India

Viral Video: దేవుడు తిరిగి బ్రతికిస్తాడని బిల్డింగ్‌ పై నుండి దూకిన యువకుడు, కాళ్లు-చేతులు విరిగి ఆస్పత్రిపాలు...వీడియో ఇదిగో

Arun Charagonda

దేవుడు తిరిగి బ్రతికిస్తాడు అని బిల్డింగ్ పైనుంచి దూకాడు ఓ యువకుడు. తనకు అతీతమైన శక్తులు ఉన్నాయని, దేవునితో తాను మాట్లాడానని‌‌‌‌... నేను చనిపోయిన బతుకుతానని పిచ్చి నమ్మకంతో నాలుగవ అంతస్తు నుండి దూకాడు. తీరా చేతులు, కాళ్లు విరిగి తల తీవ్రమైన గాయాలు అయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వీడియో మాత్రం వైరల్‌గా మారింది.

Diwali Wishes In Telugu: మీ బంధు మిత్రులకు, మీ కుటుంబ సభ్యులకు ఫోటో గ్రీటింగ్స్ ద్వారా దీపావళి శుభాకాంక్షలు తెలియజేయండి..

sajaya

Diwali Wishes In Telugu: మీ బంధు మిత్రులకు, మీ కుటుంబ సభ్యులకు ఫోటో గ్రీటింగ్స్ ద్వారా దీపావళి శుభాకాంక్షలు తెలియజేయండి..

Anna canteen: వైఎస్‌ఆర్ జిల్లా అన్నా క్యాంటీన్‌లో పేలుడు, వంట గదిలో గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం...వీడియో ఇదిగో

Arun Charagonda

కడపలో అన్నా క్యాంటీన్‌లో పేలుడు సంభవించింది. మార్కెట్ యార్డు సమీపంలోని అన్నా క్యాంటీన్ వంటశాలలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. వంట గదిలో గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో పేలుడు థాటికి వంటశాల షెడ్ ధ్వంసమైంది. అయితే వంటలు వండకపోవడం.. సిబ్బంది బాయిలర్ వద్ద లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Diwali Wishes 2024 In Telugu: దీపావళి పర్వదినం సందర్భంగా మీ బంధు మిత్రులకు ఫోటోల రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండి..

sajaya

దీపావళిని శుభ సందర్భంలో సంపదలకు దేవత అయిన లక్ష్మీ దేవిని, గణేశుడిని పూజిస్తారు. దీనితో పాటు దీపాలు కూడా వెలిగిస్తారు. లక్ష్మీదేవిని పూజించడం వల్ల సంతోషం, సౌభాగ్యం పెరుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండిలా..

Advertisement

Maoists Letter On BRS Leaders: బీఆర్ఎస్ నేతలకు మావోయిస్టుల వార్నింగ్ లెటర్, దళిత బంధు పేరుతో మోసం చేశారు...డబ్బులు తిరిగి ఇవ్వకపోతే శిక్ష తప్పదని హెచ్చరిక

Arun Charagonda

దళిత బంధు పేరుతో ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ నేతలారా ఖబద్దార్ అంటూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళిత బంధు పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపణలు చేశారు జగన్.

CPI Narayana: వైఎస్ ఫ్యామిలీ ఆస్తి వివాదం...రాజకీయం కాదు, బయట వాళ్ల జోక్యం అనవసరం...విజయమ్మ క్లారిటీ ఇచ్చాక కూడా రాద్దాంతం సరికాదన్న సీపీఐ నారాయణ

Arun Charagonda

వైఎస్ ఫ్యామిలీలో నెలకొన్న ఆస్తి వివాదంపై స్పందించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కుటుంబ వ్యవహారంలో బయట వాళ్ళ జోక్యం ఎందుకు? అని ప్రశ్నించారు. ఈ మేరకు వీడియో రిలీజ్ చేశారు నారాయణ. ఆస్తి వివాదాలపై విజయమ్మ క్లారిటీ ఇచ్చేశారు...ఇది కుటుంబ వివాదం.. రాజకీయం కాదు అన్నారు. అందరూ నోరు మూసుకుంటే మంచిదని సూచించారు.

