Information

TTD Seva Tickets: సెప్టెంబరు నెలకు సంబంధించి సేవా టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్న టీటీడీ.. ఈ నెల 19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల.. జూన్ 21 వరకు లక్కీడిప్ కు అవకాశం.. మరిన్ని వివరాలు ఇవే..

Rudra

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సెప్టెంబరు నెల శ్రీవారి సేవలకు సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఈ నెల 19న తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ లో ఉంచనుంది.

AP LAWCET Results 2023 Declared: ఏపీ లాసెట్‌ ఫలితాలు విడుదల, 13,402మంది క్వాలిఫై, రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి

Hazarath Reddy

ఏపీ లాసెట్‌(AP LAW CET), పీజీ ఎల్‌‌సెట్‌(PG LCET) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ రాజశేఖర్‌ శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు

AP PECET Result 2023 Declared: ఏపీ పీఈసెట్‌ ఫలితాలు విడుదల, మొత్తం 977 మంది ఉత్తీర్ణత, రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదిగో..

Hazarath Reddy

ఏపీలో పీఈటీ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 31న నిర్వహించిన ఏపీ పీఈసెట్‌ (AP PECET) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ రాజశేఖర్‌ విడుదల చేశారు. ఈ సెట్‌లో మొత్తం 977 మంది ఉత్తీర్ణత సాధించినట్టు ఆయన వెల్లడించారు

Cyclone Biparjoy: తీవ్ర తుపానుగా బలహీనపడ్డ బిపర్‌జోయ్.. గుజరాత్ తో విధ్వంసం తర్వాత రాజస్థాన్ వైపు పయనం.. తుపాను కారణంగా తండ్రీ కొడుకుల మృతి.. 23 జంతువుల మృత్యువాత.. రాజస్థాన్‌లో నేడు, రేపు భారీ వర్షాలు.. గుజరాత్‌లో అంధకారంలో 940 గ్రామాలు

Rudra

నిన్న గుజరాత్ తీరాన్ని తాకిన అతి తీవ్ర తుపాను బిపర్‌జోయ్ విధ్వంసం సృష్టిస్తోంది. తీరాన్ని తాకిన తర్వాత అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుకు మారింది. గుజరాత్‌లో విధ్వంసం సృష్టించిన తర్వాత రాజస్థాన్‌కు మళ్లింది. ఫలితంగా నేడు, రేపు రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది.

Advertisement

Trains Cancelled: తాడి-అనకాపల్లి మధ్య పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. విశాఖ మార్గంలో నేడు, రేపు పలు రైళ్ల రద్దు

Rudra

విశాఖపట్టణం మార్గంలో నేడు, రేపు పలు రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. విజయవాడ డివిజన్‌లోని తాడి-అనకాపల్లి స్టేషన్ మధ్య గూడ్సు రైలు పట్టాలు తప్పింది. ఈ నేపథ్యంలో నేడు, రేపు కొన్ని రైళ్లను రద్దు చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.

Asia Cup Details: అనిశ్చితికి తెరదించిన ఆసియా క్రికెట్ కౌన్సిల్.. ఆసియా కప్ కు తేదీల ఖరారు... ఆగస్టు 31 నుంచి ఆసియా కప్.. సెప్టెంబరు 17న ఫైనల్.. ఒకే గ్రూపులో భారత్, పాకిస్థాన్

Rudra

భారత్, పాకిస్థాన్ మధ్య వైరం కారణంగా ఈ ఏడాది ఆసియా కప్ వేదికపై అనిశ్చితి ఏర్పడింది. అయితే, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఆ అనిశ్చితికి ఎట్టకేలకు తెరదించింది. టోర్నీలో 4 మ్యాచ్ లకు పాకిస్థాన్ ఆతిథ్యమిస్తుందని, మిగిలిన అన్ని మ్యాచ్ లు శ్రీలంకలో జరుగుతాయని ఏసీసీ పేర్కొంది.

Edible Oil Prices Comedown: సామాన్యులకు ఊరట.. తగ్గనున్న వంటనూనెల ధరలు.. రిఫైన్డ్ నూనెలపై దిగుమతి సుంకం 17.5 నుంచి 12.5 శాతానికి తగ్గించిన కేంద్రం .. అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు

Rudra

పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరాభారంతో అల్లాడుతున్న సామాన్యులకు గుడ్ న్యూస్! దేశంలో వంటనూనెల ధరలు మరింతగా తగ్గనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా శుద్ధి చేసిన (రిఫైన్డ్) వంట నూనెలపై(సోయాబీన్, సన్‌ఫ్లవర్) దిగుమతి సుంకాన్ని తగ్గించింది.

AP ICET Results 2023 Declared: ఏపీ ఐసెట్‌ ఫలితాలు విడుదల, టాపర్‌గా రేణిగుంటకు చెందిన తపల జగదీశ్‌కుమార్‌రెడ్డి, cets.apsche.ap.gov.in ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్‌ 2023 ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. పలు యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను విడుద‌ల చేశారు.

Advertisement

EPFO: అధిక పెన్షన్‌ కోసం దరఖాస్తు చేస్తున్నారా.. అయితే జూన్ 26వ తేదీ లాస్ట్, అప్లై చేసుకోవడానికి కావాల్సిన పత్రాలేంటో ఓ సారి చెక్ చేసుకోండి

Hazarath Reddy

అధిక పెన్షన్‌ను ఎలా క్లెయిమ్ చేయాలనే దానిపై మరింత స్పష్టతని అందించే లక్ష్యంతో, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) బుధవారం పేరా 26(6) కింద ఉమ్మడి అభ్యర్థనను అందించలేకపోతే, అన్ని పత్రాలను సమర్పించగలరనే దానిపై ఒక సర్క్యులర్‌ను విడుదల చేసింది.

TS DEECET Results 2023 Declared: తెలంగాణ డీఈఈ సెట్ -2023 ఫ‌లితాలు విడుదల, ఈ నెల 14వ తేదీ నుంచి ర్యాంకు కార్డులు అందుబాటులోకి..

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డైట్ కాలేజీల్లో ప్ర‌వేశాల నిమిత్తం నిర్వ‌హించిన డీఈఈ సెట్ -2023 ఫ‌లితాలు బుధ‌వారం విడుద‌ల‌య్యాయి. తెలుగు, ఇంగ్లీష్, ఉర్డూ మీడియం కాలేజీల వారీగా ఫ‌లితాల‌ను వెల్ల‌డించారు.

10 Lakh Government Jobs in India: గుడ్ న్యూస్,  దేశంలో యువతకు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ఆగస్టు 15 నాటికి భర్తీ చేయాలని అధికారులకు ప్రధాని మోదీ ఆదేశాలు

Hazarath Reddy

జాతీయ రోజ్‌గార్ మేళాలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను పంపిణీ చేసిన సందర్భంగా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 15 నాటికి యువతకు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని ప్రధాని లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు.

AP EAMCET Results 2023 Declared: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు ఈ లింక్ ద్వారా చెక్ చేసుకోండి, ఇంజనీరింగ్లో 76.32 శాతం మంది ఉత్తీర్ణత, అగ్రికల్చర్లో 89.65 శాతం మంది ఉత్తీర్ణత

Hazarath Reddy

ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను జూన్ 14 బుధవారం విజయవాడలో ఉదయం 10.30 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఇంజనీరింగ్లో 76.32 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, అగ్రికల్చర్లో 89.65 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

Advertisement

AP EAPCET Results 2023 Declared: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల, విద్యార్థులు తమ ఫలితాలను cets.apsche.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీ సెట్‌–2023 ఫలితాలను బుధవారం ఉదయం 10.30 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.

NEET Result 2023: నీట్ ఫలితాల విడుదల, తమిళనాడుకు చెందిన ప్రబంజన్, ఏపీకి చెందిన వరుణ్ చక్రవర్తికి ఫస్ట్‌ ర్యాంక్‌, రిజల్ట్ ఇక్కడ చెక్ చేసుకోండి..

kanha

నీట్ యూజీ ఫలితాల విడుదల.. మొత్తం 20,38,596 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకాగా.. అర్హత సాధించిన 11,45,976 మంది అభ్యర్థులు.. తమిళనాడుకు చెందిన ప్రబంజన్, ఏపీకి చెందిన వరుణ్ చక్రవర్తికి ఫస్ట్‌ ర్యాంక్‌.. 720కి గాను.. 720 మార్కులు సాధించిన ఇద్దరు అభ్యర్థులు

Aadhaar Update: ఆధార్ కార్డ్‌ వివరాలు ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు రేపే చివరి తేదీ, యూజర్లను అలర్ట్ చేసిన యూఐడీఏఐ

Hazarath Reddy

ఎలాంటి రుసుము చెల్లించకుండా ఉచితంగా ఆధార్ కార్డ్‌లోని వివరాల్ని అప్‌డేట్‌ చేసుకునేందుకు ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (uidai) ఇచ్చిన గడువు రేపటితో ముగియనుంది. యూఐడీఏఐ ప్రతి పదేళ్లకోసారి ఆధార్‌కు సంబంధించిన వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ‘మై ఆధార్‌’ను సందర్శించాల్సి ఉంటుంది.

AP Inter Supplementary Results 2023 Out: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల, విద్యార్థులు తమ రిజల్ట్స్‌ను bie.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఏపీ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల అయ్యాయి. ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ, వృత్తి విద్య కోర్సులకు సంబంధించిన ఫలితాలను విజయవాడలోని ఇంటర్‌ విద్యామండలి కార్యాలయంలో ఇంటర్‌ విద్యా మండలి కార్యదర్శి శేషగిరిబాబు విడుదల చేశారు.

Advertisement

Cyclone Biparjoy: గంటకు 150 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు, గుజరాత్ తీరాన్ని వణికిస్తున్న బిపర్‌జోయ్‌ తుపాను, సముద్రంలో ఎగసిపడుతున్న అలలు

Hazarath Reddy

అత్యంత తీవ్రంగా మారిన బిపర్‌జోయ్‌ తుపాను గుజ‌రాత్ తీరం దిశ‌గా వెళ్తోంది.ఈ నెల 15న గుజరాత్‌లోని జఖౌ పోర్టు వద్ద తీరాన్ని తాకనుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. దీంతో ద్వార‌క‌లో బ‌ల‌మైన గాలులు వీస్తున్నాయి. స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మార‌డంతో పెద్ద ఎత్తున్న‌ అల‌లు ఎగిసిప‌డుతున్నాయి.

IMD Weather Update: ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో మరో 5 రోజులు మండిపోనున్న ఎండలు, రుతుపవనాలు వచ్చినా భానుడు సెగలు తప్పవని ఐఎండీ హెచ్చరిక

Hazarath Reddy

దేశంలో ఎండలు మండిపోతున్నాయి. జూన్‌ నెల సగం గడిచినా పగటి ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గలేదు. నైరుతి రుతు పవనాలు ఆలస్యం కావడంతో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు కూడా ఎండలు మండిపోతాయని భారత వాతావరణ కేంద్రం (India Meteorological Department) సోమవారం ప్రకటించింది.

UPSC Prelims Result 2023 Declared: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల, మెయిన్స్‌కు అర్హత సాధించిన 14,624 మంది అభ్యర్థులు

Hazarath Reddy

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి. సివిల్స్ ఫలితాలతో పాటు ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) ఫలితాలను కూడా నేడు విడుదల చేశారు. ఈ వడపోత పరీక్షలో 14,624 మంది ఉత్తీర్ణులయ్యారు

Southwest Monsoon: తెలుగు రాష్ట్రాలను తాకిన నైరుతి రుతుపవనాలు, రాగల రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, 24 గంటల్లో ఉగ్రరూపం దాల్చనున్న బిపర్జోయ్ తుపాను

Hazarath Reddy

నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకాయి. తిరుపతి జిల్లా శ్రీహరికోట సహా సమీప ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొన్నది.

Advertisement
Advertisement