News

EPFO Adds 14.63 Lakh Net Members: ఈపీఎఫ్‌లో కొత్తగా 14.64 లక్షల మంది చేరిక, గతేడాది డేటాను విడుదల చేసిన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్

Hazarath Reddy

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నవంబర్ 2024 కోసం తాత్కాలిక పేరోల్ డేటాను విడుదల చేసింది, ఇందులో 14.63 లక్షల మంది సభ్యుల నికర చేరికను వెల్లడించింది . గత నెల అక్టోబర్ 2024తో పోలిస్తే ప్రస్తుత నెలలో నికర సభ్యుల చేరికలో 9.07% పెరుగుదల నమోదు చేయబడింది.

MLA Vemula Veeresham: కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం మానవత్వం.. పెన్షన్ వచ్చే వరకు తానే ఆ డబ్బులు ఇస్తానని వృద్ధురాలికి భరోసా ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, వీడియో

Arun Charagonda

నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మానవత్వం చాటుకున్నారు. గ్రామ సభలో సొంత డబ్బులు ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేశం.

Black Magic At KMF Office: లే ఆఫ్స్‌.. ఉద్యోగాల కోత, ఆగ్రహంతో కంపెనీ ముందు చేతబడి చేసిన ఓ ఉద్యోగి... వివరాలివే!

Arun Charagonda

ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీల్లో లే ఆఫ్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మల్టీ నేషనల్ కంపెనీల నుండి చిన్న కంపెనీల వరకు ఉద్యోగాల కోత మొదలు పెట్టగా లక్షలాది మంది ఉద్యోగాలను కొల్పోతున్నారు.

Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియోలు ఇవిగో, లోయలో పడిన ట్రక్కు, కూరగాయలు అమ్మేందుకు వెళుతున్న 10 మంది అక్కడికక్కడే మృతి, మరో 15 మందికి గాయాలు

Hazarath Reddy

కర్ణాటకలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యల్లాపుర సమీపంలో ఓ ట్రక్కు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో పది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. వీరంతా సావనూర్‌ నుంచి యల్లాపుర సంతకు పండ్లను విక్రయించేందుకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.

Advertisement

Hyderabad: జామై ఉస్మానియా రైల్వేస్టేషన్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, ట్రాక్ మీద రెండు ముక్కలుగా శరీరీం, మృతురాలిని భార్గవిగా గుర్తించిన పోలీసులు

Hazarath Reddy

రైలు కిందపడి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సికింద్రాబాద్‌లోని జామై ఉస్మానియా రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందిన విద్యార్థిని భార్గవి (19) హైదరాబాద్‌లో మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడింది.

MLC Kavitha: యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత.. గ్రామసభల్లో ప్రజాగ్రహం, కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచేయడం ఎవరి వల్ల కాదని వెల్లడి

Arun Charagonda

యాదగిరిగుట్ట గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వామి వారి జన్మ నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు కవిత.

Tamil Nadu: కర్మ ఫలితం ఎలా ఉంటుందో ఈ వీడియో చూడండి, పిల్లాడిని కొట్టబోయిన ఆటోడ్రైవర్, అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తాపడిన ఆటో, తీవ్ర గాయాలతో..

Hazarath Reddy

తమిళనాడులోని కడయనల్లూర్ లో సైకిల్ పై వెళ్తున్న బాలుడిని కొట్టేందుకు డ్రైవర్ తన చేతితో స్టీరింగ్ మీద నుంచి తీయడానికి ప్రయత్నించినప్పుడు ఒక ఆటోరిక్షా బోల్తా పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సైకిల్ తొక్కుతున్న అబ్బాయిని రిక్షావాలా చెంపదెబ్బ కొట్టేందుకు ప్రయత్నించబోయాడు.

Tamil Nadu: షాకింగ్ వీడియో, పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకున్న యువకుడు

Hazarath Reddy

చెన్నైలోని RK నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు . ఉత్తర చెన్నైలోని పులియన్‌తోప్ ప్రాంతానికి చెందిన రాజన్‌గా గుర్తించబడిన 30 ఏళ్ల వ్యక్తి జనవరి 20 సాయంత్రం పోలీస్ స్టేషన్ ముందు తనను తాను నిప్పంటించుకున్నాడు.

Advertisement

Kerala Shocker: వీడియో ఇదిగో, మొబైల్ ఫోన్ ఇవ్వకుంటే మీ అంతుచూస్తానంటూ ప్రిన్సిపాల్‌కి విద్యార్థి బెదిరింపులు

Hazarath Reddy

కేరళలోని పాలక్కాడ్‌లోని అనక్కర ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్‌ అండ్ కాలేజీలో జరిగిన షాకింగ్ సంఘటనలో 16 ఏళ్ల విద్యార్థి తన మొబైల్ ఫోన్ లాక్కున్న తర్వాత ఉపాధ్యాయుడిని బెదిరించాడు. క్యాంపస్‌లో మొబైల్ ఫోన్‌ల వినియోగాన్ని నిషేధించే కఠినమైన నిబంధనలు ఉన్నప్పటికీ, 11వ తరగతి విద్యార్థి క్లాస్‌లో దాన్ని ఉపయోగిస్తూ పట్టుబడ్డాడు.

Fire Accident At Shadnagar: షాద్‌ నగర్‌ ఆయిల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. నిల్వ ఉంచిన ట్యాంకర్ పేలడంతో ఘటన, ప్రమాద సమయంలో పరిశ్రమలో 30 మంది కార్మికులు.. వీడియో ఇదిగో

Arun Charagonda

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని రాయికల్ గ్రామ శివారులోని BRS ఆయిల్ మిల్లు పరిశ్రమలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

Tirumala: తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల అప్‌డేట్.. రేపు ఉదయం ఆన్‌లైన్‌లో టోకెన్ల రిలీజ్, పూర్తి వివరాలివే

Arun Charagonda

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల దర్శన టోకెన్లకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. రేపు ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టోకెన్లు విడుదల కానుందని టీటీడీ అధికారులు వెల్లడించింది.

Janasena: జనసేనకు గుడ్ న్యూస్‌..కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు, గాజు గ్లాస్ చిహ్నాన్ని రిజర్వ్ చేస్తూ పవన్ కళ్యాణ్‌కు లేఖ పంపిన ఈసీ

Arun Charagonda

జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. ఆ పార్టీకి గాజు గ్లాస్ చిహ్నాన్ని రిజర్వ్ చేస్తూ పవన్ కళ్యాణ్‌కు లేఖ పంపింది ఈసీ.

Advertisement

BJP MP Etela Rajender: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై కేసు నమోదు, సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా ఈటల రాజేందర్‌ దాడి చేశారంటూ ఫిర్యాదు

Arun Charagonda

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై పోలీస్ కేసు నమోదైంది. గ్యార ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేశారు పోచారం పోలీసులు.

AP CID Ex Chief Sanjay: ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలు..ఆదేశించిన సీఎస్ విజయానంద్, అభియోగాలపై వివరణ ఇవ్వాలని ఆదేశం

Arun Charagonda

ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్‌ విజయానంద్‌ ఆదేశాలు జారీ చేశారు.

Gannavaram Airport: గన్నవరం ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగ మంచు..పలు విమానాల ఆలస్యం, తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగ మంచు కమ్ముకుంది. పొగ మంచు కారణంగా విమానాల ల్యాండింగ్‌కి అంతరాయం ఏర్పడింది.

CM Revanth Reddy:తెలంగాణలో రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు, దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వంతో డాటా కంట్రోల్ సంస్థ ఎంవోయూ

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సత్ఫలితాన్నిస్తోంది. తెలంగాణలో రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది ప్రముఖ డాటా సంస్థ CtrlS.

Advertisement

Jeet Adani and Diva Shah Wedding Date: గౌతం అదానీ కొడుకు పెళ్లి తేదీ ఫిక్స్, అత్యంత సాధారణంగా బిలియనీర్ కొడుకు పెళ్లి, దివా షాతో ఏడడుగులు వేయనున్న జీత్ అదానీ

Hazarath Reddy

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కుమారుడు జీత్ వివాహం వచ్చే నెలలో జరగనుంది. జీత్ అదానీ 7 ఫిబ్రవరి 2025న దివా షాను వివాహం చేసుకోనున్నారు. ఫిబ్రవరి 7న తన కుమారుడి వివాహాన్ని అహ్మదాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయన వెంట ఆయన భార్య ప్రీతి అదానీ, కుమారులు కరణ్, జీత్, కోడలు పరిధి, మనవరాలు కావేరి ఉన్నారు.

Priyanka Chopra Visits Chilkur Balaji Temple: వీడియో ఇదిగో, కొత్త ఛాప్టర్ మొదలైంది అంటూ ప్రియాంక చోప్రా పోస్ట్, చిలుకూరు బాలాజీని దర్శించుకున్న ప్రముఖ నటి

Hazarath Reddy

చిలుకూరు బాలాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నట్లు పేర్కొన్నారు. లాస్ ఏంజెలెస్ నుంచి ఆమె కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కించనున్న చిత్రంలో ప్రియాంక హీరోయిన్‌గా ఎంపికయ్యారని వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్టు కోసమే ఆమె హైదరాబాద్‌లో ఉన్నట్లుగా భావిస్తున్నారు.

Venu Swamy Apologizes: వీడియో ఇదిగో, నన్ను క్షమించండి ఇంకోసారి అలాంటి వ్యాఖ్యలు చేయను, నాగచైతన్య–శోభిత విడాకులు తీసుకుంటారనే జోస్యంపై క్షమాపణలు చెప్పిన వేణుస్వామి

Hazarath Reddy

కొన్ని రోజుల క్రితం అక్కినేని నాగ చైతన్య (Nagachaitanya), శోభిత ధూళిపాల (Shobitha Dhulipalla) వివాహం సందర్భంగా ఓ చానల్‌లో ఈ ఇద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండరు అని, విడాకులు తీసుకుంటారని వేణు స్వామి జోస్యం చెప్పిన విషయం తెలిసిందే.

Turkey Fire: టర్కీలో ఘోర అగ్ని ప్రమాదం, 66 మంది మృతి, మరో 55 మందికి గాయాలు, 12 అంత‌స్తులు ఉన్న గ్రాండ్ క‌ర్తాల్ హోట‌ల్‌లో ఎగసిన మంటలు, వీడియో ఇదిగో

Hazarath Reddy

ట‌ర్కీలోని స్కీయింగ్ రిసార్టు హోట‌ల్‌లో ఘోర అగ్నిప్ర‌మాదం(Hotel Fire) చోటు చేసుకుంది. ఆ ప్ర‌మాదంలో 66 మంది మృతిచెంద‌గా, 51 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బోలో ప్రావిన్సులో ఉన్న 12 అంత‌స్తులు గల గ్రాండ్ క‌ర్తాల్ హోట‌ల్‌లో తెల్ల‌వారుజామున 3.30 నిమిషాల‌కు ఈ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. హోట‌ల్ మంట‌ల నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో దూకిన ఇద్ద‌రు బాధితులు కూడా మృతిచెందారు

Advertisement
Advertisement