Salman Khan Gets Death Threat Again: రూ. 2 కోట్లు ఇవ్వ‌కపోతే ఖ‌తం చేస్తాం... స‌ల్మాన్ ఖాన్ కు మ‌రోసారి బెదిరింపులు, ముంబై పోలీసుల‌కు మెసేజ్ పంపిన గుర్తు తెలియ‌ని వ్య‌క్తి

VNS

బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్‌ (Salman Khan)కు మ‌ళ్లీ బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. రెండు కోట్లు ఇవ్వాల‌ని, లేదంటే చంపేస్తామ‌ని ఆయ‌న్ను బెదిరించారు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తి నుంచి ఆ మెసేజ్‌ వ‌చ్చింది. ముంబై ట్రాఫిక్ పోలీసుల‌కు ఆ మెసేజ్ (Death Threat) వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ డ‌బ్బులు చెల్లించ‌కుంటే, అత‌న్ని చంపేస్తామ‌ని ఆ మెసేజ్‌లో వార్నింగ్ ఇచ్చారు.

Bomb Threat To Shamshabad Airport:శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు, ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాల్లో బాంబులు పెట్టామ‌ని ఫోన్లు, అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది

VNS

శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Shamshabad Airport) విమానాలకు బాంబు బెదిరింపులు (Bomb Threat) రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది విమానాల్లో తనిఖీలు చేపట్టారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో పలు విమానాల్లో బాంబు ఉన్నాయని బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది

Advertisement

Gold Prices Cross Rs 1 Lakh Mark by Diwali 2025: రూ. ల‌క్ష‌కు చేరుకోనున్న తులం బంగారం ధ‌ర‌, అప్ప‌టిలోగా ధ‌ర‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉందంటున్న నిపుణులు, ఇంత‌కీ ఇప్పుడు బంగారం కొనొచ్చా?

VNS

బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 10 గ్రాముల పసిడి రూ.80,000, కేజీ సిల్వర్ రూ. 1 లక్ష దాటేసింది. ధరలు భారీగా పెరిగినప్పటికీ.. గోల్డ్ కొనుగోలు (Gold Price) చేసేవారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ధన త్రయోదశి (Dhantheras) సందర్భంగా బంగారం ఎక్కువగానే అమ్ముడైనట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.

Shenzhou 19 Manned Space Flight: అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌ల్లో మ‌రో కీల‌క మైలు రాయి సాధించిన చైనా, మాన‌వ స‌హిత స్పేస్ ఫ్లైట్ విజ‌య‌వంతంగా ప్రయోగం

VNS

చైనా డ్రీమ్ మిషన్ అయిన షెంజౌ-19 మిషన్ (Shenzhou 19) విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. వాయువ్య చైనాలోని జియూక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి తెల్లవారు జామున 4.27 గంటలకు ఈ మిషన్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇందులో అంతరిక్ష యాత్రకు (Space tour) బయలుదేరిన వారిలో ఒక మహిళా స్పేస్ ప్లైట్ ఇంజనీర్ తో సహా ముగ్గురు వ్యోమగాములు (Manned Spaceflight Mission) ఉన్నారు.

Instagram Down ? ఇన్‌స్టాగ్రామ్‌ డౌన్‌, భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌ సేవల్లో అంతరాయం, ఎక్స్ వేదికగా ఫిర్యాదుల చేస్తున్న నెటిజన్లు

Vikas M

భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌ సేవల్లో (Instagram) అంతరాయం ఏర్పడింది.. దీనిపై యూజర్లు ఎక్స్‌ వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. తమకెదురైన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ డౌన్‌ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్‌ చేస్తున్నారు. కొందరు అప్పుడే మీమ్స్‌ మొదలు పెట్టేశారు.

November 2024 Bank Holidays: నవంబర్ నెలలో బ్యాంకులకు సెలవులు జాబితా ఇదిగో, మొత్తం 13 రోజుల పాటు బ్యాంక్ హాలిడేస్

Vikas M

అక్టోబర్ నెల మరో రెండు రోజుల్లో ముగియనుండగా శుక్రవారం నుంచి నవంబర్ నెల ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రతి బ్యాంకు ఖాతాదారుడు తమ బ్యాంకు శాఖలను కొన్ని పనులకు తప్పక సందర్శించాల్సి వస్తోంది.

Advertisement

Jio Payment Solutions: జియో పేమెంట్ సొల్యూషన్స్‌కు ఆన్ లైన్ పేమెంట్ లావాదేవీలు జరిపేందుకు ఆర్బీఐ అనుమతి

Vikas M

తమ సంస్థ ఆన్ లైన్ లావాదేవీలు జరిపేందుకు ఆర్బీఐ అనుమతించడంతో భారత్ డిజిటల్ పేమెంట్ సర్వీసుల దిశగా ఒక కీలక అడుగు ముందుకు పడిందని జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ మంగళవారం స్టాక్ ఎక్స్చేంజీల ఫైలింగ్‌లో తెలిపింది.

