ప్రపంచం
Uttar Pradesh: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో రాని మార్పు, యువతిపై అత్యాచారం చేసి నిప్పంటించిన దుండుగుడు, ఉన్నావ్ రేప్ ఘటన మర్చిపోక ముందే ఉత్తర ప్రదేశ్‌లో మరో దారుణం, ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య యువతి
Hazarath Reddyదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర ప్రదేశ్‌లోని(Uttar Pradesh) ఉన్నావ్‌ ఘటన (Unnao Rape Case) మర్చిపోక ముందే ఆ రాష్ట్రంలో మరో ఘోరం జరిగింది. 18ఏళ్ల యువతిపై దుండగుడు అత్యాచారం చేసి తర్వాత నిప్పు(Teenager Raped And Set On Fire)పెట్టాడు. 90 శాతం గాయాలతో ఆస్పత్రిలో ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
Unnao Rape Case: ఉన్నావ్ అత్యాచార కేసుపై తీర్పు నేడే, బీజేపీ ఎమ్మెల్యే భవితవ్యాన్ని తేల్చనున్న ఢిల్లీ కోర్టు, తీర్పు ఇవ్వనున్న జిల్లా జడ్జ్‌ ధర్మేష్‌ శర్మ, 2017లో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌‌లో అత్యాచార ఘటన
Hazarath Reddyదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2017 ఉన్నావ్ అత్యాచారం కేసులో ఢిల్లీ కోర్టు (Delhi's Tis Hazari Court) ఇవాళ మధ్యాహ్నం తీర్పు వెలువరించనుంది. యువతిని కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేసిన ఈ కేసులో(Unnao Rape Case) బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సింగ్‌ సెంగర్‌ (former BJP MLA Kuldeep Singh Sengar) నిందితుడిగా ఉన్నారు.
Vartika Singh: నా రక్తంతో రాస్తున్నా, వారిని ఉరి తీసే అవకాశం నాకివ్వండి, హోం మంత్రి అమిత్ షాను కోరిన ఇంటర్నేషనల్ షూటర్ వర్తిక సింగ్‌, త్వరలో నిర్భయ నిందితులని ఉరి తీసే అవకాశం
Hazarath Reddy2012 డిసెంబరులో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన (Nirbhaya gang-rape case) దేశ వ్యాప్తంగా తీవ్ర పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటన తర్వాత ఈ నెలలో తెలంగాణాలో జరిగిన దిశ ఘటన (Disha Rape Murde case) దేశాన్ని కుదిపేసింది. ఈ ఘోరమైన ఘటనలే కాకుండా ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు, ఆపై హత్యలు పెరిగిపోతూ ఉన్నాయి.
Biryani Seller: బిర్యాని అమ్మాడని చావబాదారు, కుల జాడ్యంలో కొట్టుమిట్టాడుతున్న గ్రేటర్ నోయిడా, కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు వేగవంతం
Hazarath Reddyప్రపంచం ఎంత ముందుకు వెళ్తున్నా కుల జాడ్యం(Casteism) మాత్రం వీడటం లేదు. దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో మళ్లీ ఈ కుల జాడ్యం పడగవిప్పింది. అక్కడ ఓ దారుణం చోటు చేసుకుంది.దళిత వ్యక్తి బిర్యానీ అమ్ముతున్నాడనే ఆగ్రహంతో కొందరు అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టిన ఘటన కలకలం రేపింది. గ్రేటర్‌ నోయిడా(Greater Noida)లోని రబుపురాలో ఈ దాడి జరిగింది.
CAA Stir: రైల్వే స్టేషన్లకు నిప్పు, పశ్చిమబెంగాల్‌లో పౌరసత్వ బిల్లును నిరసిస్తూ మిన్నంటిన ఆందోళనలు, కఠిన చర్యలు తప్పవన్న మమతా బెనర్జీ, ఆందోళనకారుల ధాటికి పలు రైళ్లు రద్దు
Hazarath Reddyఅధికార పార్టీ బీజేపీ(BJP) ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (amended Citizenship Act) కొన్ని రాష్ట్రాల్లో నిప్పు రాజేస్తోంది. దీనిని వ్యతిరేకిస్తున్న ఆయా రాష్ట్రాల ప్రజలు రోడ్లపైకి ఎక్కుతున్నారు. ఆందోళనలు హింసాత్మకరూపంగా మారుతున్నాయి. ప్రధానంగా పశ్చిమబెంగాల్‌లో నిరసనలు మిన్నంటాయి.
