ప్రపంచం
Hand Sanitizer Exploded: శానిటైజర్లు పేలుతున్నాయ్..అమెరికాలో భారీ శబ్దంతో పేలిన శానిటైజర్ బాటిల్, తీవ్ర గాయాల పాలైన మహిళ, టెక్సాస్‌లో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
Hazarath Reddyప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ దడ పుట్టిస్తోంది. దీనికి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ రాకపోవడంతో జాగ్రత్తలతోనే అందరూ దీన్ని ఎదుర్కుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ జాగ్రత్తలే కొంపలు ముంచుతున్నాయి. కరోనా రాకుండా కాపాడుకునేందుకు వాడే శానిటైజర్ బాటిల్ ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకెళితే..అమెరికాలోని టెక్సాస్‌లో శానిటైజర్‌ బాటిల్‌ పేలటంతో (Hand Sanitizer Exploded) ఓ మహిళ శరీరం మొత్తం తీవ్రంగా కాలిపోయింది.
Coronavirus in India: ఇండియాలో రెండవ ధపా కరోనా వేవ్, వ్యాక్సిన్‌పై ఇంకా క్లారిటీ లేదు, దేశంలో తాజాగా 86,432 మందికి కరోనా, 40 లక్షలు దాటిన కోవిడ్ కేసులు
Hazarath Reddyదేశవ్యాప్తంగా కొత్తగా 86,432 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 40,23,179 కు (coronavirus in India) చేరింది. గత 24 గంటల్లో 1,089 కరోనా బాధితులు ప్రాణాలు విడిచారు. మొత్తం మృతుల సంఖ్య 69,561 కు (coronavirus Deaths in India) చేరింది. కరోనా బారినపడ్డవారిలో ఇప్పటివరకు 31,07,223 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 8,46,395 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది.
India-China Face Off: సరిహద్దు వద్ద దూకుడు పెంచిన భారత్, వ్యూహాత్మకంగా పలు కీలక స్థావరాలు స్వాధీనం, చైనా దళాలకు ఎదురుగా తరలుతోన్న భారత బలగాలు
Team Latestlyభారతదేశం తన స్థావరాలను బలోపేతం చేసుకోవడంతో పాటు దక్షిణ ఒడ్డున వ్యూహాత్మక పర్వత ఎత్తులను స్వాధీనం చేసుకోవడంతో, ప్రస్తుతం ఇరు దేశాల సైనికులు కేవలం 300-500 మీటర్ల దూరంలో ఉన్నారని, దీంతో సరిహద్దు వద్ద తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొంది.....
Coronavirus in India: ప్రతి అయిదుగురిలో ఒకరికి కరోనా, గోవా ముఖ్యమంత్రికి కోవిడ్ పాజిటివ్, దేశంలో తాజాగా 78,357 మందికి కరోనా, 29,01,909 మంది కోలుకుని డిశ్చార్జ్
Hazarath Reddyగడిచిన 24 గంటల్లో దేశంలో ఏకంగా 78,357 కరోనా పాజిటివ్‌‌ కేసులు (Coronavirus in India) నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 37,69,524 కు చేరింది. కోవిడ్‌ బాధితుల్లో తాజాగా 1045 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 66,333 కు చేరింది. కోవిడ్‌ రోగుల్లో ఇప్పటివరకు 29,01,909 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 8,01,282 (Coronavirus Cases in India) యాక్టివ్ కేసులున్నాయి.
Ajit Doval: చైనా కవ్వింపు చర్యలు, రంగంలోకి అజిత్ డోవల్, బార్డర్ పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్ష, ఎన్నడూ కవ్వింపు చర్యలకు పాల్పడలేదని చెబుతున్న చైనా
Hazarath Reddyభారత్‌-చైనా సరిహద్దుల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో (India-China border) మంగళవారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డొవల్‌ (National Security Advisor (NSA) Ajit Doval) ఉన్నతాధికారులతో సమవేశమయ్యారు. బార్డర్ పరిస్థితులను సమీక్షించారు. అనంతరం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Defence Minister Rajnath Singh) వీరితో భేటీ కానున్నారు. ఆగస్టు 29న ఎల్‌ఏసీ వెంబడి యథాతథ స్థితిని మార్చడానికి గాను 150-200 మంది చైనా సైనికులు (Chinese Army) ప్రయత్నించినట్లు భారత సైన్యం (Indian Army) గుర్తించింది.
