ప్రపంచం

Bangladesh Protest: బంగ్లాదేశ్‌లో ఆగని ఆందోళనలు, వీసా సెంటర్లు మూసివేస్తున్నట్లు ప్రకటించిన భారత్, నేడు కొలువుదీరనున్న మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం

Hazarath Reddy

బంగ్లాదేశ్‌లో ఉద్యోగాల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమంతో రాజకీయ అస్థిరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమం హింసాత్మకంగా మారింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఆర్మీ రంగంలోకి దిగినప్పటికీ శాంతి భద్రతలు అదుపులోకి రానట్లు తెలిసింది.

Bangladesh Crisis Updates: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా యూనస్..15 మంది సభ్యులతో ప్రభుత్వ ఏర్పాటు, నేడే బాధ్యతల స్వీకరణ, భారత్‌లోకి చొరబడేందుకు ప్రజల ప్రయత్నం

Arun Charagonda

బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రధానిగా ఇవాళ భాద్యతలు స్వీకరించనున్నారు నోబెల్ గ్రహీత, ఆర్థిక వేత్త మహమ్మద్ యూనస్. ఇవాళ దుబాయ్ నుండి ప్రత్యేక విమానంలో ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు యూనస్. ఇవాళ సాయంత్రం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండనుండగా కొత్తగా ఏర్పడే తాత్కాలిక ప్రభుత్వం 15 మంది సభ్యులతో ఉండే అవకాశం ఉంది.

Bangladesh Crisis: బంగ్లాదేశ్‌లో 19 వేల మంది భారతీయులు, వారిలో 9 వేల మంది విద్యార్థులే, నిరంతరం వారితో టచ్‌లో ఉన్నామని తెలిపిన జైశంకర్

Hazarath Reddy

బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్ననేపథ్యంలో అక్కడ మొత్తం 19 వేల మంది భారతీయులు ఉన్నారని, వీరిలో 9 వేల మంది విద్యార్థులేనని విదేశాంగ మంత్రి జైశంకర్‌ తెలిపారు. ఆందోళనలు (Bangladesh Crisis) మొదలైన జూలై నెలలోనే చాలామంది వచ్చేశారని చెప్పారు.

Sheikh Hasina: షేక్ హసీనాను అరెస్ట్ చేయండి.. ఆ తర్వాత మాకు అప్పగించండి.. భారత్‌ ను కోరిన బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోయేషన్

Rudra

యువత ఆందోళనలతో బంగ్లాదేశ్ విడిచిపెట్టి వచ్చి భారత్‌ లో తలదాచుకుంటున్న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలంటూ డిమాండ్లు మొదలయ్యాయి.

Advertisement

Hiroshima, Nagasaki Atomic Bombings: హిరోషిమా, నాగసాకిపై అణుబాంబు దాడులు, మృతులకు నివాళి అర్పించిన లోక్‌సభ సభ్యులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాల్లో 1945 ఆగస్టులో అణుబాంబు పేలుళ్లలో వేలాది మంది మరణించి, గాయపడిన మృతులకు లోక్‌సభ మంగళవారం నివాళులర్పించింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఆగస్టు 6, 9 తేదీలలో హిరోషిమా మరియు నాగసాకి నగరాలపై బాంబులు వేయబడ్డాయి

Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో ఆగని హింస, హోటల్‌కు నిప్పు.. 24 మంది సజీవదహనం, కొన్ని గంటల్లోనే 100 మందికి పైగా ప్రాణాలు గాలిలోకి..

Hazarath Reddy

బంగ్లాదేశ్‌లో విధ్వంసం కొనసాగుతోంది. తాజాగా జషోర్ జిల్లాలో ఓ హోటల్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 24 మంది సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. మృతి చెందిన వారిలో ఒకరు ఇండోనేషియా పౌరుడు ఉన్నాడని లోకల్ మీడియా చెబుతోంది. ఆందోళనకారులు నిప్పు పెట్టిన జబీర్ ఇంటర్నేషనల్ హోటల్ అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి షాహిన్ చక్లాదర్‌కు చెందినది.

