News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ 2024, తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకు ఆలౌటైన భారత్ డి, మొదటి సెషన్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన ఖలీల్ అహ్మద్, ఆకిబ్ ఖాన్

Vikas M

ఇండియా ఎ వర్సెస్ ఇండియా డి దులీప్ ట్రోఫీ 2024 మ్యాచ్‌లో 2వ రోజు జరిగిన మ్యాచ్‌లో, ఇండియా ఎ బౌలర్లు ఖలీల్ అహ్మద్, ఆకిబ్ ఖాన్ మొదటి సెషన్‌లో నాలుగు వికెట్లు పడగొట్టారు. ఇండియా డిని 52/4 స్కోరుకు పరిమితం చేశారు.

Shreyas Iyer Duck Video: శ్రేయ‌స్‌ అయ్యర్ డ‌కౌట్ వీడియో ఇదిగో, స‌న్‌గ్లాసెస్ పెట్టుకుని మరీ గోల్డన్ డక్, ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Vikas M

దులీప్ ట్రోఫీలో ఇండియా-డీ జ‌ట్టు తరఫున ఆడుతున్న శ్రేయ‌స్‌ అయ్యర్ తాజాగా డ‌కౌట్ అయ్యాడు. రెండో రౌండ్ మ్యాచ్‌లో భాగంగా మొదటి ఇన్నింగ్స్‌లో 7 బంతులు ఎదుర్కొని ప‌రుగుల ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్ చేరాడు. క్రీజులోకి వ‌చ్చిన అయ్య‌ర్ స‌న్‌గ్లాసెస్ పెట్టుకుని బ్యాటింగ్ చేయ‌డం గ‌మ‌నార్హం.

Kadambari Jethwani: వీడియో ఇదిగో, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నటి కాదంబరి జత్వానీ, అక్రమంగా బంధించి, చిత్రహింసలకు గురి చేసినట్టు లిఖితపూర్వక ఫిర్యాదు

Hazarath Reddy

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై హీరోయిన్‌ జెత్వానీ వేధింపుల కేసులో ఆసక్తి పరిణామం చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ముంబై సినీ నటి జత్వనీ ఫిర్యాదు చేసింది.తనను అక్రమంగా బంధించి, చిత్రహింసలకు గురి చేసినట్టు లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది.

Video: వీడియో ఇదిగో, కువైట్‌లో అమ్మేస్తామని బెదిరిస్తున్నారు, నన్ను కాపాడాలంటూ వీడియో ద్వారా వేడుకున్న ఆంధ్రప్రదేశ్ యువతి

Hazarath Reddy

అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం నారాయణరెడ్డి పల్లి గ్రామానికి చెందిన కవితా అనే మహిళ బ్రతుకు తెరువు కోసం కువైట్ వెళ్లానని, కువైట్ వాళ్ళు నన్ను కొట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంది.

Advertisement

Arvind Kejriwal Released From Tihar Jail: వీడియో ఇదిగో, తీహార్ జైలు నుండి బయటకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్, వర్షంలో తడుస్తూ కార్యకర్తలకు అభివాదం

Hazarath Reddy

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. సీబీఐ విచారిస్తున్న ఎక్సైజ్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన కొన్ని గంటల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు.

Andhra Pradesh Rains: రెండు రోజుల్లో వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, వచ్చే రెండు రోజుల పాటు ఏపీలో వర్షాలు

Hazarath Reddy

ఈ రోజు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న రెండు రోజుల్లో అల్ప పీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి బెంగాల్‌ సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో, ఏపీలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.

YS Jagan: వీడియో ఇదిగో, పాపా నీకు 15 వేలు నీకు 15 వేలు అంటూ సెటైర్ వేసిన జగన్, పిఠాపురం పర్యటనలో ఆసక్తికర వీడియో వైరల్

Hazarath Reddy

చంద్రన్న వస్తే రూ.20 వేల ఇస్తానని మోసం చేశారు. రూ.15 వేలు ఇస్తానని బడి పిల్లలను మోసం చేశారు. రూ. 18వేలు ఇస్తానని అక్కచెల్లెమ్మలను మోసం చేశారు. ఏడాదికి రూ. 36 వేల నిరుద్యోగ భృతి అని మోసం చేశారు. రూ. 2 వేలకోట్లకు పైగా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదు.

