తాజా వార్తలు

Air India Cancels All Flights to Israel: పశ్చిమాసియాలో తీవ్రమైన ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్‌కు ఎయిర్‌ఇండియా విమాన సర్వీసులు బంద్‌

Hazarath Reddy

పశ్చిమాసియాలో రోజురోజుకూ ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతుండటంతో భారత విమానయాన సంస్థ ఎయిరిండియా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇజ్రాయెల్‌కు తాత్కాలికంగా విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు వెల్ల‌డించింది.

Health Tips: ఈ పండ్లతో ఇన్ఫెక్షన్లకు చెక్, వర్షాకాలంలో తప్పకుండా తినాల్సిన పండ్లు ఇవే, అస్సలు మిస్ కాకండి

Arun Charagonda

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సరిపడ పోషకాలు అవసరం. అయితే ఇందులో కొన్ని సహజ సిద్ధంగా దొరికేవి అయితే మరికొన్ని కృత్రిమంగా లభిస్తాయి. అయితే మనిషి ఆరోగ్యంగా ఉండటంలో ప్రధాన పాత్ర పోషించేంది రోగ నిరోధక శక్తి. ఇది బలహీన పడితే వ్యాధుల బారిన పడటం ఖాయం.

Andhra Pradesh: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి శ్రీశైలం ఆలయంలో విధులకు వచ్చిన ఉద్యోగి, పట్టుకుని చితకబాదిన భక్తులు

Hazarath Reddy

శ్రీశైలం ఆలయంలో మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగిని భక్తులు పట్టుకుని చితకబాదారు. క్యూ కంపార్టుమెంట్‌లో గురువారం రాత్రి 9 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం కొంతమంది భక్తులు ఆలయ క్యూలైన్ల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

Wayanad Landslide: వయనాడ్ విలయం.. ఇంకా మట్టిలోనే మృతదేహాలు, కేరళకు సాయం అందించేందుకు ముందుకొస్తున్న సినీ నటులు!

Arun Charagonda

కేరళను ఓ వైపు వర్షం మరోవైపు కొండ చరియలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఇక మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 289 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటుండగా హృదయ విదారక పరిస్థితులతో కలత చెందుతున్నట్లు శవ పరీక్షలు చేస్తున్న వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Wayanad Landslide Death Toll: వయనాడ్‌లో ఇంకా ఆగని మృత్యుఘోష, 308కు చేరుకున్న మృతుల సంఖ్య, నాలుగు రోజుల తర్వాత గాయాలతో సజీవంగా బయటపడిన కుటుంబం

Hazarath Reddy

కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి సృష్టించిన విలయంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 308 దాటింది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 308 మంది చనిపోయినట్టు అధికారులు నిర్దారించారు.

Maharashtra: మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో విషాదం, నదిని దాటుతు బోల్తా పడిన ట్రాక్టర్,8 మంది గల్లంతు, కొనసాగుతున్న సహాయక చర్యలు

Arun Charagonda

మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా ఇచల్‌కరంజిలో విషాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిని దాటుతున్న ట్రాక్టర్ బోల్తా పడింది. నది ప్రవాహానికి అందులో ఉన్న 7-8 మంది గల్లంతయ్యారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం స్థలానికి చేరుకుంది.

Madhya Pradesh Horror: దారుణం, నిద్రలో మూత్ర విసర్జన చేశాడని బాలుడి ప్రైవేట్ పార్టుపై వేడి గరిటెతో కాల్చిన సవతి తల్లి, బాధతో అల్లాడిపోయిన పసివాడు

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాకు చెందిన ఐదేళ్ల బాలుడిపై సవతి తల్లి రాక్షసంగా ప్రవర్తించింది. బుధవారం తెల్లవారుజామున బాలుడు నిద్రలో మంచంపై మూత్ర విసర్జన చేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

NEET UG 2024 Paper Leak Case: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లోపాల వల్ల లీకేజీ, నీట్‌ యూజీ 2024 పరీక్ష ప్రశ్నపత్నం లీకేజీ వ్యవహారపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

నీట్‌ యూజీ 2024 పరీక్ష (NEET UG 2024 Exam) ప్రశ్నపత్నం లీకేజీ వ్యవహారంలో సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేదంటూ ఇటీవల కీలక తీర్పునిచ్చిన ధర్మాసనం.. అందుకుగల కారణాలను వివరిస్తూ శుక్రవారం మళ్లీ తీర్పు వెలువరించింది.

