తాజా వార్తలు

Nellore: కుటుంబ కలహాలు, పట్టాలపై పడుకొని ఆత్మహత్యయత్నం, కాపాడిన కానిస్టేబుల్..వీడియో వైరల్

Arun Charagonda

పట్టాలపై పడుకొని ఆత్మహత్యాయత్నం చేసుకోబోయాడు ఓ యువకుడు. నెల్లూరు - రంగనాయకులపేటకి చెందిన రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు కుటుంబ కలహాలతో రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పి.చెన్నయ్య ఆ వ్యక్తిని కాపాడాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

KTR On Farmers Problem: కాంగ్రెస్ చేసిన కమాల్ ఇదే,ఆగమైతున్న తెలంగాణ రైతు, సంక్షోభంలో సాగు? ఆసక్తికర ట్వీట్ చేసిన కేటీఆర్

Arun Charagonda

కేసీఆర్ పాలనలో సాగుకు స్వర్ణయుగం కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం మొదలైందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్..ఒక్క ఏడాదిలోనే.. 15.30 లక్షల ఎకరాల్లో తగ్గిన సాగు విస్తీర్ణం తగ్గిందని ఆగమైతున్న తెలంగాణ రైతు బతుకుకు.. తొలి ప్రమాద సంకేతం ఇది అన్నారు.

Duvvada Srinivas: దువ్వాడ ఫ్యామిలీ డ్రామా, నాలుగో రోజు దువ్వాడ శ్రీనివాస్ ఆఫీస్‌ ముందు వాణి ఆందోళన, మాధురిపై కేసు నమోదు చేసిన పోలీసులు

Arun Charagonda

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ రోజుకో టర్న్ తీసుకుంటుంది. దువ్వాడ శ్రీనివాస్ - వాణి మధ్యలో మాధురి, ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. మా నాన్న మాకు కావాలి అంటూ శ్రీనివాస్ కుమార్తెలు మీడియా ముందుకు రావడంతో రెండు సంవత్సరాలుగా ఇంట్లోనే రగులుతున్న విషయం కాస్త బయటకు వచ్చింది.

Andhra pradesh: మానవత్వం చాటుకున్న మదనపల్లె సీఐ, ఫిర్యాదు ఇవ్వడానికి స్టేషన్‌కువచ్చిన బాధితురాలికి అస్వస్థత, తన వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించిన సీఐ

Arun Charagonda

మానవత్వం చాటుకున్న మదనపల్లె సీఐ చాంద్‌బాషా మంచి మనసు చాటుకున్నారు. ఫిర్యాదు ఇవ్వడానికి అర్ధరాత్రి స్టేషన్‌కి వచ్చిన బాధితురాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తన వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి.. వైద్యం చేయించారు. దీంతో సీఐ చాంద్‌బాషాని అభినందించింది పోలీస్ శాఖ.

Advertisement

Telangana Shocker: శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం, డివైడర్‌ని ఢీకొట్టిన బైక్, ఒకరు మృతి, మరోకరికి తీవ్ర గాయాలు

Arun Charagonda

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్వాల్‌గూడ ఔటర్ రింగు రోడ్డు సర్వీస్ రోడ్డులో ప్రమాదశాత్తు డివైడర్‌ని ఢీకొట్టింది బైక్. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి

Paris Olympics 2024 : 6 పతకాలతో 71వ స్థానంలో భారత్, టాప్ ప్లేస్‌లో అగ్రరాజ్యం అమెరికా, చైనాకు ఎన్ని పతకాలంటే?

Arun Charagonda

విశ్వక్రీడా సంబరం ఒలింపిక్స్ 2024 ముగిసింది. పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో ఈసారి చైనాను వెనక్కి నెట్టి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది అమెరికా. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ 6 పతకాలతో పాయింట్ల పట్టికలో 71వ స్థానంలో నిలిచింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 1 బంగారు,2 కాంస్య, 2012 లండన్ ఒలింపిక్స్‌లో 2 రజత,నాలుగు కాంస్యం,2016 రియో ఒలింపిక్స్‌లో ఒక రజతం,ఒక కాంస్యం

Potatoes Ally for Heart Health: ఆలుగడ్డలతో చిట్టి గుండె పదిలం.. షుగర్ వ్యాధిగ్రస్తులు తినడం మరీ మంచిది.. తాజా అధ్యయనం వెల్లడి

Rudra

ఆలుగడ్డలను తింటే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని చాలామంది భావిస్తారు. అందుకనే కర్రీస్ లిస్టు లో వాటిని పక్కనబెడతారు. అయితే, టైప్‌-2 డయాబెటిస్‌ తో బాధపడుతున్న వారి ఆహారంలో ఆలుగడ్డలను చేర్చితే మంచిదని, గుండె ఆరోగ్యాన్ని ఇవి మెరుగుపరుస్తాయని తాజా అధ్యయనం వెల్లడించింది.

Electric Bandage: తీవ్ర గాయాలను సైతం వేగంగా నయంచేసే ఎలక్ట్రిక్‌ బ్యాండేజీ.. 30% వేగంగా గాయం నుంచి ఉపశమనం పొందొచ్చట!

Rudra

డయాబెటిక్‌ రోగులకు గాయలైతే ఎంతకీ తగ్గవు. ఇలాంటి వారి కోసం వినూత్నమైన ‘ఎలక్ట్రిక్‌ బ్యాండేజ్‌’ని నార్త్‌ కరోలినా స్టేట్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు తయారుచేశారు.

Advertisement

Stampede in Bihar Temple: బీహార్‌ లోని ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి.. ఆలయ సిబ్బంది లాఠీచార్జి చేయడంతోనే తొక్కిసలాట జరిగిందంటున్న భక్తులు

Rudra

బీహార్‌ లో జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్‌ లోని బాబా సిద్ధనాథ్‌ ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఆలయం వద్ద ఉన్న కొండపైకి భక్తులు ఎక్కుతుండగా మెట్లపై తొక్కిసలాట జరిగి గందరగోళ వాతావరణం నెలకొన్నది.

Manu Bhaker and Neeraj Chopra Chatting Video: భారత అథ్లెట్లు మను బాకర్, నీరజ్ స్పెషల్ చిట్ చాట్.. వీళ్ల మధ్య ఏం జరుగుతుందంటూ ఆసక్తిగా అడుగుతున్న నెటిజన్లు (వీడియోతో)

Rudra

పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భారత అథ్లెట్లు మను బాకర్, నీరజ్ చోప్రా మధ్య జరుగుతున్న సంభాషణ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

Heavy Rains In Bihar: పాట్నాను ముంచెత్తిన భారీ వర్షాలు, బీహార్ అసెంబ్లీ ప్రాంగణం, మంత్రుల ఇళ్లు జలమయం, పరిస్థితిని సమీక్షించిన సీఎం నితీష్ కుమార్

Arun Charagonda

బీహార్ రాజధాని పాట్నాను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆదివారం ఎడతెరపిలేకుండా వర్షం కురియడంతో బీహార్ అసెంబ్లీ ప్రాంగణంతో పాటు పలువురు మంత్రుల ఇళ్లు, ఆస్పత్రులు సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్. భవిష్యత్‌లో వరదనీరు నిల్వకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Telangana Shocker: ఫోన్ లో మాట్లాడుతూ నీటిలో పెట్టాల్సిన హీటర్ ను చంకలో పెట్టుకున్న వ్యక్తి.. షాక్ కొట్టి మృతి.. ఖమ్మంలో దారుణం

Rudra

ఫోన్ మాయలో పడి ఏం చేస్తున్నాం అన్న సంగతి కూడా కొందరు మరిచిపోతారు. ఫోన్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తూ ప్రమాదాలకు గురైన వాళ్లు కోకొల్లలు. ప్రస్తుతం చెప్తున్న ఘటన కూడా ఇలాంటిదే.

Advertisement

‘Pregnant’ Cars in China: ఇదేందయ్యా.. ఇది..!? చైనాలో ప్రెగ్నెంట్‌ కార్లు.. ఎండలే కారణం అంటున్న నిపుణులు.. ఎండల వల్ల కార్లు ప్రెగ్నెంట్ కావడం ఏంటి??

Rudra

చైనాలో ప్రెగ్నెంట్‌ కార్లు హల్ చల్ చేస్తున్నాయి. అదేంటి..? కార్లకు గర్భం రావడమేంటి? అనుకుంటున్నారా? అవును. మీరు చదువుతున్నది నిజమే.

How to Cook Peacock Curry: జాతీయ పక్షి నెమలి కూర ఎలా వండాలో వీడియో చేసిన సిరిసిల్ల యూట్యూబర్‌.. వీడియో అప్‌ లోడ్‌.. అరెస్టు

Rudra

వ్యూస్ కోసం కొందరు వికృత చర్యలకు తెగబడుతున్నారు. ఇందులో భాగంగా జాతీయ పక్షి నెమలి కూరను ఎలా వండాలో అంటూ సిరిసిల్లకు చెందిన ఓ యూట్యూబర్‌ షాకింగ్ వీడియో చేశాడు.

Rains in Telangana: తెలంగాణకు వర్ష సూచన.. వచ్చే రెండు రోజులు వర్షాలు... పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.. హైదరాబాద్ లో ఈ ఉదయం నుంచి వర్షం

Rudra

తెలంగాణకు భారీ వర్ష సూచన ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

Hindenburg Research: హిండెన్ బ‌ర్గ్ నివేదిక‌పై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి, జాయింట్ పార్ల‌మెంట‌రీ క‌మిటీకి డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్

VNS

హిండెన్‌బర్గ్ తాజా నివేదిక (Hindenburg Research) ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నివేదిక సెబీ చీఫ్‌, ప్రధాని నరేంద్ర మోదీ సమగ్రతను దెబ్బతీసిందని కాంగ్రెస్‌ నేత సుప్రియా శ్రీనటే (Supriya) అన్నారు. ఈ కుంభకోణంలో అదానీ ప్రమేయం ఉన్నందునే అదానీ వ్యవహారంపై దర్యాప్తు జరపడం లేదా అని ఆమె ప్రశ్నించారు

Advertisement

Rammohan Naidu: నాగార్జున సాగ‌ర్ వ‌ద్ద త్వ‌ర‌లోనే విమానాశ్ర‌యం, మ‌రికొన్ని ప్రాంతాల్లోనూ కొత్త ఎయిర్ పోర్టులు నిర్మిస్తామ‌న్న రామ్మోహ‌న్ నాయుడు

VNS

నాగార్జున సాగర్‌తో(Nagarjuna Sagar) పాటు మరికొన్ని విమానాశ్రయాల (Airports )ఏర్పాటుకు కేంద్రం ఆలోచిస్తుందని కేంద్ర విమానాయానశాఖ మంత్రి కింజరపు రామ్మోహన్‌ నాయుడు(Minister Rammohan Naidu) వెల్లడించారు. వీటితో పాటు శ్రీకాకుళం, దగదర్తిలో, కుప్పం వద్ద కూడా విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.

CM Revanth Reddy America Tour: సత్పలితాన్నిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్,భారీగా పెట్టుబడులు, హైదరాబాద్‌లో అమెజాన్ ఏఐ ఆధారిత డేటా సెంటర్

Arun Charagonda

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ సత్ఫలితాన్నిస్తోంది. అమెరికా పర్యటనలో భాగంగా రేవంత్ టీం వివిధ కంపెనీల ప్రతినిధులను కలిసి పెట్టుబడులను పెట్టాల్సిందిగా కోరుతుండగా వారి నుండి మంచి స్పందన వస్తోంది. తాజాగా అమెజాన్ హైదరాబాద్‌లో తన డేటా సెంటర్ ను విస్తరించేందుకు అవసరమైన పెట్టుబడులు పెడతామని ప్రకటించింది.

Telangana Rain Alert: తెలంగాణ‌కు రెండు రోజుల పాటూ భారీ వ‌ర్ష సూచ‌న, హైద‌రాబాద్ తో పాటూ ప‌లు జిల్లాల్లో అల‌ర్ట్

VNS

తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు (Telangana Rain Alert) కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం ఉందన్నారు. ఉపరితల ఆవర్తనం, బలమైన నైరుతి రుతుపపనాల (Mansoon) కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం

YS Jagan Tweet: పంట బీమా ఎప్పుడు చెల్లిస్తారు! సీఎం చంద్రబాబు అల‌స‌త్వంతో వేలాది మంది రైతులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని వైఎస్ జ‌గ‌న్ ఫైర్

VNS

ఏపీ రైతుల పట్ల చంద్రబాబు (CM Chandra Babu) నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి (YS Jagan) ధ్వజమెత్తారు. సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడంతో రైతులకు నష్టం వాటిల్లుతుందని ఆరోపించారు.

Advertisement
Advertisement