World

Plane On Fire Video: ఘోర ప్రమాదం, కోస్ట్ గార్డ్ విమానాన్ని ఢీకొట్టిన జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం, అందులో 367 మంది ప్రయాణికులు

Hazarath Reddy

367 మందితో ప్రయాణిస్తున్న జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం టోక్యో విమానాశ్రయంలో కోస్ట్ గార్డ్ విమానాన్ని ఢీకొట్టింది. విమానం ఢీకొట్టిన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారనే దానిపై ఇంకా అధికారిక సమాచారం లేదు. వీడియో ఇదిగో..

Japan Earthquake: భూకంపం వచ్చినప్పుడు అక్కడే ఉన్నా, హృదయాన్ని కలచివేసే ఘటన అది, జపాన్ భూకంపంపై ఎన్టీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి

Hazarath Reddy

జపాన్‌లో సంభవించిన వరుస భూకంపాల ఘటనపై నటుడు ఎన్టీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత వారం తారక్‌ వ్యక్తిగత పర్యటన నిమిత్తం జపాన్‌లోనే ఉన్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్ వచ్చారు. ‘‘గత వారతమంతా అక్కడే ఉన్నాను. ఆ ప్రాంతంలోనే భూకంపం రావడం నా హృదయాన్ని కలచివేసింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు త్వరగా కోలుకోవాలి’’ అని ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Japan Earthquake Video: భారీ భూకంపానికి జపాన్ మెట్రో స్టేషన్ ఎలా ఊగిపోతుందో వీడియోలో చూడండి, భయంతో పరుగులు పెట్టిన ప్రయాణికులు

Hazarath Reddy

వరుస భూకంపాలు జపాన్ దేశాన్ని కుదిపేశాయి. ఒక్క రోజులోనే ఏకంగా 155 సార్లు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై అత్యధికంగా 7.6 గా నమోదైంది. దీంతో రోడ్లు ధ్వంసం కాగా చాలా ఇళ్లు, పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకుని ఇప్పటి వరకు 24 మంది చనిపోయారని జపాన్ ప్రభుత్వం వెల్లడించింది.

Japan Earthquake: వీడియో ఇదిగో, భూకంపం ధాటికి భూమి ఎలా పగులుతుందో చూడండి, జపాన్‌‌లో ఎనిమిది మంది మృతి

Hazarath Reddy

జపాన్‌ (Japan) వరుస భూకంపాలతో వణికిపోతున్నది. సోమవారం నుంచి ఇప్పటివరకు 155 సార్లు భూమి (Earthquakes) కంపించిందని జపాన్‌ వాతావరణ శాఖ (JMA) తెలిపింది. ఇందులో సోమవారం నాటి 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపంతోపాటు 6 తీవ్రత నమోదైన భూకంపాలు కూడా ఉన్నాయని వెల్లడించింది. అయితే 3 అంతకంటే ఎక్కువ తీవ్రతతో నమోదైనవే అత్యధికంగా ఉన్నాయని చెప్పింది.

Advertisement

Japan Earthquake: జపాన్‌లో భూకంపం విలయం, 155 సార్లు కంపించిన భూమి, ఇప్పటి వరకు 24 మంది మృతి చెందినట్లుగా వార్తలు

Hazarath Reddy

జపాన్‌లో భూకంపం విలయం సృష్టించింది. అగ్నిప్రమాదం జరిగి ఒకే వీధిలో 200 భవనాలు కాలిపోయాయి. ఇప్పటి వరకు 24 మంది (24 Dead, Several Feared) మరణించినట్లు స్థానిక పత్రికలు పేర్కొంటున్నాయి.నీగట, టొయామ, ఫుకూయ్‌, గిఫూ నగరాల్లో క్షతగాత్రులను గుర్తించారు. 45 వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

Masood Azhar Killed in Bomb Blast? బాంబు పేలుడులో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ మృతి వార్త అబద్దం, పోస్ట్ తప్పుదోవ పట్టించేలా ఉందని తెలిపిన ది వైర్ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ హెడ్ సాహిల్ మురళీ మెంఘని

Hazarath Reddy

ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌ స్థాపకుడు మహమద్‌ మసూద్‌ అజహార్‌ అల్వీ చనిపోయినట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. గుర్తు తెలియని దుండగులు జరిపిన బాంబు దాడిలో మసూద్‌ చనిపోయినట్లు సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

Goldy Brar Declared as Terrorist:లారెన్స్ బిష్ణోయ్ సహచరుడు గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన హోంశాఖ

Hazarath Reddy

లారెన్స్ బిష్ణోయ్ సహచరుడు గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను కేంద్ర హోంశాఖ సోమవారం ఉగ్రవాదిగా ప్రకటించింది. పంజాబ్‌లో దోపిడీలు, సరిహద్దుల నుంచి అక్రమంగా ఆయుధాలు, డ్రగ్స్‌ స్మగ్లింగ్‌కు ఇతను పాల్పడ్డాడు.ఈ ఉగ్రవాది ప్రస్తుతం కెనడాలో తలదాచుకుంటున్నాడు

Japan earthquake: జపాన్‌లో వరుస భూకంపాలు, భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ ఎంబసీ హెచ్చరిక, ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ నంబర్స్ ఇవిగో..