Bangladesh Unrest: బంగ్లాదేశ్ నిరసనలు, ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్‌ వేదిక మారనున్నట్లు వార్తలు, భారత్ లేదా UAE లేదా శ్రీలంకకు ఐసీసీ తరలిస్తుందా?

Vikas M

బంగ్లాదేశ్‌లో చెల‌రేగుతున్న హింస ప్ర‌పంచ క్రికెట్‌పై ప‌డ‌నుంది. ఆ దేశ ప్ర‌ధాని షేక్ హ‌సీనా (Shaikh Hasina) రాజీనామాతో దేశం సైన్యం చేతుల్లోకి వెళ్ళింది. ఈ నేప‌థ్యంలో బంగ్లాదేశ్‌లో మ‌రో రెండు నెలల్లో జ‌ర‌గాల్సిన‌ మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ (T20 World Cup 2024)పై అనిశ్చితి నెల‌కొంది.

UK Riots: బ్రిటన్‌లో హింసాత్మక నిరసనలు, భారతీయులు అప్రమత్తంగా ఉండాలంటూ అడ్వైజరీని జారీ చేసిన భారత రాయబార కార్యాలయం

Hazarath Reddy

వలస వ్యతిరేక గ్రూపులు బ్రిటన్‌లోని పలు నగరాల్లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ తరుణంలో అక్కడున్న భారతీయులను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ మేరకు లండన్‌లోని భారత రాయబార కార్యాలయం అడ్వైజరీని జారీ చేసింది.

Advertisement

Bangladesh Protests: వీడియో ఇదిగో, బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయం స్కాన్‌ టెంపుల్‌పై దాడి, ఆలయాన్ని ధ్వంసం చేసి విగ్రహాలను పగులగొట్టిన దుండగులు

Hazarath Reddy

ఖుల్నా డివిజన్‌లోని మెహర్‌పూర్‌లో ఉన్న ఇస్కాన్‌ టెంపుల్‌పై (ISKCON Temple) గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేశారు.ఆలయాన్ని ధ్వంసం చేసి విగ్రహాలను పగులగొట్టారు. ఆ ప్రతిమలను కాల్చివేశారు.

Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేదు, భారతీయుల్ని తరలించాల్సిన అవసరం లేదని తెలిపిన విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌

Hazarath Reddy

బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అస్థిర పరిస్థితుల్ని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ (S Jaishankar) తెలిపారు. అక్కడ ఉన్న భారతీయుల్ని తరలించాల్సిన అవసరం లేదన్నారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేదన్నారు. భారతీయుల్ని తరలించేంత ప్రమాదకరంగా పరిస్థితులు లేవని సమావేశంలో వెల్లడించారు.

Suitcase of Sheikh Hasina: ప్రధాని షేక్‌ హసీనా చీరలు దొరికాయోచ్.. ఈ చీరలు నా భార్యకు ఇచ్చేస్తా.. ఇక అప్పుడు నా భార్య కూడా ప్రధానే..! బంగ్లా ప్రధాని నివాసం గణ భవన్‌ లోకి చొరబడి హసీనా సూట్ కేసు ఎత్తుకెళ్తూ ఓ దుండగుడి వ్యాఖ్యలు.. (వీడియోతో)

Rudra

యువకుల నిరసనలతో బంగ్లాదేశ్‌ లో తీవ్ర రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఉద్యోగ రిజర్వేషన్ల చిచ్చు కారణంగా అదుపు తప్పిన అల్లర్ల నేపథ్యంలో ప్రభుత్వం కుప్పకూలింది. ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా చేసి సోదరితో కలిసి భారత్‌ కు వచ్చారు.

