Politics

Karnataka Election Results 2023: కర్ణాటక ఎన్నికల ఫలితాలు, 115 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యత, 73 స్థానాల్లో బీజేపీ ముందంజ, 29 స్థానాల్లో జేడీఎస్ ఆధిక్యం

Hazarath Reddy

కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ECI ప్రకారం, ప్రారంభ ట్రెండ్‌లలో కాంగ్రెస్ సగం మార్కును దాటింది, 115 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది, BJP 73 స్థానాల్లో ముందంజలో ఉంది, JDS 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

Karnataka Election Results 2023: కింగ్ మేకర్ కుమారస్వామికి షాకిస్తున్న ఫలితాలు, కాంగ్రెస్-బీజేపీ నుంచి గట్టి సవాల్, ఈ సారి గత సీట్ల మెజారీటీ కష్టమే

Hazarath Reddy

రాష్ట్ర రాజకీయాల్లో తరచూ కీలక పాత్ర పోషిస్తున్న జనతాదళ్ (సెక్యులర్) 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్‌మేకర్‌గా అవతరించే అవకాశం కనిపించడం లేదు. తాజా ట్రెండ్స్ ప్రకారం...కుమారస్వామి పార్టీ దాదాపు 13% ఓట్లతో 25 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

Karnataka Election Results Update: కర్ణాటక ఎన్నికల ఫలితాలు.. మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్ ఆధిక్యత.. ఎర్లీ ట్రెండ్స్ లో కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యత.. 114 స్థానాల్లో లీడ్ లో ఉన్న కాంగ్రెస్.. 76 సీట్లలో ముందంజలో ఉన్న బీజేపీ

Rudra

కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటి స్పష్టమైన మెజార్టీ దిశగా ముందుకు సాగుతోంది. మొత్తం 224 స్థానాలకు గాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 113 స్థానాల మ్యాజిక్ ఫిగర్ సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 114 స్థానాల్లో లీడ్ లో ఉంది.

Snake Found In BJP Office: కర్ణాటక సీఎం బొమ్మై ఉన్న సమయంలోనే బీజేపీ ఆఫీసులో పాము కలకలం.. పట్టేసుకున్న భద్రతా సిబ్బంది

Rudra

కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. శిగ్గావ్ లోని బీజేపీ క్యాంప్ ఆఫీసు లో సీఎం బసవరాజు బొమ్మై ఉన్న సమయంలోనే భవనంలో పాము కలకలం సృష్టించింది. పామును భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Karnataka Election Results: కన్నడనాట విజయగీతిక ఎవరిదో? 36 కేంద్రాల్లో మొదలైన కౌంటింగ్.. వెలువడుతున్న ఫలితాలు.. లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Rudra

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ మొదలైంది. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం పోలింగ్ జరగగా.. నేటి ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు షురూ అయ్యింది.

DK Shivakumar on CM Post: కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే మీరు సీఎం అవుతారా, డికె శివకుమార్ ఆసక్తికర సమాధానం ఇదిగో, రేపు వెలువడనున్న కర్ణాటక ఎన్నికల ఫలితాలు

Hazarath Reddy

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. పలు ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కే ఆధిక్యత వస్తుందని అంచనా వేశాయి.

Jogi Ramesh on Pawan: చంద్రబాబు పాలేరు పవన్, పదేళ్లుగా జెండాలు మోసిన జనసైనికులు ఆయన తీరుతో ఏడుస్తున్నారని జోగి రమేష్ ఆవేదన

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్‌ కల్యాణ్‌పై మంత్రి జోగి రమేష్‌ మండిపడ్డారు. పాలకుడిని కాదు.. పాలేరునని పవన్‌ ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు. పవన్ని నమ్ముకుంటే నట్టేట ముంచారని కార్యకర్తలు బాధ పడుతున్నారని కామెంట్స్‌ చేశారు.