Hazarath Reddy

జపాన్ పశ్చిమ భాగాన్ని నేడు తీవ్ర భూకంపం కుదిపేసిన సంగతి తెలిసిందే. వరుసగా 21 భూకంపాలతో వణికిపోయింది. దీనికి తోడు స్వల్పశ్రేణి సునామీ అలలు తీరాన్ని తాకాయి.నూతన సంవత్సరం 2024 మొదటి రోజున జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది

Advertisement

Japan Earthquake: వీడియోలు ఇవిగో, జపాన్‌లో గంటల వ్యవధిలో 20కు పైగా భూకంపాలు, ముందుకు దూసుకువచ్చిన సముద్రం, 36 వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా కట్

Hazarath Reddy

జపాన్ పశ్చిమ భాగాన్ని నేడు తీవ్ర భూకంపం కుదిపేసిన సంగతి తెలిసిందే. వరుసగా 21 భూకంపాలతో వణికిపోయింది. దీనికి తోడు స్వల్పశ్రేణి సునామీ అలలు తీరాన్ని తాకాయి.నూతన సంవత్సరం 2024 మొదటి రోజున జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6 నమోదయింది.

Tsunami Waves Caught on Camera: భయంకర సునామి వీడియో ఇదిగో, ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఇళ్ల మీదకు దూసుకువస్తున్న రాకాసి అలలు

Hazarath Reddy

పశ్చిమ జపాన్ ప్రాంతంలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది, దీని ఫలితంగా దేశం యొక్క వాయువ్య తీరం అంతటా సునామీ హెచ్చరిక జారీ చేయబడింది. ఆన్‌లైన్‌లో కనిపించిన అనేక వీడియోలలో, ఐదు మీటర్ల ఎత్తులో ఉన్న భయానక ఆటుపోట్లు చూడవచ్చు.

Earthquake in Japan: జపాన్‌లో 7.6 తీవ్రతతో భారీ భూకంపం, సముద్ర అలలు 5 మీటర్ల వరకు ఎగిసిపడే అవకాశం ఉందని హెచ్చరించిన వాతావరణ సంస్థ

Hazarath Reddy

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. ఈ నేపథ్యంలో జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికల్ని జారీ చేసింది. సముద్ర అలలు 5 మీటర్ల వరకు ఎగిసిపడే అవకాశం ఉందని వెల్లడించింది.

Shooting in Mexico: మెక్సికో పార్టీలో కాల్పుల మోత.. ఆరుగురు మృతి, 26 మందికి గాయాలు

Rudra

మెక్సికోలోని సియుడాడ్ ఓబ్రెగాన్‌లో కాల్పుల మోతమోగింది. శుక్రవారం రాత్రి సియుడాడ్‌ ఓబ్రెగాన్‌ లో జరుగుతున్న ఓ పార్టీలోకి చొచ్చుకెళ్లిన ముగ్గురు దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.

Advertisement

COVID-19 in India: దేశంలో 162కు పెరిగిన కరోనా సబ్-వేరియంట్ JN.1 కేసులు, ప్రపంచ వ్యాప్తంగా కొత్త వేరియంట్ కేసుల పెరుగుదలతో ఆందోళన, చైనాలో మళ్లీ భయానక పరిస్థితులు

Hazarath Reddy

శుక్రవారం తాజాగా వెలువడిన INSACOG డేటా ప్రకారం, దేశంలో మొత్తం 162 COVID-19 సబ్-వేరియంట్ JN.1 కేసులు కనుగొనబడ్డాయి, కేరళలో అత్యధికంగా 83, గుజరాత్‌లో 34 నమోదయ్యాయి. గత కొన్ని వారాలుగా అనేక రాష్ట్రాలు కోవిడ్ కేసుల సంఖ్యలో పెరుగుదలను నివేదిస్తున్నాయి.

Russia-Ukraine War: వీడియో ఇదిగో, కైవ్‌లోని భవనాన్ని పేల్చేసిన రష్యా క్షిపణి, భారీ మంటల్లో భవనం ఎలా చిక్కుకుందో చూడండి

Hazarath Reddy

ఉక్రెయిన్‌లోని కైవ్‌లోని భవనాన్ని రష్యా క్షిపణి ఢీకొట్టిన క్షణాన్ని చూపించే వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దాడి తర్వాత నల్లటి పొగ ఆకాశాన్ని కప్పేస్తున్నట్లు ఫుటేజీ చూపుతోంది. ఈ దాడి వల్ల ఎంతమేర నష్టం జరిగిందనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Russia-Ukraine War: వీడియోలు ఇవిగో, ఉక్రెయిన్‌పై అతిపెద్ద మిస్సైల్‌ని వదిలిన రష్యా, దాడిలో 11 మంది మృతి, నెలరోజుల వ్యవధిలో అతి పెద్ద దాడి ఇదే..

Hazarath Reddy

రష్యా ఉక్రెయిన్‌పై నెలరోజుల వ్యవధిలో అతిపెద్ద క్షిపణి దాడిని ప్రారంభించినట్లు సమాచారం. రష్యా క్షిపణి దాడి ఒడెసా, కైవ్ మరియు ఉక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాల్లోని అనేక భవనాలను ఢీకొట్టింది. BNO న్యూస్ ప్రకారం , ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడిలో కనీసం 11 మంది మరణించారు. 70 మందికి పైగా గాయపడ్డారు.

Russia-Ukraine War: ఉక్రెయిన్ మీద 36 డ్రోన్లు, 122 మిస్సైళ్ల‌తో విరుచుకుపడిన రష్యా, ఒకేసారి అనేక లొకేష‌న్ల‌ను టార్గెట్ చేసిన పుతిన్ సేన 13 మంది మృతి

Hazarath Reddy

ఉక్రెయిన్‌పై నేడు మళ్లీ ర‌ష్యా విరుచుకుప‌డింది. దేశంలోని ప‌లు ప్రాంతాల‌పై ర‌ష్యా అటాక్ చేసిన‌ట్లు ఉక్రెయిన్ వెల్ల‌డించింది. భీక‌రంగా జ‌రిగిన ఆ దాడుల్లో సుమారు 13 మంది మృతిచెందారు. డ‌జ‌న్ల సంఖ్య‌లో జ‌నం గాయ‌ప‌డ్డారు. దాదాపు 36 డ్రోన్లు, 122 మిస్సైళ్ల‌తో ర‌ష్యా దాడి చేసిన‌ట్లు ఉక్రెయిన్ మిలిట‌రీ తెలిపింది

Advertisement

Maine Disqualifies Trump: డొనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన మరో రాష్ట్రం, ఎన్నికల్లో పోటీకి ట్రంప్‌ను అనర్హుడిగా ప్రకటించిన మైనే, సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో అమెరికా మాజీ అధ్యక్షుడు

Hazarath Reddy

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump)కు మరో షాక్‌ తగిలింది. రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ఆయన అనర్హుడని కొలరాడో కోర్టు ప్రకటించిన విషయం మరువక ముందే మరో రాష్ట్రం కూడా కూడా అనర్హత వేటు వేసింది.

Liberia Gas Tanker Exploded: ఘోర ప్రమాదం, పెట్రోల్ ట్యాంకర్ నుంచి పెట్రోల్‌ను తీసుకునేందుకు స్థానికులు ఎగబడుతుండగా పేలిన ట్యాంకర్, 48 మంది మృతి

Hazarath Reddy

ప‌శ్చిమ ఆఫ్రికా దేశం లైబీరియాలోని టోటోటాలో వేగంగా వెళ్తున్న ఓ ప్రెటోల్ ట్యాంక‌ర్ అదుపుత‌ప్పి రోడ్డు ప‌క్క‌న బోల్తా ప‌డింది. దీంతో పెట్రోల్ ట్యాంక్‌ను గ‌మ‌నించిన స్థానికులు, క్ష‌ణాల్లో అక్క‌డికి పెద్ద సంఖ్య‌లో చేరుకుని ట్యాంక‌ర్ నుంచి పెట్రోల్‌ను తీసుకునేందుకు స్థానికులు ఎగ‌బ‌డ్డారు. అయితే ఈ స‌మ‌యంలో ట్యాంక‌ర్‌లో పేలుడు సంభ‌వించింది

Pakistan Bans New Year Celebrations: న్యూ ఇయర్ వేడుకలను బ్యాన్ చేసిన పాకిస్థాన్, హమాస్ యుద్ధంలో నలిగిపోయిన గాజా ప్రజలకు సంఘీభావంగా కీలక నిర్ణయం

Hazarath Reddy

యుద్ధంలో అతలాకుతలమైన గాజా ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాని అన్వారుల్ హక్ కకర్ గురువారం దేశంలో నూతన సంవత్సర వేడుకలను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, కాకర్ పాలస్తీనియన్లకు సంఘీభావం చూపాలని మరియు నూతన సంవత్సరంలో నిగ్రహాన్ని, వినయాన్ని ప్రదర్శించాలని కోరారు.

Fake Recruitment Abroad: ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లేవారికి విదేశాంగ శాఖ హెచ్చరిక.. నకిలీ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచన

Rudra

నకిలీ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల బారిన పడొద్దంటూ విదేశాంగ శాఖ ఉద్యోగార్థులను తాజాగా హెచ్చరించింది. ఫేక్ సంస్థల నకిలీ జాబ్ ఆఫర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Advertisement
Advertisement