తాజా వార్తలు

KTR Complaint To DGP: తెలంగాణ డీజీపీకి కేటీఆర్ ఫిర్యాదు, రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు క్షీణించాయంటూ నేత‌ల‌తో క‌లిసి కంప్లైంట్ చేసిన కేటీఆర్

VNS

రాష్ట్ర డీజీపీ కార్యాల‌యంలో డీజీపీ జితేంద‌ర్‌ను బీఆర్ఎస్ (BRS) నాయ‌కులు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం క‌లిశారు. తుంగ‌తుర్తి రైతుల‌పై, నిన్న సీఎం రేవంత్ సొంతూరు కొండారెడ్డిప‌ల్లిలో జ‌ర్న‌లిస్టుల‌పై జ‌రిగిన దాడుల‌పై డీజీపీకి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR Complaint) ఫిర్యాదు చేశారు.

Nirmal Benny Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గుండెపోటుతో ప్రముఖ మళయాల నటుడు నిర్మల్‌ బెన్నీ కన్నుమూత

Vikas M

ప్రముఖ మళయాల నటుడు నిర్మల్‌ బెన్నీ (Nirmal Benny) గుండెపోటుతో మరణించారు. 37 ఏళ్ల బెన్నీ ఇవాళ (శుక్రవారం) ఉదయం తిరువనంతపురం (Thiruvananthapuram) లోని తన నివాసంలోనే నిర్మల్‌ బెన్నీ తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు

Nirmal Benny Dies: సినీ ప‌రిశ్ర‌మలో విషాదం, 37 ఏళ్ల వ‌య‌స్సులోనే గుండెపోటుతో మృతి చెందిన క‌మెడియ‌న్, దిగ్భ్రాంతిలో ఇండ‌స్ట్రీ

VNS

నిర్మ‌ల్ బెన్నీ మృతితో మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం తెలియ‌జేస్తున్నారు.

New TVS Jupiter 110: టీవీఎస్‌ నుంచి జూపిటర్‌లో సరికొత్త వెర్షన్‌, 110సీసీ సామర్థ్యంతో కొత్త జూపిటర్‌ స్కూటీని విడుదల చేసిన దిగ్గజం

Vikas M

టీవీఎస్‌ మోటర్‌ తమ పాపులర్‌ మోడల్‌ జూపిటర్‌లో సరికొత్త వెర్షన్‌ను పరిచయం చేసింది. 110సీసీ సామర్థ్యంతో వచ్చిన ఈ స్కూటర్‌ ప్రారంభ ధర ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం రూ.73,700లుగా ఉన్నది.

Advertisement

PRANA 2.0 Electric Bike: ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 250 కిలోమీటర్లు,ప్రాణ ఎలైట్‌ బైక్‌ను విడుదల చేసిన శ్రీవారు మోటర్స్‌, ధర ఎంతంటే..

Vikas M

తమిళనాడు శ్రీవారు మోటర్స్‌ గురువారం తమ ప్రీమియం ఎలక్ట్రిక్‌ మోటర్‌సైకిల్‌ ప్రాణ 2.0 మోడల్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. చెన్నై ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర రూ.2,55,150గా ఉంది.ఈ బైక్ సింగిల్‌ చార్జింగ్‌పై 150 కిలోమీటర్లదాకా ప్రయాణం చేయవచ్చని కంపెనీ తెలిపింది. దీంతో పాటుగా ప్రాణ ఎలైట్‌ బైక్‌నూ మార్కెట్‌కు పరిచయం చేసింది.

Audi Q8 Facelift: ఆడి నుంచి భారత మార్కెట్లోకి క్యూ8 ఫేస్‌లిఫ్ట్ కారు, ధర రూ.1.17 కోట్లు పై మాటే, కేవలం 5.6 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగం దీని సొంతం

Vikas M

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ భారత మార్కెట్లోకి కొత్త మాడల్‌ను ప్రవేశపెట్టింది. ఎనిమిది రంగుల్లో లభించనున్న Audi Q8 facelift కారు ప్రారంభ ధర రూ.1.17 కోట్లుగా నిర్ణయించింది. రూ.5 లక్షలు చెల్లించి ఈ కారు ముందస్తు బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