Eknath Shinde Govt Gets Relief: బల నిరూపణకు ముందే రాజీనామా చేశారు, ఉద్ధవ్‌ ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేం, షిండేనే సీఎంగా కొనసాగుతారని సుప్రీంకోర్టు తీర్పు

Hazarath Reddy

మహారాష్ట్ర( Maharashtra ) మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరేను(Uddhav Thackeray) తిరిగి నియమించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆయన బలపరీక్షను ఎదుర్కోకుండా స్వచ్ఛందంగా రాజీనామా చేయడమే అందుకు కారణమని వెల్లడించింది

Advertisement

Delhi Govt vs Lieutenant Governor Case Verdict: కేంద్రానికి భారీ షాక్, కేజ్రీవాల్‌ సర్కార్‌కు ఊరట, పాలనలో ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయమని సుప్రీంకోర్టు తీర్పు

Hazarath Reddy

ఢిల్లీ పాలనా వ్యవహారాల నియంత్రణ లెఫ్టినెంట్ గవర్నర్‌దా? లేక ప్రభుత్వానిదా ? అన్న విషయంపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది. ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేవనే 2019 నాటి సింగిల్ జడ్జి తీర్పుతో ఏకీభవించబోమని స్పష్టం చేసింది. ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారి అని, నిజమైన అధికారాలు అసెంబ్లీకే ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.

Imran Khan Arrested: పాక్ ప్రధాని ఇంటిపై పెట్రోల్‌ బాంబులు దాడి, ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో రణరంగంగా మారిన దాయాది దేశం, ఎనిమిది మంది మృతి, 290 మందికి గాయాలు

Hazarath Reddy

పాకిస్థాన్‌ (Pakistan) మాజీ ప్రధాని, పీటీఐ (PTI) చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) అరెస్ట్‌తో ఆ దేశం అట్టుడుకుతోంది. అరెస్ట్‌ తర్వాత చెలరేగిన అల్లర్లు రెండు రోజులుగా కొనసాగుతున్నాయి. పాకిస్థాన్‌లోని క్వెట్టా, కరాచీ, పెషావర్, రావల్పిండి, లాహోర్‌ సహా పలు ప్రధాన నగరాల్లో నిరసనకారులు బీభత్సం సృష్టిస్తున్నారు.

Yarram Venkateswara Reddy Joins YSRCP: సత్తెనపల్లిలో జనసేనకు భారీ షాక్, వైసీపీ కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, ఆయన కుమారుడు

Hazarath Reddy

సత్తెనపల్లిలో జనసేనకు భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ కీలక నేత యర్రం వెంకటేశ్వరరెడ్డి వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. బుధవారం కుమారుడు నితిన్‌ రెడ్డితో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరా­రు.

Revanth Reddy vs Talasani: నేనే వస్తా, ఏం పిసుకుతావో పిసుకు, మంత్రి తలసానికి కౌంటర్ వేసిన రేవంత్ రెడ్డి, అరటిపళ్ల బండి దగ్గర మేక నమిలినట్లు పాన్‌పరాగ్‌ నమిలేటోడు అంటూ వ్యాఖ్యలు

Hazarath Reddy

ఆ పొట్టోడిని పిసికితే ప్రాణం పోతుందని రేవంత్ రెడ్డిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. దీనిపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బుధవారం కంటోన్మెంట్‌ బోర్డు సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Advertisement

Karnataka Exit Poll Results 2023: అతి పెద్ద పార్టీగా అవతరించనున్న కాంగ్రెస్, కర్ణాటక ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఇవిగో, మళ్లీ కింగ్ మేకర్ కానున్న కుమార స్వామి

Hazarath Reddy

జీ న్యూస్-మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ 103-118 సీట్ల మధ్య ఏదైనా గెలుస్తుందని అంచనా. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ గరిష్టంగా 93 స్థానాల్లో (సీట్ల పరిధి: 79-93) ముగుస్తుందని అంచనా. జనతాదళ్ సెక్యులర్ 25-33 సీట్ల మధ్య గెలుస్తుందని అంచనా.