Anti-Cancer Drugs Price Cut: క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మూడు ఓౌషధాల ధరలు తగ్గింపు, కేంద్రం కీలక ఆదేశాలు

Hazarath Reddy

క్యాన్సర్ రోగుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి ఊరట నిచ్చేలా కీలక ఆదేశాలు జారీ చేసింది. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మూడు ప్రధాన ఔషధాల ఎంఆర్‌పీ (MRP) ధరలను తగ్గించింది

Rajasthan Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, కల్వర్టును ఢీకొట్టిన బస్సు, 12 మంది మృ అక్కడికక్కడే మృతి, పలువురికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సికార్‌లో మంగళవారం మధ్యాహ్నం బస్సు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. సలాసర్ నుంచి వెళ్తున్న బస్సు సికర్ జిల్లాలోని లక్ష్మణ్‌గఢ్ వద్దకు రాగానే ఎదురుగా కల్వర్టును ఢీకొట్టింది.

YS Vijayamma Letter on Property Dispute: వైఎస్సార్ అభిమానులకు విజయమ్మ బహిరంగ లేఖ, మా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావడం లేదంటూ ఆవేదన

Hazarath Reddy

వైసీపీ అధినేత జగన్‌, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మధ్య ఆస్తి పంపకాల వివాదం నేపథ్యంలో వారి తల్లి వైఎస్‌ విజయమ్మ స్పందించారు. ఈ మేరకు వైఎస్‌ఆర్‌ అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. ‘‘జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా బాధేస్తోంది. జరగకూడనివన్నీ నా కళ్ల ముందే జరిగిపోతున్నాయి

Advertisement

Hyderabad Shocker: భర్తను, బిడ్డను పోగొట్టుకుని గుండెలు పగిలేలా ఏడుస్తున్న ఈ తల్లిని చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే, ఆన్లైన్ బెట్టింగ్ అప్పులు తీర్చలేక కొడుకు సూసైడ్

Hazarath Reddy

ఆన్లైన్ బెట్టింగ్ కు ఇంజనీరింగ్ విద్యార్థి బలయ్యాడు. వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామానికి చెందిన బత్తిని గణేశ్‌(20) హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌లో ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు.

Mumbai Local Train: ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణించాలంటే చుక్కలే, ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది మరి

Hazarath Reddy

ముంబై లోకల్ ట్రైన్లలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ భారతీయ రైల్వే వారికి ఉపశమనం కల్పించట్లేదు. ఆఫీసు సమయాల్లో రద్దీ అధికంగా ఉన్నప్పటికీ లోకల్ ట్రైన్లను పెంచట్లేదని, ఇతర మార్గాలనూ అన్వేషించట్లేదనే విమర్శలొస్తున్నాయి. థానే స్టేషన్లో రైలు ఎక్కేందుకు మహిళా ప్రయాణికులు పడిన అవస్థల వీడియో వైరలవుతుంది.

YS Jagan Slams CM Chandrababu: రైతులను బాధపెట్టిన వారు బాగుపడినట్టుగా చరిత్రలో ఎక్కడా లేదు, సీఎం చంద్రబాబు ఉచిత పంటల బీమా పథకం రద్దు నిర్ణయంపై మండిపడిన జగన్

Hazarath Reddy

పంటల బీమా ప్రీమియం రైతులే చెల్లించాలంటూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతులపైనే పంటల బీమా ప్రీమియం భారమా చంద్రబాబు అంటూ ఎక్స్‌ వేదికగా ప్రశ్నలు సంధించారు.

Astrology: లక్ష్మీదేవికి ఇష్టమైన మూడు రాశులు ఇవే వీరికి దీపావళి నుంచి అదృష్టం కలిసి వస్తుంది..

sajaya

హిందూమతంలో లక్ష్మీ దేవతను సంపదకు ఐశ్వర్యానికి ప్రత్యేకగా కొలుస్తారు. లక్ష్మీదేవి దయ ఉంటే ఆ ఇల్లు ఎప్పుడు కూడా సిరిసంపదలకు లోటు రాకుండా ఉంటుంది.

Advertisement
Advertisement