World

India Post Aircraft: బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన విమానం, పశ్చిమ బెంగాల్‌‌లో ఘటన, బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు,కోల్‌కతా విమానాశ్రయంలో మూలన పడి ఉన్న డజనుకు పైగా విమానాలు

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్‌లోని(West Bengal) బర్ధమాన్ జిల్లాలోని దుర్గాపూర్‌లో ( DURGAPUR)ట్రక్కుపై తరలిస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్‌ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన వైనం మంగళవారం వెలుగు చూసింది. భారత తపాలా శాఖకు చెందిన ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ (India Post Aircraft) కొంతకాలం నుంచి నిరూపయోగంగా ఉంది. నేషనల్ హైవే-2 బ్రిడ్జి కింద ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇరుక్కుపోయింది. దీంతో విషయం తెలుసుకున్న తపాలా శాఖ అధికారులు దుర్గాపూర్‌కు చేరుకున్నారు.

Delhi Fire At Narela industrial Area: ఢిల్లీని వెంటాడుతున్న అగ్ని ప్రమాదాలు, షూ ఫ్యాక్టరీలో మరో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు, అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) వరుసగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే రెండు ప్రమాదాలు ఢిల్లీ ప్రజలకు ఉక్కిరిబిక్కిర చేశాయి. వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా నెల వ్యవధిలో అక్కడ మూడో అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం (డిసెంబర్ 24)నరేలా ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీలో (Delhi's Narela industrial area) భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.

Jharkhand Election Results: చిత్తయిన బీజేపీ, 47 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన జేఎంఎం-కాంగ్రెస్‌-ఆర్జేడీ కూటమి, 25 స్థానాలకు పరిమితమైన బీజేపీ, రఘుబర్ దాస్ రాజీనామా, నూతన ముఖ్యమంత్రి కానున్న హేమంత్ సోరెన్

Hazarath Reddy

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో(Jharkhand Assembly Elections 2019) బీజేపీకి షాకింగ్‌ ఫలితాలు ఎదురయ్యాయి. జేఎంఎం-కాంగ్రెస్‌-ఆర్జేడీ కూటమి (JMM-Congress-RJD) మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 81 స్థానాలకుగాను ప్రభుత్వ ఏర్పాటకు కావాల్సిన మెజారిటీ (41) స్థానాలను కూటమి అధిగమించి 47 సీట్లు (ఆధిక్యం+విజయం)సాధించింది. బీజేపీ (BJP)పార్టీ 25 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు జేవీఎం(JVM) 3, ఏజేఎస్‌యూ(AJSU) 2, ఇతరులు స్థానాల్లో గెలుపొందారు.

Tamil Nadu: చిట్టి జంతువులపై స్మగ్లర్ల కన్ను, స్మగ్లింగ్ చేస్తుండగా పోలీసులకు పట్టుబడిన ప్రయాణికుడు, బ్యాంకాక్ నుంచి చెన్నైకు స్మగ్లింగ్, ముద్దొచ్చే ఆ చిట్టి జంతువులను తిరిగి బ్యాంకాక్‌కు పంపించిన ఇంటలిజెంట్ ఆఫీసర్లు

Hazarath Reddy

చూడగానే ముద్దొచ్చేలా ఉన్న చిన్న జంతువులను స్మగ్లింగ్ చేస్తూ తమిళనాడులో (Tamil Nadu) ఓ స్మగ్లర్ ఇంటలిజెంట్ ఆఫీసర్లకు దొరికిపోయాడు. బ్యాంకాక్ నుంచి వచ్చి చెన్నైలో దిగిన భారత్ కు చెందిన ఓ ప్రయాణీకుడు ఈ అరుదైన జంతువులను బ్యాగులో పెట్టుకుని చెన్నై ఎయిర్‌పోర్టులో (Chennai airport) కనిపించాడు. అతను ఎయిర్ పోర్టులో అనుమానాస్పదంగా కనిపించడంతో ఇంటలిజెన్స్ అధికారులు అతడిని తనిఖీ చేశారు.