Coronavirus in India: లక్షణాలు లేకుండానే కరోనా, నేటి నుంచి అన్‌లాక్‌4 అమలు, దేశంలో 65 వేలు దాటిన కరోనా మరణాలు, తాజాగా 69,921 మందికి కోవిడ్-19, డిశ్చార్జ్ కేసుల సంఖ్య 28,39,883కు చేరిక
Hazarath Reddyభారత్‌లో గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 69,921 పాజిటివ్‌ కేసులు (Coronavirus in India) నమోదడంతో మొత్తం కేసుల సంఖ్య 36,91,167 కు (India's COVID-19 Tally) చేరింది. వైరస్‌ బాధితుల్లో తాజాగా 819 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 65,288 (Coronavirus Deaths) చేరింది. కరోనా రోగుల్లో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 28,39,883. దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,85,996.
COVID-19 Cases in India: దేశంలో పెరుగుతున్న రికవరీ రేటు, ఇప్పటివరకు 27,74,802 మంది డిశ్చార్జ్, 7,81,975 యాక్టివ్‌ కేసులు, తాజాగా 78,512 మందికి కోవిడ్-19
Hazarath Reddyదేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 78,512 పాజిటివ్‌ కేసులు (COVID-19 New Cases in India) నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 36,21,246 చేరింది. ఆదివారం ఒక్కరోజే కోవిడ్‌ బాధితుల్లో 971 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 64,469 కు (Coivd Deaths) చేరింది. భారత్‌లో ప్రస్తుతం 7,81,975 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు 27,74,802 మంది కోవిడ్‌ రోగులు కోలుకున్నారు.
China Restaurant Collapse: చైనాలో కుప్పకూలిన రెస్టారెంట్, 29 మంది మృతి, పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా కూలిన రెండంతస్తుల భవనం
Hazarath Reddyఉత్తర చైనాలోని షాంగ్జి ప్రావిన్సులో జుక్సైన్‌ రెస్టారెంటు కుప్పకూలిన ఘ‌ట‌న (China Restaurant Collapse) విషాదాన్ని నింపింది. లిన్‌ఫెన్‌ అనే పట్టణంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బీజింగ్‌కు 630 కిలోమీటర్ల దూరంలోని షాంకి ప్రావిన్స్‌లోని జియాంగ్‌ఫెన్ (Shanxi Province) కౌంటీలో గల రెండంతస్తుల రెస్టారెంట్‌లో ఒక వ్యక్తి 80వ పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా శనివారం అది కూలిపోయింది. వెంటనే వందలాది మంది రెస్క్యూ సిబ్బంది, డాగ్స్ సహాయంతో సహాయక చర్యలు చేపట్టి శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని రక్షించారు. ఆదివారం నాటికి రెస్క్యూ ఆపరేషన్ ముగించారు.