Swati Maliwal Hunger Strike: దిశ చట్టం కోసం 13 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష, క్షీణించిన ఢిల్లీ మహిళా హక్కుల కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ ఆరోగ్యం, లోక్ నాయక్ హాస్పిటల్‌కి తరలింపు, చికిత్స అందిస్తున్న డాక్టర్లు
Hazarath Reddyమహిళలపై అకృత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ మహిళా హక్కుల కమిషన్(DCW chief) చీఫ్ స్వాతి మాలివాల్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష(Swati Maliwal Hunger Strike) 13వ రోజుకు చేరింది. దేశవ్యాప్తంగా దిశ చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న స్వాతి మాలివాల్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది.
Prashant Kishor: కేజ్రీవాల్‌తో జత కట్టిన ప్రశాంత్ కిషోర్, 2020లో ఆప్ విజయకోసం వ్యూహాలకు పదును, స్వాగతం పలికిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, పని చేసిన చోటల్లా గెలుపు బావుటా ఎగురవేస్తున్న పీకే టీం
Hazarath Reddyప్రశాంత్ కిషోర్(Prashant Kishor) ఈ పేరు రాజకీయాల్లో తెలియని వారు ఉండరేమో.. 2014 ఎన్నికల సమయంలో మోడీ ప్రచార వ్యూహకర్తగా వ్యవహరించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. మోడీ ప్రచారం కోసం అనేక వ్యూహాలు రచించి బీజేపీ(BJP) పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషించారు.
Sanjay Raut Warns Ally Congress: వీర సావర్కర్ గురించి తక్కువగా మాట్లాడితే సహించేది లేదు, ట్విట్టర్ వేదికగా విరుచుకుపడిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్, గాంధీ, నెహ్రూలాగే సావర్కర్ కూడా మహనీయుడే అన్న శివసేన
Hazarath Reddyకాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi) ‘రేప్ ఇన్ ఇండియా’ (Rape In India) వ్యాఖ్యలపై దేశంలో తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దేశాన్ని, మహిళల్ని అవమానపరిచే విధంగా ఉన్నాయని రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని అధికార పార్టీ బీజేపీ (BJP) డిమాండ్ చేస్తోంది. మహిళలపై అకృత్యాల్ని పెంచేదిగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీ ఫైర్ అవుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ మళ్లీ మరో వివాదంలో చిక్కుకున్నారు.
PM Modi Falls Down At Ganga Ghat: ప్రధాని మోడీకి తప్పిన ప్రమాదం, గంగానది మెట్లు ఎక్కుతూ జారి పడిన ప్రధాని, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, గంగా అటల్ ఘాట్ వద్ద ఘటన
Hazarath Reddyకాన్పూర్ (Kanpur) పర్యటనలో ప్రధాని మోడీకి (PM Modi) పెను ప్రమాదం తప్పింది. గంగానది (Ganga River) మెట్లు ఎక్కుతూ ప్రధాని జారీ పడ్డారు. అటల్ ఘాట్ వద్ద ఒక అడుగు తప్పి మెట్లపై పడిపోయారు అదృష్టవశాత్తు ఆయనకు గాయాలేం కాలేదు. వెంట ఉన్న సెక్యూరిటీ త‌క్ష‌ణ‌మే ఆయన్ను పైకి లేపారు.
'Bharat Bachao' Rally: దేశం తగలబడిపోతోంది, అధిక ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారు, ఇవేమి మోడీ-అమిత్‌షాలకు పట్టడం లేదు, ఇష్టమొచ్చినట్లుగా పాలన సాగిస్తున్నారు, భారత్ బచావో ర్యాలీలో సోనియా గాంధీ ఘాటు విమర్శలు
Hazarath Reddyపౌరసత్వ సవరణ బిల్లుతో దేశం తగలిబడి పోతున్నా మోడీ-షాలకు(Modi-Shah) పట్టటం లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi)ఘాటుగా విమర్శించారు.దేశంలో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అధిక ధరలతో ప్రజలు అల్లాడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. అందుకు అసోం, ఇతర ఈశాన్యా రాష్ట్రాలే నిదర్శనమని ఆమె తెలిపారు.