Port Blair As Sri Vijaya Puram: పోర్టు బ్లెయిర్ పేరును మార్చిన కేంద్ర ప్రభుత్వం, శ్రీ విజయ పురంగా మారుస్తున్నట్లు వెల్లడించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Arun Charagonda

అండామాన్ నికోబార్ దీవుల్లోని పోర్టు బ్లెయిర్ పేరును మారుస్తు నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. పోర్ట్ బ్లెయిర్ పేరును "శ్రీ విజయ పురం"గా మారుస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు.

Advertisement

Astrologer Venuswamy: వేణుస్వామికి షాకిచ్చిన నాంపల్లి కోర్టు, వేణుస్వామిపై కేసు నమోదుచేయాలని జూబ్లీహిల్స్ పోలీసులకు ఆదేశాలు

Arun Charagonda

వేణుస్వామిపై కేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జాతకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ప్రధాని ఫోటోను సైతం మార్ఫింగ్ చేసి వేణుస్వామి ప్రజలను తప్పుదోవ పట్టించారని మూర్తి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. తనకు హాని తలపెట్టాలని చూస్తున్నాడని పిటిషన్ లో పేర్కొనగా పిటిషనర్ వాదనలతో ఏకీభవించింది కోర్టు

YS Jagan Slams CM Chandrababu: ఎక్కడ ఏం జరిగినా జగనే కారణమంటారు, చంద్రబాబుపై విరుచుకుపడిన వైఎస్ జగన్, ఇకనైనా జగన్నామం ఆపు అంటూ ఎద్దేవా

Hazarath Reddy

పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఏలేరు ముంపు గ్రామాల్లో ఇవాళ వైఎస్ జగన్ పర్యటించారు. అనంతరం రమణక్కపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో విజయవాడ ఏమాదిరిగా అతలాకుతలం అయ్యిందో.. అదే తరహాలో ఏలేరు రిజర్వాయర్‌ రైతులను ముంచేసిందని వైఎస్సార్‌సీపీ అధినేత అన్నారు.

Telangana: నీళ్ల సంపులో యువకుడి మృతదేహం...నవీన్ శరీరంపై గాయాలు..హత్య కోణంలో పోలీసుల దర్యాప్తు!

Arun Charagonda

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్ పార్కింగ్ ఏరియాలో ఉన్న నీళ్ల సంపులో అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడు శాంతి నగర్ కు చెందిన నవీన్ ( 21 ) గా గుర్తించగా నవీన్ శరీరంపై గాయాలు ఉండటంతో హత్యనా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Andhra Pradesh Shocker: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, లారీ - బస్సు ఢీ..8 మంది మృతి, మృతుల సంఖ్య పెరిగే అవకాశం

Arun Charagonda

చిత్తూరు జిల్లాలో చిత్తూరు - బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగిలి ఘాట్ వద్ద కంటైనర్ లారీని ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Advertisement

Donations To Telangana CMRF: రెడ్డీస్ ల్యాబ్ రూ.5 కోట్లు, బాలయ్య కూతురు రూ.50 లక్షలు..ఇంకా ఎవరెవరూ ఎంత ఇచ్చారంటే!

Arun Charagonda

తెలంగాణ వరద బాధితుల సహాయార్ధం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు ముందుకొచ్చి విరాళాన్ని అందివ్వగా తాజాగా రూ.5 కోట్లు విరాళం ఇచ్చింది డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీ.

Andhra Pradesh: సీబీఎస్‌ఈ పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్, ఈ ఏడాది రాష్ట్ర బోర్డు పరీక్షలు రాసేందుకు అనుమతించిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఏపీలో సీబీఎస్‌ఈ అనుబంధ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ ఏడాది రాష్ట్ర బోర్డు పరీక్షలు రాసేందుకు వెసులుబాటు కల్పిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.

TCS Employees Get Tax Notices: 40 వేల మంది టీసీఎస్ ఉద్యోగులకు ఐటీ షాక్, రూ.1 లక్ష వరకు పన్నుచెల్లించాలంటూ నోటీసులు, కంపెనీ స్పందన ఏంటంటే..

