Information
TS Inter Exams 2024: ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్‌లోకి నో ఎంట్రీ, ఈ నెల 28 నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం
Hazarath Reddyఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుతుందని శృతి తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరామని తెలిపారు.
HC on POCSO Case: యువకుడిని పెళ్ళి చేసుకుని బిడ్డకు జన్మనిచ్చిన మైనర్ బాలిక, యువతి తల్లిదండ్రులు అతనిపై పెట్టిన పోక్సో కేసును రద్దు చేసిన హైకోర్టు
Hazarath Reddyమైనర్ బాలికను వివాహం చేసుకుని లైంగిక సంబంధం పెట్టుకున్నాడని ఆ తర్వాత ఆ బాలిక బిడ్డకు జన్మనిచ్చిందన్న ఆరోపణలపై 20 ఏళ్ల యువకుడిపై వేసిన క్రిమినల్ ప్రాసిక్యూషన్‌ను కర్ణాటక హైకోర్టు ఇటీవల రద్దు చేసింది.
Bank Holidays in March 2024: బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్.. మార్చిలో 14 రోజుల పాటు బ్యాంకులు బంద్‌.. సెలవుల జాబితా ఇదే!
Rudraబ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్. 2024 సంవత్సరానికి సంబంధించి మార్చి నెల బ్యాంకు సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. మార్చి నెలలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.
Petrol-Diesel Price Cut: చమురు కంపెనీలు లాభాల్లోకి వస్తున్నాయి..పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం.. కేంద్ర పెట్రోలియం హర్‌దీప్‌ సింగ్‌ పూరీ ప్రకటన
sajayaవాహన దారులకు గుడ్ న్యూస్. ఇంధన ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. 2024లో లోక్‌సభ ఎన్నికలు రానున్న విషయం తెలిసిందే.చమురు కంపెనీలు లాభాల్లోకి వస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు త్వరలో తగ్గే సూచనలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం హర్‌దీప్‌ సింగ్‌ పూరీ ఓ సదస్సులో అన్నారు.
SC on Cheating: IPC సెక్షన్ 417 ప్రకారం వివాహం రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, దాన్ని మోసం చేసిన నేరంగా పరిగణించలేమంటూ వధువు తండ్రి వేసిన పిటిషన్‌ కొట్టేసిన అత్యున్నత ధర్మాసనం
Hazarath Reddyనిందితుడు (పెళ్లి కొడుకు) బుక్ చేసిన కళ్యాణ మండపంలో వివాహం చేసుకోకపోవడం, ఐపిసి సెక్షన్ 417 ప్రకారం శిక్షార్హమైన మోసం చేసిన నేరంగా పరిగణించబడదని సుప్రీంకోర్టు పేర్కొంది.మోసం కింద నేరం చేయడానికి, మోసం చేయడం లేదా మోసం చేయాలనే ఉద్దేశ్యం మొదటి నుండి సరిగ్గా ఉండాలని కోర్టు పదే పదే పునరుద్ఘాటించింది.
TSPSC Group-1 Notification Released: 563 పోస్టులతో తెలంగాణ గ్రూప్‌ -1 నోటిఫికేషన్‌ విడుదల, వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంపు
Hazarath Reddyతెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. 563 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ నెల 23వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ప్రభుత్వం వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది
Telangana Group-1 Notification Cancelled: తెలంగాణలో గ్రూప్‌ -1 నోటిఫికేషన్‌ రద్దు చేసిన టీఎస్‌పీఎస్సీ, కొత్త నోటిఫికేషన్‌ త్వరలో జారీ చేసే అవకాశం
Hazarath Reddyతెలంగాణలో గత ప్రభుత్వం 2022లో విడుదల చేసిన పాత గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ సోమవారం రద్దు చేసింది.ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. 2022లో 503 పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.
Numaish Last Day Today: హైదరాబాద్ నుమాయిష్‌ నేడే ఆఖరు.. శనివారం నాటికి దాదాపు ఇరవై లక్షలు దాటిన సందర్శకుల సంఖ్య
Rudraనాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్‌) నేడు ఆదివారం ముగియనుంది.
CBSE Board Exams 2024: 10, 12వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు సీబీఎస్ఈ అలర్ట్, ఉదయం 10 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచన
Hazarath Reddyసర్క్యులర్ ప్రకారం, విద్యార్థులు ఉదయం 10 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఎందుకంటే ప్రవేశం 10:15 గంటలకు మూసివేయబడుతుంది. పరీక్ష ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ముందు ప్రశ్నపత్రాన్ని చదవడానికి విద్యార్థులకు 15 నిమిషాల సమయం ఇవ్వబడుతుంది. సబ్జెక్టును బట్టి పరీక్ష వ్యవధి మారుతుంది.
