తాజా వార్తలు

Australia vs India: స్మిత్, ట్రావిస్ హెడ్‌ సెంచరీలు..5 వికెట్లు తీసిన బుమ్రా...భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా

Arun Charagonda

బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా బిస్బేన్ లోని గర్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ ఇద్దరు సెంచరీలతో రాణించగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే బిగ్ షాకిచ్చాడు. మరోసారి 5 వికెట్లు తీసి సత్తాచాటాడు బుమ్రా.

Andhra Pradesh: ఏపీలో గంజాయి సాగు...15 ఎకరాల్లో పండించిన గంజాయిని తగలబెట్టిన రైతులు...వీడియో ఇదిగో

Arun Charagonda

అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలో స్వచ్ఛందంగా గంజాయి పంటలు ధ్వంసం చేశారు రైతులు. దాదాపు 15 ఎకరాల్లో పండించిన గంజాయిని తగలబెట్టారు రైతులు. గంజాయి వల్ల కలిగే అనర్థాలపై ప్రభుత్వం అవగాహన కల్పించడంతో రైతుల్లో చైతన్యం కల్పించారు.

Telangana: భార్య భర్తల గొడవలో తలదూర్చిన ఎస్‌ఐ, రూ.20 వేలు డిమాండ్..ఇవ్వక పోవడంతో గిరిజన యువకుడిపై దాడి...వీడియో ఇదిగో

Arun Charagonda

భార్య భర్తల గొడవలో తలదూర్చాడు ఓ ఎస్ఐ. రూ.20 వేలు లంచం ఇవ్వలేదని గిరిజన యువకుడిపై దాడికి పాల్పడడాడు. మహాబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలో భార్యా భర్తల పంచాయితీలో రూ.20 వేలు డిమాండ్ చేశారు ఎస్ఐ క్రాంతి కిరణ్. అంతకు ముందే రూ.15 వేలు తీసుకున్నారని, తన దగ్గర డబ్బులు లేవని వేడుకున్నాడు యువకుడు. డబ్బులు ఇవ్వలేదని పోలీసులు దారుణంగా కొట్టినట్టు గిరిజన యువకుడు ఆరోపించగా న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Srisailam: శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుత కలకలం.. రోడ్డు పక్కన గోడపై కూర్చుని ఉన్న చిరుత...వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుత కలకలం రేపింది. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న భక్తులకు కనిపించింది చిరుత. రోడ్డు పక్కన గోడపై చిరుత కూర్చొని ఉండగా చిరుతను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు యాత్రికులు. చిరుత కూర్చొని ఉండగా దానిని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Telangana Congress: కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం తగదు...ఇదే కొనసాగితే ప్రజలు బుద్దిచెప్పడం ఖాయమని వెల్లడి

Arun Charagonda

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ పార్టీగా గొప్పలు చెప్పుకునే బీఆర్ఎస్.. తన పదేళ్ల పాలనలో తెలంగాణ వెనుకబాటుకు గురైందన్నారు.

Burra Venkatesham: గ్రూప్ 2 పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం, రెండు మూడు నెలల్లో పరీక్షల ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడి

Arun Charagonda

గ్రూప్ 2 పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు TGPSC చైర్మన్ బుర్రా వెంకటేశం. బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. రెండు మూడు నెలల్లో పరీక్షల ఫలితాలు అందిస్తామని వెల్లడించారు బుర్రా వెంకటేశం.

SI Suicide Case: వాజేడు ఎస్ఐ సూసైడ్ కేసులో ప్రియురాలు అరెస్ట్, రాంగ్‌ నెంబర్‌ కాల్ చేసి ఎస్‌ఐకి పరిచయం..ప్రేమ పేరుతో వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా పోలీసుల వెల్లడి

Arun Charagonda

వాజేడు ఎస్ఐ సూసైడ్ కేసులో ప్రియురాలును అరెస్ట్ చేశారు పోలీసులు. ఇటీవల సర్వీస్ రివాల్వర్ తో ఆత్మహత్య చేసుకున్న వాజేడు ఎస్ఐ హరీష్ కేసులో ప్రియురాలు అనసూర్య(29)ను అరెస్ట్ చేశారు పోలీసులు. బానోత్ అనసూర్య, సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దూదియా తండాకు చెందిన మహిళగా గుర్తించారు. ప్రేమ పేరుతో ఎస్ఐని వేధింపులకు గురిచేసి, ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు వెల్లడించారు. గత సంవత్సరం క్రితం రాంగ్ నెంబర్ కాల్ చేసి ఎస్ఐకు పరిచయమైంది అనసూర్య.

CM Revanth Reddy: 98 శాతం కులగణన పూర్తి, తెలంగాణకు బహుజనుల తల్లి కావాలి...దొడ్డి కొమురయ్య పేరు శాశ్వతంగా గుర్తుండిపోయేలా చర్యలు తీసుకుంటామన్న సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

జనాభా ప్రాతిపదికన ఫలాలు అందాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన 98 శాతం మేరకు పూర్తయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మిగిలిన రెండు శాతం పూర్తయితే దేశానికే ఆదర్శంగా నిలిచే ఈ కులగణన తెలంగాణ ప్రజల మెఘా హెల్త్ ప్రొఫైల్‌గా మారుతుందని అన్నారు.

Advertisement

Man Chops Off His Fingers: పని ఒత్తిడా? లేక పని చేయడం ఇష్టంలేకనో... మొత్తానికి పని నుంచి తప్పించుకోవదానికి కత్తితో చేతులు నరుక్కున్న వ్యక్తి.. గుజరాత్‌ లోని సూరత్ లో ఘటన (వీడియో)

Rudra

గుజరాత్‌ లోని సూరత్‌ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వజ్రాల దుకాణంలో కంప్యూటర్ ఆపరేటర్‌ గా పని చేస్తున్న ఓ యువకుడు పని ఒత్తిడి మూలంగానో లేక ఆ ఉద్యోగం చేయడం నచ్చకనో ఏదైతేనేమీ తన చేతి నాలుగు వేళ్లను నరుక్కున్నాడు.

Car Overturns in Mancherial: మద్యం మత్తులో డ్రైవింగ్.. కారు బోల్తా.. మంచిర్యాలలో ఘటన (వీడియో)

Rudra

మంచిర్యాలలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి ఫూటుగా మద్యం సేవించి కారు నడుపుతుండగా.. ప్రమాదవశాత్తూ అది బోల్తా పడింది. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కారును పైకి లేపి అందులో ఉన్న వ్యక్తిని కాపాడారు.

Cockroaches in Pub’s Kitchen: హైదరాబాద్ లోని ఫేమస్ పబ్బుల్లోని కిచెన్ లో బొద్దింకలు.. కాలం చెల్లిన ఉత్పత్తులు..

Rudra

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని డైలీ రిచువల్స్, హార్ట్ కప్ పబ్బుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు జరిపారు. ఆయా పబ్స్ లోని కిచెన్ లో బొద్దింకలు, కాలం చెల్లిన ఉత్పత్తులు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ రెండు పబ్బులపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

Bigg Boss Season 8: నేడు బిగ్‌ బాస్ సీజన్ 8 కు ఎండ్ కార్డ్.. 300 మంది పోలీసులతో భారీ భద్రత.. గత సీజన్ అనుభవాలను దృష్టిలో పెట్టుకునే..

Rudra

ప్రముఖ వినోద ఛానల్ స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ‘బిగ్‌బాస్ సీజన్ 8’ నేటితో ముగియనుంది. దాదాపు వంద రోజులపాటు ప్రేక్షకులను అలరించిన ఈ రియాలిటీ షో విజేతను ఆదివారం రాత్రి ప్రకటించనున్నారు.

