World

SARS-CoV-2 Virus: కరోనావైరస్ మానవ సృష్టే, చైనా వుహాన్ ల్యాబొరేటరీ నుంచి ఈ వైరస్ బయటకు వచ్చింది, నోబెల్‌ గ్రహీత మాంటగ్నియర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Hazarath Reddy

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ ( Coronavirus) పుట్టుక చైనా నుంచే జరిగిందనే వాదనలు రొజు రోజుకు బలంగా మారుతున్నాయి. తాజాగా కరోనా వైరస్‌పై ఫ్రాన్స్‌కు చెందిన నోబెల్‌ గ్రహీత లూక్‌ మాంటగ్నియర్‌ (French Nobel Prize Winner Scientist Luc Montagnier) సరికొత్త వివాదానికి తెరదీశారు. కరోనా మానవ సృష్టేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఎయిడ్స్‌ వైరస్‌కు (AIDS Virus) వ్యాక్సిన్‌ రూపొందించే క్రమంలో చైనీస్‌ ల్యాబొరేటరీ (China Lab) నుంచి అది బయటకు వచ్చిందని పేర్కొన్నారు.

New FDI Rules Row: ఇండియా కొత్త ఎఫ్‌డీఐ రూల్స్, ఆవేశం వెళ్లగక్కిన చైనా, భారత్ కొత్త నిబంధనలు డబ్ల్యూటీఓ సూత్రాలకు తూట్లు పొడిచేలా ఉన్నాయంటూ విమర్శలు

Hazarath Reddy

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (Foreign direct investment) సంబంధించి భారత్ కొన్ని మార్పులు చేసిన సంగతి విదితమే. కాగా ఎఫ్‌డీఐ (FDI) విషయంలో భారత్ కీలక మార్పులు చేయడంపై చైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుత కోవిడ్-19 (C)ovid-19) పరిస్థితిని ఆసరాగా చేసుకుని చైనా (China) సహా పొరుగుదేశాలు 'ఆవకాశవాద టేకోవర్'లకు పాల్పడకుండా భారత్‌ ఈ కఠిన చర్యలు చేపట్టింది. ఎఫ్‌డీఐల విషయంలో భారత్‌లో కొత్తగా చోటు చేసుకున్న మార్పులు డబ్ల్యూటీఓ (WTO) సూత్రాలకు తూట్లు పొడిచేలా ఉన్నాయని చైనా పేర్కొంది.

Coronavirus in India: ఇండియాలో 17 వేలు దాటిన కోవిడ్-19 కేసులు, 543 మంది మృతి, 2,546 మంది డిశ్చార్జ్‌, దేశ వ్యాప్తంగా 54 జిల్లాల పరిధిలో పూర్తిగా తగ్గిన కరోనా కేసులు

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ (India Coronavirus) రోజురోజూ అంతకంతకు పెరుగుతోంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,553 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 36 మంది మృతి చెందారు. దీంతో భారత్‌లో (India) కరోనా కేసుల సంఖ్య 17,265కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 2,546 మంది డిశ్చార్జ్‌ కాగా, 543 మంది మృతిచెందారని తెలిపింది.

Indian Flag Shines High: విదేశీ గడ్డపై ఠీవీగా మెరిసిన భారత జెండా. స్విట్జర్లాండ్‌లోని మాటర్‌హార్న్ పర్వతంపై త్రివర్ణ పతాక కాంతులు, కోవిడ్-19పై భారత్ చేస్తున్న పోరాటానికి సంఘీభావం, మానవత్వం గెలుస్తుందన్న నరేంద్ర మోదీ

Team Latestly

స్విట్జర్లాండ్‌లోని దిగ్గజ మాటర్‌హార్న్ పర్వతం భారత జెండాలోని త్రివర్ణ కాంతులతో వెలిగిపోయింది. COVID-19 మహమ్మారికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి, భారతీయులకు సంఘీభావం తెలిపే సూచికగా....

Advertisement

Maharashtra Coronavirus: మూడు నెలలు ఇంటి అద్దె వసూలు చేయవద్దు, ఇళ్ల యజమానులకు మహారాష్ట్ర సర్కారు కీలక ఆదేశాలు, ముంబై బాంద్రా ఘటన తర్వాత మరింత ఫోకస్

Hazarath Reddy

మూడు నెలల పాటు ఇంటి యజమానులు అద్దెకు ఉంటున్న వారిని అద్దె అడగవద్దని మహారాష్ట్ర ప్రభుత్వం సూచన చేసింది. ఈ సమయంలో.. అద్దె కట్టలేదన్న కారణంగా ఏ ఒక్క కుటుంబాన్ని ఇల్లు ఖాళీ చేయించవద్దని యజమానులకు సూచించింది. అద్దె చెల్లింపుల వ్యవహారంపై ప్రత్యేకంగా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.

Arunachal Pradesh Coronavirus: ముందు కరోనా పాజిటివ్, ఇప్పుడు పేషెంట్ నెగిటివ్, కోవిడ్-19 రహిత రాష్ట్రంగా అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, ట్విట్టర్ ద్వారా తెలిపిన సీఎం పెమా ఖండూ

Hazarath Reddy

ఓ వైపు దేశవ్యాప్తంగా కోవిడ్ 19 (COVID 19) కేసులు పెరుగుతున్నాయి, మరోవైపు పలు రాష్ట్రాల్లో కరోనా బాధితులు కోలుకుంటున్నారు. చికిత్స తరువాత పాజిటివ్ కేసులు క్రమంగా నెగెటివ్‌గా మారుతున్నాయి. ఇదిలా ఉంటే అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో న‌మోదైన తొలి క‌రోనా పాజిటివ్ కేసు ఇపుడు నెగెటివ్ గా (COVID-19 Patient Tests Negative) నిర్దార‌ణ అయింది.

Corona in India: ఆగని కరోనా మరణాలు, దేశ వ్యాప్తంగా 437 మంది మృతి, 13 వేలు దాటిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ (Coronavirus) మరణాలు ఆగడం లేదు. కొవిడ్-19 (COVID 19) కట్టడికి పటిష్ట చర్యలు కొనసాగుతున్నా మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు వైరస్ బారిన పడి 437 మంది మృతి (Coronavirus Death Toll) చెందారు. మొత్తం 13,387 మందికి కొవిడ్ సోకినట్లు గుర్తించారు. దేశంలో 1,749 మంది కోలుకోగా, 11,200 పాజిటివ్ కేసులు కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో కేసుల సంఖ్య 1007 నమోదు కాగా 23 మంది చనిపోయారు.

Corona In Dharavi: గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ధారావి, కొత్తగా 11 కేసులు నమోదు, ముంబై మురికివాడలో 71కి చేరిన కోవిడ్ 19 కేసుల సంఖ్య, మహారాష్ట్రలో 3 వేలు దాటిన కరోనా కేసులు

Hazarath Reddy

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి (Coranavirus in Maharashtra) తీవ్రత భయంకరంగా ఉంది. రోజురోజుకీ పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నది. ముఖ్యంగా ముంబైలో (Coranavirus in Mumbai) అతిపెద్ద స్ల‌మ్ ఏరియా ధార‌విలో (Corona In Dharavi) క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతుండ‌టం తీవ్ర‌ ఆందోళ‌న కలిగిస్తోంది. కరోనా హాట్‌స్పాట్‌లోని ధారావి ప్రాంతంలో ఈ రోజు 11 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా, ఈ ప్రాంతంలో కరోనా వైరస్ భారీన పడిన వారి సంఖ్య ఇప్పుడు 71 కి పెరిగిందని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ తెలిపింది.

Advertisement

COVID-19 in India: 400 దాటిన కరోనా మృతులు, దేశంలో 12 వేలు దాటిన కరోనా కేసులు, అత్యధికంగా మహారాష్ట్రలో 2,916 కరోనా కేసులు

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్‌ (Deadly COVID 19 in India) రోజురోజుకి విజృంభిస్తోంది. గురువారం ఉదయం వరకు భారత్‌లో 12,380 మందికి కోవిడ్ 19 (COVID 19) పాజిటివ్‌గా తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వారిలో 1,489 మంది కరోనా నుంచి కోలుకున్నారని.. 414 మంది మృతిచెందారని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 10,477 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని పేర్కొంది. అత్యధికంగా మహారాష్ట్రలో 2,916 కరోనా కేసులు నమోదుకాగా, 187 మంది మృతిచెందారు. తమిళనాడు, ఢిల్లీ, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌లలో కూడా కరోనా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది.

Coronavirus Cases in India: దేశంలో ఆగని కరోనా ఘోష, 12వేలకు చేరువలో కోవిడ్-19 కేసులు, 392కు చేరిన మృతుల సంఖ్య, హాట్‌స్పాట్స్‌గా 170 జిల్లాలు

Hazarath Reddy

దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ (Coronavirus) తీవ్రత భారత్‌లో రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా కరోనా బాధితుల సంఖ్య (coronavirus cases) 12 వేలకు దగ్గర్లో ఉంది. బుధవారం సాయంత్రం నాటికి కరోనా బాధితుల సంఖ్య 11,933కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దాదాపు 1,118 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా ( COVID 19)నుండి ఇప్పటి వరకు 1,343 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు 392 మంది కరోనాతో మరణించారు.

