World

Viral Video: మిస్‌ శ్రీలంక అందాల పోటీల్లో కుమ్ములాట, అబ్బాయిలు, అమ్మాయిలు ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్న వీడియోలు వైరల్

Hazarath Reddy

న్యూయార్క్‌లోని స్టేటన్‌ ఐల్యాండ్‌లో తొలిసారి జరిగిన మిస్‌ శ్రీలంక అందాల పోటీల్లో ఘర్షణ చోటుచేసుకుంది. శుక్రవారం పోటీలు ముగిసిన తరువాత ఏర్పాటు చేసిన పార్టీలో పలువురు కొట్టుకున్నారు.

US Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు తెలుగు విద్యార్థులు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు, ట్రక్కును ఢీకొట్టిన మినీ వ్యాన్

Hazarath Reddy

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ముగ్గురు విద్యార్థులు (Three students from Telugu states) మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.మంగళవారం కనెక్టికట్ రాష్ట్రంలో ట్రక్కు మరియు మినీ వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో ఈ ప్రమాదం జరిగింది.

Covid in Wuhan: మళ్లీ అక్కడి నుంచే మొదలా, చైనా వుహాన్‌లో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు,కఠిన లాక్‌డౌన్‌ నిబంధనలు అమల్లోకి, సూపర్‌ మార్కెట్లు, ఫార్మసీలు మినహా అన్నీ మూసివేత

Hazarath Reddy

ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనావైరస్ మొట్టమొదటగా చైనాలోని వుహాన్‌లో (Wuhan) బయటపడిన సంగతి విదితమే.కరోనా మూలాలపై ఇంకా స్పష్టత లేనప్పటికీ వుహాన్‌లోనే కోవిడ్ వైరస్ పుట్టిందని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి.

Python Swallows Woman: వామ్మో! మహిళను మింగేసి హాయిగా పడుకున్న 22 అడుగుల కొండ చిలువ, పొట్ట చీల్చి చూసి షాకైన భర్త, చెట్ల కోసం అడవిలోకి వెళ్లి కొండచిలువకు ఆహారమైన ఇండోనేషియా మహిళ, ఒళ్లు గగుర్పొడుస్తున్న సంఘటన

Naresh. VNS

గ్రామస్థులందరూ కలిసి దానిని చంపి పొట్టను చీల్చారు. పూర్తిగా జీర్ణం కాని స్థితిలో ఉన్న మహిళ కళేబరాన్ని బయటకు తీశారు. జరాను మింగేందుకు కొండచిలువకు కనీసం రెండు గంటల సమయం పట్టి ఉంటుందని స్థానిక అధికారులు తెలిపారు. ఆమెను మింగడానికి ముందు చుట్టేసి ఊపిరాడకుండా చేసి చంపేసి ఉంటుందని అనుమానిస్తున్నారు.

Advertisement

Video: రష్యా ఆక్రమిత నగరం మెలిటోపోల్‌లో కారు బాంబు పేలుడు, అయిదు మందికి గాయాలు, ఎఫ్‌ఎస్‌బీ ప్రధాన కార్యాలయం ఆవరణలో పేలిన కారు

Hazarath Reddy

ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత నగరం మెలిటోపోల్‌లో పేలుడు సంభవించడంతో కనీసం ఐదుగురు గాయపడ్డారు. ఎఫ్‌ఎస్‌బీ ప్రధాన కార్యాలయం ఆవరణలో కారు పేలిపోయింది. మెలిటోపోల్ దాని రాజధాని తర్వాత జపోరిజ్జియా ఒబ్లాస్ట్‌లో రెండవ అతిపెద్ద నగరం.