Advertisement

Jharkhand Assembly Election Results 2019: ప్రారంభమైన జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌, హంగ్ అసెంబ్లీ వస్తుందంటున్న ఎగ్జిట్ పోల్స్, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పైనే అందరి కన్ను, మధ్యాహానికి తొలి ఫలితం వెలువడే అవకాశం

Hazarath Reddy

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ (Jharkhand Assembly Election Results) ప్రారంభమైంది. మొత్తం 81 శాసనసభ స్థానాలకు నవంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 20 వరకు అయిదు దశల్లో పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ( Jharkhand) 24 జిల్లా కేంద్రాల్లో ఎన్నికల సంఘం కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేసింది. అధికార బీజేపీ(BJP), ప్రతిపక్ష జేఎంఎం–కాంగ్రెస్‌(JMM-Congress) కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది.

Beer Is Better For You Than Milk: గ్లాసు పాల కన్నా పెగ్గు బీరు మిన్న, ఆరోగ్యంగా ఉండాలంటే ఇదే బెటర్ అంటున్న పెటా, బీరు తాగడం వల్ల ఎముకలు గట్టిపడతాయట, డెయిరీ ఉత్పత్తులు తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తాయట

Hazarath Reddy

ఇప్పటివరకు మద్యం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని విన్నాం. అయితే ప్రముఖ జంతు సంరక్షణ సంస్థ పెటా (People for the Ethical Treatment of Animals) మాత్రం దీనికి భిన్నంగా చెబుతోంది. రోజు పెగ్గు బీరు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతోంది. గ్లాసు పాల కన్నా పెగ్గు బీరు మిన్న(Beer Is Better For You Than Milk) అనే నినాదాన్ని లేవదీస్తోంది.

Maha Aghadi Sarkar: ‘మహా’ సర్కారు కీలక నిర్ణయం, రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ, మహాత్మా జ్యోతిరావ్ పూలే రుణాల రద్దు పథకం కింద అమల్లోకి, ప్రభుత్వంపై రూ.40వేల కోట్ల భారం, సీఎం ఉద్ధవ్‌పై మండిపడిన బీజేపీ

Hazarath Reddy

ధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra GOVT)సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర రైతులకు (Farmers)తీపికబురును అందిస్తూ ఉద్ధవ్ సర్కారు రైతు రుణమాఫీ(Farmer Loan Waiver) అమలు చేసింది.

DK Shivakumar: క్రికెట్ బ్యాటు పట్టిన కాంగ్రెస్ సీనియర్ నేత, పాత్రికేయులతో కలిసి క్రికెట్ ఆడిన డికె శివకుమార్, యడ్డూరప్ప ప్రభుత్వంపై విమర్శలు, రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలకు ముఖ్యమంత్రి, హోం మంత్రే బాధ్యులన్న డీకే

Hazarath Reddy

ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉండే రాజకీయ నాయకులు అప్పుడప్పుడూ ఆటవిడుపు కోసం సరదాగా ఏవైనా ఆటలు ఆడుతుంటారు. కొద్ది పాటి సమయం దొరికితే తమ ముచ్చటను ఆ విధంగా తీర్చుకుంటుంటారు. ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ లీడర్ డికే శివకుమార్ (Senior Congress leader DK Shivakumar) కూడా క్రికెట్ బ్యాటు పట్టారు.

Advertisement

Jaipur Bomb Blast 2008: ఆ నలుగురికి ఉరిశిక్ష, 80 మంది ప్రాణాలను తీసిన ఉగ్రవాదులకు మరణశిక్ష విధించిన రాజస్థాన్ కోర్టు, మరో ముగ్గురు నిందితులు తీహార్ జైలులో.., ఒకరు నిర్దోషిగా బయటకు..

Hazarath Reddy

2008 లో జైపూర్‌లో వరుస బాంబు పేలుళ్లకు(Jaipur Bomb Blast 2008) పాల్పడినట్లు తేలిన నలుగురికి రాజస్థాన్ కోర్టు ( Jaipur special court) మరణశిక్ష విధించింది. ఒక వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించారు. 2008 మే నెలలో జైపూర్‌ పాత నగరంలోని హనుమాన్‌ ఆలయ సమీపంలో 9 వరుస పేలుళ్లు జరిగాయి.

