Information

Electoral Bonds: రాజకీయ పార్టీలకు విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునే హక్కు ప్రజలకు లేదు, ఎన్నికల బాండ్ల పథకంపై సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

Hazarath Reddy

ఎన్నికల బాండ్ల పథకం కింద రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునే హక్కు ప్రజలకు లేదని పేర్కొంది.

Train Delay: రైలు ఆలస్యం.. వినియోగదారుల ఫోరం రూ.60,000 జరిమానా

Rudra

సమయ పాలన పాటించనందుకు రైల్వేకు వినియోగదారుల ఫోరం రూ.60,000 జరిమానా విధించింది.

Andhra Pradesh Elections 2024: ఏపీలో మహిళా ఓటర్లే ఎక్కువ బాసూ, ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసిన ఈసీ, మొత్తం 4,01,53,292 మంది ఓటర్లు

Hazarath Reddy

ఏపీలో ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇదే సమయంలో ముసా​యిదా ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే డిసెంబర్‌ తొమ్మిదో తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్టు ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది

HC on Elderly Parents: ముసలి వయసులో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవడం పిల్లల కర్తవ్యం, వృద్ధ తల్లిదండ్రుల పోషణపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

పిల్లలు తమ వృద్ధ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని భావిస్తున్నారు. దేశంలోని సంప్రదాయ నిబంధనలు, భారతీయ సమాజం పాటించే విలువలు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను, పెద్దలను సంరక్షించే బాధ్యతకు ప్రాధాన్యత ఇస్తాయని హైకోర్టు పేర్కొంది.

Advertisement

HC on Maintenance to Graduate Wife: భార్య డిగ్రీ చదివినంత మాత్రాన ఉద్యోగం చేయాలని బలవంతం చేయలేం, భర్త చెల్లించే మధ్యంతర భరణం కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

భార్య గ్రాడ్యుయేట్ అయినంత మాత్రానా ఆమెను ఉద్యోగం చేయమని బలవంతం చేయలేమని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. విడిపోయి దూరంగా ఉంటున్న భర్త నుంచి భరణం పొందేందుకే ఉద్దేశపూర్వకంగా ఆమె జాబ్ చేయడం లేదని భావించలేమని కోర్టు పేర్కొంది.

Bharat in NCERT School Textbooks: NCERT స్కూల్ పుస్తకాల్లో ఇకపై ఇండియా స్థానంలో భారత్, కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపిన ఎన్‌సీఈఆర్టీ ప్యానెల్

Hazarath Reddy

NCERT పుస్తకాల్లో ఇకపై ఇండియా పేరును భారత్ గా భర్తీ చేస్తున్నట్లు National Council of Educational Research and Training తెలిపింది. కొన్ని నెలల క్రితమే దీనిని ప్రతిపాదించగా తాజాగా ప్యానెల్ ఇందుకు ఆమోదం తెలిపింది. ప్యానెల్ సభ్యుడు సీఐ ఐజాక్ మాట్లాడుతూ కొత్త పుస్తకాల్లో ఇకపై భారత్ ఉంటుందని తెలిపారు. ఇటీవల జీ20 సదస్సులో ఇండియాను భారత్ గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ గా మార్చిన సంగతి విదితమే.

Cyclone Hamoon Update: బంగ్లాదేశ్ తీరం వైపు కదిలిన హమూన్ తుఫాను, ఒడిశాలోని పారదీప్‌కు 230 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం సైక్లోన్

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్ప పీడనం తీవ్ర తుఫాన్‌గా మారింది. బంగ్లాదేశ్ తీరప్రాంతంపై ఈ తుఫాను 'హమూన్' ల్యాండ్‌ఫాల్ ప్రక్రియను ప్రారంభించింది. రాబోయే ఆరు గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండి) తెలిపింది

Cyclone Hamoon Update: బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారిన హమూన్, తీరం వైపు వేగంగా దూసుకువస్తున్న సైక్లోన్, ఈ రెండు రాష్ట్రాలకు హై అలర్ట్

Hazarath Reddy

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన 'హమూన్' తుపాను ఇప్పుడు తీవ్ర తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం తెలిపింది. IMD నుండి వచ్చిన సమాచారం ప్రకారం, వాయువ్య మరియు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా 'హమూన్' తుఫాను గత 6 గంటల్లో గంటకు 18 కి.మీ వేగంతో ఈశాన్య దిశగా కదిలింది.

Advertisement

Cyclone Hamoon: ఈ ఉదయం 6 గంటలకు తీవ్ర తుపానుగా మారిన హమూన్.. ఏడు రాష్ట్రాలకు హెచ్చరిక.. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక.. రేపు బంగ్లాదేశ్‌లోని ఖేపుపారా-చిట్టగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం..

Rudra

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘హమూన్’ తీవ్ర తుపానుగా మారినట్టు భారత వాతావరణశాఖ తెలిపింది. ఇది ఉత్తర-ఈశాన్య దిశగా కదిలి బుధవారం మధ్యాహ్నం బంగ్లాదేశ్‌ లోని ఖేపుపారా-చిట్టగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది.

Winter Season: తెలంగాణలో మొదలైన చలి పంజా.. త‌గ్గుముఖం ప‌ట్టిన ఉష్ణోగ్ర‌త‌లు.. ఆదిలాబాద్‌ లో 17.2 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌ నమోదు

Rudra

తెలంగాణలో గ‌జ‌గ‌జ మొద‌లైంది. చ‌లి వ‌ణికిస్తోంది. నాలుగైదు రోజుల క్రితం వ‌ర‌కు ప‌గ‌లు, రాత్రి స‌మ‌యాల్లో ప్ర‌జ‌లు ఉక్క‌పోత‌తో అల్లాడిపోయారు. నైరుతి రుతుప‌వ‌నాలు తిరుగుముఖం ప‌ట్ట‌డంతో తెలంగాణ వైపు శీత‌ల గాలులు వీస్తున్నాయి.

Cyclone Tej Update: రాత్రికి తేజ్ తుఫానుగా మారనున్న వాయుగుండం, ఒడిశా తీరానికి హై అలర్ట్, ఈ సైక్లోన్ తీరం ఎక్కడ దాటుతుందంటే..

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన లోతైన అల్పపీడనం సోమవారం సాయంత్రం నాటికి తుఫానుగా మారవచ్చని భారత వాతావరణ శాఖ (IMD) బులెటిన్‌లో తెలిపింది. తుఫాను ఏర్పడిన తర్వాత దీనిని ఇరాన్ పెట్టిన పేరు 'హమూన్' అని పిలుస్తారు

Cyclone Tej: బలపడుతున్న తేజ్ తుఫాను.. ఆదివారం మధ్నాహ్నానికి మరింత తీవ్రం.. తీవ్ర తుఫానుగా మారే అవకాశం.. గుజరాత్‌ కు ఐఎండీ అలర్ట్

Rudra

భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. ఆగ్నేయ, నైరుతి అరేబియా సముద్రంలో ఏర్పడిన తేజ్ తుఫాను మరింత తీవ్రంగా బలపడుతోందని ప్రకటించింది.

Advertisement

Weather Forecast: బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం, ఈనెల 23తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం, ఏపీలో భారీ వర్షాలు పడతాయంటున్న వాతావరణ శాఖ

Hazarath Reddy

నేడు అండమాన్‌ సముద్రా­నికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 4.5 కి.మీ.ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. రేపటికి ఇది బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడనంగా మారనుందని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది.

Andhra Pradesh: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గ్రూప్-2లో అదనంగా 212 పోస్టులను పెంచుతూ జీవో విడుదల

Hazarath Reddy

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-2లో అదనంగా 212 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గతంలోనే గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి ప్రభుత్వం జీవో జారీ చేసింది.

NaMo Bharat RapidX Train: గంటకు 180 కి.మీ.గరిష్ఠ వేగంతో ర్యాపిడ్‌ ఎక్స్‌ రైలు, నమో భారత్ సెమీ హైస్పీడ్‌ ట్రైన్ ప్రత్యేకతలు ఇవిగో..

Hazarath Reddy

నమోభారత్‌ రైళ్లలో అన్నీ ఏసీ పెట్టెలే ఉంటాయి. ప్రతి రైలులో 2+2 తరహాలో సీట్లు ఉంటాయి. నిలబడేందుకు విశాలమైన ప్రదేశం, సామాన్లు ఉంచేందుకు అరలు, సీసీటీవీ కెమెరాలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, లాప్‌టాప్‌/మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్లు, రూట్‌మ్యాప్‌లు, దానంతట అదే నియంత్రించుకునే లైటింగ్‌ వ్యవస్థ ఉంటాయి.

Dasara Special Trains: దసరాకు మరో 9 ప్రత్యేక రైళ్లు.. నేడు నాందేడ్-కాకినాడ మధ్య ప్రత్యేక రైలు, 24న హైదరాబాద్-కటక్, 25న కటక్-హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు.. కాచిగూడ-రాయచూర్, రాయచూర్-కాకినాడ మధ్య 25 వరకు రైళ్ల రద్దు

Rudra

దసరా (Dasara) సమీపిస్తున్న వేళ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) మరోమారు గుడ్‌ న్యూస్ (Good News) చెప్పింది.

Advertisement

Weather Forecast: ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్, అల్పపీడనం ప్రభావంతో పొంచి ఉన్న తుఫాను ముప్పు, మళ్లీ భారీ వర్షాలు తప్పవని హెచ్చరిక

Hazarath Reddy

మండే ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురును వాతావరణ శాఖ అందించింది.ముఖ్యంగా ఏపీలో మళ్లీ వానలు భారీగా కురుస్తాయని తెలిపింది. అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. ఇది సముద్రమట్టానికి 4.5 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ అధికారులు చెప్పారు.

Cyclone Tej: తేజ్ తుఫానుపై ఐఎండీ భారీ హెచ్చరిక, అరేబియా సముద్రంలో సైక్లోన్ వచ్చే అవకాశం ఉందని వెల్లడి, తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఏంటంటే..

Hazarath Reddy

అరేబియా సముద్రంలో ఏర్పడే అవకాశం ఉన్న తుఫాను కారణంగా మహారాష్ట్ర నగరంలో వాతావరణ మార్పుల గురించి భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరిక జారీ చేసింది .రానున్న 48 గంటల్లో ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రానికి ఆనుకుని అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD వాతావరణ నవీకరణ సోమవారం వెల్లడించింది.

SSC Exams: మార్చిలో పదోతరగతి వార్షిక పరీక్షలు.. ఈసారీ ఆరు పేపర్లకే ఎగ్జామ్స్‌

Rudra

వచ్చే ఏడాది మార్చిలో పదోతరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలంగాణ విద్యాశాఖ అధికారులు తెలిపారు.

HC On Recording Phone Conversation: అది గోప్యత హక్కును ఉల్లంఘించడమే, భార్య ఫోన్ సంభాషణ ఆమెకు తెలియకుండా భర్త రికార్డు చేయడంపై ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

వ్యక్తికి తెలియకుండా అతని మొబైల్‌ ఫోన్‌ సంభాషణను రికార్డు చేయడం రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం వారి గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. 38 ఏండ్ల మహిళ తన భర్త నుంచి భరణం కోరుతూ వేసిన వ్యాజ్యం విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Advertisement
Advertisement