SEBI Bans Anil Ambani From Market: నిధుల మళ్లింపు ఆరోపణలు, అనిల్‌ అంబానీపై సెబీ ఐదేళ్ల నిషేధం, రూ.25 కోట్ల జరిమానా

Vikas M

ప్రముఖ వ్యాపార‌వేత్త అనిల్ అంబానీ(Anil Ambani)పై మార్కెట్ రెగ్యులేట‌ర్ సెబీ అయిదేళ్ల పాటు నిషేధం విధించింది. రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌’ (RHFL)లో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులు, మరో 24 సంస్థలకూ నిషేధాన్ని వర్తింపజేస్తున్నట్లు శుక్రవారం వెల్లడించింది. నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

Jio Issues Cyber Fraud Warning: కస్టమర్లకు జియో సైబర్ వార్నింగ్, ఆ సందేశాలు నమ్మవద్దంటూ అలర్ట్

Vikas M

రిలయన్స్‌ జియో పేరిట సందేశాలు పంపుతూ కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే ప్రయత్నాలు హ్యాకర్లు మొదలుపెట్టారు. దీనిపై రిలయన్స్ తమ కస్టమర్లను వెంటనే అలర్ట్‌ చేసింది. సున్నితమైన సమాచారం అందించాలంటూ జియో పేరుతో వచ్చే సందేశాలను నమ్మొద్దంటూ వినియోగదారులకు తెలిపింది. ఈ మేరకు కొన్ని సూచనలు జారీ చేసింది.

Advertisement

Viral News: ఆ టీచర్ వక్షోజాలు చూసి నా కొడుకు చెడిపోతున్నాడు, స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు, వింత ఘటన వెలుగులోకి..

Vikas M

ఆన్‌లైన్‌లో మరో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. టీచర్ పెద్ద వక్షోజాలు" గురించి ఒక పేరెంట్ తన స్కూల్ అడ్మినిస్ట్రేటర్‌కి ఫిర్యాదు చేశాడని పేర్కొంటూ, ఒక మిడిల్ స్కూల్ టీచర్ రెడ్డిట్‌కి వెళ్లింది. రెడ్డిట్‌లో xtinalaperra అనే పేరుతో ఉన్న ఉపాధ్యాయురాలు, తన దుస్తుల కోడ్‌పై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఆమె పాఠశాల అడ్మిన్ తనను సంప్రదించినట్లు సుదీర్ఘ పోస్ట్‌లో పేర్కొంది.

Ghaziabad Metro Fight Video: వీడియో ఇదిగో, ఘజియాబాద్ మెట్రోలో సీటు కోసం తన్నుకున్న ఇద్దరు ప్రయాణికులు

Vikas M

ఘజియాబాద్‌లోని మెట్రో రైలులో ఇద్దరు వ్యక్తులు సీటు కోసం దూకుడుగా పోరాడుతున్న హింసాత్మక వాగ్వాదానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. న్యూ బస్టాండ్ షాహీద్ స్థల్ మెట్రో స్టేషన్‌లో జరిగిన ఈ సంఘటనలో పురుషులు భారీ కిక్‌లు, పంచ్‌లు ఇచ్చుకుంటున్నట్లు చిత్రీకరించబడింది.

Meerut Shocker: యూపీలో దారుణం, స్కూలుకు వచ్చిన బాలికలను అసభ్యంగా తాకుతూ హెడ్ మాస్టర్ పైశాచికానందం, చితకబాదిన తల్లిదండ్రులు, వీడియో ఇదిగో

Hazarath Reddy

మీరట్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసి అరెస్ట్ చేసినట్లు అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. విద్యార్థిని ఫిర్యాదు తర్వాత ప్రధానోపాధ్యాయుడు జమాల్ కమిల్‌ను కూడా బాలిక తల్లిదండ్రులు కొట్టారు

Macherla Municipality: టీడీపీ ఖాతాలో మాచర్ల మున్సిపాలిటీ, సైకిల్ ఎక్కిన 16 మంది వైసీపీ కౌన్సిలర్లు, చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన పోలూరు నరసింహారావు

Hazarath Reddy

Advertisement

Andhra Pradesh: నాడు - నేడు ఇకపై మన బడి - మన భవిష్యత్, ఏపీలో మరో ఆరు పథకాలకు పేర్లు మార్చిన చంద్రబాబు సర్కారు

Hazarath Reddy

ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు ప్రభుత్వ పథకాల పేర్లను మారుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలోని పథకాల పేర్లను తొలగించి కొత్త పేర్లను పెడుతోంది. తాజాగా మరో ఆరు పథకాల పేర్లను మార్చింది.

Andhra Pradesh: వీడియో ఇదిగో, ఒంటి నిండా 25 కిలోల బంగారం, తిరుమల వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించిన పూణే నుండి వచ్చిన భక్తుల బృందం

Hazarath Reddy

విశేషమైన భక్తి ప్రదర్శనలో, పూణే నుండి వచ్చిన భక్తుల బృందం ఈరోజు తెల్లవారుజామున 25 కిలోల బంగారం ధరించి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలోని వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించింది. పవిత్ర మందిరానికి చేరుకున్న ఈ బృందం తోటి యాత్రికులు మరియు ఆలయ సిబ్బంది దృష్టిని ఆకర్షించింది.

Pune Shocker: వీడియో ఇదిగో, విద్యార్థినికి ఐ లైక్ యు అంటూ స్కూల్ వ్యాన్ డ్రైవర్‌ మెసేజ్, పట్టుకుని చితకబాదిన ఎంఎన్ఎస్ సభ్యులు

Hazarath Reddy

ఎడ్యుకేషన్‌కు హబ్‌గా పేరుగాంచిన పూణెలో ఓ పాఠశాల విద్యార్థినిపై జరిగిన వేధింపుల ఘటన ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. స్కూల్ వ్యాన్ డ్రైవర్‌.. విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపి, ‘ఐ లైక్ యు’ అంటూ ఆమెను వ్యక్తిగతంగా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

Andhra Pradesh: వైసీపీ భూతాన్ని పూర్తిగా భూ స్థాపితం చేస్తేనే రాష్ట్రాభివృద్ధి, వానపల్లి సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, కేంద్రం సాయంతో గ్రామాలను అభివృద్ధి చేస్తామని వెల్లడి

Hazarath Reddy

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్త పేట మండలం వానపల్లిలో శుక్రవారం సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా స్వర్ణ వానపల్లి గ్రామసభకు హాజరై ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. పేద ప్రజలకు న్యాయం జరిగే పాలనకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు

Advertisement

Andhra Pradesh Factory Explosion:రెడ్‌ బుక్‌ మీద పెట్టిన శ్రద్ధ వీటిపై పెట్టి ఉంటే ప్రమాదం జరిగేది కాదు, అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని జగన్ మండిపాటు

Hazarath Reddy

అచ్యుతాపురం ప్రమాద ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా బాధాకరమని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం అనకాపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు.

Paradise Hotel Fire: వీడియో ఇదిగో, సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‎లో అగ్ని ప్రమాదం, తినే ప్లేట్లు వదిలి బయటకు పరుగులు పెట్టిన కస్టమర్లు

Hazarath Reddy

సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‎లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో హోటల్ సిబ్బందితో పాటు కస్టమర్లు తీవ్ర భయాందోళనకు గురై తినే ప్లేట్లను వదిలి బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన హోటల్ స్టాఫ్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు

Indian Army Drone Crosses LoC: ఎల్‌వోసీని దాటి పాకిస్థాన్‌లో ల్యాండ్‌ అయిన భారత ఆర్మీ వ్యూహాత్మక డ్రోన్,స్వాధీనం చేసుకున్న పాక్ ఆర్మీ

Hazarath Reddy

ఇండియన్ ఆర్మీకి చెందిన వ్యూహాత్మక డ్రోన్ అనుకోకుండా నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ)ను దాటి పాకిస్థాన్‌లో ల్యాండ్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇండియన్‌ ఆర్మీ డ్రోన్‌ను పాకిస్థాన్‌ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లో ఈ సంఘటన జరిగింది.

UP School Balcony Collapses: యూపీలో కూలిన ప్రైవేట్ స్కూల్‌ బిల్డింగ్‌, 40 మంది విద్యార్థులకు గాయాలు

Hazarath Reddy

యూపీలోని ప్రైవేట్ స్కూల్‌ బిల్డింగ్‌ పాక్షికంగా కుప్పకూలింది. బాల్కనిలోని పిట్ట గోడ కూలడంతో సుమారు 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నలుగురు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement