జాతీయం

Hindenburg-Adani-SEBI: హిండెన్ బర్గ్ మరో బాంబు.. సెబీ చైర్ పర్సన్, ఆమె భర్త కు అదానీ గ్రూప్ సంస్థల్లో వాటాలు.. సంచలన ఆరోపణలు చేసిన అమెరికా షార్ట్ సెల్లర్.. ఆరోపణలపై మండిపడ్డ సెబీ చీఫ్

Rudra

అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్ బర్గ్ కంపెనీ భారత్ పై మరో పెద్ద బాంబ్ పేల్చింది. శనివారం ఉదయం తన ఎక్స్ ఖాతాలో సమ్ థింగ్ బిగ్ న్యూస్ ఇండియా అంటూ హింట్ ఇచ్చిన హిండెన్ బర్గ్.. అనుకున్నట్లుగానే సాయంత్రానికి సంచలన విషయాన్ని బయటపెట్టింది.

Sitarama project: ఆదివారం సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్,15న పంప్‌హౌస్‌లు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి, భారీ బహిరంగసభ

Arun Charagonda

ఈనెల 15న సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి సీతారామ ప్రాజెక్ట్ లోని మూడు పంప్ హౌస్ లు. ఈ ఆదివారం ట్రయిల్ రన్ కు ఏర్పాట్లు చేశారు. పంప్ హౌజ్ ల ప్రారంభోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీతారామ ప్రాజెక్ట్ కు 67 TMC నీటి కేటాయింపులకు ప్రతిపాదనలు చేశారు.

CM Revanth Reddy: స్టాన్ ఫర్డ్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ శాటిలైట్ సెంటర్ ఏర్పాటును చేయాలని కోరిన రేవంత్

Arun Charagonda

తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సాగుతోంది. తన పర్యటనలో భాగంగా వివిధ రంగాల పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతున్నారు రేవంత్. తాజాగా స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, హెల్త్‌ కేర్ రంగాల్లో పరస్పర సహకారంపై కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న లైఫ్ సైన్సెస్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీల్లో భాగస్వామ్యం కావాలని కోరారు

Health Tips: వాములో ఉన్న ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా.

sajaya

వాము మనందరికీ తెలిసిందే. వామును ప్రతి ఒక్క వంటలో వాడుకుంటా ఉంటాం. ముఖ్యంగా చిరుతిళ్ళు, పిండి వంటల్లో ఇది వాడుతూ ఉంటాం. దీన్ని ఇది కేవలం రుచికే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

Advertisement

Khammam: నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల బెదిరింపు, హోటల్‌ యజమానికి రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు

Arun Charagonda

ఖమ్మంలోని ఓ హోటల్ యజమానికి నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల బెదిరింపులు కలకలం రేపాయి. మమతా రోడ్డులోని కింగ్ దర్బార్ హోటల్ యాజమానిని బెదిరించిన నలుగురు దుండగులు రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసలు ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కి సమాచారం అందించిన హోటల్ యజమాని. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులను కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి సీతారాంపురం గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు పోలీసులు.

Google Chrome: క్రోమ్ బ్రౌజ‌ర్ యూజ‌ర్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌, అనేక బ‌గ్ లు ఉన్నాయ‌ని యూజ‌ర్ల‌ను అల‌ర్ట్ చేసిన కేంద్రం

VNS

గూగుల్‌ క్రోమ్‌ (Google Chrome) యూజర్లకు కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది. క్రోమ్‌ బ్రౌజర్‌లో అనేక బగ్‌లు (Chrome BUG) ఉన్నాయని.. వాటిని హ్యాకర్లు ఉపయోగించుకోవచ్చని ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెనీ రెస్పాన్స్‌ టీమ్‌ (CERT-In) పేర్కొంది. గూగుల్‌ యూజర్లు క్రోమ్‌ బ్రౌజర్‌ను (Chrome Browser) వెంటనే అప్‌డేట్‌ చేయాలని సెర్ట్‌ ఇన్‌ (CERT-in) సూచించింది.

Ashwini Vaishnaw About New Rail Projects: తెలుగు రాష్ట్రాలకు కొత్త రైల్వే లైన్లు, బెంగాల్ టూ వరంగల్, భద్రాచాలం టూ తూర్పుగోదావరి కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు, ఐదేళ్లలో పూర్తి చేస్తామన్న కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్

Arun Charagonda

తెలుగు రాష్ట్రాలకు కొత్త రైల్వే కారిడార్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్. బెంగాల్‌లోని అసోన్‌సోల్ నుండి వరంగల్ వరకు అలాగే భద్రాచలం మీదుగా తూర్పుగోదావరి వరకు కొత్త రైల్వే లైన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ, తెలంగాణతో పాటు బిహార్, ఝార్ఖండ్ కొత్త రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను తెలిపారు.