Cyclone Sitrang: బంగ్లాదేశ్‌‌కు కన్నీటిని మిగిల్చిన సిత్రాంగ్ తుపాన్, 35 మంది మృతి, కుప్పకూలిన వేల ఇండ్లు, వేల హెక్టార్లలో పంట నష్టం, వేల సంఖ్యలో కొట్టుకుపోయిన ఫిషింగ్‌ ప్రాజెక్టులు

Hazarath Reddy

సిత్రాంగ్‌ తుఫాను ధాటికి బంగ్లాదేశ్‌ అతలాకుతలమయింది.భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల వరదలు సంభవించి 35 మంది ప్రాణాలు ( kills people in Bangladesh) కోల్పోయారు. దాదాపు 20 వేల మంది నీటిలో చిక్కుకున్నారు.ఈ తుపాను (Cyclone Sitrang) బెంగాల్‌ తీరం సమీపంలో బంగ్లాదేశ్‌లోని బైరిసాల్‌ వద్ద తీరందాటింది.

World's Dirtiest Man Dies: 60 ఏళ్ల తర్వాత తొలిసారి స్నానం చేశాడు! కొద్దిరోజులకే చనిపోయాడు, ఆరు దశాబ్దాలుగా ఒంటిపై నీటి చుక్క పడనీయకుండా ఉన్న వ్యక్తి, స్నానం చేయకుండా 94 ఏళ్లు బతికిన వరల్డ్ డర్జీయెస్ట్ మ్యాన్

Naresh. VNS

అయితే స్నానం చేసిన కొద్దిరోజులకే మరణించడం గమనార్హం. అతను ముళ్ల పందులను వండుకోకుండానే తినేవాడు. మురికి గుంటల్లోని నీటిని తుప్పుపట్టిన డబ్బాల్లో పట్టుకొని తాగేవాడు. ఎండిన పశువుల పశువుల పేడను తన దగ్గరున్న పాత పైపుల్లో పెట్టుకొని పొగతాగేవాడు. ఒకేసారి నాలుగు సిగిరెట్లు తాగేవాడు. అయితే ఒకసారి బలవంతంగా స్నానం చేయించేందుకు తీసుకెళ్తుండగా...మధ్యలోనే వ్యాన్ నుంచి దూకిపారిపోయాడు.

Myanmar Air Strike: మయన్మార్‌లో సైనిక పాలన అరాచకం,  ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న వారిపై మూడు జెట్‌ ఫైటర్లతో 4 బాంబులు, 80 మంది మృతి

Hazarath Reddy

మయన్మార్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తుండటంతో వారిని అణిచివేసేందుకు సైన్యం వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో దాదాపు 80 మంది మరణించినట్లుగా వార్తలు వస్తున్నాయి. కచిన్‌ రాష్ట్రంలో జరుపుకుంటున్న వేడుకలపై సైన్యం విరుచుకుపడటంతో మారణకాండ చోటుచేసుకున్నది.

Advertisement

Rishi Sunak's First Speech: ప్రధాని హోదాలో రిషి సునక్ తొలి ప్రసంగం, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న బ్రిటన్‌ను గట్టెక్కించేందుకు కఠిన నిర్ణయాలు తప్పవని సందేశం

Hazarath Reddy

బ్రిటన్ రాజు చార్లెస్ ను కలిసిన అనంతరం దేశ నూతన ప్రధానిగా (UK prime minister) రిషి సునక్ పదవీ బాధ్యతలు చేపట్టారు. రిషి సునాక్ నేడు బకింగ్ హామ్ ప్యాలెస్ లో కింగ్ చార్లెస్ తో భేటీ అనంతరం నెం.10 డౌనింగ్ స్ట్రీట్ లో ఉన్న ప్రధానమంత్రి కార్యాలయానికి విచ్చేశారు.

Arshad Killing: కెన్యాలో పాకిస్థాన్ జర్నలిస్ట్ అర్షద్ షరీఫ్ కాల్చివేత.. ఉద్దేశపూర్వకంగానే హత్య?!

Jai K

కెన్యాలో జరిగిన పోలీసు కాల్పుల్లో పాకిస్థాన్ జర్నలిస్ట్ అర్షద్ షరీఫ్ మృతి చెందారు. అర్షద్ మృతిని ఆయన భార్య ధ్రువీకరించారు. పోలీసు కాల్పుల్లో తన స్నేహితుడు, భర్త, తన ఫేవరెట్ జర్నలిస్ట్ అర్షద్‌ మృతి చెందారని ఆయన భార్య జవేరియా సిద్ధిఖి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Rishi Sunak: చరిత్ర సృష్టించిన రిషి సునక్, బ్రిటన్ ప్రధానిగా విజయం సాధించిన రిషి సునక్, తెల్ల దొరల గడ్డపై ప్రధానిగా తొలి భారతీయ మూలవాసి

kanha

భారత సంతతికి చెందిన రిషి సునక్ బ్రిటన్ కొత్త ప్రధానిగా చరిత్ర సృష్టించాడు. పెన్నీ మోర్డాంట్‌ను ఓడించి రిషి సునక్ గెలుపు సాధించారు. రిషి సునక్‌కు 180 కంటే ఎక్కువ మంది ఎంపీల మద్దతు లభించగా, పెన్నీ మోర్డాంట్ మద్దతులో చాలా వెనుకబడి ఉన్నాడు, ఆ తర్వాత అతను తన పేరును ఉపసంహరించుకున్నాడు. రిషి సునక్ అక్టోబర్ 28న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

Somalia Car Bomb:హోటల్లో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు, విద్యార్థులతో సహా తొమ్మిది మంది మృతి, మరో 47 మందికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

సోమాలియాలో రాధాని మొదగిషుకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిస్మయో నగరంలోని ఓ హోటల్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. తొలుత పేలుడు పదార్థాలతో నింపిన కారుతో తవక్కల్‌ హోటల్‌ గేటును ఢీకొట్టి ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు.

Advertisement

Train through Flame: ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టిన గూడ్స్ ట్రెయిన్.. పట్టాలపై అగ్నికీలలు.. అయినా మంటల మధ్య నుంచే దూసుకెళ్లిన రైలు.. గగుర్పొడిచే వీడియో ఇదిగో..

Jai K

సెంట్రల్ మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టిన ఓ గూడ్స్ ట్రెయిన్ అనంతరం ట్రాక్ పై రేగిన మంటల మధ్య నుంచే వేగంగా దూసుకెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారండి. ఈ ఘటనలో సమీపంలోని పలు ఇండ్లకు మంటలు అంటుకున్నట్టు స్థానిక అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Indonesia: ఇండోనేషియాలో ఘోర విషాదం, సిరప్‌ తాగి 99 మంది చిన్నారులు మృతి, కిడ్నీలు తీవ్రంగా దెబ్బతినడంతో మృతి చెందినట్లుగా వార్తలు, సిరప్‌లు, లిక్విడ్‌ మెడిసిన్స్‌ను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

Hazarath Reddy

ఇండోనేషియాలో సిరప్‌లు తీసుకున్న కారణంగానే నెల రోజుల్లో కిడ్నీ సమస్యలతో 99 మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఇండోనేషియాలో అన్ని సిరప్‌లు, లిక్విడ్‌ మెడిసిన్స్‌ను నిషేధిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Liz Truss Resigns As UK PM: ప్రధాని పదవి చేపట్టిన 45 రోజుల్లోనే.. బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా, లిజ్ ట్రస్ రాజీనామాతో బ్రిటన్‌లో మరో మారు రాజకీయ సంక్షోభం

Hazarath Reddy

బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని పదవి చేపట్టిన 45 రోజుల్లోనే ఆమె బాధ్యతల నుంచి వైదొలిగారు. బ్రిటన్‌లో చరిత్రలోనే అతి తక్కువ కాలం ప్రధానిగా ఉన్న నేత ట్రసే కావడం గమనార్హం. లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్‌లో మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని (Liz Truss Resigns As UK Prime Minister) వెల్లడించారు.

Russia-Ukraine War: ఉక్రెయిన్ వదిలి వెంటనే వెళ్లిపోండి, భారతీయులకు హెచ్చరికలు జారీ చేసిన ఇండియన్‌ ఎంబసీ, 4 నగరాల్లో మార్షల్‌ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన రష్యా

Hazarath Reddy

రష్యా-క్రిమియాను కలిపే కెర్చ్‌ వంతెన పేలుడు తర్వాత ఉక్రెయిన్‌పై మాస్కో దాడులు మరింత ఉద్ధృతమయ్యాయి.రెండు దేశాల మధ్య యుద్ధపూరిత వాతావరణం నెలకొన్నది. రాజధాని కీవ్‌ సహా ఉక్రెయిన్‌ వ్యాప్తంగా క్రెమ్లిన్‌ సేనల దాడులు కొనసాగుతున్నాయి.

Advertisement

Obama’s Diwali Party Outfit: భారతీయ దుస్తులు ధరిస్తే ఒబామా ఎలా ఉంటాడో తెలుసా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒబామాస్‌ దివాళీ పార్టీ అవుట్‌ఫిట్‌ ఫోటో

Hazarath Reddy

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత సంప్రదాయ దుస్తులైన ట్రెడిషనల్‌ కుర్తా, పైజమా ధరిస్తే చూడాలనుకుంటున్నారా..అయితే ఒబామా ఈ డ్రస్ ను తొడిగినట్లుగా ఉంటే బొమ్మ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వైరల్‌ పోస్ట్‌ను ఓ పేజ్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది.

Nubia Cristina Braga Dies: బ్రెజిలియన్ ఇన్‌స్టాగ్రామ్ స్టార్‌ని కాల్చి చంపిన దుండుగులు, దాదాపు 60,000 మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను కలిగి ఉన్న నుబియా క్రిస్టినా బ్రాగా

Hazarath Reddy

దాదాపు 60,000 మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను కలిగి ఉన్న 23 ఏళ్ల కంటెంట్ క్రియేటర్, అక్టోబర్ 14 రాత్రి బ్రెజిల్‌లోని సెర్గిప్ స్టేట్, అరకాజులోని శాంటా మారియా పరిసరాల్లోని తన ఇంటిలో శవమై కనిపించింది.

New Covid Strain: ఓమిక్రాన్, వుహాన్‌ వేరియంట్‌తో కలిపి కొత్త కరోనా అభివృద్ధి, ఈ వైరస్ వస్తే ఒక్క వేటుకే మరణం తప్పదు, తయారు చేసిన శాస్త్రవేత్తలపై మండిపడుతున్న నిపుణులు

Hazarath Reddy

80 శాతం ప్రాణముప్పు ఉన్న కొత్త కరోనా వేరియంట్‌ను (new Covid strain) తాము ల్యాబ్‌లో అభివృద్ధి చేసినట్టు శాస్త్రవేత్తలు ప్రకటించడం ఆందోళన కలిగిస్తున్నది. వివరాల్లోకెళితే.. బోస్టన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కొత్త కోవిడ్-19 జాతిని అభివృద్ధి చేశారు.

Interpol Conference Delhi: దావూద్ ఇబ్రహీంను భారత్‌కు అప్పగిస్తారా, విలేకరి ప్రశ్నకు సమాధానం దాటవేసిన ఎఫ్‌ఐఏ డైరెక్టర్ జనరల్ మొహ్సిన్ బట్

Hazarath Reddy

ఢిల్లీలో ఇంటర్‌పోల్ సదస్సుకు హాజరైన ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) డైరెక్టర్ జనరల్ మొహ్సిన్ బట్.. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌లను పాకిస్థాన్ భారత్‌కు అప్పగిస్తారా అని ఓ విలేకరి ప్రశ్నించగా సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. . దాదాపు 25 ఏళ్ల విరామం తర్వాత భారత్‌లో ఈ సమావేశం జరుగుతోంది. ఇది చివరిగా 1997లో జరిగింది.

Advertisement
Advertisement