Advertisement

Fake Deliveray Scam: డెలివరీ బాయ్ స్కామ్‌తో జాగ్రత్త..మీరు ఏం ఆర్డర్ చేయకుండానే ఓటీపీ చెప్పారో..అంతే!

Arun Charagonda

సైబర్ కేటుగాళ్లు ఏ చిన్న అవకాశం దొరికినా వదలట్లేదు. తాజాగా డెలివరీ బాయ్ స్కామ్ తెరపైకి వచ్చింది. మీరు ఆర్డర్ చేయకుండానే మీకు ఆన్‌లైన్‌లో ఆర్డర్ వచ్చిందని డెలివరీ బాయ్ వస్తే ఖచ్చితంగా అది స్కాం అని గుర్తించండి. మీకు ఎవరో ఆర్డర్ పంపారు అని మీ మొబైల్‌కు వచ్చిన OTP చెప్పమని అడిగితే చెప్పకండి. మీకు తెలియకుండానే మీకు ఎలాంటి ఆర్డర్ రాదు కాబట్టి అది ఖచ్చితంగా మోసమేనని గ్రహించి సైబర్ మోసాలకు ఒక్క అడుగు దూరంలో ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Viral Video: తరగతి గదిలో స్విమ్మింగ్ చేస్తున్న విద్యార్థులు వీడియో మళ్లీ వైరల్, పిల్లల్ని స్కూలుకు రప్పించడానికి యూపీ టీచర్లు చేసిన ప్రయత్నంపై భిన్నాభిప్రాయాలు

Hazarath Reddy

సోషల్ మీడియాలో పాత వీడియోలు మళ్లీ ఒక్కోసారి సందర్భం వచ్చినప్పుడు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తరగతి గదిని స్విమ్మింగ్ పూల్‌గా మార్చింది.

Andhra Pradesh Horror: అనంతపురంలో కామాంధుడుగా మారిన స్కూల్ కరస్పాండెంట్, రూం తలుపేసి చిన్నపిల్లలు బట్టలు విప్పి దారుణమైన వేధింపులు, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ఆదిమూర్తినగర్‌లోని లిటిల్ ఫ్లవర్స్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినితో కరస్పాండెంట్ ఆంజనేయులు గౌడ్ అసభ్య ప్రవర్తంచాడని బాధితురాలి తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చారు. ఆంజనేయులు పలుమార్లు తమ బిడ్డతో అసభ్యంగా ప్రవర్తించాడన్న తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Telangana Assembly Sessions: తెలంగాణలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, బీసీసీఐతో చర్చలు జరిపామన్న సీఎం రేవంత్ రెడ్డి, మండలానికో మినీ స్టేడియం ప్రతిపాదన

Arun Charagonda

గ్రేటర్ హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రాబోతుందని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. స్కిల్ యూనివర్సిటీ సమీపంలోనే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు .ఇందుకోసం ఇప్పటికే బీసీసీఐతో చర్చలు పూర్తయ్యాయని వెల్లడించారు.

Advertisement

Uttar Pradesh Shocker: వీడియో ఇదిగో, భార్యాభర్తల గొడవను తీర్చడానికి వెళ్లిన పోలీసును అమ్మనాబూతులు తిట్టిన భర్త, అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో, పోలీసు అధికారులను దుర్భాషలాడుతూ బెదిరిస్తున్న వీడియో వైరల్ కావడంతో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడు అతని భార్య మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి అధికారులు ప్రయత్నించినప్పుడు, అతని గుర్తింపును బహిర్గతం చేయని ఓ వ్యక్తి వీడియోలో " తేరీ మా చ్** దుంగా "తో సహా అభ్యంతరకరమైన భాషను ఉపయోగించడం వీడియోలో కనిపించింది.

Hoarding Collapse in Thane: వీడియో ఇదిగో, మహారాష్ట్రలో బలమైన గాలులకు కూలిన హోర్డింగ్, తృటిలో తప్పించుకున్న ప్రయాణికులు,మూడు వాహనాలు ధ్వంసం

Hazarath Reddy

మహారాష్ట్రలోని థానే జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఓ హోర్డింగ్ కూలి మూడు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయని అధికారి తెలిపారు. డోంబివిలి ప్రాంతంలో రద్దీగా ఉండే సహజానంద్ చౌక్ వద్ద ఉదయం 10.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి గాయాలు అయినట్లు నివేదికలు లేవని ఆయన తెలిపారు.

Road Accident Video: వీడియో ఇదిగో, రాయదుర్గంలో వేగంగా వచ్చి ఫ్లై ఓవర్ గోడను ఢీకొట్టి నుజ్జునుజ్జు అయిన కారు, స్పాట్‌లోనే స్టూడెంట్ మృతి

Hazarath Reddy

రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో గత రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మల్కంచెరువు సమీపంలో వేగంగా వచ్చిన కారు ఫ్లై ఓవర్ గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యి.. అందులోని స్టూడెంట్ మృతి చెందాడు. ఈ యాక్సిడెంట్‌తో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

PV Sindhu: ఒలింపిక్స్ ఓటమిపై పీవీ సింధు, ఆ తప్పు వల్లే ఓడిపోయా,వచ్చే ఒలింపిక్స్‌లో ఆడతానా లేదా అన్నదానిపై సింధు కామెంట్స్

Arun Charagonda

పారిస్ ఒలింపిక్స్‌లో పీవీ సింధు పోరాటం ముగిసింది. ప్రీ క్వార్టర్స్‌లో చైనీస్ ప్రపంచ నంబర్ 9 బింగ్ జాబో రన్ చేతిలో వరుస సెట్లు 21-19,21-14 తేడాతో ఓటమి పాలైంది. 56 నిమిషాల పాటు ఈ గేమ్ సాగగా వరుస గేముల్లో ఓటమి పాలై ఒలింపిక్స్ నుండి నిష్క్రమించింది

Advertisement

Andhra Pradesh Shocker: నంద్యాలలో ఘోర విషాదం, అర్థరాత్రి మట్టి మిద్దె కుప్పకూలడంతో నిద్రలోనే కుటుంబం మృత్యువాత, వీడియో ఇదిగో..

Hazarath Reddy

నంద్యాలజిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది.జిల్లాలోని చాగలమర్రి మండలం చిన్నవంగలిలో మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో దంపతులతో పాటుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న ఆ కుటుంబ సభ్యులపై మట్టి మిద్దె కూలి ఒక్కసారిగా మీద పడింది. దీంతో ఆ కుటుంబం అక్కడికక్కడే మృతి చెందింది.

Telangana: సీఎం రేవంత్‌ రెడ్డితో ఎమ్మెల్యే బండ్ల భేటీ, కాంగ్రెస్‌లోనే కొనసాగే అవకాశం, బీఆర్ఎస్‌ నేతల నిరాశ

Arun Charagonda

ఫిరాయింపులు , బుజ్జగింపులు వెరీసీ తెలంగాణ రాజకీయాలు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. మొన్న బీఆర్ఎస్ ఆ తర్వాత కాంగ్రెస్ తిరిగి బీఆర్ఎస్ సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో భేటీ అయ్యారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎమ్మెల్యే ఇంట్లో టిఫిన్ చేస్తూ జరిగిన చర్చల ఫలితం 24 గంటలు గడవక ముందే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.

Bomb Threat in Delhi: ఢిల్లీ పాఠశాలకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు.. విద్యార్థులను బయటకు పంపించి తనిఖీలు

Rudra

ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపుల మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. నగరంలోని గ్రేటర్‌ కైలాష్‌ ప్రాంతంలో ఉన్న ఓ పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

Man Buried Alive: ఇదెక్కడి ఘోరం..? భూవివాదం నేపథ్యంలో వ్యక్తిని సజీవంగా పాతిపెట్టిన దుండగులు.. వీధి కుక్కలు తవ్వడంతో బతికి బయటపడ్డ బాధితుడు.. ఆగ్రాలో ఘటన

Rudra

యూపీలోని ఆగ్రాలో ఘోరం జరిగింది. భూవివాదంలో గొడవ ముదరడంతో నలుగురు వ్యక్తులు ఓ వ్యక్తిని కొట్టి, గొంతు నులిమి, సజీవంగా పూడ్చిపెట్టారు. అయితే, అనూహ్యంగా పాతిపెట్టిన ప్రాంతాన్ని వీధికుక్కలు తవ్వడంతో అతను బయటపడ్డాడు.

Advertisement
Advertisement