Jharkhand Exit Polls 2019: బీజేపీకి షాకిస్తున్న ఎగ్జిట్ పోల్స్, జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమిదే అధికారం, డిసెంబర్ 23న ఫలితాలు, హంగ్ వచ్చే అవకాశం ఉందంటున్న ఐఏఎన్ఎస్-సీ ఓటర్ సర్వే

Hazarath Reddy

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు (Jharkhand Assembly Elections 2019) ముగిశాయి. 81స్థానాలున్న జార్ఖండ్ లో అయిదు దశల్లో జరిగిన ఎన్నికలు జరిగాయి. నవంబర్ 30న మొదటి దశ, డిసెంబర్ 7న రెండోదశ, 12న మూడో దశ ఓటింగ్, 16 న నాలుగో దశ ఓటింగ్ జరిగింది.(డిసెంబర్-20,2019)తో ఐదో దశ ఓటింగ్ ముగిసింది. డిసెంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Sonia Gandhi: ప్రజల హక్కులను ప్రభుత్వం పూర్తిగా తొక్కి వేస్తోంది, వారి గోడును అసలు పట్టించుకోవడం లేదు, బీజేపీ ప్రభుత్వంపై మండిపడిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ

Hazarath Reddy

దేశంలో జరుగుతున్న ఆందోళనలకు కేంద్రప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Congress president Sonia Gandhi) అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులకు కాంగ్రెస్ సంఘీభావం తెలుపుతుందని సోనియా అన్నారు. ఈ మేరకు ప్రజలను ఉద్దేశిస్తూ ఆమె ఒక వీడియోను (video message) విడుదల చేశారు.

Earthquake In Delhi: దేశ రాజధానిలో భూకంపం, వణికిన ఉత్తర భారతం, ఒక్కసారిగా బయటకు పరుగులు తీసిన ప్రజలు, ఆఫ్గనిస్తాన్‌లోని హిందూ కుష్ రీజియన్ ప్రాంతంలో కేంద్రీకృతమైన భూకంపం

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వచ్చిన భూ ప్రకంపనలు(earthquake) స్థానికులను వణికించాయి. ఢిల్లీ నుంచి కశ్మీర్‌ వరకు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల 12 నిమిషాలకు ఈ ప్రకంపనలు సంభవించాయి. ఉత్తర భారతం, (northern India)పాకిస్తాన్‌, అఫ్గనిస్తాన్‌ సరిహద్దులో భూమి కంపించింది. ఢిల్లీలో రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 6.3గా నమోదైంది. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.

Advertisement

Anand Mahindra: ఆనంద్ మహీంద్రా సంచలన నిర్ణయం, ఛైర్మెన్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటన, మహీంద్రా అండ్‌ మహీంద్రా కొత్త మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పవన్‌ గొయెంకా, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి

Hazarath Reddy

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ (Mahindra & Mahindra, Executive Chairman) బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఏప్రిల్-1,2020నుంచి ఇది అమలులోకి రానున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

AAP's New Slogan: అచ్చే బీతే పాంచ్ సాల్..లగే రహో కేజ్రీవాల్, కొత్త నినాదంతో ఎన్నికలకు రెడీ అవుతున్న ఆప్, మళ్లీ అధికారమే లక్ష్యంగా వ్యూహాలకు పదును, కేజ్రీవాల్‌తో జత కట్టిన ప్రశాంత్ కిషోర్

Hazarath Reddy

వచ్చే ఏడాది దేశ రాజధాని ఢిల్లీలో సార్వత్రిక సమరం (Delhi Assembly poll) మొదలు కానున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు అన్ని అవకాశాలను వెతికే పనిలో పడ్డాయి. అధికారంలో ఉన్న కేజ్రీవాల్ సర్కార్ (Arvind Kejriwal) మళ్లీ ఢిల్లీలో ఆప్ జెండాను పాతాలని చూస్తోంది.

Keonjhar Rape And Murder Case: 3 ఏళ్ల పాపపై అత్యాచారం, ఆపై హత్య, నిందితుడికి మరణ శిక్ష విధించిన ఒడిషా కోర్టు, నిందితుడికి వ్యతిరేకంగా ఆరు కేసులు నమోదు

Hazarath Reddy

దేశంలో మానవ మృగాలు వీర విహారం చేస్తున్నాయి. పసిపిల్లల దగ్గర నుంచి పండు మసలి వరకు ఎవర్నీ వదలడం లేదు. మద్యం మత్తులో వారేం చేస్తున్నారో అర్థం కాకుండా ఉన్మాద ఘటనలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారికి కోర్టు ఉరిశిక్ష విధించినా, పోలీసులు ఎన్‌కౌంటర్లు చేసినా మార్పు రావడం లేదు. మొన్న దిశ ఘటనలో(Disha rape and murde case) పోలీసుల మీద ఎదురుదాడికి దిగిన నిందితుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్ (Hyderabad Encounter)చేశారు.