Advertisement

Good News For Farmers: రైతులకు ఆర్బీఐ శుభవార్త.. తాకట్టు లేకుండానే రూ.2 లక్షల వరకూ అప్పు.. జనవరి 1 నుంచి నూతన నిబంధనలు అమలులోకి

Rudra

దేశంలోని అన్నదాతలకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుభవార్త చెప్పింది. వ్యవసాయ అవసరాలకు, పంట సాగు కోసం ఎలాంటి తాకట్టు లేకుండా అందించే రుణ సదుపాయాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

Road Accident in US: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెనాలి యువతి దుర్మరణం.. ఎంఎస్ చేసేందుకు రెండేళ్ల క్రితం అమెరికా వెళ్ళిన మృతురాలు

Rudra

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి నాగశ్రీవందన పరిమళ (26) దుర్మరణం పాలయ్యారు.

Group 2 Exams Today: నేడు, రేపు గ్రూప్‌-2 పరీక్షలు.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30వరకు రెండో సెషన్‌

Rudra

నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్‌-2 పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఆది, సోమవారాల్లో గ్రూప్‌-2 పరీక్షలు జరగనున్నాయి.

Free Aadhaar Update Last Date: ఉచితంగా ఆధార్ అప్ డేట్ చేసుకునేందుకు మ‌రోసారి గ‌డువు పెంపు, ఉచితంగా ఎలా ఆధార్ అప్ డేట్ చేసుకోవ‌చ్చంటే?

VNS

ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు శనివారంతో ముగిసిపోతున్నది. ఈ నేపథ్యంలో భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UADAI) మరో ఆరు నెలలు అంటే 2025 జూన్ 14 వరకూ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. అంటే ఆధార్‌లో అడ్రస్‌లో (Aadhar Update) మార్పులు చేసుకోవాలంటే వెంటనే ఆన్ లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు.

Advertisement

Toyota Urban Cruiser EV: మారుతీ సుజుకీ టెక్నాల‌జీతో ట‌యోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ, వ‌చ్చే నెల మార్కెట్లోకి రానున్న స‌రికొత్త కార్

VNS

సుజుకి ఈవీఎక్స్ కాన్సెప్ట్ ఆధారంగా రూపుదిద్దుకున్నదే టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ. గుజరాత్ లోని మారుతి సుజుకి ప్లాంట్ లో టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ / సుజుకి ఈ విటారా (Maruti Suzuki E Vitara) తయారవుతాయి.

KTR Meets Nandini Sidda Reddy: రేవంత్ రెడ్డి ఆఫ‌ర్ ను తిర‌స్క‌రించిన నందిని సిధారెడ్డి, ఇంటికి వెళ్లి మ‌రీ అభినందించిన కేటీఆర్

VNS

తెలంగాణ సాహితీ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కవి, రచయిత నందిని సిధారెడ్డిని (Nandini Sidda Reddy) బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామరావు (KTR) మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి నగదు పారితోషకం, ప్లాట్‌ను తిరస్కరించడం తెలంగాణ అస్థిత్వ పరిరక్షణలో ఓ మైలురాయిగా నిలుస్తుందని కేటీఆర్‌ పేర్కొన్నారు.

UPI Achieves Historic Milestone: యూపీఐ పేమెంట్స్ లో భార‌త్ స‌రికొత్త చ‌రిత్ర‌, ఏకంగా రూ. 223 లక్ష‌ల కోట్ల చెల్లింపులు

VNS

యూపీఐ లావాదేవీల్లో (UPI Payments) కీలక మైలురాయి రికార్డైంది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ నెలాఖరు వరకూ 15,547 కోట్ల లావాదేవీలు జరిగితే రూ.223 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ (Finance Ministry) శనివారం ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేసింది. ‘భారత్ ఆర్థిక వ్యవస్థ డిజిటల్ పేమెంట్ (Digital Payments) విప్లవం దిశగా ప్రయాణిస్తోంది.

Special Darshan Cancelled in Tirumala: వైకుంఠ‌ద్వార ద‌ర్శ‌నానికి తిరుమ‌ల వెళ్తున్నారా? టీటీడీ కొత్త నిబంధ‌న‌లు ఇవే! ప‌లు ద‌ర్శ‌నాలు ర‌ద్దు

VNS

జనవరి 10 నుంచి 19వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు (Vaikuntha Dwara Darshan) టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. దర్శన టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామని స్పష్టం చేసింది

Advertisement
Advertisement