AP EAPCET Schedule 2024: ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఇదిగో, మే 13 నుంచి ఈఏపీసెట్‌ పరీక్షలు, ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షల హాల్ టికెట్ల విడుదల
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 విద్యా సంవత్సారినికి సంబంధించి ఇంజినీరింగ్‌ సహా ఇతర కోర్సులు అభ్యసించేందుకు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం విడుదల చేసింది.
CBSE Fake 'X' Handles: సీబీఎస్ఈ అలర్ట్ మెసేజ్, ఈ 30 నకిలీ సోషల్ మీడియా అకౌంట్లను నమ్మవద్దని హెచ్చరిక,తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి
Hazarath Reddy30 నకిలీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై తగిన చర్యలు తీసుకుంటున్నట్లు సిబిఎస్‌ఇ అధికారిక నోటీసును విడుదల చేసింది.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మల్టీ-బ్లాగింగ్ సైట్ Xలో సాధారణ ప్రజలను తప్పుదారి పట్టించే ఉద్దేశ్యంతో CBSE పేరు, లోగోను ఉపయోగిస్తున్న 30 నకిలీ సోషల్ మీడియా హ్యాండిల్‌లను గుర్తించింది.
Andhra Pradesh DSC 2024: నేటి నుంచి డీఎస్సీ దరఖాస్తులు స్వీకరణ, ఈ నెల 22 వరకు గడువు, పూర్తి వివరాలు ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం..నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
Paramilitary Forces Recruitment: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అభ్యర్థులకు గుడ్ న్యూస్, 13 ప్రాంతీయ భాషల్లో కానిస్టేబుల్ పరీక్ష, ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఎగ్జామ్స్
Hazarath Reddyపారామిలటరీ బలగాల రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఇప్పుడు హిందీ మరియు ఇంగ్లీషుతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించబడుతుంది. మొదటిసారిగా, CRPF, BSF మరియు CISF వంటి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్‌లో కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షను హిందీ మరియు ఇంగ్లీష్ కాకుండా 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించనున్నారు.
CBSE Candidates with Diabetes: డయాబెటిక్‌ విద్యార్థులు పరీక్ష కేంద్రానికి పండ్లు, నీళ్లు, గ్లూకోమీటర్‌ తెచ్చుకోవచ్చు.. సీబీఎస్‌ఈ కీలక మార్గదర్శకాలు
Rudraసీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు రాసే డయాబెటిక్‌ విద్యార్థులు పరీక్ష కేంద్రానికి తమ వెంట పండ్లు, నీళ్ల బాటిల్‌, గ్లూకోమీటర్‌ తీసుకెళ్లవచ్చు. ఈ మేరకు బోర్డు వెసులుబాటు కల్పించింది. త్వరలో సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో బోర్డు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం డయాబెటిక్‌ విద్యార్థులు తొలుత పోర్టల్‌ లో దరఖాస్తు చేసుకోవాలి.
Telangana: తెలంగాణలో గ్రూప్‌-1 అభ్యర్థుల వయోపరిమితి 46 ఏళ్లకు పెంపు, కీలక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలో గ్రూప్‌-1 (Group-1) అభ్యర్థుల వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతూ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే గ్రూప్‌-1 నిర్వహిస్తామని శాసనసభలో ప్రకటించారు. కొన్ని నిబంధనల వల్ల టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన ఆలస్యమైంది.
Hyderabad Book Fair: నేటి నుంచి హైదరాబాద్‌ లో 36వ జాతీయ పుస్తక ప్రదర్శన.. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు.. ఈ నెల 19 వరకూ జరగనున్న బుక్‌ ఫెయిర్
Rudraపుస్తక ప్రియులకు గుడ్ న్యూస్. మీరందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభ తరుణం రానే వచ్చింది. హైదరాబాద్‌ లోని తెలంగాణ కళాభారతిలో (ఎన్టీఆర్ స్టేడియం) నేటి నుంచి ఈ నెల 19 వరకూ.. 36వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన జరగనుంది.
What is UCC Bill? యూసీసీ బిల్లు అంటే ఏమిటి? యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుతో ఎవరికి నష్టం, ఎవరికి లాభం, Uniform Civil Code బిల్లు పూర్తి సమాచారం ఇదిగో..
Hazarath Reddyస్వాతంత్య్రానంతరందేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. యూసీసీ బిల్లుకు (UCC Bill Uttarakhand) ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి సమక్షంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలంతా స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు.