తాజా వార్తలు

Stray Dogs Attack: కామారెడ్డిలో వీధికుక్కల స్వైర విహారం, 15 మందిపై దాడి, గాయాలతో ఆస్పత్రిలో చేరిక...వీడియో

Arun Charagonda

తెలంగాణలోని కామారెడ్డిలో వీధికుక్కలు రెచ్చిపోయాయి. కామారెడ్డి - మాచారెడ్డి, ఘన్పూర్ తో పాటు పలు గ్రామాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేశారు. వేర్వేరు సంఘటనలో 15 మందికి పైగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

Viral Video: బొప్పాయిలో వినాయకుడు, జగ్గంపేటలో వినూత్న సంఘటన, వినాయకుడిని చూసేందుకు ఎగబడుతున్న జనం..వీడియో వైరల్

Arun Charagonda

కాకినాడ జిల్లా జగ్గంపేటలో బొప్పాయిలో దర్శనమిచ్చాడు లంబోదరుడు. గండేపల్లి మండలం నీలాద్రిరావు పేటలో గణపతి నవరాత్రుల పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్దకు అదే గ్రామానికి చెందిన ఒక భక్తుడు తన ఇంటి వద్ద ఉన్న బొప్పాయి చెట్టు మొట్ట మొదటిగా వినాయకుడికి నైవేథ్యంగా సమర్పించేందుకు కొట్టగా అందులో వినాయకుడి దర్శనం ఇచ్చాడు.

Pawan Kalyan With Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భేటీ, సీఎంఆర్‌ఎఫ్‌కు రూ. కోటి విరాళం అందజేత

Arun Charagonda

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఇవాళ ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు పవన్. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళంకు సంబంధించిన చెక్‌ను రేవంత్‌కు అందించారు పవన్.

Flipkart Delivery Boy: ఫ్లిప్ కార్ట్ డెలివరి బాయ్ అత్యాచారయత్నం,కేకలు వేయడంతో పరారైన నిందితుడు

Arun Charagonda

ఫ్లిప్ కార్ట్ డెలివరి బాయ్ అత్యాచారయత్నం చేశాడు. గృహిణి పై అత్యాచారయత్నానికి పాల్పడగా కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. నిర్మల్ పట్టణం మంజులపూర్ కాలనీలో ఆర్డర్ డెలివరి చేసే క్రమంలో గృహిణి పై ఆత్యచారాయత్నం చేశాడు. నిర్మల్ గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Stray Dogs Attack:నిజామాబాద్‌లో దారుణం, 10 నెలల బాలుడిని పీక్కుతిన్న వీధి కుక్కలు...విషాద సంఘటన

Arun Charagonda

నిజామాబాద్ జిల్లా బోధన్ బస్‌స్టాండ్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బస్టాండ్ పరిసరాల్లో బిడ్డను వదిలి బహిర్భూమికి వెళ్లింది తల్లి. అదే సమయంలో బాలుడి ఈడ్చుకెళ్లి పీక్కుతిన్నాయి వీధి కుక్కలు. కిడ్నాప్ చేశారని మహిళ ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టినన పోలీసులు... బస్ డిపో పరిసరాలలో బాలుడి అవయవాలు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Sharmila Slams Chandrababu: చిన్న పిల్లల పాకెట్ మనీ తీసుకోవడం కాదు కేంద్రం నుండి 10 వేల కోట్లు తేండి.. సీఎం చంద్రబాబుపై వైఎస్ షర్మిల సెటైర్

Arun Charagonda

ఏపీ సీఎం చంద్రబాబుపై సెటైర్ వేశారు కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. చిన్నపిల్లల పాకెట్ మనీ తీసుకోవడం కాదు‌‌‌ చంద్రబాబు గారు.. కేంద్రం నుండి10 వేల కోట్లు తీసుకు రండి అని ఎద్దేవా చేశారు. వరద బాధితులకు కనీసం లక్ష నష్టపరిహారం ఇవ్వాలి, తక్షణ సాయంగా‌... పదిహేను వేలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.

AP CM Chandrababu: ఉత్తరాంధ్రకు ఏపీ సీఎం చంద్రబాబు, వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే,రైతులతో మాట్లాడనున్న టీడీపీ అధినేత.. షెడ్యూల్ ఇదే

Arun Charagonda

అకాల వర్షాలు ఏపీని ముంచెత్తిన సంగతి తెలిసిందే. ప్రధానంగా విజయవాడలోని బుడమేరు చెరువు పోటెత్తడంతో నగరం నీట మునగగా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక బుడమేరు నుండి నీరు దిగువన ఉన్న కోల్లేరుకు చేరుకుంది. దీంతో ఉభయ గోదావరి జిల్లాలకు వరద పోటెత్తింది.

Hyundai Creta EV: హ్యుండాయ్ క్రెటా ఈవీ లాంచ్ తేదీ వచ్చేసింది, ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయంటే..

Vikas M

దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుండాయ్ (Hyundai) పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ తో నడిచే హ్యుండాయ్ క్రెటా ఈవీ (Hyudai Creta EV) కారును తీసుకురానుంది. 2026 ప్రారంభంలో ఇది మార్కెట్లోకి రానున్నది.

Advertisement

JioPhone Prima 2 4G: తొలి సారి ఫ్రంట్‌ కెమెరాతో జియో నుంచి అదిరిపోయే ఫీచర్ ఫోన్, జియో ఫోన్ ప్రైమా 2 ఫీచర్లు, ధర గురించి ఓ సారి తెలుసుకోండి

Vikas M

దేశీయ టెలికాం దిగ్గజం జియో భారత మార్కెట్లోకి జియో ఫోన్ ప్రైమా 2 (Jio Phone Prima 2) తీసుకువచ్చింది. 2023 నవంబర్‌లో జియో ఆవిష్కరించిన జియో ఫోన్ ప్రైమా 4జీ (Jio Phone Prima 4G) కొనసాగింపుగా జియో ఫోన్ ప్రైమా 2 వస్తోంది. 2.4 అంగుళాల కర్వ్డ్ స్క్రీన్ తోపాటు క్వాల్ కామ్ ప్రాసెసర్, 2000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, రేర్ అండ్ ఫ్రంట్ కెమెరాలు ఉంటాయి.

GNSS: ప్రైవేటు వాహనదారులకు గుడ్‌న్యూస్, హైవేపై రోజుకు 20 కిలోమీటర్ల దూరం ఎలాంటి ఛార్జీలు ఉండవు, టోల్ ట్యాక్స్ నిబంధనల్లో కీలక మార్పులు చేసిన కేంద్రం

Vikas M

ప్రైవేటు వాహనదారులకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. వాహనానికి జీఎన్ఎస్ఎస్ (గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్) సౌలభ్యం కలిగిన వాహనదారులు హైవేలు, ఎక్స్‌ప్రెస్‌ రహదారులపై రోజుకు 20 కిలోమీటర్ల దూరం ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండానే ప్రయాణించవచ్చని ప్రకటించింది.

ISRO Warning on Apophis: భూమివైపు దూసుకొస్తున్న భారీ అపోఫిస్ ఆస్టరాయిడ్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య కంటే పెద్దగా ఉందని తెలిపిన ఇస్రో చీఫ్ డా.ఎస్ సోమనాథ్

Vikas M

ఒక భారీ గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోందంటూ ఇస్రో హెచ్చరికలు జారీ చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం కంటే పెద్దగా ఉన్న ఆస్టరాయిడ్ అపోఫిస్ భూమికి అతి సమీపంలో దూసుకువెళుతుందని తెలిపింది.

Yuzvendra Chahal Five-Wickets Video: యుజ్వేంద్ర చాహల్ 5 వికెట్ల వీడియో ఇదిగో, కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ టూలో అదరగొట్టిన భారత స్పిన్నర్

Vikas M

కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ టూలో యుజ్వేంద్ర చాహల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు, అతను డెర్బీషైర్‌పై నార్తాంప్టన్‌షైర్‌కు ఐదు వికెట్లు పడగొట్టాడు. చాహల్ బాధితుల్లో వేన్ మాడ్‌సెన్, అన్యూరిన్ డొనాల్డ్, జాక్ చాపెల్, అలెక్స్ థాంప్సన్ మరియు జాక్ మోర్లే ఉన్నారు.

Advertisement

Uttar Pradesh: షాకింగ్ వీడియో ఇదిగో, 40 అడుగుల ఓవర్‌బ్రిడ్జిపై నుంచి దూకి యువకుడు మృతి, కారణం ఏంటంటే..

Vikas M

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో, పిల్లలను ఎత్తుకెళ్తున్నాడని అనుమానిస్తున్న వ్యక్తి ఎనిమిది గంటలపాటు తీవ్ర ప్రతిష్టంభన తర్వాత 40 అడుగుల ఓవర్‌బ్రిడ్జిపై నుంచి దూకి మృతి చెందాడు. అవినాష్ కుమార్ అనే వ్యక్తి పిల్లల దొంగ అని భావించిన గ్రామస్థులు, రాత్రంతా అతడిని వెంబడించడంతో ఘటన మొదలైంది. ప్రాణభయంతో కుమార్ జాన్‌పూర్-వారణాసి హైవేపై ఫుట్ ఓవర్‌బ్రిడ్జిపైకి ఎక్కాడు.

