తాజా వార్తలు

Pendem Dorababu Resigns YSRCP: వైసీపీకి షాకిచ్చిన ఇద్దరు నేతలు, పిఠాపురంలో పెండెం దొరబాబు రాజీనామా, అనంతపురంలో పైలా నర్సింహయ్య గుడ్ బై

Hazarath Reddy

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాజకీయ స్వలాభం కోసం కాదని, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఇక అనంతపురం జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నర్సింహయ్య తన పదవికి రాజీనామా చేశారు.

Jagan Disproportionate Assets Case: జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ నవంబర్‌ 11కు వాయిదా, రఘురామపై సుప్రీంకోర్టు సీరియస్‌, సీబీఐపై అసహనం

Hazarath Reddy

మాజీ సీఎం వైఎస్ జగన్‌ (YS Jagan) అక్రమాస్తుల కేసు విచారణ నవంబర్‌ 11కు వాయిదా (Adjourn) పడింది. జగన్‌ అక్రమాస్తుల ( Illegal assets ) కేసులపై గతంలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టులో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా (Justice Sanjeev Khanna ) నేతృత్వంలో విచారణ జరిగింది.

YS Jagan's Security Row: దేవాన్స్‌కు ఆరుమంది సెక్యూరిటీని పెట్టారు, మరి జగన్‌కు భద్రత వద్దని ఎందుకంటున్నారు ? ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అని మండిపడిన అంబటి రాంబాబు

Hazarath Reddy

హైదరాబాద్‌లో చంద్రబాబు ఇంటి ముందు ఇప్పటికీ ప్రవేశం లేదని ఆయన గుర్తుచేశారు. కానీ వైఎస్‌ జగన్‌ ఇంటి ముందు రోడ్డును తెరిచి జనాలను పంపిస్తున్నారని అన్నారు. చంద్రబాబు మనుమడు దేవాన్ష్‌కు కూడా ఆరుగురు సెక్యూరిటీని ఎలా పెట్టారని ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

GVMC Standing Committee Elections: గ్రేట‌ర్ విశాఖలో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్, స్టాండింగ్ క‌మిటీ ఎన్నిక‌ల్లో కూట‌మి ఘ‌న విజ‌యం

VNS

విశాఖపట్నం జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ (GVMC Standing Committee Elections) ఎన్నికల్లో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో కూటమి (NDA) ఘన విజయం సాధించింది. 10కి 10 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. కూటమి అభ్యర్థులే గెలుపొందారు. కూటమి కార్పొరేటర్లు 60 ఓట్లు సాధించారు.

Advertisement

Telangana Politics: బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు, తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై కోర్టులో దావా వేస్తామని వెల్లడి

Hazarath Reddy

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం లేదు. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చ‌రించారు. ఈ మేర‌కు కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా ట్వీట్ చేశారు.

YS Jagan's Security Row: భద్రత కుదింపుపై హైకోర్టులో జగన్ పిటిషన్, బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాన్ని రీప్లేస్‌ చేస్తామని తెలిపిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

తన భద్రతా కుదింపుపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది.జగన్‌ భద్రత విషయంలో రాజీ పడొద్దని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మధ్యాహ్నాం తిరిగి వాదనల సమయంలో అడ్వొకేట్‌ జనరల్‌ వివరణ ఇస్తూ.. ‘‘స్పేర్ పార్ట్స్ కు ఆర్డర్ ఇచ్చాం అవి ఇంకా రాలేదు.

National Handloom Day: చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33శాతం రిజర్వేషన్లు, అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలిపిన సీఎం చంద్రబాబు, జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

జయవాడలో జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్టాళ్లలో ఉత్పత్తులు పరిశీలించి చేనేత కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన సతీమణి భువనేశ్వరికి రెండు చీరలు కొనుగోలు చేశారు. చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించారు.

AP Cabinet Meeting: స్థానిక ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా పోటీ చేయవచ్చు, చట్ట సవరణ బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం

Hazarath Reddy

స్థానిక ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే అనర్హత వేటు నిబంధన ఎత్తివేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నిబంధన ఎత్తివేసేలా చట్ట సవరణ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టనున్నారు.

Advertisement

AP Cabinet Meeting Highlights: వైద్య క‌ళాశాల‌ల్లో అద‌న‌పు పోస్టుల మంజూరుకు క్యాబినెట్ ఆమోదం, మరో 380 పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. మంత్రివర్గం సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో కేబినెట్ భేటీ అంశాలను వివరించారు.

AP Cabinet Meeting Highlights: పట్టాదారు పాసు పుస్తకాల నుండి జగన్ ఫోటో ఔట్, ప్రభుత్వ అధికారిక రాజముద్రతో కొత్త పాసు పుస్తకాల పంపిణీ

Hazarath Reddy

సర్వే రాళ్లపై జగన్‌ బొమ్మ, పేరు తొలగించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీకి నిర్ణయం తీసుకుంది. రీ సర్వేపై క్యాబినెట్‌లో రెవెన్యూశాఖ నోట్‌ సమర్పించింది.

New Liquor Policy in AP: ఏపీలో అక్టోబర్1 నుండి కొత్త మద్యం పాలసీ, అత్యంత తక్కువ ధరకే బ్రాండెడ్ మద్యం,మంత్రి పార్థసారథి వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. మంత్రివర్గం సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో కేబినెట్ భేటీ అంశాలను వివరించారు. రాష్ట్రంలో అక్టోబర్‌ 1 నుంచి నూతన మద్యం విధానం అమలు చేస్తామన్నారు.

AP Cabinet Meeting Highlights: మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం, తక్కువ ధరకే నాణ్యమైన మద్యం, ఏపీ క్యాబినెట్‌ సమావేశం హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. మంత్రివర్గం సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో కేబినెట్ భేటీ అంశాలను వివరించారు.

Advertisement

PM Modi on Vinesh Phogat Disqualification: వినేశ్.. మీరు ఛాంపియన్లలో ఛాంపియన్, వినేశ్‌ ఫోగాట్‌ అనర్హత వేటుపై స్పందించిన ప్రధాని మోదీ, ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

వినేష్, వినేష్, మీరు ఛాంపియన్లలో ఛాంపియన్! మీరు భారతదేశానికి గర్వకారణం మరియు ప్రతి భారతీయునికి స్ఫూర్తి. ఈరోజు ఎదురుదెబ్బ బాధిస్తుంది. నేను మీరు అనుభవిస్తున్న వైరాగ్య భావ పదాలు నాకు తెలుసు

Rahul Gandhi on Vinesh Phogat Disqualification: దేశం మొత్తం మీ వెంటే ఉంది వినేశ్, రాహుల్ గాంధీ ట్వీట్ ఇదిగో, నువ్వు ఎప్పుడూ దేశం గర్వించేలా చేశావంటూ విషెస్

Hazarath Reddy

ప్రపంచ ఛాంపియన్ రెజ్లర్లను ఓడించి ఫైనల్స్‌కు చేరిన భారత్‌కు గర్వకారణమైన వినేష్ ఫోగట్ సాంకేతిక కారణాలతో అనర్హత వేటు పడటం దురదృష్టకరం.ఈ నిర్ణయాన్ని భారత ఒలింపిక్ సంఘం గట్టిగా సవాలు చేస్తుందని, దేశ పుత్రికకు న్యాయం చేస్తుందని మేము పూర్తి ఆశిస్తున్నాము

Anand Mahindra on Vinesh Phogat Disqualification: నోనోనో.. ఇది ఓ పీడకల అయితే బాగుండు, వినేశ్ ఫోగట్ అనర్హత వేటుపై ఆనంద్ మహీంద్రా ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఊహించని షాక్ తగిలింది. స్వర్ణపతక రేసు ఆశలు రేపిన భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. అధిక బరువు కారణంగా మహిళల 50 కేజీల రెజ్లింగ్‌కు అనర్హురాలు అయ్యింది. ఈ అంశం ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Dell Layoffs Announced: టెక్ రంగంలో భారీ లేఅప్స్, 12, 500 మంది ఉద్యోగులపై వేటు వేసిన డెల్, ఇంటెల్ భారీ ఉద్యోగాల కోతల తర్వాత రెండవ అతిపెద్ద దెబ్బ

Hazarath Reddy

డెల్ తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌ను ప్రభావితం చేసే అతిపెద్ద ఉద్యోగ కోత రౌండ్‌లో దాదాపు 12,500 మంది ఉద్యోగులను తొలగించింది. టెక్ దిగ్గజం ఆగస్ట్ 6, 2024న అంతర్గత మెమో ద్వారా ఈ తొలగింపులను ప్రకటించింది, ఇది గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 10% ప్రభావం చూపుతుందని సూచించింది.

Advertisement

Rajya Sabha Elections: సెప్టెంబ‌ర్ 3న 12 రాజ్య‌స‌భ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు, అదే రోజు సాయంత్రం 5 గంట‌ల నుంచి ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

కేంద్ర ఎన్నిక‌ల సంఘం రాజ్య‌స‌భ‌లో ఖాళీ అయిన 12 స్థానాల‌కు ఉప ఎన్నిక‌ల షెడ్యూల్‌ను బుధ‌వారం విడుద‌ల చేసింది. ఈ 12 స్థానాల్లో 10 చోట్ల రాజ్యసభ సభ్యులుగా ఉన్నవారు, ఇటీవలి ఎన్నికల్లో గెలిచి లోక్‌స‌భకు వెళ్లారు. దాంతో ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి.

Astrology: ఆగస్టు 12 నుండి రాహువు తన నక్షత్రం మార్చుకోబోతున్నాడు ఈ మూడు రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది.

sajaya

ఆగస్టు 12 నుండి రాహు గ్రహం భాద్రపద నక్షత్రం లోనికి ప్రవేశం. దీని కారణంగా మూడు రాశుల వారికి అఖండ ఐశ్వర్యం చేరుతుంది.. ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Astrology:మీ ఇంట్లో డబ్బును ఈ దిశలో ఉంచినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడు స్థిర నివాసం ఉంటుంది.

sajaya

వాస్తు శాస్త్రం ప్రకారం సరైన దిశలో సరైన వస్తువులు పెట్టినట్లయితేనే సానుకూల ఫలితాలు లభిస్తాయి. డబ్బులు బంగారం వెండి వంటి వాటిని సరైన దిశలో ఉంచాలి. అప్పుడే మీకు ధనలక్ష్మి దేవి కృపా కటాక్షాలు ఉంటాయి.

Astrology: ఆగస్టు 21న శుక్రుడు కుజ గ్రహాల రాశి మార్పు..ఈ ఐదు రాశుల వారికి భారీ నష్టాలు ఇబ్బందులు తప్పవు.

sajaya

ఆగస్టు 21న కుజుడు ,శుక్రుడు తన రాశి మార్చుకుంటున్నారు. ఈ రాశి మార్పు కారణంగా అశుభ ఫలితాలు ఈ ఐదు రాశుల వారికి ఏర్పడతాయి ఐదు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
Advertisement