India
Asteroid Collides with Earth: వీడియో ఇదిగో, అంతరిక్షం నుంచి నిప్పులు చిమ్ముతూ అమితవేగంతో భూమిపై పడిన గ్రహశకలం, అర్థరాత్రి సమయంలో తాకడంతో..
Hazarath Reddyఅంతరిక్షం నుంచి అమితవేగంతో దూసుకొచ్చిన గ్రహశకలం భూమిని తాకింది. 70 సెంటీ మీటర్ల వ్యాసార్థం గల ఈ గ్రహ శకలం శాస్త్రవేత్తలు గుర్తించిన 12 గంటల్లోనే అత్యంత వేగంగా దూసుకొచ్చి రష్యాలోని ఓ గ్రామంలో పడిపోయింది. అయితే ఆ గ్రహశకలం చిన్నది కావడంతో ప్రాణాపాయం తప్పింది. రష్యాలోని మారుమూల ప్రాంతంలో పడడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని శాస్త్రవేత్తలు తెలిపారు.
Sukhbir Singh Badal Attacked: వీడియో ఇదిగో, స్వర్ణ దేవాలయంలో పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంపై కాల్పులు, అనుచరులు అలర్ట్ కావడంతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డ సుఖ్ బీర్ సింగ్ బాదల్
Hazarath Reddyపంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై ఓ అగంతకుడు కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. ఆలయ కాపలాదారుడిగా సేవ చేస్తుండగా బాదల్ సమీపంలోకి నడుచుకుంటూ వచ్చిన ఓ వ్యక్తి తుపాకీ తీసి కాల్పులకు ప్రయత్నించాడు. వృద్ధుడి అనుమానాస్పద కదలికలతో అప్రమత్తమైన బాదల్ అనుచరుడు ఎదురు వెళ్లి అడ్డుకున్నాడు.
Warangal: వాజేడు ఎస్ఐ ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్, గతంలో ముగ్గురు యువకులను ప్రేమ పేరుతో మోసం చేసిన యువతి..ఎస్ఐని ప్రేమ పేరుతో ముగ్గులోకి దించిన వైనం!
Arun Charagondaవాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య వెనుక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హరీష్ ప్రేమించిన యువతి గతంలో ముగ్గురు యువకులను ప్రేమ పేరుతో మోసం చేసిందని, ఆ ముగ్గురిపై కేసులు కూడా పెట్టినట్లు సమాచారం.
Earthquake In Singareni Areas: సింగరేణి ప్రాంతాల్లో భూకంపం..కార్మికులు భయపడాల్సిన అవసరం లేదు..తనిఖీల తర్వాతే కార్మికులను అనుమతిస్తామన్న సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి
Arun Charagondaసింగరేణి ప్రాంతాల్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించారు సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి. కార్మికులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు అన్నారు. మైన్స్ , అండర్ గ్రౌండ్ మైన్స్ లో సూపర్ వైజర్లు, అధికారులు తనిఖీల తరువాతే కార్మికులను అనుమతిస్తాం అన్నారు.
Punjab: పంజాబ్లోని స్వర్ణ దేవాలయం వద్ద కాల్పుల కలకలం, సుఖ్బీర్ సింగ్ బాదల్పై ఓ వ్యక్తి కాల్పులు..వీడియో ఇదిగో
Arun Charagondaపంజాబ్లోని స్వర్ణ దేవాలయం వద్ద కాల్పుల కలకలం చోటు చేసుకుంది. అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ ప్రవేశ ద్వారం వద్ద శిరోమణి అకాలీదళ్ నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. అక్కడికక్కడే ఉన్న వ్యక్తులు ఆ వ్యక్తిపై దాడి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Andhra Pradesh: పాత మిద్దె కూలి ముగ్గురి మృతి, మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు..అనంతపురంలో విషాదం
Arun Charagondaఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం రుద్రంపల్లిలో పాత మిద్దె కూలి ముగ్గురు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన గంగన్న, శ్రీదేవి, సంధ్య లుగా గుర్తించారు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
Earthquake In Vijayawada: తెలుగు రాష్ట్రాలను వణికించిన భూకంపం, విజయవాడలో భూప్రకంపనలతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీసిన ప్రజలు..సెకన్ల పాటు కంపించిన భూమి..వీడియో
Arun Charagondaతెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఏపీలోని విజయవాడ, జగ్గయ్య పేట, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇంట్లో నుండి బయటకు పరుగులు తీశారు.అలాగే హైదరాబాద్, హనుమకొండ, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు, గోదావరి ఖని, భూపాలపల్లి, చర్ల, చింతకాని, ములుగు, భద్రాచలం ఏరియాల్లో సైతం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
Earthquake In Hyderabad: వీడియోలు ఇవిగో..హైదరాబాద్,ఖమ్మం, వరంగల్లో భూకంపం, భూ ప్రకంపనల ధాటికి కూలిన ఇల్లు గోడ, రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 5.3గా నమోదు
Arun Charagondaహైదరాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇవాళ ఉదయం 7.25 గంటల నుంచి 7.28 గంటల మధ్య భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనల ధాటికి ఏటూరు నాగారంలో ఇల్లు గోడ కూలిపోయింది.
CM Revanth Reddy: గ్రూప్-4 విజేతలకు నేడు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్,పెద్దపల్లిలో 8 వేల 143 మందికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు
Arun Charagondaతెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇవాళ పెద్దపల్లిలో జరిగే విజయోత్సవ సభలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా గ్రూప్-4 విజేతలకు నియామక పత్రాలు అందజేయనున్నారు.
Telangana: విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన..దేహశుద్ది చేసిన తల్లిదండ్రులు, అనంతరం గోడదూకి పారిపోయిన టీచర్...వీడియో ఇదిగో
Arun Charagondaవిద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించాడు ఓ ఉపాధ్యాయుడు. మంచిర్యాల - ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించాడు ఉపాధ్యాయుడు సత్యనారాయణ. పాఠశాలకు వచ్చిన విద్యార్థినిల తల్లిదండ్రులను చూసి గోడ దూకి పారిపోగా జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో ఉపాధ్యాయుడు సత్యనారాయణను చితక బాదారు తల్లిదండ్రులు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Flying Snake: అత్యంత అరుదైన 'తక్షక' నాగును చూశారా?, జార్ఖండ్లో ప్రభుత్వ కార్యాలయంలో ప్రత్యక్షం..గాలిలో 100 అడుగుల వరకు ప్రయాణించగల తక్షక నాగు..వీడియో
Arun Charagondaతక్షకుడనే పాము పరీక్షిత్తును కాటేసినట్లు మహాభారతంలో చదువుకున్నాం. అదే పేరుతో పిలిచే ఓ అరుదైన పాము జార్ఖండ్లోని రాంచీలో కనిపించింది. ప్రభుత్వ కార్యాలయానికి వచ్చిన దాన్ని చూసి అధికారులు కంగారు పడ్డారు.అంతరించిపోతున్న పాముల జాబితాలో ఉన్న తక్షక నాగు చెట్లపై నివసిస్తుంటుంది.
Earthquake In Manuguru: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో భూకంపం, 10 సెకండ్ల పాటు ఊగిన భూమి..ఉలిక్కిపడ్డ ప్రజలు
Arun Charagondaభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం సంభవించింది. జిల్లాలోని మణుగూరులో ఒక్కసారిగా ప్రకంపనలు వచ్చాయి. దాదాపు 10 సెకన్ల పాటు భూమి కంపించింది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ఏం జరుగుతుందో తెలియక జనం ఆందోళనకు గురయ్యారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
CM Revanth Reddy: హైదరాబాద్ నగరమే మన ఆదాయం... ఆత్మగౌరవం, అంతర్జాతీయ పెట్టుబడులతో అభివృద్ధి చేస్తాం, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెరిగిందన్న సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaహైదరాబాద్ నగరమే మన ఆదాయం... ఆత్మగౌరవం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నగర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నాం... ఆ ప్రణాళికల ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకొచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ రైజింగ్ ఉత్సవాలు హెచ్ఎండీఏ మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపన చేశారు రేవంత్ రెడ్డి.
Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న టీచర్, పట్టుకుని రోడ్డు మీద చెప్పులతో చితకబాదిన పేరెంట్స్
Hazarath Reddyమంచిర్యాల జిల్లా కేంద్రంలో బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులను వేధించిన ఉపాధ్యాయుడుకి బాధిత కుటంబ సభ్యులు దేహశుద్ధి చేశారు. గోడ దూకి పారిపోతుండగా ఉపాధ్యాయుడిని పట్టుకుని రోడ్డుపై చెప్పుతో చితకబాదారు పేరెంట్స్. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Telangana Shocker: దారుణం, అక్రమ సంబంధానికి అడ్డు వస్తోందని భార్యను చంపిన భర్త, నిందితుడిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యుల ఆందోళన
Hazarath Reddyనల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తోందని భార్యను హతమార్చాడు ఓ కసాయి భర్త. నాలుగేళ్ల క్రితం వాణిని ప్రేమ వివాహం చేసుకున్నారు కోదాటి శ్రీను. తన బిడ్డను చంపిన శ్రీను, అతడికి సహకరించిన నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యుల ఆందోళన చేపట్టారు.
Kerala Road Accident: షాకింగ్ వీడియో ఇదిగో, కేరళలో ఎదురెదురుగా ఢీకొట్టుకున్న రెండు ఆర్టీసీ బస్సులు, 35 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు
Hazarath Reddyఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్ దృశ్యం వెలుగులోకి వచ్చింది. కేరళలో ఎదురెదురుగా వస్తూ రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొట్టుకున్నాయి. ఓ బస్సు మనంతవాడి నుంచి పయ్యనూరు, మరో బస్సు మనంతవాడికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
Sivamani: వీడియో ఇదిగో, దోశ పెనంపై అద్భుతమైన మ్యూజిక్ వాయించిన శివమణి, సంగీతంలో మునిగితేలిన బెంగళూరులోని విద్యార్థి భవన్ హోటల్
Hazarath Reddyమంగళవారం ప్రముఖ డ్రమ్మర్ శివమణి అల్పాహారం కోసం రెస్టారెంట్ను సందర్శించినప్పుడు బెంగళూరులోని ఐకానిక్ విద్యార్థి భవన్ ప్రత్యేకమైన సందర్భాన్ని చూసింది. రిథమిక్ మేధావికి పేరుగాంచిన శివమణి వంటగదిని తన డ్రమ్ గా మార్చుకున్నాడు.
Delhi: బాత్ రూం పేరు చెప్పి ప్రతీసారి ఈ పెళ్లి కొడుకు చేసిన పని చూస్తే అందరూ నోరెళ్లబెట్టాల్సిందే, పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని చెడామడా తిట్టిన పెళ్లి కూతురు, ఇంతకీ కథ ఏంటంటే..
Hazarath Reddyఢిల్లీలోని సాహిబాబాద్లో జరిగిన ఒక పెళ్లి నాటకీయ మలుపు తిరిగింది, వరుడు పదే పదే "వాష్రూమ్ బ్రేక్లు" చేయడం ఆశ్చర్యకరమైన ఆవిష్కరణకు దారితీసింది-అతను వేదిక వెనుక తన స్నేహితులతో రహస్యంగా మద్యం సేవిస్తున్నాడు. ఈ ఊహించని పరిణామంతో రెండు కుటుంబాలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాయి
Telangana:మూసీ ప్రక్షాళనకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెస్తారో కిషన్రెడ్డి చెప్పాలి, తమకు పేరు వస్తుందని కొందరు ఏడుస్తున్నారని మండిపడిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లో నిర్వహించిన రైజింగ్ వేడుకల్లో సీఎం మాట్లాడారు.భాగ్యనగరం హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ సహా పలు నగరాలు కాలుష్య కాసారంగా మారాయని తెలంగాణ ముఖ్యమంత్రి అన్నారు