Karnataka Exit Poll Results 2023: ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వచ్చేశాయి. హంగ్ దిశగా కర్ణాటక, మళ్లీ కింగ్ మేకర్ కానున్న కుమార స్వామి, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైటింగ్

Hazarath Reddy

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ముగిసింది. ఇక, పోలింగ్‌ ముగిసిన వెంటనే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. ఎగ్జిట్‌ పోల్స్‌పై ఉత్కంఠ నెలకొంది.బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య టఫ్ పైట్ నడించిందని గ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు చెబుతున్నాయి. హంగ్ అసెంబ్లీ అవకాశం ఉంది

Karnataka Elections 2023: ముగిసిన కర్ణాటక ఎన్నికల పోలింగ్‌, సాయంత్రం 5 గంటల వరకు 66 శాతం పోలింగ్‌ నమోదు, క్యూలో ఉన్న వారికి మాత్రం ఓటు వేసే అవకాశం

Hazarath Reddy

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. అయితే.. ఆరు గంటలకే పోలింగ్‌ ముగిసినప్పటికీ.. క్యూ లైన్‌లో నిల్చున్న వాళ్లకు మాత్రం ఓటు వేయడానికి అధికారులు అనుమతి ఇస్తారు. చివరి దశలో రికార్డయ్యే పోలింగ్‌పై ఉత్కంఠ నెలకొంది.సాయంత్రం 5 గంటల వరకు 66 శాతం పోలింగ్‌ నమోదు అయింది.

Karnataka Polls 2023: కర్ణాటక మంత్రి ఇంటిపై చీరలతో దాడి చేసిన దళిత మహిళలు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

ఒకవైపు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ జరుగుతున్న వేళ కర్ణాటక క్రీడాశాఖ మంత్రి కేసీ నారాయణగౌడ ఇంటిపైకి దళితులు ఆగ్రహంతో దూసుకొచ్చారు. గత రాత్రి మంత్రి అనుచరులుగా చెప్పుకుంటున్న కొందరు స్థానికంగా కొందరికి చీరలు పంపిణీ చేశారు. అయితే.. ఆ చీరలను ఈ ఉదయం మంత్రి ఇంటి ముందు విసిరేసిన దళితులు నిరసన తెలిపారు

Advertisement

Karnataka Polls 2023: విజయపుర జిల్లాలో ఈవీఎంలను పగలగొట్టిన గ్రామస్తులు, ఎన్నికల సిబ్బంది కారును పల్టీకొట్టించి మరీ ధ్వంసం ,23 మంది అరెస్ట్

Hazarath Reddy

కర్ణాటకలో బుధవారం పోలింగ్‌ కేంద్రం నుంచి తీసుకెళ్తున్న ఈవీఎంలను గ్రామస్థులు పగలగొట్టారు. విజయపుర జిల్లా మసబినళ గ్రామంలో ఇది చోటుచేసుకోగా.. పోలీసు బలగాల మోహరింపుతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది.అడ్డొచ్చిన పోలీసులను చితకబాది ఈవీఎంలను లాక్కుని ధ్వంసం చేశారు గ్రామస్తులు.

Mudragada Padmanabham: రాజకీయ భవిష్యత్తుపై ప్రజలకు బహిరంగ లేఖ రాసిన ముద్రగడ పద్మనాభం, నన్ను తిహార్ జైలుకు తీసుకువెళ్ళేందుకు హెలికాప్టర్ సిద్దం చేశారని వెల్లడి

Hazarath Reddy

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. త్వరలోనే తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానని వెల్లడించారు. ప్రజల్లో మార్పు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఉద్యమాల్లో గానీ, రాజకీయాల్లో గానీ డబ్బు సంపాదించాలనే ఆలోచన తనకు ఎప్పుడు రాలేదని తెలిపారు.

Retired IAS Somesh Kumar: సీఎం సీఆర్‌ ప్రధాన సలహాదారుగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సోమేశ్‌కుమార్‌ నియామకం, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాన సలహాదారుగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సోమేశ్‌కుమార్‌ నియామకమయ్యారు. మూడేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు.ప్రధాన సలహాదారుడిగా ఆయనకు ప్రభుత్వం కేబినెట్‌ హోదా కల్పించింది.

MLA Muthireddy: భూవివాదంలో కూతురు పోలీసులకు ఫిర్యాదు, ఏ తప్పు చేయలేదంటూ ఏడ్చేసిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

Hazarath Reddy

కుమార్తె ఫిర్యాదు నేపథ్యంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మీడియా ముందుకు వచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తన కుమార్తెకు ఇచ్చిన ఆస్తి ఆమె పేరు మీదే ఉందని ఆయన స్పష్టం చేశారు. కేవలం లీజ్ అగ్రిమెంట్ మాత్రమే పొడిగించామని ముత్తిరెడ్డి వివరించారు.

Advertisement
Advertisement