Lucknow, September 13: నేరాలకు పాల్పడితే ఎన్​కౌంటర్​ (Encounter) చేస్తామంటూ.. ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి (UP CM) యోగి ఆదిత్యనాథ్​ (Yogi Adityanath) చేసిన హెచ్చరికలు నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి భయంతో మెడలో ఓ బోర్డు తగిలించుకుని పోలీస్​ స్టేషన్​కు వచ్చాడు. తాను లొంగిపోతానని, జీవితంలో మరోసారి నేరాలకు పాల్పడనని, తనను ఎన్​కౌంటర్​ చేయొద్దని అట్టపైన రాసి మెడలో వేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 9న ఘజియాబాద్‌లో ఓ హత్య జరిగింది. ఈ కేసులు పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరొకడు పరారీలో ఉన్నాడు.

పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న నిందితుడు సోహైల్‌ను పట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావడంతో ఎస్పీ ఓ ప్రకటన చేశారు. అవసరమైతే నిందితుడిని ఎన్‌కౌంటర్ చేస్తామని, ఈ విషయంలో ప్రభుత్వ ఆదేశాలు కూడా ఉన్నాయని హెచ్చరించారు. అంతే, అది విన్న నిందితుడు సోహైల్ ఎన్‌కౌంటర్ తప్పదని భయపడిపోయాడు.

సికింద్రాబాద్‌లో ఘోరం.. ఎలక్ట్రిక్ వాహన షోరూంలో అగ్నిప్రమాదం.. లాడ్జీలోని ఏడుగురి పర్యాటకుల మృతి.. ప్రాణాలు కాపాడుకోవడానికి భవనం కిటికీల మీద నుంచి దూకిన టూరిస్టులు.. వీడియోలు వైరల్

ఇక తప్పించుకుని లాభం లేదని పోలీసులకు లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మెడకు ఓ బోర్డు తగిలించుకుని పోలీస్ స్టేషన్‌కు బయలుదేరాడు. తాను లొంగిపోతున్నానని, మరోమారు ఇలాంటి నేరాలకు పాల్పడబోనని, తనను ఎన్‌కౌంటర్ చేయొద్దని వేడుకున్నాడు. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.