వార్తలు

Telangana: వీడియో ఇదిగో, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న పారిశుద్ధ్య కార్మికుడు, అధికారుల వేధింపులే కారణం

Hazarath Reddy

అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న పారిశుద్ధ్య కార్మికుడు. రామగుండంలో జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం.. మేయర్ కమీషనర్ ఉన్న సమయంలోనే.. ఆత్మహత్యాయత్నం చేసిన పారిశుద్ధ్య కార్మికుడు విజయ్.

Mobile Phone Explodes: ప్యాంటు జేబులో ఒక్కసారిగా పేలిన సెల్ ఫోన్, జేబు కాలిపోవడంతో పాటు..

Hazarath Reddy

కామారెడ్డి - పిట్లం మండల కేంద్రంలో పిట్లం ఎస్సీ కాలనీకి చెందిన ప్రైవేట్ మెడికల్ ప్రాక్టిషనర్ ఎనిగే సాయిలు రోజు మాదిరిగానే తన క్లినిక్‌కు వచ్చారు. అకస్మాత్తుగా తన ప్యాంటు జేబులో నుంచి పొగలు రావడంతో గమనించి అప్రమత్తమయ్యారు. ఈలోపే జేబులో ఉన్న సెల్ ఫోన్ ఒక్కసారిగా పేలి పూర్తిగా ధ్వంసమై జేబు కాలిపోయింది. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు

Viral Video: రెండుగా విడిపోయిన అహ్మదాబాద్ - ముంబై డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌, గోతంగం యార్డ్ సమీపంలో ఘటన, వీడియో వైరల్

Arun Charagonda

అహ్మదాబాద్-ముంబై డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌ భోగిలు రెండుగా విడిపోయాయి. కప్లర్ లోపం కారణంగా సూరత్ సమీపంలో విడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో వెనుక ముందు బోగీలను ఫ్లాట్‌ఫామ్‌కి తరలించారు. ఇవాళ ఉదయం 8:50 గంటలకు వడోదర డివిజన్‌లోని గోతంగం యార్డ్ సమీపంలో ఈ సంఘటన జరిగింది.

Telangana Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, ఆటోని ఢీకొట్టిన భారీ ఐరన్ లోడ్‌ లారీ, ఒకరు మృతి, మరో 5 మందికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల పరిధిలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూల్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న రాజస్థాన్ భారీ ఐరన్ లోడ్‌ ట్రాలీ ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 5 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Weight Loss Story: అద్భుతం.. 610 కేజీల నుండి 63 కేజీలకు, కేవలం ఆరునెలల్లో 540 కిలోలు తగ్గిన ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తి

Hazarath Reddy

ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తిగా గుర్తింపు పొందిన సౌదీ అరేబియాకు చెందిన ఖలీద్‌ బిన్‌ మోహ్‌సేన్‌ షరీ సుమారు 610 కిలోల బరువు నుండి ఇప్పుడు 63.5 కేజీలకు తగ్గాడు. అత్యంత భారీ కాయంతో బరువు కారణంగా మూడేండ్లకు పైగా ఖలీద్‌ మంచానికే పరిమితమయ్యాడు. అతని ఆరోగ్యం రోజురోజుకు క్షీణించడం, వైద్యానికి ఖర్చు ఎక్కువ కావడంతో దానిని భరించలేకపోయాడు.

Vivek Ramaswamy on Bangladesh Hindus Attack: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండించిన వివేక్ రామస్వామి, హిందువులే టార్గెట్‌గా దాడులు చేస్తున్నారని మండిపాటు,

Arun Charagonda

రిజర్వేషన్లు తెచ్చిన తంటాతో దేశం విడిచిపారిపోయారు బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా. ఆ దేశ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు విద్యార్థుల ఆందోళనలకు కారణం కాగా వందలాది మంచి చనిపోయారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినా బంగ్లాలో దాడులు మాత్రం ఆగడం లేదు. ప్రధానంగా ఆ దేశంలో ఉంటున్న హిందువులే టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి.

