India

Health Tips: మిరియాల కషాయం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా.

sajaya

మిరియాలు మసాలాలకే కాదు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మిరియాల కషాయాన్ని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.

Harishrao: వాంకిడి బాధితులను పరామర్శించడం తప్పా?, రాజ్యాంగ దినోత్సవం రోజే హక్కుల ఉల్లంఘనా?...సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్

Arun Charagonda

వాంకిడి గురుకులంలో ఫుడ్ పాయిజన్ వల్ల బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చేందుకు వారి గ్రామానికి వెళ్తున్న ఎమ్మెల్యే కోవా లక్ష్మి సహా ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం సిగ్గుచేటు అన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు.

Eknath Shinde Resign: మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్‌నాథ్‌ షిండే రాజీనామా, గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన షిండే...సీఎం ఎవరన్నది ఇంకా సస్పెన్సే!

Arun Charagonda

మహారాష్ట్ర సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రాజ్‌భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌కు రాజీనామా లేఖ సమర్పించారు ఏక్‌నాథ్ షిండే. అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు తన రాజీనామా లేఖను అందించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు షిండే కేర్ టేకర్ సీఎంగా కొనసాగనున్నారు.

Andhra Pradesh: రామ్‌గోపాల్ వర్మ కోసం ప్రకాశం జిల్లా పోలీసుల గాలింపు, హైదరాబాద్-తమిళనాడులో విస్తృత గాలింపు..

Arun Charagonda

ఆర్జీవీ కోసం ప్రకాశం జిల్లా పోలీసుల గాలింపు ముమ్మరం చేశారు. రెండుసార్లు విచారణకు హాజరుకాలేదు ఆర్జీవీ. దీంతో హైదరాబాద్, తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ కోసం గాలిస్తుండగా ఈ నెల 23న కోయంబత్తూరు లో షూటింగ్ లో పాల్గొన్నట్టు నటులతో వర్మ దిగిన ఫొటోలు ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీంతో రాంగోపాల్ వర్మ కోసం కోయంబత్తూరు వెళ్లారు పోలీసులు.

Advertisement

Telangana: షాకింగ్...వసతి గృహంలో బాలికతో నగ్నపూజలకు యత్నం, భయంతో బంధువుల ఇంటికి వెళ్లి తలదాచుకున్న విద్యార్థిని, బాధ్యులపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు

Arun Charagonda

తెలంగాణలోని మంథని పట్టణ బాలికల వసతి గృహంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి బాలికతో నగ్నపూజలకు యత్నించిన ఘటన కలకలం రేపింది. వసతి గృహంలో పనిచేసే వంట మనిషి.. నగ్న పూజలు చేస్తే కనకవర్షం కురుస్తుందని యువతికి మాయ మాటలు చెప్పింది.

Deputy CM Pawan Kalyan: కేంద్రమంత్రి షెకావత్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ, టూరిజం హబ్‌గా ఏపీ..కేంద్రం సాయంతో పలు పర్యాటక ప్రాజెక్టులు రాబోతున్నాయని వెల్లడించిన పవన్ కళ్యాణ్

Arun Charagonda

ఏపీని టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతాం అని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేంద్రం నుంచి సహాయ సహకారాల కోసం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో పవన్ భేటి అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు కీలక పర్యాటక ప్రాజెక్టులు అమలు చేయబోతున్నామని పవన్ ప్రకటించారు.

Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై పోక్సో కేసు , మైనర్ బాలిక అత్యాచార విషయంలో దుష్ప్రచారం చేశారని ఫిర్యాదు మేరకు పోక్సో కేసు

Arun Charagonda

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై పోక్సో కేసు నమోదైంది. తిరుపతి జిల్లా యల్లమంద మైనర్ బాలికపై అత్యాచార విషయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దుష్ప్రచారం చేశారని బాలిక తండ్రి ఫిర్యాదు చేయగా భాస్కర్ రెడ్డితో పాటు మరికొందరిపై పోక్సో కేసు నమోదు చేశారు యర్రావారిపాళెం పోలీసులు.

Constitution Day of India: 75వ రాజ్యాంగ దినోత్సవం, ప్రాథమిక హక్కులు- భారత పౌరులకు అందించిన గొప్ప వరం, ప్రజాస్వామ్యానికి మూలస్తంభంలా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ

Arun Charagonda

నవంబర్ 26.. భారత రాజ్యాంగ దినోత్సవం. 2015 నుంచి ప్రతి ఏటా ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది మాత్రం జనవరి 26, 1950. నేటితో 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Advertisement

KTR: ఇంకెంత కాలం నిశ్శబ్దం..పొంగులేటి ఆస్తులపై దాడుల అప్‌డేట్ ఏది? ఈడీని ప్రశ్నించిన కేటీఆర్...కరెన్సీ లెక్కింపు యంత్రాలు ఏమయ్యాయి? అని ప్రశ్న

Arun Charagonda

ఎక్స్ వేదికగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిపై జరిగిన ఐటీ దాడులపై ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ రెవెన్యూ మంత్రి ఇళ్లు & కార్యాలయాలపై 60 రోజుల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన దాడుల స్థితిగతులపై ఏమైనా అప్‌డేట్‌లు ఉన్నాయా? అని ఈడీని ప్రశ్నించారు. కనీసం ఐటీ దాడులకు సంబంధించిన వీడియోలు లేదా ఫోటోలు కూడా వెల్లడించరా?, కరెన్సీ లెక్కింపు యంత్రాలు ఏమయ్యాయని ప్రశ్నల వర్షం కురిపించారు.

Obesity-Diabetes Link: ఊబకాయంతో మధుమేహం ఎందుకు వస్తుంది? ఎట్టకేలకు గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలు

Rudra

ఊబకాయం వల్ల మధుమేహం ముప్పు పెరుగుతుందనే విషయాన్ని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి. అయితే, ఊబకాయంతో మధుమేహం ఎందుకు వస్తుంది?

RBI Governor Shaktikanta Das in Hospital: ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కు అస్వస్థత.. చెన్నైలోని అపోలో దవాఖానలో చికిత్స.. ఛాతీలో నొప్పి కారణంగానేనంటూ మీడియాలో కథనాలు

Rudra

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అస్వస్థతకు గురతయ్యారు. దీంతో ఆయన్ని చెన్నైలోని అపోలో దవాఖానలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

Birds Divorce Too: మనుషులే కాదు పక్షులూ విడాకులు తీసుకుంటాయట.. ఆస్ట్రేలియా పరిశోధకుల వెల్లడి.. మరి ఎందుకు విడాకులు తీసుకుంటాయంటే??

Rudra

భేదాభిప్రాయాలు, ఇగోల కారణంగా మనుషులు విడాకులు తీసుకునే ఘటనలను చూస్తూనే ఉంటాం. అయితే, అనేక పక్షులు సైతం చాలాకాలం ఒకే సహచరితో జీవించడమే కాదు కొన్ని సందర్భాల్లో మనుషుల్లానే విడిపోతాయని తెలుసా?

Advertisement

Red Stream on Hyderabad Roads: హైదరాబాద్‌ లోని జీడిమెట్లలో రోడ్డు మీద ఏరులై పారిన ఎర్రటి ద్రవం.. రక్తమేమోనని స్థానికుల ఆందోళన.. చివరకు తేలింది ఏమంటే? (వీడియోతో)

Rudra

అది హైదరాబాద్ లోని జీడిమెట్ల పారిశ్రామికవాడను ఆనుకొని ఉన్న సుభాష్ నగర్‌ డివిజన్‌ వెంకటాద్రి నగర్‌ ప్రాంతం. సోమవారం సాయంత్రం కాలనీవాసులు కాస్త సేదతీరుతూ ముచ్చటించుకుంటున్నారు. పిల్లలు వీధుల్లో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి వీధిలోని రోడ్డుమీదకు ఓ ఎర్రని ద్రవం ఏరులై పారింది.

Special Trains To Sabarimala: అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త.. శబరిమలకు ఏపీ, తెలంగాణ నుంచి స్పెషల్ ట్రైన్స్.. డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 27వరకు అందుబాటులోకి

Rudra

తెలుగు రాష్ట్రాల్లోని అయ్యప్ప మాల వేసుకున్న భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీ, తెలంగాణ నుంచి వరుసగా కొల్లం, కొట్టాయంలకు పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్ల సర్వీసులను ఏర్పాటు చేసింది.

TG Weather Update: తెలంగాణపై చలి-పులి పంజా.. అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు రాత్రి ఉష్ణోగ్రతలు.. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (యూ)లో రికార్డు స్థాయిలో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. రానున్న మూడ్రోజుల్లో ఇంకా పడిపోనున్న ఉష్ణోగ్రతలు

Rudra

తెలంగాణపై చలి-పులి పంజా విసురుతున్నది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలలోపు నమోదవుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

Rains in AP: బంగాళాఖాతంలో వాయుగుండం.. నేటి నుంచి ఏపీలో భారీ వర్షాలు.. ఈ నెల 29 వరకు వానలే వానలు.. దక్షిణ కోస్తాలో ఈదురుగాలులు

Rudra

ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయుగుండం ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో ఈ నెల 29 వరకు కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది.

Advertisement

Vaibhav Suryavanshi: 13 ఏళ్లకే ఐపీఎల్ మెగా వేలంలోకి, వైభవ్ సూర్యవంశీని రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్

Hazarath Reddy

బీహార్‌కు చెందిన 13 ఏళ్ల వర్ధమాన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలంలో విక్రయించబడిన అతి పిన్న వయస్కుడైన క్రికెటర్ అయ్యాడు. బీహార్‌లో జన్మించిన ఈ క్రికెటర్‌ను IPL 2008 ఛాంపియన్స్ రాజస్థాన్ రాయల్స్ (RR) INR 1.1 కోట్లకు సంతకం చేసింది.

Cigarette in Bawarchi Biryani: వీడియో ఇదిగో, ఆర్టీసీ క్రాస్ రోడ్ బావర్చి బిర్యానీలో సగం తాగిన సిగరెట్ పీక, తిన్న తర్వాత చివర్లో చూసి షాకైన కస్టమర్

Hazarath Reddy

బావర్చి బిర్యానీలో సగం తాగిన సిగరెట్ పీక రావడంతో కస్టమర్లు ఖంగుతిన్నారు. హైదరాబాద్ - RTC ‘X’ రోడ్డు వద్ద బావర్చీ రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ తింటుండగా కస్టమర్లకు చివర్లో సిగరెట్ పీక వచ్చింది.. దీంతో పీకను చూసి కస్టమర్లు షాకయ్యారు. దీంతో కస్టమర్లంతా యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు.

‘I Have Not Resigned’: నేను పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయలేదు, వార్తలను ఖండించిన మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే

Hazarath Reddy

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఓటమికి బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే రాజీనామా చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను పటోలే ఖండించారు.

IPL 2025 Mega Auction: కేన్ మామతో సహా మెగావేలంలో అమ్ముడు పోని స్టార్ ఆటగాళ్లు వీళ్లే, ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ కూడా లిస్టులో, షాకవుతున్న అభిమానులు

Hazarath Reddy

ఐపీఎల్ 2025 మెగావేలంలో స్టార్ ఆటగాళ్లు అమ్ముడు పోలేదు. ఈ జాబితాలో దేవదత్ పడిక్కల్, డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో, గ్లెన్ ఫిలిప్స్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, శార్థుల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌, ముజీబ్ ఉర్ రెహ్మాన్‌, అదిల్‌రిషీద్, బెన్ డకెట్, నవీన్ ఉల్ హక్, ఉమేష్ యాదవ్, అజింక్యారహానే, పృథ్వీ షా, ఉమ్రాన్ మాలిక్‌తో పాటు పలువురు యువ ఆటగాళ్లున్నారు

Advertisement
Advertisement