Bangladesh Unrest: బంగ్లాదేశ్ అల్లర్లు, ప్రధాని మోదీ నివాసంలో భారత భద్రతా వ్యవహారాల కేబినెట్ అత్యవసర భేటీ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

బంగ్లాదేశ్‌లో పరిణామాల నేపథ్యంలో భారత భద్రతా వ్యవహారాల కేబినెట్ ఉప సంఘం అత్యవసరం భేటీ అయ్యింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. పొరుగు దేశంలో తాజా పరిస్థితులు, దేశంలో ముందస్తుగా చేపట్టాల్సిన భద్రతా చర్యలపై ఈ భేటీలో సమీక్షించనున్నారు

Advertisement

Bangladesh Protest: నిరసనలతో భగ్గుమంటున్న బంగ్లాదేశ్, అన్ని విమాన సర్వీసులు, రైళ్లను రద్దు చేసిన భారత్, ఎల్ఐసీ ఆఫీసు మూసివేత

Hazarath Reddy

బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా (Air India), ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఆ దేశానికి విమానాల రాకపోకలను రద్దు చేసాయి. షెడ్యూల్‌ ప్రకారం.. బంగ్లాదేశ్‌కు వెళ్లాల్సిన, బంగ్లాదేశ్‌ నుంచి రావాల్సిన సర్వీసులను నిలిపివేశాయి.

Bangladesh Protest: వీడియో ఇదిగో, షేక్‌ హసీనాతో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌ భేటీ

Hazarath Reddy

Bangladesh Protest: వీడియో ఇదిగో, భారత్ చేరుకున్న షేక్ హసీనా, లండన్ వెళ్లే అవకాశం ఉన్నట్లుగా వార్తలు, భారత్ దౌత్య కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం

Hazarath Reddy

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా సోమవారం సాయంత్రం 5.30 గంటలకు భారత్‌కు చేరుకున్నారు. ఘజియాబాద్‌లోని హిండన్‌ ఎయిర్‌ బేస్‌కు చేరుకున్నారు. అక్కడ ఎయిర్‌ఫోర్స్‌ అధికారులకు ఆమె స్వాగతం పలికారు. అయితే, ఆమె భారత్‌ నుంచి లండన్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

Bangladesh Protests: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హైఅలర్ట్, సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఎస్ఎఫ్ ఆదేశాలు

Hazarath Reddy

బంగ్లాదేశ్‌ (Bangladesh) లో రాజకీయ సంక్షోభం (Political crisis) నేపథ్యంలో భారత సరిహద్దులను రక్షించే బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF) అప్రమత్తమైంది. భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దు వెంబడి హై అలర్ట్‌ (High alert) ప్రకటించింది.

Advertisement

Bangladesh Protests: బంగ్లాదేశ్‌‌లో ఎందుకీ ఆందోళనలు? విద్యార్థులు చేపట్టిన ఉద్యమం రాజకీయ నిరసనగా ఎందుకు మారింది, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానంపై ఎవరేమన్నారు ?

Hazarath Reddy

హసీనా దేశం విడిచి వెళ్లిపోయారని సైన్యం ప్రకటించగానే.. రోడ్ల మీదకు చేరిన లక్షల మంది నినాదాలు చేస్తూ సంబురాలు చేసుకున్నారు. దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపుల్లోకి వచ్చే దాకా కర్ఫ్యూ కొనసాగుతుందని ఆర్మీ ప్రకటించింది

Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు, పరిస్థితులు పూర్తిగా అదుపుల్లోకి వచ్చే దాకా కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపిన ఆర్మీ చీఫ్ వాకర్‌-ఉజ్‌-జమాన్

Hazarath Reddy

బంగ్లాదేశ్‌ (Bangladesh)లో పరిస్థితి అదుపుతప్పింది. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన హింస తీవ్రరూపం దాల్చింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పదవికి షేక్‌ హసీనా (Sheikh Hasina) రాజీనామా చేశారు.

Bangladesh Protests: బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా, చెలరేగిన హింస నేపథ్యంలో తలదాచుకోవడానికి భారత్‌ బయలుదేరినట్లుగా వార్తలు

Hazarath Reddy

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్‌ల వివాదం హింసాత్మకంగా మారడంతో ఆ ఆదేశ ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలతో దేశం అట్టుడుకుతోంది.

Bangladesh Violence: బంగ్లాదేశ్ లో మ‌రోసారి ర‌క్తపాతం, ఏకంగా 32 మంది మృతి, ఇంట‌ర్నెట్ సేవ‌లు బంద్

VNS

బంగ్లాదేశ్ రిజర్వేషన్లకు (Bangladesh)వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం సాయంత్రం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించింది. ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనల్లో 32 మంది ప్రాణాలు వదిలారు.

Advertisement
Advertisement