Information
Earthquake in Andaman: అండమాన్ నికోబార్ దీవుల్లో 5.9 తీవ్రతతో భూకంపం.. అర్ధరాత్రి 12.53 గంటలకు ఘటన
Rudraఅండమాన్ నికోబార్ దీవులను మరోసారి భూకంపం వణికించింది. పోర్ట్ బ్లెయిర్ కు సమీపంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.9గా నమోదయింది.
MMTS Trains Cancelled: వారం పాటు 22 ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు.. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 6 వరకూ సర్వీసులు రద్దు
Rudraఈ నెల 31 నుంచి వారం పాటు 22 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే శాఖ శుక్రవారం ప్రకటించింది. రైల్వే ట్రాకుల నిర్వహణ, మరమ్మతులు నేపథ్యంలో సర్వీసులు రద్దు చేసినట్టు తెలిపింది.
Godavari’s Danger Level In Bhadrachalam: భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో ఎగిసిపడుతున్న గోదావరి.. 54 అడుగులు దాటిన నీటిమట్టం.. నీటమునిగిన భద్రాచలం స్నానఘట్టాల ప్రాంతం.. పలు గ్రామాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ
Rudraభద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది (Godavari) మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో ప్రమాదకర స్థాయికి చేరింది. శుక్రవారం రాత్రి 53.1 అడుగులుగా ఉన్న నీటిమట్టం (Water Levels) తెల్లారేసరికి అడుగుమేర పెరిగింది.
TSRTC: ప్రయాణికులకు అలర్ట్, హైదరాబాద్ - విజయవాడ బస్సు సర్వీసులు రద్దు చేసిన టీఎస్ఆర్టీసీ, ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉగ్రరూపం
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఏపీలోని కృష్ణా జిల్లా కీసర టోల్ గేట్ దగ్గర్లోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వరద నీరు జాతీయ రహదారిపైకి చేరింది.
Rains in Hyderabad: హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వాన.. నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం.. ఇతర జిల్లాల్లో కూడా
Rudraహైదరాబాద్‌లో (Hyderabad) వాన (Rain) మళ్లీ మొదలైంది. రెండు రోజులపాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం గురువారం సాయంత్రం నిలిచిపోయింది. అయితే నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున వాన మళ్లీ షురూ అయింది.
IMD Weather Alert: భారీ వరదలు, దేశంలోని 22 రాష్ట్రాలకు మూడు రోజుల పాటు అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
Hazarath Reddyదేశవ్యాప్తంగా రాగల మూడురోజుల్లో 22 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (IMD) హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌తో పాటు వాయువ్య, ఈశాన్యం నుంచి దక్షిణ భారతదేశం చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది
IMD Weather Forecast: నేడు వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, తీరప్రాంతంలో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరిక
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న తీవ్ర పీడనంగా మారింది. మరి కొద్ది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఒడిశాలోని గోపాల్‌పూర్ వాతావరణశాఖ తెలిపింది. ఇది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి చేరువ అవుతోందని, దీనికి అనుబంధంగా సముద్ర ఉపరితలంలో 7.6 కిలోమీటర్ల ఎత్తులో మరో తుపాను ఆవర్తనం కొనసాగుతున్నట్టు పేర్కొంది.
IMD Weather Forecast: అల్ప పీడనంపై ఐఎండీ తాజా అలర్ట్ ఇదిగో, రాగల 24 గంటల్లో వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం, అలాగే తాజా వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ఈ సాయంత్రం బులెటిన్ విడుదల చేసింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను అనుకుని పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోందని ఐఎండీ వెల్లడించింది.
Rs 2000 Note Exchange Deadline: రూ. 2 వేల నోట్ల ఉపసంహరణ గడువు పొడిగించే ప్రశ్నే లేదు, సెప్టెంబర్ 30 లోగా మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేసిన కేంద్రం
Hazarath Reddyభారతదేశంలో రూ. 2వేలు నోట్లను ఉపసంహరించుకోవడంపై కేంద్ర మరో కీలక ప్రకటన చేసింది.రూ. 2000 నోట్ల ఉపసంహరణకు సంబంధించి గడువు పొడిగిస్తారా? అనే ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బదులిస్తూ పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేసింది.
Bank Holidays in August 2023: బ్యాంకు పనులు ఉంటే వెంటనే పూర్తి చేయండి, ఆగస్టులో 14 రోజులు బ్యాంకులు క్లోజ్, తెలుగు రాష్ట్రాల అప్‌డేట్ ఇదిగో..
Hazarath Reddyబ్యాంకు పనులు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవద్దు ఎందుకంటే వచ్చే ఆగస్టు నెల లో బ్యాంకులకు ఎక్కువగా సెలవులు వస్తున్నాయి. రాష్ట్రాల వారీగా ఈ సెలవులు మారాయి. స్థానిక పండగలు ఆయా రాష్ట్రాల్లో బ్యాంక్ సెలవులను నిర్ణయించడం జరుగుతుంది. ఆగస్టు, 2023లో బ్యాంకులు ఏకంగా 14 రోజుల పాటు పని చేయవని తెలుస్తోంది.
PM Kisan Installment Date: రైతులకు గుడ్ న్యూస్, ఈ నెల 27న పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లోకి, PM కిసాన్ స్థితిని ఎలా తనిఖీ చేయాలో తెలుసుకోండి
Hazarath Reddyప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్ యోజన) 14వ విడతను ఈ వారంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. పీఎం కిసాన్ లబ్ధిదారులకు ప్రభుత్వం దాదాపు రూ.8.5 కోట్లు విడుదల చేయనుంది. ఈ పథకం కింద, అర్హులైన రైతులు ఒక విడతకు రూ. 2000 మరియు ఒక సంవత్సరంలో మొత్తం రూ. 6000 అందుకుంటారు.
PM Kisan 14th Installment Date: ఈ నెల 27న రైతుల అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు, లిస్టులో మీ పేరు ఉందో లేదో ఈ ప్రాసెస్ ద్వారా తెలుసుకోండి
Hazarath Reddyప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్ యోజన) 14వ విడతను ఈ వారంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. పీఎం కిసాన్ లబ్ధిదారులకు ప్రభుత్వం దాదాపు రూ.8.5 కోట్లు విడుదల చేయనుంది. ఈ పథకం కింద, అర్హులైన రైతులు ఒక విడతకు రూ. 2000 మరియు ఒక సంవత్సరంలో మొత్తం రూ. 6000 అందుకుంటారు.
Typhoon Doksuri: పసిఫిక్ మహాసముద్రంలో మరో తుపాన్, గంటకు 230 కిలోమీటర్ల వేగంతో గాలులు, రాగల కొన్ని గంటల్లో డోక్సురి టైఫూన్‌గా బలపడే అవకాశం
Hazarath Reddyప్రమాదకర టైఫూన్ (తుపాను)లకు పుట్టినిల్లుగా నిలిచే పసిఫిక్ మహాసముద్రంలో మరొక భీకర టైఫూన్ రెడీ అవుతోంది. ప్రస్తుతం ఇది టైఫూన్ స్థాయికి చేరుకుంది. అంటే, దీని ప్రభావంతో గంటకు 230 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇది ఫిలిప్పీన్స్ దీవులకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఈ టైఫూన్ కు డోక్సురి అని నామకరణం చేశారు.
Justice Dhiraj Singh Thakur: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, ఆమోద ముద్ర వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ను నియమించాలన్న సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రాం మేఘ్వాల్‌ సోమవారం రాత్రి ట్వీట్‌ చేశారు
IRCTC Down: ఐఆర్సీటీసీ యాప్, వెబ్ సైట్ లో సాంకేతిక సమస్యలు.. ట్విట్టర్ లో వెల్లడించిన ఐఆర్సీటీసీ
Rudraరైళ్లలో వెళ్లే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ ముఖ్య సూచన చేసింది. టికెట్ కొనుగోలు విషయంలో యాప్, వెబ్ సైట్ లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు ట్విట్టర్ ద్వారా పేర్కొంది. దీని కారణంగా టికెట్ చెల్లింపులు జరపడం కష్టంగా మారిందని.. దీనికి ప్రత్యామ్నయంగా ఆస్క్ దిశాను సంప్రదించాల్సిదిగా కోరారు.
Telangana Rains: రానున్న మూడ్రోజులు మరింత దంచికొట్టనున్న వానలు.. తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్‌, ఎల్లో అలర్ట్‌
Rudraతెలంగాణలో వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆయా జిల్లాలకు రెడ్‌, ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావొద్దని సూచించింది.
IMD Weather Forecast: వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్రకు సమీపంలో అల్పపీడనం, ఈ నెల 26 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం, తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
Hazarath Reddyదక్షిణ ఒడిస్సా - ఉత్తర ఆంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని తెలిపింది. ఈ అల్పపీడనం జూలై 26వ తేదీన వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది.
Telangana Weather Update: తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ, రాగల 3 రోజుల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచన
Hazarath Reddyతెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిస్సా - ఉత్తర ఆంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని తెలిపింది.
Rains in Telugu States: రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
Rudraతెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) భారీ వర్ష సూచన చేసింది. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ, యానాంలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Tirumala Venkateswara Swamy Assets: తిరుమల శ్రీవారి పేరిట రూ.17 వేల కోట్ల నగదు డిపాజిట్లు.. బ్యాంకులో 11 టన్నుల బంగారం.. టీటీడీ పరిధిలో 600 ఎకరాల అటవీప్రాంతం.. తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలను వెల్లడించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి
Rudraకలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించేందుకు రోజూ లక్షలాది మంది ఉవ్విళ్ళూరుతుంటారు. నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకునే వెంకన్నస్వామి అత్యంత సంపన్నుడు అని తెలిసిందే.