New ED Director: ఈడీ కొత్త బాస్‌గా రాహుల్‌ నవీన్‌, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పదవిలో కొనసాగనున్న 1993 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి

Hazarath Reddy

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తాత్కాలిక చీఫ్‌గా ఉన్న రాహుల్‌ నవీన్‌ పూర్తిస్థాయి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు క్యాబినెట్‌ నియామకాల కమిటీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1993 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన నవీన్‌ ఈడీ డైరెక్టర్‌గా రెండేండ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఏది ముందైతే అప్పటివరకు పదవిలో కొనసాగుతారు.

Jagan's Disproportionate Assets Case: జగన్ అక్రమాస్తుల కేసు, విచారణ నుండి తప్పుకున్న సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సంజయ్ కుమార్

Hazarath Reddy

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, విజయసాయి రెడ్డిలకు వ్యతిరేకంగా ఈడీ దాఖలు చేసిన కేసు విచారణ నుండి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ తప్పుకున్నారు.

Advertisement

CM Chandrababu: 2019-2024 మధ్య ఒక విధ్వంస పాలన జరిగింది, గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్‌ను తిరిగి తెస్తామని తెలిపిన చంద్రబాబు

Hazarath Reddy

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.

Anand Mahindra: తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా, ఉత్తర్వులు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్‌ గవర్నర్స్ చైర్‌ పర్సన్‌గా ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూపు సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రాను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా నుండి తిరిగి వచ్చిన సీఎం రేవంత్...ఆనంద్ మహీంద్రా నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు

CM Revanth Reddy: గొల్కోండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, పెద్దన్నగా చెబుతున్న నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ

Arun Charagonda

దేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను మరువలేమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ గోల్కొండ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు రేవంత్.

Mpox Outbreak in Africa: ఆఫ్రికాలోని 13 దేశాల్లో ఎంపాక్స్‌ కల్లోలం, హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర దేశాలకు పొంచి ఉన్న ముప్పు

Hazarath Reddy

ఆఫ్రికాలోని 13 దేశాల్లో ఎంపాక్స్‌ మహమ్మారి విజృంభిస్తోంది. ఇందులో 96శాతానికిపైగా కేసులు ఒక్క కాంగోలో మాత్రమే గుర్తించారు. ఇక కొత్తగా వెలుగులోకి వచ్చిన వేరియంట్‌ మరణాల రేటు సుమారు 3-4శాతం ఉంటున్నది. ఆ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపాక్స్‌ను హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది. గత రెండేళ్లలో ఎంపాక్స్‌ను హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించడం ఇది రెండోసారి.

Advertisement

Kolkata Doctor Rape-Murder Case: కోల్‌కతా డాక్టర్ అత్యాచారం కేసులో షాకింగ్ ట్విస్ట్, సామూహిక అత్యాచారం చేసి చంపేశారని తెలిపిన తల్లిదండ్రులు, వైద్యురాలి శరీరంలో 150 మి.గ్రా వీర్యం

Hazarath Reddy

కోల్‌కతాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం (Doctor Rape-Murder Case) చేసి చంపేసిన సంగతి విదితమే. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

Stray Dogs Attack In Karimnagar: కరీంనగర్‌లో వీధి కుక్కల దాడి, ముగ్గురు చిన్నారులపై దాడి, గాయాలతో ఆస్పత్రిలో చేరిక

Arun Charagonda

కరీంనగర్‌లో వీధి కుక్కలు మరోసారి పంజా విసిరాయి. ఇంటి బయట ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులపై దాడి చేశాయి వీధి కుక్కలు. కరీంనగర్ - వీణవంక మండలం గన్ముకుల గ్రామంలో ఇంటి బయట ఆడుకుంటున్న నాగ ప్రణయ్(12), రిషి(10), స్వప్న అనే ముగ్గురు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి.గాయపడిన ముగ్గురు పిల్లలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