Hazarath Reddy

టీసీఎస్ ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ భారీ షాకిచ్చింది. 30 వేల నుంచి 40 వేల మంది ఉద్యోగులకు పన్ను డిమాండ్ నోటీసులను పంపించింది ఐటీ డిపార్ట్ మెంట్. టీడీఎస్ విషయంలో వ్యత్యాసాల కారణంగా ఈ నోటీసులు పంపింది.

Eid Milad Un Nabi 2024: మిలాద్ ఉన్ నబీ ఎందుకు జరుపుకుంటారు? ఈద్ మిలాద్-ఉన్-నబీ చరిత్ర ఏమిటీ, అల్లాహ్ విశ్వ శాంతి నిమిత్తం ఆఖరి ప్రవక్తగా మహమ్మద్ ను ఎంపిక చేసుకున్నారా..

Hazarath Reddy

మౌలిద్ లేదా మీలాద్ అనునది మహమ్మదు ప్రవక్త జన్మదినోత్సవం.అరబ్బీ భాషలో మౌలిద్ అంటే జన్మనివ్వడం అనే అర్థంలో వాడుతారు. ఆధ్యాత్మిక గురువులు ఔలియాల జన్మదినాన్ని గూడా 'మౌలిద్' గా జరుపుకుంటారు.

Advertisement

Nasal Covid-19 Vaccine From Wuhan Lab: కరోనా పుట్టిన వుహాన్‌ ల్యాబ్‌ నుండి కొత్త వ్యాక్సిన్‌, భవిష్యత్తులో వచ్చే అన్ని వైరస్‌లను ఎదుర్కునే నానో వ్యాక్సిన్‌ తయారు చేసినట్లు సైంటిస్టులు వెల్లడి

Hazarath Reddy

కరోనా వైరస్‌ పుట్టుకకు ప్రధాన కేంద్రమని భావిస్తున్న చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఇప్పుడున్న కరోనా వైరస్‌లతో పాటు, భవిష్యత్తులో వచ్చే వేరియెంట్స్‌ అన్నింటినీ ఎదుర్కొనే నానో వ్యాక్సిన్‌ను తయారుచేసినట్టు ‘వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ’ సైంటిస్టులు తాజాగా ప్రకటించారు

Fake Doctor Arrest: మేడ్చల్‌లో నకిలీ డాక్టర్, చదివింది డీ ఫార్మసీ చెప్పుకునేది ఎంబీబీఎస్, వల వేసి పెట్టుకున్న ఎస్‌ఓటీ పోలీసులు

Arun Charagonda

నకిలీ డాక్టర్‌ని అరెస్ట్ చేశారు ఎస్‌ఓటీ పోలీసులు. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని దమ్మాయిగూడకు వెళ్ళే దారిలో డీ ఫార్మ చేసిన బండ సాయి వర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఏకంగా ఎంబీబీఎస్ వైద్యుడి అవతారమెత్తి వైరమ్ లతాశ్రీ మల్టీ స్పెషాలిటీ పేరుతో ఆసుపత్రిని ప్రారంభించారు. పక్కా సమాచారంతో సాయి వర్ధన్ రెడ్డి ఆటకట్టించారు పోలీసులు.

Uttar Pradesh: సమోసాలో కప్పకాలు, ఉత్తరప్రదేశ్‌లో దారుణం, నిర్వాహకులతో కస్టమర్ల గొడవ..వీడియో ఇదిగో

Arun Charagonda

ఉత్తర్ ప్రదేశ్ - గాజియాబాద్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. సమోసాలు తింటోన్న వ్యక్తికి అందులో కప్ప కాలు కనిపించింది. దీంతో షాక్‌కు గురై నిర్వాహకులతో గొడవకు దిగారు. అనంతరం సదరు స్వీట్స్ షాపుపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

Telangana Congress: కౌశిక్‌ రెడ్డిపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ మహిళా నేతలు, మహిళలను కించ పరిచేలా మాట్లాడారని ఆగ్రహం

Arun Charagonda

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ మహిళా విభాగం. మహిళలను కించపరిచేలా కౌశిక్ రెడ్డి ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు మహిళా నేతలు. కౌశిక్ రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement