఫీసర్‌, తమ ఉద్యోగుల్ని తొలగించడం లేదని ప్రకటన
Hazarath Reddyఆర్ధిక మాద్యం ముంచుకొస్తుందన్న భయాలతో ప్రపంచ వ్యాప్తంగా టెక్ కంపెనీలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో టీసీఎస్‌ సైతం ఉద్యోగుల్ని తీసేస్తుందని నివేదికలు బయటకు వచ్చాయి. అయితే ఈ వార్తలన్ని టీసీఎస్‌ ఖండించింది.సంస్థలో చేరిన ఉద్యోగి ప్రతిభను తీర్చిదిద్దుతామే తప్పా.. ఉద్యోగుల్ని తొలగించడం లేదని స్పష్టం చేసింది.
HP Layoffs: ఉద్యోగాల కోత షురూ చేసిన HP, 100 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన పీసీ దిగ్గజం, 2025 చివరి నాటికి దాదాపు 4,000-6,000 మందికి ఉద్వాసన పలికే అవకాశం
Hazarath Reddyపిసి, ప్రింటర్ మేజర్ హెచ్‌పి ఇంక్ 100 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. డిజిటల్ ప్రింటింగ్ మెషీన్‌ల ఉత్పత్తిలో నిమగ్నమై ఉన్న హెచ్‌పి ఇండిగోలో చాలా ఉద్యోగాల కోత ఉంటుందని తెలిపింది.మార్కర్.కామ్ ప్రకారం, దేశంలో విక్రయ కార్యకలాపాలను నిర్వహించే HP యొక్క మార్కెటింగ్ సిస్టమ్.. ప్రధాన కార్యాలయం నుండి కూడా కొన్ని తొలగింపులు వస్తాయని తెలిపింది
Apple Begins Layoffs: ఉద్యోగులను తొలగించేది లేదంటూనే యాపిల్ షాక్, వందలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్వాసన, దూసుకొస్తున్న ఆర్థిక మాంధ్య భయాలే కారణం
Hazarath Reddyఉద్యోగులను తొలగించేది లేదని చెబుతూనే టెక్ దిగ్గజం యాపిల్ 100 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. వందలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను యాపిల్ తొలగించింది. నివేదిక ప్రకారం , Apple వందలాది మంది కాంట్రాక్టర్‌లను తొలగించింది, వీరు ప్రాథమికంగా ఇతర కంపెనీలచే నియమించబడిన సిబ్బంది అయితే Apple సిబ్బందితో ప్రాజెక్ట్‌లకు సహకరించారు.
Meta Launches Paid Blue Badge: ఫేస్‌బుక్‌ బ్లూ ట్రిక్ అంటే ఏమిటీ, డబ్బులు ఎంత చెల్లించాలి, దాని వల్ల యూజర్ కు ఊపయోగం ఏమిటి ?, ఇన్‌స్టా,ఫేస్‌బుక్ యూజర్లకు షాకిచ్చిన జుకర్‌ బర్గ్‌
Hazarath Reddyట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ బాటలో మెటా (facebook) సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ అడుగులు వేస్తున్నారు. ఇన్ని రోజులు ఫేస్‌బుక్‌, ఇన్‌ స్టాగ్రామ్‌ సేవల్ని (Facebook, Instagram) ఉచితంగా అందించిన జుకర్‌ బర్గ్‌.. ఇప్పుడు యూజర్ల నుంచి ప్రతినెలా ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు.
Google Layoffs: ఉద్యోగులను సాగనంపుతున్న గూగుల్.. భారత్ లో 453 మంది ఇంటికి
Rudraఐటీ కంపెనీలపై ఆర్ధిక సంక్షోభం ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఏ క్షణాన జాబ్ పోతుందో అన్న టెన్షన్‌ తో ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఐటీ సెక్టార్ (IT sector) లో ఉద్యోగాల కోతలు నడుస్తున్నాయి. దిగ్గజ కంపెనీలు ప్రతినిత్యం లే ఆఫ్స్ (Layoffs ) ప్రకటిస్తున్నాయి. తాజాగా భారత్ లో గూగుల్ 453 మందిని తొలగించనున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.
DocuSign Layoffs: ఆగని ఉద్యోగాల కోతలు, 700 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన టెక్ దిగ్గజం డాక్యుసైన్, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం
Hazarath Reddyఅమెరికాకు చెందిన ఈ-సిగ్నేచర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ డాక్యుసైన్ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా దాదాపు 10 శాతం మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది.తాజా కోతలు దాదాపు 700 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతాయని సిఎన్‌బిసి నివేదించింది.
Jumia Layoffs: 900 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపిన మరో దిగ్గజం, 20 శాతం మంది సిబ్బందిని తొలగిస్తూ ఆఫ్రికన్ మార్కెట్‌ప్లేస్ కంపెనీ జుమియా కీలక నిర్ణయం
Hazarath Reddyఆఫ్రికన్ మార్కెట్‌ప్లేస్ కంపెనీ జుమియా తన ఖర్చు తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా 20 శాతం మంది సిబ్బందిని -- దాదాపు 900 మంది కార్మికులను తొలగించిందని జుమియా యొక్క FY2022 ఆర్థిక గణాంకాలు చెబుతున్నాయి. 2022 యొక్క నాల్గవ త్రైమాసికంలో, మేము గణనీయమైన సంఖ్యలో హెడ్‌కౌంట్ తగ్గింపులను చేపట్టాము, ఫలితంగా 900 ఉద్యోగులను తొలగించాము,
Twitter Offices Shut: ట్విట్టర్ మరో షాక్, భారత్‌లోని రెండు కార్యాలయాలు మూసివేత, ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశాలు
Hazarath Reddyట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత్ లోని న్యూఢిల్లీ, ముంబై నగరాల్లోని ఆఫీసులను మూసి వేశారు. భారతదేశంలోని తన మూడు కార్యాలయాలలో రెండింటిని మూసివేసిన సంస్థ సిబ్బందిని ఇంటినుంచే పనిచేయమని కోరింది. బెంగళూరు కార్యాలయం ప్రస్తుతం యథాతథంగా కొనసాగనుందని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది.
Disney+ Hotstar Down: డిస్నీ+ హాట్‌స్టార్‌ డౌన్, ఓపెన్ చేస్తుంటూ ఎర్రర్‌ వస్తోందంటూ యూజర్లు గగ్గోలు, క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం
Hazarath Reddyప్రముఖ స్ట్రీమింగ్‌ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్‌ (Diney+ Hotstar) డౌన్ అయింది. హాట్‌స్టార్‌ యాప్‌, వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తుంటే.. ఎర్రర్‌ వస్తోందంటూ యూజర్లు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో భారత్‌- ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు జరుగుతున్న వేళ ఈ అంతరాయం నెలకొనడంపై క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
Data Use in India: దేశంలో భారీగా పెరిగిన డేటా వినియోగం, సగటున నెలకు 19.5 GB డేటాను ఉపయోగిస్తున్న యూజర్, Nokia నివేదికలో వెల్లడి
Hazarath Reddyదేశంలో మొబైల్ డేటా ట్రాఫిక్ గత ఐదేళ్లలో 3.2 రెట్లు పెరిగింది, ఎందుకంటే నెలకు పాన్-ఇండియా డేటా వినియోగం 2018లో 4.5 ఎక్సాబైట్‌ల నుండి 2022లో 14.4 ఎక్సాబైట్‌లకు పెరిగింది. భారతీయుడు 2022లో సగటున నెలకు 19.5 GB డేటాను ఉపయోగించినట్లు Nokia గురువారం విడుదల చేసిన వార్షిక మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ట్రాఫిక్ ఇండెక్స్ (MBiT) నివేదికలో పేర్కొంది
Google Layoffs: ఉద్యోగులను పీకేస్తున్న గూగుల్, కంపెనీ నిర్ణయాన్ని నిరసిస్తూ స్విట్జర్లాండ్‌లో వందలాది మంది ఉద్యోగులు వాకౌట్, తీసివేసే ప్రయత్నాలు మానుకోవాలని సూచన
Hazarath Reddy250 కంటే ఎక్కువ మంది గూగుల్ జ్యూరిచ్ ఉద్యోగులు.. తమ ఉద్యోగులను 6 శాతం తగ్గించాలని కంపెనీ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ వాకౌట్ చేశారు. కార్మికులు భోజన సమయానికి ముందు తమ డెస్క్‌ల నుండి వెళ్ళిపోయారు, స్విస్ నగరంలోని రెండు Google కార్యాలయాలలో ఒకదాని వెలుపల ప్లకార్డులు పట్టుకున్నారు.
Tesla Layoffs: ఉద్యోగులను పీకేస్తున్న మరో టాప్ దిగ్గజం, న్యూయార్క్ ఫ్యాక్టరీలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన టెస్లా
Hazarath ReddyUS ఆటోమోటివ్ సంస్థ టెస్లా డజన్ల కొద్దీ ఉద్యోగులను వదులుతోంది, న్యూయార్క్‌లోని ఉద్యోగులు వర్కర్స్ యునైటెడ్ అప్‌స్టేట్ న్యూయార్క్‌తో యూనియన్‌ను నిర్వహించడానికి ప్రచారాన్ని ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా బ్లూమ్‌బెర్గ్ నివేదిక తెలిపింది.
Twitter down: ట్విట్టర్ డౌన్, సాంకేతిక సమస్యలతో మళ్లీ మొరాయించిన ట్విట్టర్, ఎర్రర్ మెసేజ్ ఫిర్యాదులతో హోరెత్తించిన యూజర్లు
Hazarath Reddyఔటేజ్ మానిటరింగ్ వెబ్‌సైట్ Downdetector.com ప్రకారం, వేలాది మంది ట్విట్టర్ వినియోగదారులు బుధవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయలేకపోయారు.యునైటెడ్ స్టేట్స్‌లోని మైక్రో-బ్లాగింగ్ సైట్‌తో 8,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులు సమస్యలను నివేదించారని డౌన్‌డెటెక్టర్ తెలిపింది
'New CEO Of Twitter': ట్విట్టర్ కొత్త సీఈఓగా ఎలాన్ మస్క్ పెంపుడు కుక్క, సంచలన ట్వీట్ చేసిన టెస్లా అధినేత, మండిపడుతున్న నెటిజన్లు
Hazarath Reddyట్విట్టర్‌ కొత్త బాస్‌, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మరోసారి సంచలన పోస్టుతో వివాదాల్లోకి ఎక్కారు. ట్విట్టర్‌కు కొత్త సీఈవోను పరిచయం చేస్తూ ఆయన వార్తల్లో నిలిచారు. మస్క్‌ పెంపుడు కుక్క ఫోల్కీ(pet dog Floki )ని ట్విట్టర్‌ సీఈవో సీట్‌లో కూర్చోబెట్టిన మస్క్‌.. సీఈవో అని రాసి ఉన్న టీ షర్ట్‌ను తొడిగాడు. ‘ట్విట్టర్ కొత్త సీఈవో ఇతనే..’ అంటూ ఆ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.