ప్రపంచం

Trump Concluded India Visit: రెండు రోజుల భారత పర్యటన ముగించుకొని స్వదేశానికి పయనమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ

Vikas Manda

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ తమ తొలి రెండు రోజుల భారత పర్యటనను ముగించుకొని మంగళవారం రాత్రి అమెరికాకు బయలుదేరిపోయారు. రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం ముగియగానే, ట్రంప్ ఫ్యామిలీ నేరుగా దిల్లీ విమానాశ్రయం చేరుకుని వారి ప్రత్యేక విమానంలో తిరిగి తమ స్వదేశానికి పయనమయ్యారు......

India- USA Deals: 'ఈ పర్యటన మాకెంతో ప్రత్యేకం, మీ ఆతిథ్యాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం' హైదరాబాద్ హౌజ్‌లో ట్రంప్ కీలక ప్రకటన, ఇండియా-యూఎస్ మధ్య కుదిరిన 3 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం

Vikas Manda

భారతదేశం నుంచి ఘనమైన స్వాగతం లభించింది. భారత ప్రజలు చూపిన ప్రేమ, ఆప్యాయతలు అమోఘం. దీనిని మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటామ అని ట్రంప్ అన్నారు. ఈ పర్యటన ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇరు దేశాలు భాగస్వామ్య విలువలు పాటిస్తాయి కాబట్టి ఇండియా- యూఎస్ఎ ఎప్పటికీ మిత్రదేశాలని పేర్కొన్నారు....

Namaste Trump: అమెరికాలో భారత్‌కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం. కీలక ఒప్పందాలు, సినిమా- క్రికెట్ విశేషాలు, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం, పేదరిక నిర్మూలన; ఆల్ రౌండ్ స్పీచ్‌తో అదరగొట్టిన డొనాల్డ్ ట్రంప్

Vikas Manda

తన హయాంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఉన్నత స్థితిని చూసిందని తెలిపిన ట్రంప్, రాబోయే రోజుల్లో ఇండియా ఎకానమీ కూడా బలపడుతుందని, వచ్చే పదేళ్లలో ఇండియాలో పేదరికం పూర్తిగా నిర్మూలించబడి, మిడిల్ క్లాస్ జనాలు అతిపెద్ద సంఖ్యలో ఉండే దేశంగా మారుతుందని ట్రంప్ జోస్యం చెప్పారు....

Namaste Trump: ఒకరు స్టాచూ ఆఫ్ లిబర్టీ- ఇంకొకరు స్టాచూ ఆఫ్ యునిటీ..యూఎస్- భారత్ మధ్య ఉన్నది భాగస్వామ్యం కాదు, దగ్గరి సంబంధం, ఈ బంధం కలకాలం కొనసాగనీ: నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ప్రధాని మోదీ స్పీచ్

Vikas Manda

భారతదేశం-యుఎస్ సంబంధాలు ఇకపై మరొక భాగస్వామ్యం కాదు. ఇది చాలా గొప్ప మరియు దగ్గరి సంబంధం. ఒకటి 'స్వేచ్ఛా భూమి', మరొకటి ప్రపంచం ఒక కుటుంబం అని నమ్ముతుంది. ఒకరు 'స్టాచూ ఆఫ్ లిబర్టీ' గురించి గర్వంగా భావిస్తారు, మరొకరు భావిస్తారు 'స్టాచూ ఆఫ్ యూనిటీ' గురించి గర్వంగా చెప్పుకుంటారు. భారత్ - అమెరికా మైత్రి కలకాలం వర్ధిల్లాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.....

Advertisement

Trump Visit Highlights: మహత్ముడి చర్ఖాతో నూలు వడికిన అమెరికా అధ్యక్షుడు, వేలమంది జనం డొనాల్డ్ ట్రంప్ రోడ్ షోకు అడుగడుగునా కేరింతలతో స్వాగతం, ట్రంప్ అహ్మదాబాద్ సందర్శన విశేషాలు

Vikas Manda

మొతెరా స్టేడియం గా ప్రసిద్ది చెందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం లక్ష మందికి పైగా కూర్చునే సామర్థ్యం కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. కొత్తగా నిర్మించిన స్టేడియం "నమస్తే ట్రంప్" కార్యక్రమానికి వేదిక.....

Donald Trump India visit: ఏం చేస్తారు.. ఏం చూస్తారు? నేడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ రాక, నేడు- రేపు ఆయన షెడ్యూల్‌కు సంబంధించిన డీటేల్స్ ఇలా ఉన్నాయి

Vikas Manda

అమెరికా నుంచి బయలుదేరిన ట్రంప్ మరికొద్ది సేపట్లో భారత్ లోని అహ్మదాబాద్ నగరానికి చేరుకోనున్నారు. డొనాల్డ్ ట్రంప్ కు ఇది తొలి భారత పర్యటన. నేడు, రేపు రెండు రోజుల పాటు ఆయన పర్యటన సాగనుంది. ఫిబ్రవరి 24న తొలి రోజు గుజరాత్ రాష్ట్రంలోపర్యటిస్తారు. ఇక్కడ స్వాగత కార్యక్రమాలు, సభ మరియు ఇతర కార్యక్రమాలు ముగిసిన తర్వాత.....

Ivanka Tump Joins The India Tour: మరోసారి ఇండియాలో పర్యటించనున్న ఇవాంకా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన బృందంలోనే చేరిక, వెల్లడించిన రిపోర్ట్స్

Vikas Manda

ఇవాంకా భారతదేశంలో పర్యటించడం ఇది రెండవసారి కాబోతుంది. గతంలో 2017 నవంబర్‌లో హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జిఇఎస్) కు ఇవాంకా ట్రంప్ స్పెషల్ గెస్ట్ గా హాజరైంది. ఇప్పుడు 2020లో మొత్తం ఫ్యామిలీతో కలిసి భారతదేశంలో ఇవాంకా పర్యటించనుంది...

The Beast Car: భారత రోడ్లపై అమెరికా ప్రెసిడెంట్ కార్ రయ్ రయ్.. భద్రతలో బెస్ట్ అని చెప్పబడుతున్న 'ది బీస్ట్' కార్ ప్రత్యేకతలు, డొనాల్డ్ ట్రంప్ పర్యటన విశేషాలు తెలుసుకోండి

Vikas Manda

బీస్ట్ డ్రైవర్లకు యూఎస్ సీక్రెట్ సర్వీసెస్ తో శిక్షణతో పాటు, అత్యవసర సమయాల్లో ప్రెసెడెంట్ ను కాపాడేందుకు అవసరమయ్యే శిక్షణలు కూడా ఇస్తారు. కారును 180 డిగ్రీలలో ఎలా తిప్పాలి అనేదానిపై శిక్షణ ఇస్తారు. ప్రతిరోజు డ్రైవర్ ఆరోగ్యం, మానసిక స్థితిని పరీక్షించిన తర్వాతే డ్రైవింగ్ కు అనుమతించబడతారు.....

Advertisement

H-1B Visa: అమెరికాలో చిక్కుకున్న 24 వేల మంది తెలుగు టెకీలు, ఆ వీసా రాకుంటే తట్టా బుట్టా సర్దుకోవడమే, వీరు ఏప్రిల్ నెల లోపు హెచ్‌-1బీ వీసా పొందాల్సిందే

Hazarath Reddy

అమెరికాకు ఉన్నత విద్య కోసం ఇండియా నుంచి వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తున్న భారతీయులు ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మొత్తం 68 వేల మంది భారతీయులు (Indian Techies) ఇప్పుడు అక్కడ హెచ్‌-1బీ వీసా కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో మన తెలుగు రాష్ట్రాలకు (AP And TS) చెందిన వారు దాదాపు 20 నుంచి 24 వేల మంది ఇంజనీర్లు ఉన్నారు. వీరంతా నిర్ణీత గడువులోపు హెచ్‌-1బీ వీసా పొందలేక పోతే ఇండియాకు రావాల్సి ఉంటుంది.

COVID-19 Outbreak: ఆస్పత్రి డైరక్టర్‌ను కరోనా చంపేసింది, సామాన్యుల పరిస్థితి ఏంటీ, వైరస్ భారీన పడి మృతి చెందిన వుహాన్‌లోని ఆస్పత్రి డైరెక్టర్ లియూ చిమింగ్

Hazarath Reddy

వుహాన్‌లోని ఆస్పత్రి డైరెక్టర్ (Wuhan Hospital Director) కూడా ఈ వైరస్‌తో కన్నుమూశారు. వుచాంగ్ ఆస్పత్రి డైరెక్టర్ లియూ చిమింగ్ (Wuchang Hospital Director Liu Zhiming) ఈ వైరస్‌తో మృతి చెందినట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. లియూ చిమింగ్‌ను కాపాడేందుకు చేసిన అన్ని ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మైన‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు.

COVID-19 Vaccine: కోవిడ్-19 నుంచి భారీ ఉపశమనం, వ్యాక్సిన్ తయారీలో మరో ముందడుగు, 6 నెలల్లోపు మనుషులపై ప్రయోగం, చైనాలో 1800 దాటిన కరోనా మృతులు

Vikas Manda

ఈ వ్యాక్సిన్ గనుక జంతువులపై మంచి ఫలితాలను చూపించి అందుబాటులోకి వస్తే కరోనావైరస్ ను అరికట్టే తొలి మేడ్ ఇండియా వ్యాక్సిన్ గా అవతరించనుంది. ఇంతకుముందు కూడా భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ ఎస్ఎస్ వాసన్ నేతృత్వంలో ఆస్ట్రేలియాలోని కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సిఎస్ఐఆర్ఓ) యొక్క డేంజరస్ పాథోజెన్స్ బృందం కరోనావైరస్ ను కృత్రిమంగా పుట్టించింది....

No Role For Third Party Mediation: కాశ్మీర్‌పై జోక్యం చేసుకోవద్దు, ఐరాస ప్రధాన కార్యదర్శికి భారత్ ఘాటు హెచ్చరిక, అక్కడ ఉగ్రమూకను ఖాళీ చేయించండి, తేల్చి చెప్పిన భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్

Hazarath Reddy

తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాల జోక్యంపై భారత్ కొంచెం ఘాటుగా స్పందిస్తోంది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్‌పై (Jammu and Kashmir) ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెర్స్‌ (General António Guterres) చేసిన ప్రతిపాదనను భారత్‌ (India) తోసిపుచ్చింది. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి భారత్ సిద్ధంగా లేదని, పొరుగుదేశం బలవంతంగా, అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాల నుంచి ఖాళీ చేసే విషయం మీద ముందు ఐక్యరాజ్యసమితి దృష్టిసారించాలని కోరింది.

Advertisement

Swami Chakrapani: మాంసం తిన్నందుకే చైనాను దేవుడు శపించాడు, కరోనా విగ్రహాన్ని ప్రతిష్టించి క్షమాపణ చెబితే దేవుడు శాంతిస్తాడు, లేకుంటే చైనా సర్వనాశనమే, స్వామి చక్రపాణి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

చైనా (China) ఇప్పటికైనా కళ్లు తెరిచి కరోనా విగ్రహాన్ని సృష్టించి..దాన్ని ప్రతిష్టించి క్షమాపణ చెప్పాలి..లేకుండా చైనీయులంతా కరోనాకు బలి కావాలసిందే' అని స్వామి చక్రపాణి (Swami Chakrapani) అన్నారు. ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

COVID-19: యూకెలో కరోనా వల్ల 4 లక్షల మంది చనిపోతారట, యుకె శాస్త్రవేత్త నీల్ ఫెర్గూసన్ వెల్లడి, 1669కి దాటిన మరణాలు, ఎలా విస్తరిస్తుందనేది ఇంకా అంతుచిక్కన రహస్యమే

Hazarath Reddy

కోవిడ్-19 వైరస్ మీద బ్రిటీష్ శాస్త్రవేత్త (British expert) సంచలన వ్యాఖ్యలు చేశారు. యూకేలో ఈ వైరస్ వ్యాపిస్తే దాదాపు 4 లక్షల మంది చనిపోతారని శాస్త్రవేత్త, ప్రోఫెసర్ నీల్ ఫెర్గూసన్ (UK Scientist Professor Neil Ferguson) వెల్లడించారు. ఇతను లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో ప్రోఫెసర్ గా పనిచేస్తున్నారు.

Vijay Mallya: మీ డబ్బులు పైసాతో సహా చెల్లిస్తా..నన్ను వదిలేయండి, యుకే కోర్టు బయట విజయ్ మాల్య, తనపై ఈడీ కక్ష గట్టిందంటూ ఆరోపణలు, మాకు ఆయన్ని అప్పగించమంటున్న ఈడీ

Hazarath Reddy

మీ డబ్బులు మీరు తీసుకోండి అని ఒకవైపు బ్యాంకులను కోరుతున్నా. అలా కుదరదు.. మాల్య ఆస్తులపై మాకు అధికారం ఉంది అని ఈడీ (Enforcement Directorate) చెప్తోంది. అంటే, ఒకే ఆస్తులకు సంబంధించి ఒకవైపు ఈడీ, మరోవైపు బ్యాంకులు పోరాడుతున్నాయి. నాలుగేళ్లుగా ఇదే తీరు’ అని మండిపడ్డారు. ‘చేతులు జోడించి బ్యాంకులను వేడుకుంటున్నా. మీరు ఇచ్చిన రుణం మొత్తం మీరు తీసుకోండి. నిజానికి కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ (Kingfisher Airlines) తరఫున తీసుకున్న రుణం అది. అయినా కూడా బాధ్యతగా భావించి చెల్లిస్తానంటున్నా’ అని అన్నారు.

India- USA Trade: భారత్ అభివృద్ది చెందిన దేశం, జీఎస్పి కింద వాణిజ్య ప్రయోజనాలను పొందే అర్హత ఈ దేశానికి లేదు, భారత్‌కు జీఎస్పీ రద్దు నిర్ణయాన్ని సమర్థించుకున్న అమెరికా

Vikas Manda

యూఎస్ పరిపాలన ప్రకారం, ప్రపంచ వాణిజ్యంలో 0.5 శాతం కంటే తక్కువ వాటా ఉన్న దేశం జీఎస్పి కింద ప్రయోజనాలను పొందవచ్చు. అంతకంటే ఎక్కువ ఉంటే ప్రయోజనాలు వర్తించవు. ఈ క్రమంలో భారత్ తో పాటు బ్రెజిల్, ఇండోనేషియా, హాంకాంగ్, దక్షిణాఫ్రికా మరియు అర్జెంటీనాతో తదితర దేశాలను జీఎస్పీ నుంచి యుఎస్‌టిఆర్ తొలగించింది....

Advertisement

COVID-19 Outbreak: జపాన్ నిర్భంధంలోని డైమండ్ ప్రిన్సెస్ ఓడలో ఉన్న ఇద్దరు భారతీయులకు కరోనావైరస్ పాజిటివ్, నౌకలో చిక్కుకొని ఆవేదన చెందుతున్న భారతీయులు, రక్షించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి

Vikas Manda

ఒకరికి కొవిడ్ -2019 వైరస్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఓడలోని మిగతావారికి ఈ వైరస్ సంక్రమించి ఉంటుంది అనే అనుమానంతో వారు బయటకు రాకుండా ఈనెల 4వ తేదీ నుంచి ఈ ఓడను జపాన్ తీరానికి దూరంగా నిర్భంధించి ఉంచారు.....

COVID-19: కరోనా పని పట్టాలంటే 18 నెలలు ఆగాల్సిందే, అందుబాటులోకి రానున్న మొదటి వ్యాక్సిన్, అప్పటిదాకా ఉన్న వనరులతోనే పోరాటం చేయాలన్న డబ్ల్యూహెచ్‌ఓ, ఇక నుంచి కరోనా పేరు కోవిడ్-9

Hazarath Reddy

ప్రపంచాన్ని వణికిస్తోన్న ఈ కరోనా వైరస్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త పేరు పెట్టింది. ఇకపై కరోనాను అధికారికంగా ‘కోవిడ్‌–19’గా పిలవనున్నారు. ఇందులో సీ అక్షరం కరోనాను, వీ అక్షరం వైరస్‌ను, డీ అక్షరం డిసీజ్‌ (జబ్బు)ను, 19ని.. వ్యాధిని కనుగొన్న 2019కి సూచనగా పెట్టారు.

Hafiz Saeed Convicted: ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు ఐదున్నరేళ్ల జైలు శిక్ష విధింపు, ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడన్న అభియోగంలో దోషిగా తేల్చిన పాకిస్థాన్ కోర్టు

Vikas Manda

సయీద్ పై నమోదైన మరో ఆరు కేసులపై కూడా ఏకకాలంలో విచారణ జరిపి, తీర్పు జారీచేయాలనే మరో పిటిషన్‌ను లాహోర్ కోర్టు మంగళవారం స్వీకరించింది. 26/11 ముంబై దాడుల్లో హఫీజ్ సయీద్ సూత్రధారిగా ఉన్నాడు....

Foreign Currency In Peanuts: వేరుశనగ కాయల్లో రూ.45 లక్షల విలువ గల విదేశీ కరెన్సీ, ఢిల్లీ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి పట్టుబడ్డ ప్రయాణీకుడు, అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

ఓ వ్యక్తి రూ.45 లక్షల విలువైన విదేశీ కరెన్సీని వేరుశనగ కాయల్లో అక్రమంగా తీసుకు వస్తూ ఢిల్లీ విమానాశ్రయంలో (Delhi Airport) సీఐఎస్‌ఎఫ్‌ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) (Central Industrial Security Force) సిబ్బందికి చిక్కగా.. వారు అది చూసి అవాక్కయ్యారు.

Advertisement
Advertisement