విద్య

AP UG,PG Exams Update: ఏపీలో డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు కాలేదు, ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తున్నాం, విద్యాశాఖ మంత్రి సురేష్ వెల్లడి

Hazarath Reddy

ఏపీలో డిగ్రీ, పీజీ పరీక్షలు (AP UG, PG Exams) రద్దయ్యాయని గత రెండు రోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి విదితమే. అయితే దీనిపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (Andhra Education Minister Adimulapu Suresh) క్లారిటీ ఇచ్చారు. పదో తరగతి పరీక్షల (10th Exams) మాదిరి యూజీ, పీజీ పరీక్షలు రద్దయ్యే అవకాశం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh) అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తున్నామే తప్ప రద్దన్న ప్రశ్న ఉత్పన్నమే కాలేదని స్పష్టం చేశారు.

CBSE Board Exam 2020 Cancelled: పెండింగ్ పరీక్షలన్నీ రద్దు చేస్తున్నాం, అత్యున్నత న్యాయస్థానానికి తెలిపిన సీబీఎస్ఈ బోర్డు, ప్రాక్టికల్ ప‌రీక్ష‌లు ఆధారంగా మార్క్‌లు

Hazarath Reddy

పెండింగ్‌లో ఉన్న సీబీఎస్ఈ 12వ, ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు (CBSE Board Exam 2020 Cancelled) కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి మంత్రిత్వ‌శాఖ‌, సీబీఎస్ఈ బోర్డు ఇవాళ సుప్రీంకోర్టుకు తెలియ‌జేసింది. ఈ ప‌రీక్ష‌లు జూలై ఒక‌ట‌వ తేదీ నుంచి 15వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించాల్సి ఉన్న‌ది. కోవిడ్ నేప‌థ్యంలో 12వ త‌ర‌గ‌తి బోర్డు ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాల‌ని పిటిష‌న్లు దాఖ‌లైన నేతృత్వంలో సీబీఎస్ఈ (CBSE) త‌న అభిప్రాయాన్ని కోర్టుకు వ్య‌క్తం చేసింది.

AP Degree Exams Cancelled: ఏపీలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు రద్దు, ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం, డిగ్రీ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు నేరుగా పై తరగతులకు ప్రమోట్

Hazarath Reddy

కరోనావైరస్‌ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో డిగ్రీ, పీజీ విద్యార్థులను కూడా పరీక్షలు నిర్వహించకుండానే (AP Degree Exams Cancelled) పాస్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది! విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్‌ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్సెలర్లు, రెక్టార్లు, రిజిస్ట్రార్లతో మంగళవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. యూజీ, పీజీ కోర్సుల పరీక్షలు, అకడమిక్‌ క్యాలెండర్‌పై వారి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా సంప్రదాయ కోర్సులు, ప్రొఫెషనల్‌ కోర్సులన్నింటి పరీక్షలు (UG / PG Semester Exams) రద్దు చేయడమే మేలన్న అభిప్రాయానికి వచ్చారు.

Telangana DOST Notification 2020: తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి విడుదలైన నోటిఫికేషన్, జూలై 1 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం, పూర్తి సమాచారం మీ కోసం

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ దోస్త్ నోటిఫికేషన్‌ (Telangana DOST Notification 2020) జారీ చేసింది. వివిధ వర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో చేరాలనుకొనే విద్యార్థులు జూలై 1 నుంచి 14 వరకు రూ. 200 ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో( https:// dost.cgg.gov.in) ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. విద్యార్థులు ఇంటర్‌ హాల్‌టికెట్‌ నంబర్‌తో లాగిన్‌ అయి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చని పేర్కొంది. సోమవారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన దోస్త్‌ కమిటీ సమావేశంలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించి నోటిఫికేషన్‌ జారీ చేశారు.

Advertisement

TS SSC Marks Memo: పదవ తరగతి విద్యార్థుల మార్కులు వచ్చేశాయి, www.bse.telangana.gov.inలోకి వెళ్లి గ్రేడింగ్‌ వివరాలు పొందవచ్చు

Hazarath Reddy

తెలంగాణలో పదో తరగతి విద్యార్థుల గ్రేడ్లు (TS SSC Marks Memo) ఖరారయ్యాయి. ఈ వివరాలను www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో గ్రేడ్ల వివరాలు చూసుకోవచ్చని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులంతా ఉత్తీర్ణులేనని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో మార్చి 2020 ఏడాది పాసయిన వారంతా (Telangana SSC March 2020) మెమోలు ఆయా పాఠశాలల్లో విద్యార్థులు తీసుకోవచ్చని చెప్పారు

AP SSC Exams 2020: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రద్దు! విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులను కూడా పాస్ చేస్తున్నట్లు వెల్లడి

Team Latestly

ఏపి ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో 6.3 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు లేకుండానే పాస్ అయ్యారు. కాగా, ఇప్పటికే తెలంగాణతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు గ్రేడ్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే....

Manabadi TS Inter Results 2020: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, కింది వెబ్‌సైట్ల ద్వారా హాల్‌టికెట్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసి ఫలితాలను చెక్ చేసుకోండి

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో మార్చిలో నిర్వహించిన ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్ష ఫలితాలు (Manabadi TS Inter Result 2020) గురువారం విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్మీడియట్‌ విద్యా కమిషనర్‌ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9.50 లక్షలమంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాశారు. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ ప్రక్రియకు బోర్డు దరఖాస్తులు చేసుకోవడానికి రెండు వారాల వరకు గడువు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. జూలై 11 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ నిర్వహించే అవకాశం ఉన్నది.

TS Inter Result 2020: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, TSBIE అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు (TS Inter Result 2020) తేదిని బోర్డు ప్రకటించింది. ఈ నెల 18న ఒకేసారి ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఇంటర్‌ బోర్డు (Telangana State Board of Intermediate Education (TSBIE) వెల్లడించింది. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు ప్రకటించారు. ఇంటర్‌ పరీక్షా ఫలితాలకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయని, తుది నివేదికను విద్యాశాఖకు సమర్పించినట్లు ఇంటర్‌ బోర్డు సెక్రటరీ (TS intermediate board secretary) తెలిపారు.

Advertisement

TS Inter Result 2020: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలకు రెడీ, ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు, జూన్ 16,17వ తేదీల్లో వెలువడే అవకాశం

Hazarath Reddy

ఎట్టకేలకు తెలంగాణ ఇంటర్ విద్యార్థుల ఫలితాలు (Telangana Inter Results 2020,) విడుదల కాబోతున్నాయి. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఫలితాలను (TS Inter Result 2020) ఒకేసారి విడుదల చేయాలనీ తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. రెండు సంవత్సరాల విద్యార్థుల వాల్యూషన్ ప్రక్రియ పూర్తి అవడం తో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Manabadi AP Inter Result 2020: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, ప్రథమ, ద్వీతీయ సంవత్సరాల ఫలితాలు ఒకే రోజు విడుదల, పాసయ్యారో లేదో చెక్ చేసుకోవడం ఎలా ?

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలోని గేట్ వే హోటల్ లో విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. ప్రథమ, ద్వీతీయ సంవత్సరాల ఫలితాలను ఒకే రోజు విడుదల చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫలితాలు https://bie.ap.gov.in, www.sakshieducation.com తదితర వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయి. బోర్డు వెబ్‌సైట్లో హాల్‌టికెట్‌ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా ఫలితాలు పొందవచ్చు.

AP Inter Results 2020: ఏపీ ఇంటర్ ఫలితాలు రేపు విడుదల, మనబడి అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను విడుదల చేయనున్న ఆంధ్రప్రదేశ్ బోర్డు

Hazarath Reddy

ఏపీ మనబడి ఇంటర్ రిజల్ట్స్ 2020 ను (Manabadi Inter Results 2020) రేపు (శుక్రవారం) ప్రకటించడానికి బీఐఏపీ (BIEAP) సిద్ధమైంది. ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలను మనబడి అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చు. పరీక్షా ఫలితాలను (AP Inter Results 2020) రేపు అధికారిక వెబ్‌సైట్‌ లో పొందుపర్చనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా, AP ఇంటర్ రిజల్ట్స్ 2020 ను నోటీసు బోర్డులలో ప్రదర్శించవద్దని పాఠశాలలకు సూచించబడింది.

National Test Abhyas: ఎలాంటి కోచింగ్ అవసరం లేదు, నేషనల్ టెస్ట్ అభ్యాస్ యాప్ ఉంటే చాలు, జేఈఈ, నీట్‌ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయిపోవచ్చు, 10 లక్షల డౌన్‌లోడ్‌లు దాటిన ఎన్‌టిఎ యాప్

Hazarath Reddy

నీట్ మరియు జెఇఇ మెయిన్ 2020 తయారీ కోసం ఎన్‌టిఎ ప్రారంభించిన నేషనల్ టెస్ట్ అభ్యాస్ యాప్ (National Test Abhyas APP) విజయవంతం అయింది. యాప్ విడుదల చేసిన కొద్ది రోజుల్లోనే దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. జెఇఇ మెయిన్ నీట్ పరీక్షల ప్రిపరేషన్ కోసం (JEE Main, NEET preparation) కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ విడుదల చేసింది. ఈ యాప (National Test Abhyas) విడుదలయిన కొద్ది రోజుల్లోనే జెఇఇ మెయిన్ నీట్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఉపయోగిస్తున్నారు.

Advertisement

TS SSC Exams 2020: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు, ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడులు, అందరూ పై తరగతికి ప్రమోట్

Hazarath Reddy

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు (Telangana SSC Board exam 2020) రద్దు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం (TS Govt) ప్రకటించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో పరీక్షలు లేకుండానే టెన్త్‌ విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 5.34 లక్షల మంది విద్యార్థులను ప్రమోట్ అయ్యారు. ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితిల దృష్ట్యా పరీక్షలు నిర్వహించకుండానే ఇంటర్నల్‌, అసెస్‌మెంట్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్న ప్రభుత్వం పేర్కొంది.

Telangana SSC Exams: తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు వాయిదా! హైకోర్ట్ జీహెఎంసీలో మాత్రమే వాయిదా వేయాలని చెప్పిన కొద్ది గంటల్లోనే రాష్ట్రవ్యాప్తంగా SSC పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం

Team Latestly

హైకోర్ట్ ఆదేశాలతో జీహెచ్ఎంసీ మినహా తెలంగాణ వ్యాప్తంగా సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పదో తరగతి పరీక్షల షెడ్యూల్ కోసం....

TS CET-2020 Exams: జూలై 6, 2020 నుంచి జూలై 9 వరకు ఎంసెట్, జూలై 13న ఐసెట్, తెలంగాణలో ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షల రీషెడ్యూల్ విడుదల, ముఖ్యమైన తేదీలు మరియు ఇతర వివరాలు ఇలా ఉన్నాయి

Team Latestly

లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడ్డ వివిధ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్షల రీషెడ్యూల్ తేదీలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TSPSC) శనివారం ప్రకటించింది. తెలంగాణలో ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశానికి....

TS 10th Class Exams: తెలంగాణలో జూన్‌ 8వ తేదీ నుంచి పదవతరగతి పరీక్షలు, ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల మధ్య నిర్వహణ

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా, కొవిడ్‌-19 నిబంధనలకు లోబడి జూన్‌ 8వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలను (Telangana SSC Exams Dates) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (sabita indra reddy) స్పష్టం చేశారు. వాయిదా పడ్డ పది పరీక్షలను జూన్‌ 8వ తేదీ నుంచి.. ప్రతీ పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండేలా నిర్వహించనున్నారు.

Advertisement

Schools Reopen in AP: ఏపీలో ఆగస్టు 3 నుంచి స్కూళ్లు ప్రారంభం, అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ 19 లాక్‌డౌన్‌ (Covid-19 Lockdown) కారణంగా మూత పడిన స్కూళ్లు ఆగస్టు 3 నుంచి ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ (AP CM YS jagan) ప్రకటించారు. జులై నెలాఖరులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో నాడు–నేడు (nadu nedu scheme) కింద అభివృద్ధి పనులు పూర్తిచేయాల్సి ఉందన్నారు. విద్యావ్యవస్థలో నూతన మార్పులు తీసుకురావల్సిన అవసరం ఉందని, కలెకర్ట్‌లు అందరూ సమష్టిగా పని చేయాలని సూచించారు.

Andhra Pradesh: శ్రీవారి దర్శనం ఇప్పట్లో లేనట్లే, ఏపీలో మే 31 వరకు దేవాలయాల్లోకి భక్తులకు నో ఎంట్రీ, ఈ నెల 28న టీటీడీ పాలకమండలి సమావేశం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దేవాలయాల్లోకి ఈ నెల 31 వరకు భక్తులకు ప్రవేశముండబోదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల నేపధ్యంలో లాక్ డౌన్ (Lockdown) కాలపరిమితిని మే నెల 31 వ తేదీ వరకు పొడిగించినందున రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో భక్తులకు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు (AP minister Vellampalli Srinivas Rao) వెల్లడించారు. అంటే గతంలో ఇచ్చిన ఆదేశాలే అప్పటివరకు అమల్లో ఉంటాయని తెలిపారు.

CBSE Class 10, 12 Board Exam 2020: జూలై 1 నుంచి 15 వరకు 12 వ తరగతి పరీక్షలు, ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్షల నిర్వహణ

Hazarath Reddy

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) సోమవారం పెండింగ్ లో ఉన్న 10వ తరగతి మరియు 12 వ తరగతి పరీక్షల తేదీ షీట్ (CBSE Class 10, 12 Board Exam 2020) ప్రకటించింది. ఇది ఇప్పుడు జూలై 1-15 నుండి జరుగుతుంది. COVID-19 వ్యాప్తి నియంత్రణకు దేశ వ్యాపంగా లాక్ డౌన్ విధించడంతో మార్చి 25 న దేశవ్యాప్తంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. తాజాగా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) ఇంటర్‌ పరీక్షల డేట్‌షీట్‌ను విడుదల చేసింది.

Package Breakup-5: జాతీయ ఉపాధి హామీకి అదనపు నిధులు, రాష్ట్రాలకు రుణ పరిమితి 5 శాతానికి పెంపు, విద్య మరియు ఆరోగ్యంకు భారీ కేటాయింపులు సహా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక ప్యాకేజీ- 5 విడత ప్రకటనల ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి

Team Latestly

ప్రధాని మోదీ ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ యొక్క ఐదవ మరియు ఆఖరి భాగాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆదివారం ప్రకటించారు. ఈరోజు తన ప్రసంగంలో MGNREGA, ఆరోగ్యం మరియు విద్య, కంపెనీ యాక్ట్ యొక్క డిక్రిమినలైజేషన్ తో పాటు వ్యాపార మరియు వాణిజ్య సంబంధింత కార్యకలాపాల సరళీకరణ....

Advertisement
Advertisement