Deadly COVID-19: ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు అమెరికా షాక్, కరోనా అలర్ట్‌లో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైందని నిధులు నిలిపివేత, నిర్ణయం మంచిది కాదన్న బిల్‌గేట్స్,చైనా

Hazarath Reddy

ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)కు అమెరికా అందిస్తున్న నిధులు నిలిపివేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (United States President Donald Trump) శ్వేతసౌధం సాక్షిగా తెలిపారు. కరోనా వైరస్‌(COVID-19) సంక్షోభం గురించి అప్రమత్తం చేయడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైనందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అమెరికా అధ్య‌క్షుడు తీసుకున్న నిర్ణ‌యం మంచిది కాద‌ని మైక్రోసాఫ్ట్ సీఈవో బిల్‌గేట్స్ (Bill Gates) బుధ‌వారం అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో ఇలాంటి నిర్ణ‌యాలు స‌హేతుకం కాద‌ని పేర్కొన్నారు.

COVID-19 India Update: దేశంలో 11 వేలు దాటిన కేసులు, 377 మంది కరోనాతో మృతి, మహారాష్ట్రలో అత్యధికంగా 178 మరణాలు, ఏప్రిల్‌ 20 నుంచి లాక్‌డౌన్‌ సడలింపులు

Hazarath Reddy

దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ (Coronavirus) తీవ్రత భారత్‌లో రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా కరోనా బాధితుల సంఖ్య (coronavirus cases) 11 వేలు దాటింది. బుధవారం ఉదయం నాటికి కరోనా బాధితుల సంఖ్య 11,439కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించారు. దాదాపు 9,756 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా ( COVID 19)నుండి ఇప్పటి వరకు 1,306 మంది బాధితులు కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో ఈ మహమ్మారి బారిన పడి 38 మంది మృతి చెందారు. మొత్తంగా ఇప్పటి వరకు 377 మంది కరోనాతో మరణించారు.

Advertisement

COVID-19 in Dharavi: దేశానికి దిగులు పుట్టిస్తున్న ధారావి, ఏడు మంది కరోనా కాటుకు బలి, 55కు చేరిన కోవిడ్ -19 కేసుల సంఖ్య, ఇండియాలో 10 వేలు దాటిన కరోనావైరస్ కేసులు

Hazarath Reddy

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారావి (Dharavi COVID-19) దేశానికి దిగులు పుట్టిస్తోంది. ముంబైలో విస్తరించి ఉన్న ఈ మురికివాడలో కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దాదాపు 15 లక్షల మంది నివాసం ఉంటున్న ఈ ప్రాంతంలో కొత్తగా ఆరుగురికి కరోనా సోకగా (6 New Cases), ఇద్దరు మరణించారని బ్రిహన్‌ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌ (Brihanmumbai Municipal Corporation (BMC)) పేర్కొంది. వీటితో కలుపుకుని ఇప్పటి వరకు ధారావిలో మొత్తం 55 మందికి కరోనా సోకగా, ఏడుగురు మృతిచెందారు.

PM Narendra Modi: లాక్‌డౌన్‌పై స్పష్టత, మరి కొద్దిసేపట్లో ప్రధాని మోదీ ప్రసంగం, కరోనా నేఫథ్యంలో దేశాన్ని మూడు జోన్లుగా విభజిస్తారని ఊహాగానాలు

Hazarath Reddy

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఉదయం 10 గంటలకు దేశాన్ని ఉద్దేశించి (PM Modi to Address the Nation) ప్రసంగిస్తారు. ఏప్రిల్ 14 న 21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్ (Lockdown) చివరి రోజు కావడంతో ప్రధాని (PM Modi) దీనిని పొడిగించాలా వద్దా అనే దానిపై స్పష్టత ఇవ్వనున్నారు. ఈ రోజు ప్రసంగంలో, దేశంలో కరోనావైరస్ (Coronavirus) సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి ప్రధాన మార్గం గురించి ప్రధాని మాట్లాడాలని భావిస్తున్నారు.

Visa,e-Visa of Foreigners: ఇండియాలో చిక్కుకున్న విదేశీయులకు ఊరట, వారి వీసా గడువు ఏప్రిల్ 30 వరకు పొడిగింపు, ఉత్తర్వులు జారీ చేసిన హోం మంత్రిత్వ శాఖ

Hazarath Reddy

కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ (India Lockdown) విధించింది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారు ఇండియాలోనే చిక్కుకుపోయారు. విమానాలను రద్దు చేయడంతో వారి ఇండియా నుంచి వెళ్లలేకపోయారు. అయితే ఇండియాలో చిక్కుకు పోయిన విదేశీయులకు భారత ప్రభుత్వం ఊరట కల్పించింది.విదేశీయుల వీసా గడువును పొడిగించింది.

