తాజా వార్తలు
Kasibugga Stampede: కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొక్కిసలాట, తొమ్మదిమంది మృతి, మరికొందరికి గాయాలు, ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు
Team Latestlyశ్రీకాకుళంలో(Srikakulam) జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో(Kashibugga Temple) తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో పది మందికి గాయపడినట్టు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కార్తీక మాసం నేపథ్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
Accident Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో..మూడేళ్ల పాప పైకి దూసుకెళ్లిన కారు, అయినా కూడా దెబ్బలు తగలకుండా కారు కింద నుండి మెల్లిగా బయటకు..
Team Latestlyఅహ్మదాబాద్లోని నోబెల్నగర్ ప్రాంతంలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన సిసిటివిలో రికార్డైంది. ఇందులో ఒక టీనేజర్ నడుపుతున్న కారు ఢీకొట్టడంతో మూడేళ్ల బాలిక తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో, వేగంగా వస్తున్న నంబర్ ప్లేట్ లేని కారు ఆమెపైకి దూసుకెళ్లింది.
India Winning Moment Video: భారత మహిళల విన్నింగ్ మూమెంట్ వీడియో ఇదిగో, అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత మహిళా క్రికెట్ జట్టు, ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 ఫైనల్లోకి..
Team Latestlyఅక్టోబర్ 31న నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్లో భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియాపై గెలిచి ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 ఫైనల్లోకి అడుగుపెట్టింది. ప్రేక్షకులతో కిటకిటలాడిన స్టేడియంలో ఆ రాత్రి భారత జట్టు ఆట ఒక మాయాజాలం లా మారింది.భారీ స్కోరు ఛేజ్ చేయాల్సిన పరిస్థితిలో కూడా భారత మహిళలు ధైర్యంగా పోరాడారు.
Ikkis Trailer Out: ఇక్కీస్ ట్రైలర్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.. హీరోగా అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్పాల్ జీవిత చరిత్ర ఆధారంగా మూవీ
Team Latestlyభారత సైన్యంలో అత్యంత వీరోచిత సాహసాలను ప్రదర్శించి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్పాల్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం‘ఇక్కీస్’ (Ikkis). ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో దేశభక్తి భావాలను రగిలిస్తోంది.
Shreyas Iyer: గాయం తర్వాత మొదటిసారిగా స్పందించిన భారత వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, కోలుకునే దశలో ఉన్నానని వెల్లడి, అభిమానుల మద్దతుకు ధన్యవాదాలు తెలుపుతూ నోట్
Team Latestlyసిడ్నీలో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మూడో వన్డేలో తీవ్రమైన గాయానికి గురైన తర్వాత భారత వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మొదటిసారిగా స్పందించారు. ప్లీహ (spleen) గాయం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రస్తుతం ఐసీయూ నుంచి బయటకు వచ్చి కోలుకునే దశలో ఉన్నారని తెలిపారు.
Amazon Layoffs: అమెజాన్లో భారీగా ఉద్యోగాల తొలగింపులు, సీనియర్ స్థాయి అధికారులతో కలిపి దాదాపు 14 వేల మంది బయటకు, ఏఐ రాకతో ఉద్యోగులకు దినదిన గండం
Team Latestlyఅమెజాన్లో భారీగా ఉద్యోగాల తొలగింపులు ప్రారంభమైనట్లు సమాచారం. ఈ సారి సీనియర్ స్థాయి అధికారులను కూడా కలుపుకొని దాదాపు 14 వేల మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారని నివేదికలు చెబుతున్నాయి.
Hurricane Melissa: కరీబియన్ దీవుల్లో బీభత్సం సృష్టిస్తోన్న అత్యంత భయంకరమైన హరికేన్ మెలిస్సా, వీధులన్నీ వరదలతో నిండిపోవడంతో పాటుగా నీటిలో మునిగిపోయిన కార్లు
Team Latestlyమంగళవారం, అక్టోబర్ 28న జమైకాలో తుఫాను మెలిస్సా తీరాన్ని తాకింది. తీరాన్ని తాకుతూనే విపత్కర గాలులు, కుండపోత వర్షం, భారీ తుఫానును తీసుకువచ్చింది. కేటగిరీ 5 హరికేన్ మాండెవిల్లే, బ్లాక్ రివర్, మాంటెగో బే వంటి ప్రదేశాలలో విధ్వంసం సృష్టించింది. చర్చి, ఇళ్ళు ధ్వంసమయ్యాయి.
Helmet Rule Violation: వైరల్ వీడియో ఇదిగో, హెల్మెట్ లేకుండా స్కూటర్ నడిపిన ట్రాఫిక్ పోలీసుకు షాక్, కుర్రాడి దెబ్బకు రూ.2 వేల ఫైన్ విధించిన అధికారులు
Team Latestlyథానేలో చోటుచేసుకున్న వైరల్ వీడియో ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి ట్రాఫిక్ కానిస్టేబుల్తో వాగ్వాదం చేస్తూ కనిపించాడు. విచారణలో తెలిసిన వివరాల ప్రకారం, ఆ వ్యక్తికి గతంలో హెల్మెట్ లేకుండా వాహనం నడిపినందుకు జరిమానా విధించబడింది, దానిపట్ల అతనికి పగ పెరిగి, మళ్లీ అదే అధికారిని ఎదుర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
Narrow Escape in Hyderabad: గుండెలు ఝలదరించే వీడియో ఇదిగో, కదులుతున్న రైలు నుంచి దిగుతూ జారిపడిన ప్రయాణికుడు, వెంటనే ముందుకు దూకి కాపాడిన తోటి ప్రయాణికులు
Team Latestlyహైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు నుంచి దిగడానికి ప్రయత్నిస్తూ జారిపడిన ఒక వ్యక్తి ఘోర ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నాడు. అక్టోబర్ 26న జరిగిన ఈ సంఘటన సీసీటీవీలో రికార్డైంది, వరంగల్కు చెందిన 31 ఏళ్ల మణిదీప్గా గుర్తించబడిన ఈ ప్రయాణికుడు బ్యాలెన్స్ కోల్పోయి రైలు కింద పడిపోతున్నట్లు చూపబడింది.
Air India Bus Fire in Delhi: ఢిల్లీ ఎయిర్పోర్ట్లో తృటిలో తప్పిన పెను ప్రమాదం, ఎయిర్ ఇండియా విమానం సమీపంలోని బస్సుకు అంటుకున్న నిప్పు, వీడియో ఇదిగో..
Team Latestlyఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. ఎయిర్ ఇండియా విమానం సమీపంలో పార్క్ చేసి ఉంచిన ఓ బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో కాసేపు ఎయిర్పోర్ట్లో కలకలం చెలరేగింది.
Kenya Plane Crash: కెన్యాలో ఘోర విమాన ప్రమాదం, కొండ ప్రాంతంలో కుప్పకూలిన టూరిస్టులతో వెళ్తున్న ఫ్టైట్, 12 మంది మృతి చెందినట్లుగా వార్తలు, వీడియో ఇదిగో..
Team Latestlyకెన్యా తీర ప్రాంతం క్వాలే (Kwale)లో మంగళవారం ఉదయం ఘోర విమాన ప్రమాదం జరిగింది. మాసాయి మారా జాతీయ రిజర్వ్ ఫారెస్టుకు టూరిస్టులతో వెళ్తున్న విమానం కూలడంతో 12 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కొండలు, అటవీ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
Turkey Earthquake: టర్కీని వణికించిన భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదు, ఇండ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టిన ప్రజలు, భూకంపం ధాటికి పలు భవనాలు నేలమట్టం, వీడియో ఇదిగో..
Team Latestlyటర్కీలోని పశ్చిమ ప్రాంతంలో భారీ భూకంపం (Turkey Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదయింది. రాత్రి 10.48 గంటల సమయంలో 5.99 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. బలికేసిర్ ప్రావిన్స్లోని సిందిర్గి (Sindirgi) పట్టణాన్ని భూకంప కేంద్రంగా అధికారులు గుర్తించారు. ఇస్తాంబుల్, ఇజ్మీర్, బుర్సా, మానిసా వంటి నగరాల్లో భూకంప ప్రభావానికి వణికిపోయాయి.
Karimnagar Road Accident: వీడియో ఇదిగో.. కరీంనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొట్టుకున్న రెండు బైక్లు, ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
Team Latestlyకరీంనగర్ జిల్లా నుస్తులాపూర్ స్టేజ్ వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం ప్రాంతంలో కలకలం రేపింది. రహదారిని దాటుతున్న సమయంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రమాద తీవ్రతతో రెండు బైకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.రెండు బైకులు కూడా అధిక వేగంతో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక బైక్ రోడ్డు దాటుతుండగా, మరొకటి ఎదురుగా వస్తూ బలంగా ఢీకొట్టింది.
Telangana Shocker: వీడియో ఇదిగో.. పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ పైనుండి దూకిన యువకుడు, టవర్ కింద బురదలో పడడంతో తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం.. అబ్దుల్లాపూర్మెట్లో ఘటన
Team Latestlyరంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో ఆదివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. తనకు పెళ్లి చేయాలని ఒత్తిడి చేస్తూ ఒక యువకుడు హైటెన్షన్ విద్యుత్ టవర్పైకి ఎక్కి దూకాడు. స్థానికులు అతన్ని కిందకు దించేందుకు ప్రయత్నించినా, అతడు వినిపించుకోకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు మరియు విద్యుత్ శాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
Kurnool Bus Fire Video: మంటల్లో కాలిపోతున్న కావేరి ట్రావెల్స్ బస్సు వీడియో ఇదిగో, అందరూ చూస్తుండగా క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమైన ప్రైవేట్ బస్సు, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఘటన
Team Latestlyకర్నూల్ జిల్లాలోని చిన్నటేకూరు వద్ద కావేరి ట్రావెల్స్ బస్సు (Bus Fire Accident) ఘోర ప్రమాదానికి గురైన సంగతి విదితమే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరు వద్ద ఓ బైక్ను ఢీకొట్టింది. తర్వాత డ్రైవర్ బస్సును ఆపకుండా సుమారు 300 మీటర్ల దూరం బైను అలాగే తీసుకెళ్లాడు. దీంతో మంటలు చెలరేగి బస్సు ముందు భాగంలో అంటుకున్నాయి.
Accident Caught on Camera: వీడియో ఇదిగో, కాంపౌండ్లో ఆడుకుంటుండగా ఏడేళ్ల బాలుడి మీద నుంచి వెళ్లిన కారు, బాలుడికి కనీసం సహాయం కూడా చేయలేదని తల్లి ఆవేదన
Team Latestlyదేశ ఆర్థిక రాజధాని ముంబైలోని మలాడ్లోని ఇంటర్ఫేస్ హైట్స్ సొసైటీ లోపల జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన ప్రమాదం CCTVలో రికార్డైంది, అక్టోబర్ 19న సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ఏడేళ్ల బాలుడు కారు ఢీకొని నలిగిపోతున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి.
Kurnool Bus Fire Accident: కర్నూలు బస్సు ప్రమాదం, మృతుల కుటుంబాలకు 5 లక్షలు పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థికసాయం
Team Latestlyకర్నూలు కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో (Kurnool Bus Fire Tragedy) మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Bihar Assembly Elections 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, మహాఘట్బంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్, నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు, నవంబర్ 14న ఫలితాలు
Team Latestlyబీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష మహాఘట్బంధన్ తరఫున సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ (RJD) ప్రధాన నాయకుడు తేజస్వి యాదవ్ను ఎంపిక చేశారు. ఈ సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ మీడియాతో వెల్లడించారు. అశోక్ గెహ్లాట్ ను బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆల్ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) సీనియర్ ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది.
Murder Caught on Camera: పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య, డ్రైవర్ ని ఇటుకలతో కొట్టి చంపిన ఇద్దరు వ్యక్తులు, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Team Latestlyయూపీలోని ప్రయాగ్రాజ్లోని ధూమంగంజ్ ప్రాంతంలో జరిగిన ఒక దారుణమైన దాడి చోటు చేసుకుంది. కాంట్రాక్టు రోడ్వేస్ డ్రైవర్ రవెంద్ర కుమార్ అలియాస్ మున్ను అనే వ్యక్తి తలపై ఇద్దరు వ్యక్తులు ఇటుకలతో కొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటన అక్టోబర్ 21న CCTVలో రికార్డైంది. బాధితుడు వారు విసిరేసిన ఇటుకలు, రాళ్లను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో ఉంది.
Andhra Pradesh: వీడియో ఇదిగో.. పెట్రోల్ డబ్బులు అడిగినందుకు పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి చేసిన కానిస్టేబుల్, చల్లారెడ్డిపాలెం పెట్రోల్ బంకులో ఘటన
Team Latestlyఏపీలో పెట్రోల్ డబ్బులు అడిగినందుకు పెట్రోల్ బంక్ సిబ్బందిపై కానిస్టేబుల్ దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పెట్రోల్ బంకులో ఓ ఏఆర్ కానిస్టేబుల్ హల్చల్ చేశాడు. బుధవారం తెల్లవారుజామున బైకుకు పెట్రోల్ కొట్టించుకుని డబ్బులు చెల్లించకుండా,డబ్బులు అడిగిన బంక్ సిబ్బందిపై దౌర్జన్యం చేసి దాడికి పాల్పడ్డాడు.