Telangana: శభాష్ ఆటో అన్న, నీటిలో కొట్టుకుపోతున్న కుటుంబాన్ని కాపాడిన ఆటో డ్రైవర్‌, వీడియో వైరల్

Arun Charagonda

మహబూబాబాద్ - గార్ల మండలంలో ఏరు దాటుతుండగా కాలు జారి నీటిలో కొట్టుకుపోయిన ఓ కుటుంబాన్ని ఆటో డ్రైవర్ కాపాడాడు. రాంపురం పాకాల ఏరు పైనుంచి దాటుతున్న తండ్రి, కూతురు, కొడుకు ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయారు. అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ వారిని చూసి కాపాడాడు. దీంతో ఆటో డ్రైవర్ చేసిన సాహసానికి స్థానికులు అభినందించారు.

Gujarat: కుక్కల దెబ్బకు తోకముడిచిన సింహాలు,షాకింగ్ సీసీ టీవీ ఫుటేజ్, గుజరాత్‌లో ఓ ఊరిలోకి వచ్చిన రెండు సింహాలు, ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న కుక్కలు, వీడియో వైరల్

Arun Charagonda

గుజరాత్‌లోని ఆమ్రేలిలో రెండు సింహాలు హల్ చల్ చేశారు. రాత్రి సమయంలో ఓ గ్రామంలోకి రెండు సింహాలు వచ్చాయి. అయితే సింహాలను ఇంట్లోకి రాకుండా రెండు కుక్కలు తీవ్రంగా పోరాడాయి. దీంతో చేసేదేమి లేక సింహాలు వెనుదిరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

CAS Dismissed Vinesh Phogat Petition: వినేశ్ ఫోగట్ పిటిషన్‌ను కొట్టేసిన కాస్ కోర్టు, తీవ్ర నిరాశలో వినేశ్‌, రజత పతకంపై ఆశలు ఆవిరి

Arun Charagonda

భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు నిరాశే ఎదురైంది. ఒలింపిక్స్ 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో ఫైనల్‌కు చేరినా అధిక బరువు కారణంగా ఆమెపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో కోర్టాఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS)కు అప్పీల్ చేసింది వినేశ్‌. కనీసం తనకు రజత పతకం ఇవ్వాలన్న పిటిషన్‌ను దాఖలు చేయగా కాస్ ఈ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో పతకంపై వినేశ్‌ పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. న్యాయస్థానం వన్ లైన్‌తో తీర్పు వెల్లడించింది.

Independence Day 2024: ఎర్రకోటపై ఎగిరిన మువ్వన్నెల జెండా, 11వ సారి జాతీయజెండా ఎగురవేసిన ప్రధాని మోడీ, 2047 వికసిత్ భారత్ లక్ష్యమన్న ప్రధాని,ఎర్రకోటపై హెలికాప్టర్లతో పూలవర్షం

Arun Charagonda

ఢిల్లీలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎర్రకోటపై 11వ సారి జాతీయ జెండాను ఎగరవేశారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. అనంతరం జాతాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్ మాతా కీ జై అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు మోడీ.

Independence Day 2024 Wishes in Telugu: మీ బంధుమిత్రులకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేయాలంటే...ఈ ఫోటో గ్రీటింగ్స్ ఉపయోగించుకోండిలా..

sajaya

నేటికి కూడా మన ముందున్న సవాళ్లను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకొని ముందుకు వెళ్లడం ద్వారా మాత్రమే భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలుస్తుంది అన్న సంగతి ప్రతి ఒక్కరు గుర్తించాలి. మీ బంధుమిత్రులకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేయాలంటే ఈ ఫోటో గ్రీటింగ్స్ వాడుకోండి

Health Tips: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా ఇలా చేస్తే మీ జుట్టు ఎప్పటికీ నల్లగా.

sajaya

ఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య తెల్ల జుట్టు. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే తెల్ల జుట్టు కనిపించేది కానీ ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఈ తెల్ల జుట్టు సమస్య అనేది చాలా బాధిస్తుంది.

Advertisement
Advertisement