India
Car Catches Fire in Ghatkesar: వీడియో ఇదిగో, ఘట్కేసర్ వద్ద కారులో మంటలు, బయటకు వచ్చే అవకాశం లేక ఇద్దరు సజీవ దహనం
Hazarath Reddyహైదరాబాద్లోని ఘట్కేసర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని ముగ్గురు సజీవదహనం అయ్యారు. మరొకరు కారులోనే మృతి చెందారు. మృతులు ఉప్పల్ వాసులుగా గుర్తించారు.
HMPV Virus in India: ఈ వైరస్ పట్ల అప్రమత్తంగానే ఉన్నాం, దేశంలో నమోదైన హెచ్ఎంపీవీ వైరస్ కేసులపై స్పందించిన కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా
Hazarath Reddyహెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాన్యూమా వైరస్) కేసులు భారత్ లో వెలుగు చూసిన నేపథ్యంలో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించారు. హెచ్ఎంపీవీ వైరస్ పై ప్రజలు ఆందోళన చెందనక్కర్లేదని అన్నారు. ఇదేమీ కొత్త వైరస్ కాదని నిపుణులు చెబుతున్నారని వెల్లడించారు.
Formula E Race Case: కేటీఆర్కు మరోసారి నోటీసులు జారీ చేసిన ఏసీబీ, ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలు, నేడు విచారణకు హాజరు కాకుండానే వెనక్కి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
Hazarath Reddyహైదరాబాద్ ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. గచ్చిబౌలి ఓరియన్ విల్లాలో కేటీఆర్కు ఏసీబీ అధికారులు నోటీసులు అందించారు. ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సదరు దర్యాప్తు సంస్థ తన తాజా నోటీసుల్లో పేర్కొంది.
BPSC Exam Row: బీపీఎస్సీ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్, ప్రశాంత్ కిషోర్కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ, ష్యూరిటీ బాండ్ ఇచ్చేందుకు నిరాకరించిన జన్ సురాజ్ చీఫ్
Hazarath Reddyబీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్పై జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్ చేపట్టిన నిరాహార దీక్షను పాట్నా పోలీసులు సోమవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైనందున అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. తాజాగా పాట్నా సివిల్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
Monkey Enters Courtroom: వీడియో ఇదిగో, జ్ఞానవాసి కేసు విచారణ సమయంలో కోర్టులోకి ప్రవేశించిన కోతి, అక్కడే ఉన్న ఫైల్స్ను పరిశీలించి వెళ్లిపోయిన వానరం
Hazarath Reddyవారణాసి జిల్లా కోర్టులో జ్ఞానవాపి కేసు విచారణ సమయంలో కోర్టు రూమ్లోకి ఓ కోతి ప్రవేశించింది. విచారణ జరగడాన్ని చూస్తూ అక్కడే ఉన్న ఫైల్స్ను పరిశీలించి వెళ్లిపోయింది. ఈ వీడియో వైరల్గా మారింది. ఇది రామాలయంతో సంబంధం ఉన్న 39 ఏళ్ల సంఘటన జ్ఞాపకాలను తిరిగి తెచ్చింది.
Aramghar-Zoo Park Flyover: వీడియో ఇదిగో, ఆరాంఘర్-జూపార్క్ ఫ్లై ఓవర్కు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు, హైదరాబాద్లోనే రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyఆరాంఘర్- జూ పార్క్ ఫ్లైఓవర్ (Aramghar Zoo Park flyover)ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఘనంగా ప్రారంభించారు. రూ.799 కోట్ల జీహెచ్ఎంసీ నిధులతో ఆరాంఘర్ చౌరస్తా నుంచి జూపార్క్ వరకూ 6 లైన్ల ఫ్లైఓవర్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. కాగా ఈ ఫ్లై ఓవర్ కు డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని సూచిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Hyderabad: వీడియో ఇదిగో, హైదరాబాద్లో బీభత్సం సృష్టించిన చెత్త ఊడ్చే వాహనం, డ్రైవర్కు తీవ్ర గాయాలు, పలు వాహనాలు ధ్వంసం
Hazarath Reddyహైదరాబాద్ నగరంలోని మల్లాపూర్లో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)కి చెందిన చెత్త ఊడ్చే వాహనం బీభత్సం సృష్టించింది. చెత్త ఊడ్చే వాహనాన్ని డ్రైవర్ రోడ్డుపై నిలిపి ఉంచాడు. హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో వాహనం ముందుకు కదిలింది.
Road Accident Video: షాకింగ్ వీడియో ఇదిగో, బుల్లెట్ కన్నా వేగంగా వచ్చి మరో బైకును ఢీకొట్టిన బైకు, ప్రమాదపు దృశ్యం చూసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు
Hazarath Reddyసోషల్ మీడియాలో ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బుల్లెట్ కంటే వేగంగా వచ్చిన ఓ బైకు ఎదురుగా వెళ్తున్న మరో బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకు మీదున్న వ్యక్తులు ఎగిరి అవతలపడ్డారు. ముందుగా వెళుతున్న యువతి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.
Telangana New Voter List: తెలంగాణలో సవరించిన ఓటరు జాబితా ఇదిగో, రాష్ట్రంలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు,శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7,65,982 మంది ఓటర్లు
Hazarath Reddyతెలంగాణలో సవరించిన ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. 1,66,41,489 మంది పురుష ఓటర్లు... 1,68,67,735 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ జాబితా ప్రకారం 2,829 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.