Romania Wrestler Injured: పారిస్ ఒలింపిక్స్ లో విషాదం, అమాంతం ఎత్తి ప‌డేసిన ప్ర‌త్య‌ర్ధి, మ‌హిళా రెజ్ల‌ర్ విరిగిపోయిందా? ఆస్ప‌త్రిలో సీరియ‌స్ కండిష‌న్ లో రెజ్ల‌ర్

VNS

ఒలింపిక్స్‌లో దేశానికి పత‌కం అందించాల‌నే ఓ రెజ్ల‌ర్ (Wreaslig) క‌ల చెదిరింది. ప్రత్య‌ర్థి అమాంతం ఎత్తి ప‌డేయంతో ఊహించ‌ని విధంగా ఆమె గాయ‌ప‌డింది. మ‌హిళ‌ల ఫ్రీ స్ట‌యిల్ 76 కిలోల విభాగం 16వ రౌండ్‌లో రొమేనియా రెజ్లర్ క‌ట‌లినా అక్సెంటే (Catalina Axente) తీవ్ర గాయాల‌పాలైంది

Advertisement

Susan Wojcicki: యూట్యూబ్ మాజీ సీఈవో క‌న్నుమూత‌, రెండేళ్ల పాటూ క్యాన్స‌ర్ తో పోరాడి మ‌ర‌ణించిన సుసాన్ వొజ్కికి, ఆమె లేని ప్ర‌పంచాన్ని ఊహించ‌డం క‌ష్ట‌మంటూ పిచాయ్ ట్వీట్

VNS

యూట్యూబ్ మాజీ సీఈఓ 'సుసాన్ వొజ్కికి' (Susan Wojcicki) క్యాన్సర్‌తో రెండేళ్ల పోరాటం తర్వాత 56 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఆమె మరణ వార్తను ఆమె భర్త 'డెన్నిస్ ట్రోపర్' ఆగస్టు 9న ధృవీకరించారు. సుసాన్ వొజ్కికి మరణ వార్తను ట్రోపర్ ఫేస్‌బుక్ పోస్ట్‌తో తెలియజేశారు. నా భార్య ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడి చివరకు కన్నుమూసింది.

Himachal Landslides: హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కు పొంచిఉన్న మ‌రో ముప్పు, భారీ వర్షాలు, కొండ చ‌రియ‌లు విరిగిప‌డే ప్ర‌మాదం, 128 రోడ్లు మూసివేత‌

VNS

హిమాచల్‌ ప్రదేశ్‌ను మరోసారి భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తాయి. ఈ వర్షాలకు ఆకస్మిక వరదలు (Flash Floods) సంభవించాయి. పలు చోట్ల కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. శుక్రవారం సాయంత్రం నుంచి రాష్ట్రంలోని నహాన్‌లో అత్యధికంగా 168.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

JK Encounter: జ‌మ్మూక‌శ్మీర్ లో మ‌రో భారీ ఆప‌రేష‌న్, అనంత‌నాగ్ లో బ‌ల‌గాలు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య కాల్పులు, ఇద్దరు జ‌వాన్ల‌కు గాయాలు

VNS

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా అహ్లాన్‌ గడోల్‌ ప్రాంతంలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కోకెర్‌నాగ్ ప్రాంతంలో ఉన్న అహ్లాన్ గడోల్‌లో ఉగ్రవాద జాడ గురించి పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ క్రమంలో భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని సెర్చ్‌ ఆపరేషన్‌ను ప్రారంభించాయి.

Snake Birthday: నాగుపాముకి బర్త్ డే వేడుకలు, కేక్ తెచ్చి సెలబ్రేట్ చేసిన యువకులు, వైరల్ వీడియో

Arun Charagonda

నాగుల పంచమి సందర్భంగా కర్ణాటకలో కొంతమంది యువకులు నాగుపాముకి బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. హ్యాపీ బర్త్ డే నాగుభాయ్... అంటూ నాగులపంచమి రోజున నాగుపాముకి పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

Advertisement

Astrology: ఆగస్టు 22న శుక్రుడు పాల్గొని నక్షత్రంలోనికి ప్రవేశం. ఈ మూడు రాశుల వారికి అపార ధన నష్టం.

sajaya

సంపదకు కీర్తికి కారణమైన గ్రహం శుక్ర గ్రహం ఈ శుక్ర గ్రహం ఆగస్టు 22న పాల్గొని నక్షత్రంలోనికి ప్రవేశం. దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండాలి.

Astrology: ఆగస్టు 17 శని త్రయోదశి, ప్రీతియోగం కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు 17 శని త్రయోదశి శనివారం రోజు ప్రీతియోగం ఏర్పడుతుంది. ఈ యోగం కలయిక వల్ల మూడు రాశులు వారికి కలిసి వస్తుంది ఆ మూడు రాశులు ఏంటో తెలుసుకుందాం.

Astrology: ఆగస్టు 26 నుండి బుధాదిత్య శుక్రాదిత్య రాజయోగం.. ఈ మూడు రాశుల వారికి డబ్బుకు కొరత ఉండదు.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు 26 నుండి సూర్యుడు సింహరాశిలోకి ప్రయాణిస్తాడు. అప్పటికే సింహరాశిలో ఉన్న బుధుడు బుధాదిత్య ,శుక్రుడి శుక్రాతిత్యా అనే రెండు శుభకరమైన రాజయోగాలు ఏర్పడతాయి.

Hyderabad Road Accident: ఆగి ఉన్న బైక్‌ను కారుతో ఢీకొట్టిన మహిళ, ఓ వ్యక్తికి తీవ్రగాయాలు, హిమాయత్ నగర్‌లో రోడ్డు ప్రమాదం, వీడియో వైరల్

Arun Charagonda

హైదరాబాద్ హిమాయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా థార్ వాహనాన్ని నడిపి ఆగి ఉన్న బైకర్ ను ఢీకొట్టింది మహిళ. ఈ ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Advertisement

Bandi Sanjay About KTR: త్వరలో జైలుకు కేటీఆర్, బీజేపీలో బీఆర్ఎస్‌ విలీనం వార్తలు పుకార్లేనన్న బండి సంజయ్‌

Arun Charagonda

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు కేంద్రమంత్రి బండి సంజయ్‌. మీడియాతో మాట్లాడిన కేటీఆర్...కేటీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం ఉందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ చేసిన అరాచకాలు, అవినీతి గురించి అందరికీ తెలుసని తెలిపారు.

Hemant Soren: సీఎం హేమంత్ సోరెన్ చేతికి ఖైదీ ముద్ర‌, బర్త్ డే సందర్భంగా ఫోటో షేర్ చేసిన సోరెన్, ప్రమాదంలో ప్రజాస్వామ్యమని వ్యాఖ్య

Arun Charagonda

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తన 49వ పుట్టినరోజు ఇవాళ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ ద్వారా ఆసక్తికర ట్వీట్ చేశారు సోరెన్. త‌న చేతిపై ఖైదీ ముద్ర ఉన్న ఓ ఫోటోను రిలీజ్ చేయగా జైలు నుంచి రిలీజైన స‌మ‌యంలో ఈ ముద్ర వేశారు అని చెప్పారు.

Nalgonda Police: రోడ్ రోలర్‌తో బైక్ సైలెన్సర్లు నుజ్జునుజ్జు, 80 ద్విచక్ర వాహనాల మాడిఫై చేసిన సైలెన్సర్స్ ను ద్వంసం చేసిన పోలీసులు

Arun Charagonda

భారీ శబ్దాలు వచ్చే బైక్ సైలెన్సర్లను రోడ్ రోలర్‌తో తొక్కించారు నల్గొండ జిల్లా పోలీసులు. నల్లగొండ పట్టణంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అధిక శబ్దం కలిగించే 80 ద్విచక్ర వాహనాల మాడిఫై చేసి సైలెన్సర్స్ ద్వంసం చేశారు పోలీసులు. భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Crows Attack: పగబట్టిన కాకులు.. మసుషులపై దాడి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వినూత్న సంఘటన..వీడియో వైరల్‌

Arun Charagonda

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వినూత్న సంఘటన చోటు చేసుకుంది. కాకులు పగబట్టాయి. సిరిసిల్ల పాత బస్టాండ్ పక్కన.. కట్ట మైసమ్మ గుడి వద్ద పాదచారులపై దాడి చేస్తున్నాయి కాకులు. గుడికి ఆనుకొని ఉన్న వేప చెట్టు‌పై పదుల సంఖ్యలోని కాకులు గూళ్లు కట్టుకున్నాయి. అటువైపు వెళ్తున్న వారిపై దాడి చేస్తుండగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement
Advertisement