India Coronavirus: రెండోసారి కరోనా రావడంపై క్లారిటీ ఇచ్చిన శాస్త్రవేత్తలు, దేశంలో తాజాగా 78,761 కేసులు నమోదు, ఇప్పటివరకు 27,13,934 మంది కోలుకుని డిశ్చార్జ్
Hazarath Reddyకేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ (Ministry of Health and Family Welfare) ఆదివారం విడుద‌ల చేసిన‌ గణాంకాల ప్రకారం దేశంలో కరోనా కేసుల సంఖ్య (Coronavirus Outbreak in India) 35 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 78,761 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 35,42,734కు చేరింది. కరోనాతో తాజాగా 948 మంది మృతి (Covid Deaths) చెందారు. దీంతో మొత్త మరణాల సంఖ్య 63,498కు చేరింది. వైరస్‌ బారిన పడ్డవారిలో ఇప్పటి వరకు 27,13,934 మంది కోలుకున్నారు. భారత్‌లో ప్రస్తుతం 7,65,302 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4,14,61,636 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
Schools to Reopen in Wuhan: కరోనా నుంచి కోలుకున్న వుహాన్‌, సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు,కాలేజీలు ప్రారంభం, విద్యార్థులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలంటూ ఆదేశాలు
Hazarath Reddyకరోనావైరస్ తొలిసారి వెలుగు చూసిన చైనాలోని వూహాన్ నగరం (China's Wuhan) ఇప్పుడు సాధారణ జీవితానికి వచ్చేసింది. అక్కడ స్థానిక ప్రభుత్వం ఆంక్షలకు సెలవిస్తూ పూర్తిస్థాయి అన్‌లాక్ దిశగా ప్రయాణం ప్రారంభించింది. ఈ క్రమంలోనే స్కూళ్లు తెరిచేందుకు అనుమతిస్తూ (Schools to Reopen in Wuhan) అక్కడి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సెప్టెంబర్ 1 నుంచి అక్కడున్న 2842 విద్యా సంస్థలు తమ కార్యకలాపాలు యథాతథంగా ప్రారంభించనున్నాయి. 10.4లక్షల మంది విద్యార్థులు ఆగిపోయిన తమ చదువులను తిరిగి ప్రారంభించనున్నారు. విద్యార్థులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
Coronavirus (COVID-19): బరువుంటే కరోనాతో ప్రమాదం, 26 అడుగుల దూరం వరకు కోవిడ్ వైరస్ ప్రయాణం, మహిళల కంటే పురుషులకే వైరస్‌ ముప్పు, రెండోసారి కరోనా సోకుతుందనే దానిపై ఇంకా వీడని సస్పెన్స్
Hazarath Reddyకరోనావైరస్ ప్రపంచం మొత్తాన్ని కలవరపెడుతోంది. వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ఇది (coronavirus disease (COVID-19) మరింతగా భయపెడుతోంది. దీనిపై శాస్ర్తవేత్తలు రోజుకొక కొత్త ఆసక్తిర విషయాన్ని ప్రకటిస్తున్నారు. తాజాగా మరొక వార్త బయటకు వచ్చింది. కోవిడ్‌–19 (Coronavirus (COVID-19) బారిన పడితే ఆరోగ్యకరమైన బరువు కలిగిన వారికన్నా అధిక బరువు కలిగిన వారు (Obesity) 48 శాతం ఎక్కువ మరణించే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్‌ నియమించిన శాస్త్రవేత్తల బృందం తెలిపింది.
Galwan Clash: గాల్వన్ వ్యాలీ ఘర్షణ, బయటపడిన చైనా సైనికుని సమాధి, ఈ వార్తపై ఇంకా స్పందించని డ్రాగన్ దేశం, ట్విట్టర్లో వైరల్ అవుతున్న చైనా సైనికుని సమాధి రాయి ఫోటో..
Hazarath Reddyఇండియా‌-చైనా దళలా మధ్య జూన్‌ 15న గాల్వన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో (Galwan Clash) 20 మంది భారత సైనికులు మరణించిన సంగతి తెలిసిందే.అయితే గాల్వన్ వ్యాలీలో భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో (India-China Tensions) చైనాకు ఎంత నష్టం జరిగిందనేది ఇప్పటికీ చైనా గోప్యంగానే ఉంచింది. ఈ ఘర్షణలో ఎంతమంది చైనా సైనికులు (People's Liberation Army (PLA) ప్రాణాలు కోల్పోయారు? ఎంత మంది గాయపడ్డారు? అనే వివరాలను చైనా కమ్యూనిష్టు ప్రభుత్వం (ChinA Govt) ఇప్పటికీ దేశ ప్రజలకు తెలియజేయలేదు. ఈ ఘర్షణలో చైనా సైనికులు 40 మంది వరకు చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కానీ చైనా నుంచి మాత్రం ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
TikTok-Triller Deal Rumors: దూసుకొస్తున్న అమెరికా గడువు, టిక్ టాక్‌పై కన్నేసిన మరో అమెరికా దిగ్గజం, 20 బిలియన్ డాలర్ల బిడ్‌తో ట్రిల్లర్ సంప్రదింపు, అలాంటిదేమి లేదని తెలిపిన టిక్ టాక్
Hazarath Reddyఇండియాలో బ్యాన్ అయిన చైనా షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ టిక్‌టాక్‌ (TikTok) కొనుగోలు రేసులో అమెరికాకు చెందిన మరో దిగ్గజ సంస్థ నిలిచింది. ప్రముఖసోషల్ వీడియో ప్లాట్‌ఫామ్ ట్రిల్లర్ (Triller) చైనాకు చెందిన బైట్‌డాన్స్‌ను (ByteDance) సంప్రదించినట్టు తెలుస్తోంది. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రసిద్ధ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ సెంట్రికస్ ద్వారా 20 బిలియన్ డాలర్ల బిడ్‌తో (TikTok-Triller Deal) సంప్రదించినట్లు రాయిటర్స్ శనివారం తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారతదేంలోని టిక్ టాక్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు యోచిస్తున్నట్టు పేర్కొంది.
COVID-19 in India: కరోనాపై గుడ్ న్యూస్, దేశంలో 26 లక్షలు దాటిన డిశ్చార్జ్ కేసులు, యాక్టివ్ ఉన్న కేసులు 7,52,424 మాత్రమే, దేశంలో తాజాగా 76,472 కేసులు నమోదు, 62,550కు పెరిగిన మరణాల సంఖ్య
Hazarath Reddyదేశంలో శుక్రవారం తాజాగా మరో 76,472 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య34,63,973కు (COVID-19 in India) చేరుకుంది. గత 24 గంటల్లో 60,177 మంది కోలుకోగా 1,021 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 62,550కు (Coronavirus Deaths) చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ (Ministry of Health and Family Welfare) తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య26,48,999 కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,52,424గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల శాతం 21.90గా ఉంది. కాగా యాక్టివ్‌ కేసుల కంటే కోలుకున్న కేసులు 18 లక్షలకు పైగా అధికంగా ఉన్నాయి.అంతేగాక యాక్టివ్‌ కేసుల కంటే 3.5 రెట్లు కోలుకున్న కేసులు ఉండటం శుభ పరిణామం.
Kim Jong-Un: కోమాలేదు..గీమాలేదు, మీటింగ్‌లో దర్జాగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్, సంచలన ఫోటోలను విడుదల చేసిన నార్త్ కొరియా వార్తా సంస్థ కెసిఎన్ఎ, నిజమా..కాదా అనే సందిగ్ధంలో నెటిజన్లు
Hazarath Reddyగత కొద్ది కాలం నుంచి ఉత్తర కొరియా అధ్యక్షుడు (North Korean leader Kim) కోమాలోకి వెళ్లారని, ఆయన చనిపోయారని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే నార్త్ కొరియా అధ్యక్షుడు (Kim Jong-Un) బతికే ఉన్నారంటూ ఇప్పుడు ఓ వార్త బయటకు వచ్చింది. ఇందులో నిజమొంతో తెలియదు కాని... బయటకు వచ్చిన వార్త ప్రకారం.. కరోనావైరస్, అలాగే దూసుకొస్తున్న తుఫాను కట్టడికి (looming typhoon) నివారణ ప్రయత్నాలు చేయాలని ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ పిలుపునిచ్చినట్లు నార్త్ కొరియా వార్తా సంస్థ కెసిఎన్ఎ ( KCNA) బుధవారం తెలిపింది.
Coronavirus in India: మాస్కుల దెబ్బ.. దేశంలో భారీగా తగ్గిన స్వైన్ ఫ్లూ కేసులు, భారత్‌లో తాజాగా 1059 మంది కరోనాతో మృతి, గత 24 గంటల్లో 67,151మందికి కోవిడ్-19, 32,34,475కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య
Hazarath Reddyదేశవ్యాప్తంగా కొత్తగా 67,151 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 32,34,475కు (Coronavirus Cases in India) చేరింది. గడిచిన 24 గంటల్లో 1059 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 59,449 కు (Coronavirus Deaths in India) చేరింది. వైరస్‌బారిన పడ్డవారిలో ఇప్పటివరకు 24,67,759 మంది కోలుకున్నారు. భారత్‌లో ప్రస్తుతం 7,07,267 యాక్టివ్‌ (Corona Active Cases) కేసులున్నాయి. కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ఈ మేరకు బుధవారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. నిన్న ఒక్క‌రోజే 8,23,992 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నామండ‌లి వెల్ల‌డించింది. దేశ‌వ్యాప్తంగా ఆగ‌స్టు 25 వ‌ర‌కు మొత్తం 3,76,51,512 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని తెలిపింది.
World’s Fastest Human Calculator: హైదరాబాదీ యువకుడి ఘనత, ప్రపంచంలోనే వేగవంతమైన హ్యూమన్ క్యాలెక్యులెటర్‌గా అవతరణ, లండన్ మైండ్ స్పోర్ట్స్ ఒలంపియాడ్ నుంచి బంగారు పతకం గెలుపు
Team Latestlyయింట్ స్టీఫెన్స్ కాలేజీలో మేథమేటిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేస్తున్న భానుప్రకాష్ తనకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడే SIP అబాకస్ ప్రోగ్రామ్ లో చేరి అందులోనే 9 లెవెల్స్ విజయవంతంగా పూర్తి చేశారు. అంతేకాకుండా అంతర్జాతీయ అబాకస్ ఛాంపియన్....
India Coronavirus: పిల్లలకు, టీనేజర్లకు కరోనా ముప్పు ఎక్కువ, దేశంలో తాజాగా 60,975 మందికి కరోనా, 31,67,324 కు చేరుకున్న కోవిడ్-19 కేసుల సంఖ్య, 3.5కోట్ల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు
Hazarath Reddyదేశంలో గత 24 గంటల్లో 60,975 మందికి కరోనా (Coronavirus) సోకిందని, అదే సమయంలో 848 మంది మృతి (Coronavirus Deaths) చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 31,67,324 కు ( India's COVID-19 Tally)చేరగా, మృతుల సంఖ్య మొత్తం 58,390కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 24,04,585 మంది కోలుకున్నారు.
BP Drugs Cuts Covid Death Risk: కరోనాకు బీపీ మందులతో చెక్, బ్లడ్ ప్రెషర్ రోగులకిచ్చే మందులు అద్భుతంగా పనిచేస్తున్నాయని లండన్‌ తాజా సర్వే ద్వారా వెల్లడి, కరోనా రోగుల శవ పరీక్షల్లో దిమ్మతిరిగే విషయాలు
Hazarath Reddyకరోనా వైరస్‌కు ఇప్పటి వరకు మందు అయితే రాలేదు. కాని ఎవరికి వారే పలు రకాల సర్వేలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. తాజాగా కరోనా బారిన పడిన ‘హై బ్లడ్‌ ప్రెషర్‌’ రోగులకు బ్లడ్‌ ప్రెషర్‌ నివారణ మందులను (Blood pressure drugs) ఇవ్వడం వల్ల వారు అద్భుతంగా కరోనా వైరస్‌ బారి నుంచి కోలుకున్నారని (BP Drugs Cuts Covid Death Risk) లండన్‌లో నిర్వహించిన ఓ తాజా సర్వే తెలియజేస్తోంది.
Kim Jong Un in Coma: కోమాలోకి నార్త్ కొరియా అధినేత, కిమ్‌ యో జోంగ్ చేతికి నార్త్ కొరియా పగ్గాలు, సంచలన వ్యాఖ్యలు చేసిన దక్షిణ కొరియా అధికారి
Hazarath Reddyగత కొంత కాలంగా ఉత్తర ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ ఆరోగ్యంపై మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. తాజాగా దక్షిణ కొరియా అధికారి, గతంలో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే-జంగ్‌కు సహాయకుడిగా పని చేసిన చాంగ్‌ సాంగ్‌ మిన్‌ కిమ్ ఆరోగ్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ కోమాలోకి వెళ్లారని (Kim Jong Un in Coma), తమ దేశానికి చెందిన గూఢచర్య వర్గాలు వెల్లడించాయని ఆయన అన్నారు.