Hertz Tower Demolition: వీడియో ఇదిగో, 15 సెకన్లలో 22 అంతస్తుల టవర్‌ని కూల్చివేసారు, లేక్‌ చార్లెస్‌లో హెర్ట్జ్‌ టవర్‌ కూల్చివేత వీడియో ఇదిగో..

Vikas M

అమెరికాలోని లూసియానా రాష్ట్రం లేక్‌ చార్లెస్‌లో 2020లో సంభవించిన లౌరా, డెల్టా హరికేన్‌ తుఫాన్ల కారణంగా 22 అంతస్తుల హెర్ట్జ్‌ టవర్‌ బాగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో హెర్ట్జ్‌ టవర్‌ను అధికారులు శనివారం ఇలా నియంత్రిత విధానంలో పేలుళ్లు జరిపి కూల్చివేశారు. 15 సెకన్లలోనే ఈ భవనం నేలమట్టమైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

16th Finance Commission Meet: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటా 41 నుంచి 50 శాతానికి పెంచాలి: 16వ ఆర్ధిక సంఘం సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి

Hazarath Reddy

దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని..అందుకే ది ఫ్యూచర్ స్టేట్‌గా పిలుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాభవన్‌లో జరిగిన 16వ ఆర్ధిక సంఘం సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ వేగంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని పేర్కొన్నారు.

Video: వీడియో ఇదిగో, రైలులో మహిళకు ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ ప్రయాణికుడు అసభ్య ప్రవర్తన, చితకబాదిన ప్రయాణికురాలు

Hazarath Reddy

కదులుతున్న రైలులో ఓ మహిళా ప్రయాణికుడికి తన ప్రైవేట్ పార్ట్స్ చూపించి అసభ్యంగా ప్రవర్తించాడు.మహిళ అతనిని తన చెప్పులతో కొట్టి, వారి ముందు అతనిని బహిర్గతం చేసింది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది

Advertisement

Vande Bharat Attack Video: వీడియో ఇదిగో, వందే భారత్ రైలు అద్దాలను సుత్తితో పగలగొడుతున్న యువకుడు, చర్యలు తీసుకోవాలంటూ  వీడియో షేర్ చేస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

వందే భారత్‌ రైలుపై (Vande Bharat Train) అడపదడపా దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో మరో వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అద్దాలను సుత్తితో పగలగొడుతున్నాడు

Devara Part 1 Trailer: గూస్ బంప్స్ తెప్పిస్తున్న దేవర ట్రైలర్, కేక పుట్టించేలా సముద్ర తీరంలో జరిగే పోరాట సన్నివేశాలు, పవర్‌ఫుల్‌ లుక్‌లో జూనియర్ ఎన్టీఆర్

Hazarath Reddy

కొరటాల శివ డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' ట్రైలర్‌ విడుదలైంది. బాలీవుడ్‌ వేదికగా దేవర ట్రైలర్‌ను తెలుగు,హిందీ,తమిళ్‌,కన్నడ,మలయాళం భాషలలో విడుదల చేశారు. ట్రైలర్‌లో ఎన్టీఆర్‌ చాలా పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపిస్తున్నారు.

Godavari Water Level Rise: భద్రాచలం వద్ద 47 అడుగులు దాటిన గోదావరి నీటిమట్టం, పోలవరం ముంపు మండలాలకు రాకపోకలు బంద్, రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్న అధికారులు

Hazarath Reddy

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు ఎక్కువవుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం (Godavari Water Level Rise) పెరుగుతోంది. సోమవారం 26 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం.. ఈ రోజు మధ్యాహ్నానికి 47 అడుగులు దాటి ప్రవహిస్తోంది.

Suicide Attempt Foiled: వీడియో ఇదిగో, ఆత్మహత్య చేసుకోవాలని వచ్చి పట్టాలపై నిద్రపోయిన యువతి, తలకు కొద్ది దూరంలో రైలును ఆపేసిన డ్రైవర్

Hazarath Reddy

బీహార్‌లోని మోతిహారిలో జరిగిన నాటకీయ పరిణామాలలో, రైలు పట్టాలపై జీవితాన్ని ముగించాలని భావించిన ఒక యువతి అందుకు బదులుగా నిద్రపోయింది. ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశ్యంతో చాకియా రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఆమె రైలు కోసం వేచి ఉండగానే పట్టాలపై పడుకుని నిద్రపోయింది.

Advertisement
Advertisement