Narendra Modi: పవిత్ర గంగానదిలో ప్రధాని మోడీ బోటు షికారు, గంగానది ప్రక్షాళన కోసం నమామి గంగ ప్రాజెక్టు చేపట్టిన మోడీ సర్కారు, చంద్రశేఖర్ ఆజాద్‌కు నివాళి అర్పించిన భారత ప్రధాని
Hazarath Reddyభారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) పవిత్ర గంగానదిలో బోట్ రైడ్ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌లోని అటల్ ఘాట్(Atal ghat) వద్ద ప్రధాని వద్ద మోడీ సరదాగా షికారు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ సీనియర్ నేతలతో పాటు ఎన్డీఏ(NDA) మిత్రపక్ష నేతలు మోడీ వెంట ఉన్నారు.
Earthquake In Maharashtra: మహారాష్ట్రలో భూప్రకంపనలు, మూడు సార్లు కంపించిన భూమి, ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన గ్రామస్తులు, భూప్రకంపనలు వాస్తవమే అన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ కైలాష్ షిండే
Hazarath Reddyమహారాష్ట్రలో(Maharashtra) భూమి కంపించింది. శనివారం తెల్లవారుజామున 5:20 గంటలకు ఫాల్ఘర్‌ ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. పల్ఘర్ జిల్లా దహను తాలుకాలోని దుండల్‌వాడిలో శుక్రవారం(డిసెంబర్ 13, 2019) మధ్యాహ్నం నుంచి శనివారం(డిసెంబర్ 14, 2019) తెల్లవారుజాము వరకు మూడు సార్లు భూమి కంపించింది. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.
'Bharat Bachao' Rally: నా పేరు రాహుల్ సావర్కర్ కాదు, రాహుల్ గాంధీ, రేప్ ఇన్ ఇండియా వ్యాఖ్యలపై సారీ చెప్పే ప్రసక్తే లేదు, వాళ్లే క్షమాపణ చెప్పే రోజు వస్తుంది, భారత్ బచావో ర్యాలీలో బీజేపీపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
Hazarath Reddyభారత్ బచావో ర్యాలీలో(Bharat Bachao Rally) కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నిప్పులు చెరిగారు. బీజేపీ(BJP) నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా విమర్శించారు. 'భారత్ బచావో' ర్యాలీలో పాల్గొని ఆయన మాట్లాడారు. 'రేప్ ఇన్ ఇండియా (Rape in India) వ్యాఖ్యలపై నేను క్షమాపణ చెప్పాలని నిన్న పార్లమెంటులో బీజేపీ డిమాండ్ చేసింది.
'Bharat Bachao' Rally: భారత్ బచావో ర్యాలీ, ప్రధాని మోడీపై సమరభేరి మోగించిన కాంగ్రెస్ పార్టీ, మహిళలకు భద్రత లేకుండా పోయింది, బీజేపీపై నిప్పులు చెరిగిన ప్రియాంకా గాంధీ వాద్రా, ఢిల్లీలో భారీ ర్యాలీకి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు
Hazarath Reddyబీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ (Congress) పిలుపునిచ్చిన 'భారత్ బచావో' ర్యాలీకి(Bharat Bachao Rally) వేలాదిగా ప్రజలు తరలివస్తున్నారు. ఢిల్లీ(Delhi)లోని రామ్‌లీలా గ్రౌండ్స్‌( Ramlila Maidan) వేదికగా ఈ ర్యాలీ జరుగుతోంది. కాగా మోడీ (PM Modi) ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ పార్టీ భారత్ బచావో ర్యాలీకి పిలుపునిచ్చింది.
Ayesha Meera Re-Postmortem: 12 ఏళ్ల తరువాత..,ఆయేషా మృతదేహానికి నేడు రీపోస్ట్‌మార్టం, హైకోర్టు ఆదేశాలతో సీబీఐ సంచలన నిర్ణయం, రీ-పోస్ట్‌మార్టం మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించనున్న అధికారులు
Hazarath Reddyఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా(Ayesha Meera) హత్య కేసులో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయేషా మీరా మృతదేహానికి మరోసారి పోస్ట్‌మార్టం (Ayesha Meera Re Postmortem) నిర్వహించబోతోంది. ఈ నేపథ్యంలో ఉదయాన్నే సీబీఐ(CBI) అధికారులు తెనాలిలోని ఆయేషాను ఖననం చేసిన స్మశానానికి వచ్చారు.