Case Filed Against Telugu NRI : అమెరికాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగు ఎన్నారై, న్యూజెర్సీలో కేసు నమోదు చేసిన మరో ఎన్నారై, సారీ అంటూ మరో వీడియో విడుదల చేసిన యాంకర్

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఐ యాంకర్ స్వాతిదేవినేని (Telugu NRI Swathi Devineni) అమెరికాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు అమెరికాలో ఎన్‌ఆర్‌ఐ యాంకర్ స్వాతి దేవినేనిపై కేసు పెట్టారు. శ్రవణ్ అనే తెలుగు ఎన్‌ఆర్‌ఐ న్యూయార్క్‌లోని ఒక పోలీస్ స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఓ వీడియోను విడుదల చేశారు.అమెరికాలో ప్రజలలో ద్వేషాన్ని వ్యాప్తి చేసే విధంగా స్వాతి వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు.

Advertisement

COVID-19 : కరోనా నియంత్రణపై రిలయన్స్ శాస్త్రవేత్తల ముందడుగు, సముద్రంలో దొరికే నాచుతో కోవిడ్-19కి చెక్, రిలయన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ శాస్త్రవేత్తలు వెల్లడి

Hazarath Reddy

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ (coronavirus) మహమ్మారికి మందు రావడానికి ఆరు నెలలు పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించిన సంగతి విదితమే.ఈ వైరస్ నియంత్రణకు ఎటువంటి వ్యాక్సిన్ లేకపోవడంతో ఇది ప్రపంచ దేశాలను (Global Coronavirus) అల్లకల్లోలం చేస్తోంది. కోవిడ్-19 (COVID-19) దెబ్బకు దేశాలకు దేశాలే లాక్‌డౌన్ (Lockdown) లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కరోనా వైరస్ నివారణ ఔషధ తయారీలో నిమగ్నమై ఉన్నారు.

Coronavirus in Dharavi: ముంబై మురికివాడలో కరోనా ఘోష, ధారావిలో 47కు చేరిన కోవిడ్-19 కేసులు, ఐదుకి చేరిన మృతుల సంఖ్య, మహారాష్ట్రలో 1985కి చేరిన కరోనా కేసులు

Hazarath Reddy

ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ (Asia's largest slum) అయిన ధారావి (Dharavi) ఇప్పుడు దేశ వ్యాప్తంగా వణుకుపుట్టిస్తోంది. అక్కడ రోజు రొజుకు కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా నాలుగు కేసులు నమోదు కావడంతో ఇప్పుడు అక్కడ కోవిడ్ 19 (COVID-19 Cases) కేసుల సంఖ్య 47 కి పెరిగింది. ఘోరమైన కరోనావైరస్ (Coronavirus Pandemic) కారణంగా ఈ రోజు ఒక వ్యక్తి కూడా మరణించాడు. తద్వారా ఈ ప్రాంతంలో మరణించిన వారి సంఖ్య ఐదుకి చేరుకుంది.

COVID-19 Effect on US Economy: అమెరికాలో కరోనా మృత్యుఘోష, తరుముకొస్తున్న ఆర్థిక సంక్షోభం, ఆంక్షల్ని ఎత్తి వేసే దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్

Hazarath Reddy

అమెరికాలో కోవిడ్‌–19 (COVID-19 in America) విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పుడు అక్కడ మరణాలు 19 వేలు దాటినట్లుగా తెలుస్తోంది. తాజాగా కరోనా (Coronavirus) రక్కసి కోరల్లో చిక్కుకున్న అగ్రరాజ్యం అమెరికా మృతుల్లో మొదటి స్థానానికి చేరుకుంది. రోజూ రెండు వేలకు పైగా మరణాలు నమోదవుతున్న వేళ కోవిడ్‌ మృతుల్లో ఇటలీతో (Italy) పోటీపడుతూ వస్తున్న యూఎస్‌ (US) శనివారం రాత్రి అందిన లెక్కల మేరకు 20 వేల 506 మృతులతో ఇటలీని దాటేసింది.

Global COVID-19 Deaths: ప్రపంచాన ఆగని కరోనా మృత్యుఘోష, లక్షమందికి పైగా మృతి, 17 లక్షల మందికి పైగా కోవిడ్ 19 వైరస్, 364,000 మందికి పైగా రికవరీ

Hazarath Reddy

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా (US Coronavirus) వైరస్ విజృంభిస్తోంది. ఇక్కడ కరోనా ఎంత తీవ్రంగా ఉందంటే గడిచిన 24గంటల్లో అమెరికాలో 2,100పైగా కరోనా మరణాలు (US Coronavirus Deaths) నమోదయ్యాయి. యూఎస్‌లోని జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన కరోనా ట్రాకర్ ప్రకారం, అమెరికాలో (America) ఇప్పటి వరకు 5లక్షలమందికిపైగా కరోనా సోకింది

Advertisement
Advertisement