Donald Trump Impeached: అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అమెరికా అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం, ఆమోదం తెలిపిన ప్రతినిధుల సభ, సెనేట్‌లో దర్యాప్తు, సిగ్గుచేటు రాజకీయాలని వైట్ హౌజ్ వ్యాఖ్య

Vikas Manda

అమెరికా చరిత్రలో అత్యంత సిగ్గుపడే రాజకీయ ఎపిసోడ్లలో ఇది ఒకటి. తప్పు చేసినట్లు ఎలాంటి రుజువు లేకుండా, ఒక్క రిపబ్లికన్ ఓటు తీసుకోకుండా, డెమొక్రాట్లు ఆమోదించిన అభిశంసన చట్ట విరుద్ధమైంది" అని వైట్ హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది.....

Advertisement

PM's Open Challenge To Congress: దమ్ముంటే పాకిస్తానీలకు పౌరసత్వం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరిన ప్రధాని నరేంద్ర మోడీ, దేశ ప్రజలే మీకు సమాధానం చెబుతారు, కాంగ్రెస్ చేతుల్లో పావులుగా మారొద్దని విద్యార్థులకు హితవు

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం(Central GOVT) తీసుకువచ్చిన నూతన పౌరసత్వ చట్టంపై (Citizenship Act) దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ (PM Narendra Modi) ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు.

Sadistic Parents: శాడిస్టు తల్లిదండ్రులంటే వీళ్లే, ఇంటికి లేటుగా వచ్చాడని కఠిన శిక్ష, పిల్లాడి కాళ్లలో మొలకెత్తిన విత్తనాలు, రక్తమే ఆ విత్తనాలకు నీరు, తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

రష్యాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు వేసిన శిక్షకు పిల్లాడు అల్లాడిపోయాడు. ఆ తల్లిదండ్రులు వేసిన శిక్ష వల్ల పిల్లాడి కాళ్లలో గింజలు మొలకెత్తాయి. ఆ పిల్లాడి శరీరంలోని రక్తమే నీరుగా ఆ విత్తనాలు(Buckwheat) మొలకెత్తాయి. కథనం వివరాల్లోకెళితే.. రష్యాకు చెందిన సార్జే కాజకోవ్, అలీనా యుమషేవ భార్యాభర్తలు, వీరికి 8 ఏళ్ల పిల్లవాడు(eight-year-old boy) ఉన్నాడు. ఆ ఎనిమిదేళ్ల ఆ పిల్లాడు స్నేహితులతో ఆడుకుంటూ ఇంటికి లేట్‌గా వచ్చాడు.

Musharraf: ముషారఫ్‌కు ఉరిశిక్ష, దేశద్రోహం కేసులో ఆయనను దోషిగా తేల్చిన పెషావర్ హైకోర్టు, నాలుగేళ్ల నుంచి దుబాయ్‌లో తలదాచుకుంటున్న పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, సుప్రీంకోర్టుకు వెళ్లనున్న పర్వేజ్ ముషారఫ్ తరపు న్యాయవాదులు

Hazarath Reddy

పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు (former president Pervez Musharraf) భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముషారఫ్‌కు(Pervez Musharraf) పాకిస్థాన్ (Pakistan)లోని పెషావర్ హైకోర్టు ( Peshawar High Court) ఉరిశిక్షను విధించింది. దేశద్రోహం కేసులో ఆయనను దోషిగా తేల్చిన హైకోర్టు... మరణదండనే (Death Penalty) ఆయనకు తగిన శిక్ష అని తేల్చింది. నాలుగేళ్ల నుంచి ముషారఫ్ దుబాయ్ లో తలదాచుకుంటున్నారు.

'Nitish Kumar Missing': బీహార్ సీఎం కనిపించుట లేదు, పాట్నాలో కలకలం రేపుతున్న పోస్టర్లు, కాబ్, ఎన్ఆర్‌సీలపై మౌనం వహించిన నితీష్ కుమార్, పోర్న్ సైట్లు వెంటనే బ్యాన్ చేయాలంటూ ప్రధానికి మోడీకి బీహార్ సీఎం లేఖ

Hazarath Reddy

బీహార్ సీఎం (Bihar Chief Minister)కనిపించడం లేదంటూ రాజధాని పాట్నాలో వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టంపై మౌనంగా ఉన్నందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను(Nitish Kumar) ఎగతాళి చేస్తూ సీఎం మిస్సింగ్ (Nitish Kumar Missing)అంటూ పాట్నాలో పోస్టర్లు అంటించారు.

Advertisement
Advertisement