Supreme Court: 2019 లోక్‌సభ ఎన్నికల్లో అవకతవకలు, ఎన్నికల కమిషన్‌కు సుప్రీం నోటీస్, 349 లోక్‌సభ నియోజకవర్గాల్లో భారీ వ్యత్యాసం అంటూ పిటిషన్, దాఖలు చేసిన ఏడీఆర్‌,కామన్‌ కాజ్‌ స్వచ్ఛంద సంస్థలు
Hazarath Reddy2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో (17th Lok Sabha Election)బీజేపీ(BJP) అఖండ మెజార్టీ సాధించి రెండో సారి అధికారం చేపట్టిన సంగతి విదితమే. అయితే ఈ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ పరిశీలించిన సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్(Election Commission)కి నోటీసులు జారీ చేసింది.
Arvind Kejriwal: ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం,'బాలికలతో అసభ్యంగా ప్రవర్తించం', ప్రతి రోజూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బాలురతో ప్రతిజ్ఞ చేయించాలంటున్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌
Hazarath Reddyదేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న క్రమంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ (Delhi) ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు మానవత్వంతో మెలిగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
Tamil Nadu Suicides: తమిళనాడులో ఘోరం, కుటుంబాన్ని బలి తీసుకున్న ఆన్‌లైన్ లాటరీ, చనిపోతూ సెల్పీ వీడియో తీసుకున్న కుటుంబం
Hazarath Reddyతమిళనాడు(Tamil Nadu)లో విషాదం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని విల్లుపురం(Villupuram) సమీపంలోని సలామత్‌నగర్‌లో ఆన్‌లైన్ లాటరీ.. ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఆన్‌‌లైన్ లాటరీలో మోసపోవడంతో కుటుంబ సభ్యుల అందరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులు తమ ముగ్గురు పిల్లలకు విషమిచ్చి వారు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఆన్‌లైన్‌ లాటరీలో మోసపోయి, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు(Suicide) పాల్పడ్డారు.
'Rape In India' Remark: రాహుల్ రేప్ ఇన్ ఇండియా వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్, క్షమాపణ చెప్పాలని పట్టుబడిన అధికార పార్టీ, క్షమాపణ ప్రసక్తే లేదన్న రాహుల్ గాంధీ, అలా అనడానికి కారణం తెలుసుకోండి అంటున్న కాంగ్రెస్ ఎంపీ
Hazarath Reddyభారతదేశం(India)లో జరుగుతున్న రేప్‌లపై కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై లోక్ సభ(Lok Sabha)లో దుమారం చెలరేగింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన రేప్ ఇన్ ఇండియా(Rape In India)వ్యాఖ్యలు దేశాన్ని అవమానపరిచే విధంగా ఉన్నాయని వెంటనే రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు.
Nirbhaya Rape Case: నిర్భయ కేసు డిసెంబర్18కి వాయిదా, డెత్ వారెంట్ జారీ చేసి ఉరితీయాలంటూ నిర్భయ తల్లిదండ్రుల పిటిషన్, నిర్భయ నిందితుడు అక్షయ్ రివ్యూ పిటిషన్ డిసెంబర్ 17న సుప్రీంకోర్టులోకి, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్న ఢిల్లీ కోర్టు
Hazarath Reddyనిర్భయ దోషులకు (Nirbhaya Rape Case) త్వరగా డెత్ వారెంట్ (death warrant)జారీ చేసి ఉరితీయాలన్న నిర్భయ తల్లిదండ్రుల పిటిషన్‌పై(petition) పటియాలా కోర్టు విచారణ జరిపింది. ఈ పిటిషన్ పై విచారణను డిసెంబర్ -18,2019కి ఢిల్లీ కోర్టు (Delhi Court) వాయిదా వేసింది. బుధవారం(డిసెంబర్-18,2019)మధ్యాహ్నాం 2గంటలకు ఈ పిటిషన్ పై విచారణ చేయనున్నట్లు అడిషినల్ సెషన్ జడ్జి సతీష్ కుమార్ అరోరా (Additional Session Judge Satish Kumar Arora) తెలిపారు.