Assam: గుండెలు జలదరించే వీడియో ఇదిగో,జీపులో నుంచి ఖడ్గమృగం ముందు పడిపోయిన తల్లీ కూతురు, తృటిలో ప్రాణాపాయం నుంచి బయటకు..
Hazarath Reddyఅస్సాం (Assam) రాష్ట్రంలోని కాజీరంగ్ నేషనల్ పార్క్లో ఖడ్గమృగం మంద నడుమ టూరిస్టుల జీపులు తిరుగుతూ కనిపించాయి. మూడు జీపులు ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఉన్న చోటుకు దగ్గరగా రైడ్కు వెళ్లాయి. ఈ క్రమంలో రెండు వెహికల్స్ రైట్ తీసుకుంటుండగా.. ఓ జీపులోని తల్లీ కూతురు ఒక్కసారిగా రోడ్డుపైకి ఎగిరి పడ్డారు. ఖడ్గమృగం ముందు పడిపోయారు.
Naxal Attack in Bijapur: ఛత్తీస్గఢ్లో జవాన్ల వాహనమే లక్ష్యంగా పేలిన మందుపాతర, తొమ్మిది మంది జవాన్లు మృతి, పలువురికి తీవ్ర గాాయలు, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జవాన్లే లక్ష్యంగా మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.కుత్రు అటవీ ప్రాంతంలో భద్రతాబలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీ మందుపాతర పెట్టి పేల్చివేశారు మావోయిస్టులు.
Fashion: మీ చర్మం చంద్రబింబంలాగా మెరవాలి అంటే ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి..
sajayaFashion: మీ చర్మం చంద్రబింబం లాగా మెరవాలి అంటే రెగ్యులర్ గా వేసుకుని ఫేస్ ప్యాక్ కాకుండా కొత్త ఫేస్ ప్యాక్ ను ట్రై చేయండి. సింపుల్ గా ఇంట్లో కిచెన్ లో దొరికే వాటితోటే మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.
Bank Robbery Attempt Caught on Camera: వీడియో ఇదిగో, ఆన్లైన్ బెట్టింగ్ అప్పులను తీర్చడానికి బ్యాంకుకు కన్నం వేసేందుకు ప్రయత్నించిన విద్యార్థి, పట్టుకున్న పోలీసులు
Hazarath Reddy24 ఏళ్ల BAMS విద్యార్థి సంజయ్ కుమార్ ఆన్లైన్ గేమింగ్ ద్వారా చేసిన అప్పులను తిరిగి చెల్లించడానికి భోపాల్లోని పిప్లానీ ప్రాంతంలోని ధనలక్ష్మి బ్యాంక్లో శనివారం చోరీకి ప్రయత్నించాడు. హెల్మెట్, మాస్క్ ధరించి, అతను చిల్లీ స్ప్రే మరియు ఎయిర్ పిస్టల్ వంటి ఆయుధాలతో బ్యాంకులోకి ప్రవేశించాడు
Astrology: జనవరి 9 రాహు పాత్ర 10 నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది..
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాహు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. జనవరి 9వ తేదీన రాహు గ్రహం భాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. దీని కారణంగా అన్ని రాశుల వారికి లాభాలు ఉంటాయి.
Bengaluru Shocker: వీడియో ఇదిగో, ఇద్దరు పిల్లల్ని చంపి సాఫ్ట్వేర్ దంపతులు ఆత్మహత్య, బెంగుళూరులో విషాదకర ఘటన, కారణం ఏంటంటే..
Hazarath Reddyఇద్దరు పసిపిల్లలను చంపి ఓ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, అతని భార్య తన జీవితాన్ని ముగించుకున్న విషాద సంఘటన సోమవారం బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Arunachal Pradesh: వీడియో ఇదిగో, మంచునీటిలో ఇరుక్కుపోయిన నలుగురు టూరిస్టులు, తాళ్ల సాయంతో వారిని బయటకు లాగిన అధికారులు
Hazarath Reddyఅరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ జిల్లాలోని గడ్డకట్టిన సెలా సరస్సులో నలుగురు పర్యాటకులు మంచుతో నిండిన ఉపరితలంపై నడవడానికి ప్రయత్నిస్తూ అందులో పడిపోయారని అధికారులు తెలిపారు. అయితే, మంచు నీటి నుండి వారిని సురక్షితంగా బయటకు తీసినట్లు జిల్లా అధికారి తెలిపారు.
Mohan Babu: ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో మోహన్బాబు పిటిషన్, విచారణకు స్వీకరించిన ధర్మాసనం, తదుపరి విచారణ గురువారానికి వాయిదా
Hazarath Reddyఆస్తుల విషయంలో ఇటీవల మోహన్బాబు ఫ్యామిలీలో వివాదం నెలకొన్న సంగతి విదితమే. ఈ వివాదంలో జరిగిన ఘటనలపై పలు కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఈ కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
HMPV Virus in India: భారత్లో మూడో హెచ్ఎంపీవీ కేసు నమోదు, అహ్మదాబాద్లో రెండు నెలల చిన్నారికి పాజిటివ్, ఇప్పటికే బెంగుళూరులో రెండు కేసులు నమోదు
Hazarath Reddyభారత్లో హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) కేసులు ఆందోళన కలించేంలా ఉన్నాయి. ఇప్పటికే కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు వైరస్ పాజిటివ్గా తేలిన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో మరో కేసు బయటపడింది.